Medak

News July 5, 2024

మెదక్: కొలువుల జాతర.. తగ్గనున్న భారం

image

సుమారు 12 ఏళ్లుగా ఎటువంటి నియామకాలు లేకపోవడం, పదవీ విరమణలతో RTC సిబ్బంది తగ్గుతూ వస్తున్నారు. ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరగడంతో సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో RTCలో నియామకాలు చేపట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో పనిభారం తగ్గనుందని కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఉమ్మడి మెదక్ జిల్లాలలో 8 డిపోల్లో సుమారు 1726మంది డ్రైవర్లు, కండక్టర్లు ఉన్నారు.

News July 4, 2024

పథకాలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలం: కేసీఆర్

image

ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫమైందని మాజీ సీఎం కేసీఆర్ విమర్శించారు. గురువారం ఎర్రవెల్లిలో ఆయన నివాసానికి వచ్చిన అభిమానులు, కార్యకర్తలతో కేసీఆర్ మాట్లాడారు. సాగునీరు, తాగునీరు, నిరంతర విద్యుత్, ఫీజు రియంబర్స్మెంట్, సీఎంఆర్ఎఫ్ వంటి అనేక పథకాలను కాంగ్రెస్ కొనసాగించడం లేదని ఆరోపించారు.

News July 4, 2024

కొల్చారం: ప్రైవేటు అధ్యాపకుడు ఆత్మహత్య

image

ఓ ప్రైవేటు కళాశాల అధ్యాపకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన కొల్చారం మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. చిలిపిచేడ్ మండలం చిట్కుల్ గ్రామానికి చెందిన బోయిని యాదగిరి(28) ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం కుటుంబ కలహాల నేపథ్యంలో ఇంటి నుంచి వెళ్లిన యాదగిరి ఎనగండ్ల శివారులో ఆత్మహత్య చేసుకున్నారు.

News July 4, 2024

తూప్రాన్: యువకుడు ఆత్మహత్య

image

తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన యువకుడు గడ్డి మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై యాదగిరి తెలిపారు. పానగంటి రమేశ్ (26) జులాయిగా తిరుగుతూ మద్యానికి బానిస అయ్యాడు. మద్యం సేవించేందుకు అప్పులు చేసి, అప్పులు తీర్చే మార్గం తెలియక పది రోజుల క్రితం గడ్డి మందు సేవించాడు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

News July 4, 2024

సత్తాచాటిన సిద్దిపేట జిల్లా విద్యార్థులు

image

బాసర ట్రిపుల్‌ఐటీలో ప్రవేశానికి అర్హత సాధించినవారి జాబితాలో సిద్దిపేట జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 1404 సీట్లలో 330 సీట్లను సిద్దిపేట జిల్లా విద్యార్థులు సాధించడం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అత్యధిక సీట్లు సాధించి సిద్దిపేట జిల్లా ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. ఇది విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయుల కృషి ఫలితం అని మంత్రి పేర్కొన్నారు.

News July 4, 2024

దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం: రఘునందన్

image

దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్బంగా గురువారం మెదక్ ఎంపీ రఘునందన్ రావు సంగారెడ్డి పట్టణంలో ఉన్న దొడ్డి కొమరయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. దొడ్డి కొమురయ్య భూస్వాములకు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన నిప్పు కణిక అన్నారు. ఆయన పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమన్నారు.

News July 4, 2024

రాయపోల్: సిడితల వీరగల్లు విగ్రహాం లభ్యం

image

సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం పురాతన గణపతి ఆలయంలో చోళుల కాలం నాటి సిడితల వీరమల్లు విగ్రహం లభ్యమైంది. తల నరుక్కుంటే శైవ సన్నిధికి వెళ్తామనే నమ్మకం అప్పట్లో రాష్ట్ర కూటుల సమయంలో ఉండేది. ఆ కాలంలోని శిల్పం తాజాగా బయటపడింది. రాయపోల్, జనగామ జిల్లా లింగంపల్లి, వనపర్తి జిల్లాలో మూడు వీరగల్లు చిత్రాలు బయటపడ్డాయని చరిత్ర పరిశోధకుడు కొలిపాక శ్రీనివాస్ తెలిపారు.

News July 4, 2024

పటాన్‌చెరు: లింక్ క్లిక్ చేస్తే రూ.14 లక్షలు మాయం

image

పటాన్‌చెరు పరిధిలో ఓ సాఫ్ట్‌వేర్ మహిళా ఉద్యోగి సైబర్ నేరగాళ్ల వలలో పడి రూ.14 లక్షలు పోగొట్టుకుంది. ఆన్‌లైన్ పెట్టుబడులపై ఆమె ఆసక్తి చూపించగా సైబర్ కేటుగాళ్లు మొదట్లో లాభాలు చూపించారు. దాంతో ఆమె పెట్టుబడులు పెట్టారు. లింకు పంపిస్తున్నాం క్లిక్ చేయండి నగదు క్రెడిట్ అవుతాయని నమ్మించారు. అది నమ్మి క్లిక్ చేయడంతో ఆమె ఖాతాలో ఉన్న రూ. 14 లక్షలు డ్రా అయ్యాయి. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

News July 4, 2024

పటాన్‌చెరు: లింక్ క్లిక్ చేస్తే రూ.14 లక్షలు మాయం

image

పటాన్‌చెరు పరిధిలో ఓ సాఫ్ట్‌వేర్ మహిళా ఉద్యోగి సైబర్ నేరగాళ్ల వలలో పడి రూ.14 లక్షలు పోగొట్టుకుంది. ఆన్‌లైన్ పెట్టుబడులపై ఆమె ఆసక్తి చూపించగా సైబర్ కేటుగాళ్లు మొదట్లో లాభాలు చూపించారు. దాంతో ఆమె పెట్టుబడులు పెట్టారు. లింకు పంపిస్తున్నాం క్లిక్ చేయండి నగదు క్రెడిట్ అవుతాయని నమ్మించారు. అది నమ్మి క్లిక్ చేయడంతో ఆమె ఖాతాలో ఉన్న రూ. 14 లక్షలు డ్రా అయ్యాయి. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

News July 4, 2024

సిద్దిపేట: వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి మృతి

image

సిద్దిపేట జిల్లాలో బుధవారం వేర్వేరుచోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందారు. ప్రజ్ఞాపూర్‌కు చెందిన గట్టు శ్రావణ్‌ కుమార్‌(17) పిడిచేడు వద్ద జరిగిన ప్రమాదంలో చనిపోయాడు. నారాయణరావుపేట మండలం జక్కాపూర్ గ్రామానికి చెందిన నక్క కాంతయ్య(55) కారు, ద్విచక్రవాహనం ఢీకొని మృతిచెందాడు. దుబ్బాక మండలం పద్మనాభునిపల్లికి చెందిన రాజయ్య(87) ఆస్పత్రికి వెళ్లి వస్తుండగా టాటా ఏస్ వాహనం ఢీకొని మృతిచెందాడు.