Medak

News January 9, 2025

సిద్దిపేట: విద్యార్థులను చితకబాదిన ఫిజికల్ డైరెక్టర్

image

విద్యార్థులను టీచర్ చితకబాదిన ఘటన సిద్దిపేట(D) దుద్దెడ గురుకులలో జరిగింది. టెన్త్,ఇంటర్ విద్యార్థులకు ఉదయం నిర్వహించిన స్టడీ అవర్స్‌కు ఆలస్యంగా వచ్చిన 30 మంది విద్యార్థులను PD వాసు ఒళ్లంతా వాతలు వచ్చేలా కొట్టాడు. తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకొని పిల్లలను చూసి కన్నీటిపర్యంతమయ్యారు. PDని సస్పెండ్ చేయాలని ఆందోళనకు దిగారు. తీవ్రంగా గాయపడిన వారికి సిద్దిపేటలోని ఓ ఆస్పత్రిలో చికిత్స చేయించినట్లు సమాచారం.

News January 9, 2025

తిరుపతి తొక్కిసలాటపై మంత్రి దామోదర దిగ్ర్భాంతి

image

తిరుపతి తొక్కిసలాట ఘటనలో భక్తులు మృతి చెందడంపై రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. తొక్కిసలాటలో గాయపడి, చికిత్స పొందుతున్న భక్తులు త్వరగా కోలుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి, టీటీడీకి ఆయన విజ్ఞప్తి చేశారు.

News January 9, 2025

మెదక్: జిల్లాలో టీబీ నియంత్రణకు విశేష కృషి: కలెక్టర్

image

మెదక్ జిల్లాలో టీబీ నియంత్రణకు విశేష కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. బుధవారం మెదక్ పట్టణంలోని జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్‌తో కలిసి జాతీయ టీబీ బృందం సభ్యులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. డెంగ్యూ, మలేరియా వ్యాధుల నివారణకు ఆరోగ్య శాఖ యంత్రాంగం పకడ్బందీగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

News January 8, 2025

మెదక్: మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం: డిప్యూటీ సీఎం

image

మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా సోలార్ పవర్ ప్లాంట్‌ల ఏర్పాటు ప్రగతిపై బుధవారం ప్రజాభవన్ నుంచి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్కతో కలసి వీసీ నిర్వహించారు. స్వయం సహాయక సంఘాల ద్వారా 1000 మెగావాట్ల సోలార్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు.. త్వరలో టెండర్లు ఖరారు చేస్తామన్నారు.

News January 8, 2025

మెదక్: గురుకులాల్లో అడ్మిషన్లు.. మిస్ చేసుకోకండి

image

రాష్ట్రంలోని SC, ST, BC, జ‌న‌ర‌ల్‌ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 2025-26కి 5వ తరగతి తోపాటు 6, 7, 8, 9 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ చేయనున్నారు. ఫిబ్రవరి 1లోగా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. ఆసక్తి, అర్హత ఉన్న మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లా విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. పూర్తి వివరాలు https://tgcet.cgg.gov.in లో చూడొచ్చు.

News January 8, 2025

పటాన్‌చెరు: బైక్‌లో చున్నీ ఇరుక్కొని మహిళ మృతి

image

బైక్‌లో చున్నీ చిక్కుకొని మహిళ మృతి చెందిన ఘటన అమీన్‌పూర్‌లో నిన్న జరిగింది. పటాన్‌చెరు డివిజన్‌లోని జీపీ కాలనీకి చెందిన నవదీప్ దూలపల్లిలో MCA చేస్తున్నాడు. కాలేజీలో పేరెంట్స్ మీటింగ్‌కు తల్లి రజితను బైక్‌పై తీసుకెళ్తుండగా ఆమె చున్ని బైక్ టైరులో చిక్కుకొని కింద పడింది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదైనట్లు SI దుర్గయ్య తెలిపారు.

News January 8, 2025

మెదక్: సంక్రాంతికి ప్రత్యేక బస్సులు

image

సంక్రాంతి సందర్భంగా మెదక్ రీజియన్‌లోని అన్ని డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. ఈ నెల 10, నుంచి 18 వరకు (14, 15 మినహా) 280 ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయి. రద్దీకి అనుగుణంగా మరిన్ని బస్సులు నడిపేందుకు ప్లాన్ చేశారు. కాగా సంక్రాంతి స్పెషల్ సర్వీసుల్లో అదనందగా 50 శాతం ఛార్జీలు వసూలు చేయనున్నారు. ఈ సర్వీసుల్లో ‘మహాలక్ష్మి’ వర్తింపుపై క్లారిటీ రావాల్సి ఉంది.

News January 8, 2025

మెదక్: విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనలను ప్రోత్సహించాలి: మంత్రి

image

ఆలోచనలతోనే ఆవిష్కరణలు పుట్టుకొస్తాయని, వీటిని గుర్తించి ప్రోత్సహించేది తల్లిదండ్రులతో పాటు గురువులేనని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి సేజ్‌లోని ఒ ప్రైవేట్ పాఠశాలలో రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను జ్యోతి వెలిగించి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ మోహన్ రావు, విద్యాశాఖ అధికారి ప్రవీణ్ కుమార్ ఉన్నారు.

News January 7, 2025

మెదక్: గీత కార్మికులకు ప్రభుత్వం చేయూత: మంత్రి పొన్నం

image

గీత కార్మికులకు ప్రజా ప్రభుత్వం చేయూత ఇస్తుందని బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్  పేర్కొన్నారు. మొదటి విడతలో 15 వేల మంది గీతా కార్మికులకు శిక్షణ ఇచ్చి కాటమయ్య రక్షణ కవచ కిట్లు పంపిణీ చేశామన్నారు. ఈనెల 25 లోపు రెండవ విడత కాటమయ్య రక్షణ కవచ కిట్లు పంపిణీ చేస్తామన్నారు. ప్రభుత్వం కులవృత్తులను ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు.

News January 7, 2025

మహిళలకు ఇస్తామన్న రూ.2500 ఎక్కడ..?: హరీశ్ రావు

image

మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ప్రతినెల ఇస్తామన్న రూ.2500 ఇంకా ఎప్పుడు ఇస్తారని మాజీ మంత్రి హరీశ్ రావు ‘X’ వేదికగా ప్రశ్నించారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చి గద్దెనెక్కి13 నెలలు అవుతున్నా సీఎం రేవంత్ రెడ్డి మహాలక్ష్మి పథకం ఊసే ఎత్తకపోవడం సిగ్గుచేటు అన్నారు. జార్ఖండ్‌లో సీఎంగా ప్రమాణం చేసిన హేమంత్ సోరెన్ నెల రోజులు కాకముందే ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు రూ.2500 ఇస్తున్నారని తెలిపారు.