India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జాతీయస్థాయి రగ్బీ పోటీలకు మెదక్ జిల్లా నుంచి 11 మంది క్రీడాకారులు ఎంపికైనట్లు కోచ్ కర్ణం గణేశ్ రవికుమార్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా బోయిన్పల్లిలో జరిగిన రాష్ట్రస్థాయి అండర్-15, పోటీలలో 13 జిల్లాలకు చెందిన బాల, బాలికలు పాల్గొన్నారు. మెదక్ జిల్లా బాలికల టీం రెండో స్థానం కైవసం చేస్తుందని తెలిపారు. ఈనెల 15 నుంచి 17వ తేదీ వరకు జరిగే జాతీయస్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారని పేర్కొన్నారు.

ఏడుపాయల వనదుర్గామాత ఆలయం సమీపంలోని ఘనపూర్ ఆనకట్ట వద్ద కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్యకు ప్రయత్నించిన కామారెడ్డి జిల్లాకు చెందిన బసవయ్యను QRT-1 టీమ్ ప్రాణాలకు తెగించి కాపాడింది. అక్కడ విధులు నిర్వహిస్తున్న QRT-1 సిబ్బంది ఏఆర్ ఎస్ఐలు శ్రీనివాస్, సాయిలు తదితరులు నది ప్రవాహంలోకి వెళ్లి తాడు సహాయంతో చాకచక్యంగా వ్యవహరించి అతడిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. వారి ధైర్యసాహసాలను స్థానికులు ప్రశంసించారు.

మెదక్ జిల్లా పరిధిలో పేకాట, కోడిపందాలు వంటి అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ శ్రీనివాస రావు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, పోలీస్ స్టేషన్ల పరిధిలో వాహన తనిఖీలు, రాత్రి, పగలు గస్తీ ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ వినూత్న కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. ఇప్పటివరకు 2490 దుప్పట్లను జిల్లా అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు కలెక్టర్కు అందజేశారు. దుప్పట్లను 17 బీసీ, ప్రీ మెట్రిక్ హాస్టల్స్ 1556 మంది విద్యార్థులకు, 6 ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్లో 932 మంది విద్యార్థులకు అందజేశారు. గొప్పగా స్పందించి, పెద్ద ఎత్తున దుప్పట్లు అందించిన వారికి కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.

సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు ఊర్లకు వెళ్లే సమయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ డీవీ శ్రీనివాస రావు సూచించారు. తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగలు చోరీలకు పాల్పడే అవకాశమున్నందున నగదు, బంగారు ఆభరణాలను బ్యాంక్ లాకర్లలో భద్రపరచుకోవాలని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, చోరీల నివారణకు ప్రజల సహకారం కీలకమని పేర్కొన్నారు.

సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు ఊర్లకు వెళ్లే సమయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ డీవీ శ్రీనివాస రావు సూచించారు. తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగలు చోరీలకు పాల్పడే అవకాశమున్నందున నగదు, బంగారు ఆభరణాలను బ్యాంక్ లాకర్లలో భద్రపరచుకోవాలని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, చోరీల నివారణకు ప్రజల సహకారం కీలకమని పేర్కొన్నారు.

సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు ఊర్లకు వెళ్లే సమయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ డీవీ శ్రీనివాస రావు సూచించారు. తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగలు చోరీలకు పాల్పడే అవకాశమున్నందున నగదు, బంగారు ఆభరణాలను బ్యాంక్ లాకర్లలో భద్రపరచుకోవాలని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, చోరీల నివారణకు ప్రజల సహకారం కీలకమని పేర్కొన్నారు.

సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు ఊర్లకు వెళ్లే సమయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ డీవీ శ్రీనివాస రావు సూచించారు. తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగలు చోరీలకు పాల్పడే అవకాశమున్నందున నగదు, బంగారు ఆభరణాలను బ్యాంక్ లాకర్లలో భద్రపరచుకోవాలని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, చోరీల నివారణకు ప్రజల సహకారం కీలకమని పేర్కొన్నారు.

సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు ఊర్లకు వెళ్లే సమయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ డీవీ శ్రీనివాస రావు సూచించారు. తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగలు చోరీలకు పాల్పడే అవకాశమున్నందున నగదు, బంగారు ఆభరణాలను బ్యాంక్ లాకర్లలో భద్రపరచుకోవాలని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, చోరీల నివారణకు ప్రజల సహకారం కీలకమని పేర్కొన్నారు.

మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ సోమవారం (జనవరి 12) పెద్ద శంకరంపేట మండల కేంద్రంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి హాజరుకానున్నారు. జిల్లా కేంద్రంతో పాటు మండల స్థాయిలో తహశీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహించనున్నారు. ప్రజలకు దూరభారం, ఖర్చులు తగ్గించేందుకు ఈ వినూత్న విధానం చేపట్టామని, ప్రతి వారం ఒక మండలంలో కలెక్టర్ పాల్గొంటారని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Sorry, no posts matched your criteria.