India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో ప్రయాణికులను ఉమ్మడి మెదక్ జిల్లా పోలీసులు హెచ్చరిస్తున్నారు. రద్దీని అదనుగా తీసుకుని దొంగలు చేతివాటం చూపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. బస్టాండ్, రైల్వేస్టేషన్లలో చోరీలు జరిగేందుకు అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో శనివారం ఉదయం నుంచి ఆదివారం గం.8.30 AM వరకు నమోదైన ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలోని నిజాంపేట్, కల్హేర్ 15.6, జహీరాబాద్, ఆందోల్, కోహిర్ 15.9, మెదక్ జిల్లాలోని పెద్ద శంకరంపేట్ 16.2, మనోహరాబాద్ 16.7, రేగోడ్ 16.8, తూప్రాన్ 16.9, సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక 16.0, మార్కూక్ 16.2, ములుగు 16.3, మద్దూరు 16.5 °C ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
సంగారెడ్డిలోని మిలాద్ మైదానంలో సమీర్(27) యువకుడు శనివారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. సమీర్ను దుండగులు దారుణంగా కొట్టి చంపారు. రిక్షా కాలనీకి చెందిన సమీర్ గతంలో పలు నేరాలకు పాల్పడ్డాడు. హత్య జరిగిన ప్రాంతాన్ని పట్టణ సీఐ రమేష్ పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ సాగర్ డ్యాంలో ఐదుగురు యువకులు గల్లంతైనట్లు స్థానికులు తెలిపారు. ముషీరాబాద్కు చెందిన ఏడుగురు యువకులు శనివారం డ్యాం ప్రాంతంలోకి వచ్చి ఈత కోసం డ్యామ్లో దిగారు. ఇందులో ఇద్దరు యువకులు బయటపడగా మరో ఐదుగురు యువకులు నీటిలో గల్లంతైనట్లు సమాచారం. విషయం తెలుసుకున్న అధికారులు గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్, అందోల్ 14.3, చౌటాకూర్, కోహిర్ 14.5, మెదక్ జిల్లాలోని పెద్ద శంకరంపేట 15.0, టేక్మాల్ 15.1, నిజాంపేట్ 15.6, సిద్దిపేట జిల్లాలోని మార్కూక్ 14.6, దూల్మిట్ట 15.0 C ఉష్ణోగ్రత నమోదయ్యాయి. రాబోయే రోజులలో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. చలి తీవ్రత నేపథ్యంలో వృద్ధులు, చిన్నపిల్లలు, అస్తమా రోగులు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రేపు వడ్డే ఓబన్న జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ జిల్లా అధికారి అహ్మద్ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారం కలెక్టర్ కార్యాలయంలో కార్యక్రమం ఉంటుందని కార్యక్రమానికి జిల్లాలో ఉన్న వివిధ రాజకీయ ప్రతినిధులు, వివిధ సంఘలా సభ్యులు పాల్గొనాలని కోరారు.
పండగపూట సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. మునిపల్లి మండలం భూసరెడ్డిపల్లి గ్రామ శివారులోని రిసార్ట్లో జంట సూసైడ్ చేసుకుంది. స్థానికుల సమాచారం.. ఓ జంట గురువారం సాయంత్రం రిసార్ట్లో రూం అద్దెకు తీసుకున్నారు. ఉదయం రిసార్ట్ యజమాని పరిశీలించగా ఇద్దరు ఉరివేసుకొని కనిపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతులు ఎవరు అనేది తెలియాల్సి ఉంది.
తెలంగాణ మోడల్ స్కూల్లో 2025-26 ఏడాదిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 6వ తరగతిలో 100 సీట్లు, 7 నుంచి10వ ఖాళీ సీట్లు భర్తీ చేయనున్నారు. ఫిబ్రవరి 28 వరకు అప్లై చేసుకోవాలి. APRIL 13న ప్రవేశ పరీక్ష ఉంటుందని అధికారులు తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఆసక్తి గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఝరాసంగం మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ తేనావతి తెలిపారు.
రామాయంపేట మం. సుతారిపల్లికి చెందిన లక్ష్మి(48) మృతదేహానికి 5నెలల తర్వాత పోస్టుమార్టం నిర్వహించారు. లక్ష్మి చికిత్స పొందుతూ గతేడాది సెప్టెంబర్లో చనిపోగా అంత్యక్రియలు నిర్వహించారు. కాగా తన తల్లి చికిత్స చేస్తుండగానే చనిపోగా వైద్యులు ఆ విషయం చెప్పకుండా డబ్బులు తీసుకున్నాకే మృతిచెందినట్లు చెప్పారని ఆమె కుమార్తె HYDలో ఫిర్యాదు చేసింది. దీంతో గురువారం గాంధీ ఆస్పత్రి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు.
ఈనెల 26న నిర్వహించే గణతంత్ర దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. కలెక్టరేట్లో గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. వేడుకలకు సంబంధించిన వేదికను తగిన శ్రద్ధతో ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో సురక్షితమైన వాతావరణంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు చర్యలు చెప్పటాలని కలెక్టర్ సూచించారు.
Sorry, no posts matched your criteria.