Medak

News July 2, 2024

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

image

మెదక్: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు – 24కు హెచ్ఎం, టీచర్లు ఈనెల 10లోగా http://national award teachers, education. gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని డీఈవో రాధాకిషన్ తెలిపారు. దరఖాస్తు ప్రతుల రెండు సెట్లను సంబంధిత యాజమాన్యాల ద్వారా ఈనెల 10వ తేదీలోగా డీఈవో కార్యాలయంలో అందజేయాలని సూచించారు.

News July 2, 2024

ఇంటికి వెళ్లేందుకు దారి ఇవ్వాలని ప్రజావాణిలో ఫిర్యాదు

image

తమకు ఇంటికి వెళ్లేందుకు దారి ఇవ్వాలంటూ నిరుపేద మహిళ కలెక్టర్‌కు ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు. రామాయంపేట మండలం శివాయపల్లికి చెందిన సత్తెమ్మ, ఆమె కూతురు శ్రీలత 30 సంవత్సరాల క్రితం ఇంటి నిర్మాణం చేసుకున్నామని, గతంలో ఉన్న రహదారిని గ్రామానికి చెందిన గొల్ల మల్లయ్య, ఎల్లయ్య అనే వ్యక్తులు రోడ్డుకు అడ్డంగా అక్రమ నిర్మాణాలు చేపట్టారని, తద్వారా తమకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని చర్యలు తీసుకోవాలని కోరారు.

News July 1, 2024

బూర్గుపల్లి: ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య

image

ఇంట్లో దూలానికి ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన హవేలి ఘనపూర్ మండలం బూర్గుపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మరెల్లి ఆనంద్ రాజ్ (28) తన ఇంట్లో దూలానికి చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు యువకుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News July 1, 2024

డాక్టర్ల సేవలు చిరస్మరణీయం: మంత్రి దమోదర్ రాజనర్సింహ

image

డా.బీసీ రాయ్ జన్మదినం సందర్భంగా డాక్టర్స్ డే జరుపుకోవడం చాలా సంతోషకరమని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ కొనియాడారు. వైద్యరంగంలో డాక్టర్ల సేవలను వెలకట్టలేమని కరోనా మహమ్మారి సమయంలో డాక్టర్లు వారి ప్రాణాలను అడ్డుపెట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని, వారి సేవలను గుర్తిస్తూ డాక్టర్స్ డే నాడు అవార్డులు అందిస్తున్నామని తెలిపారు. సందర్భంగా రాష్ట్రంలోని డాక్టర్లందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

News July 1, 2024

వెల్దుర్తి: వైన్స్‌‌కు కన్నం.. నగదు చోరీ

image

వెల్దుర్తి మండల కేంద్రంలోని తిరుమల వైన్స్‌లో సుమారు రూ. 55 వేల నగదు చోరీ జరిగింది. రాత్రి సమయంలో గుర్తుతెలియని దొంగలు వైన్స్ వెనుక వైపు కన్నం వేసి వైన్ షాపులో ఉన్న నగదు చోరీ చూశారు. అలాగే వెల్దుర్తిలో దంతాన్‌పల్లికి చెందిన శేఖర్ కిరాణా దుకాణం, చందుకు చెందిన మొబైల్ షాప్‌లో చోరీ చేసేందుకు ప్రయత్నం చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News July 1, 2024

మెదక్: స్కూటీ, లారీ ఢీ.. ఒకరి మృతి

image

మెదక్ మండలం మాచవరం గేటు సమీపంలో స్కూటీ- లారీ ఢీకొంది. ఈ ఘటనలో స్కూటీపై ఉన్న టేక్మాల్ మండలం ఎలుపుగొండకు చెందిన శాంతి కుమార్ తలకు తీవ్ర గాయలై అక్కడికక్కడే మృతిచెందాడు. మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్ జాం అయింది. ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

News July 1, 2024

పటాన్‌చెరు: తల్లి మందలింపు.. బాలుడి అదృశ్యం

image

స్కూల్‌కి వెళ్లమని మందలించినందుకు బాలుడు అదృశ్యమైన ఘటన పటాన్‌చెరు పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. జహీరాబాద్ వాసి స్వరూప భర్తతో గొడవపడి పటాన్‌చెరు మండలం ముత్తంగిలో వేరుగా ఉంటోంది. ముగ్గురు కుమారుల్లో 2వ వాడు ఇమాన్యూయల్(9)ను శనివారం ఉదయం పాఠశాలకు వెళ్లడానికి సిద్ధంకమ్మని మందలించింది. దీంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

News July 1, 2024

సంగారెడ్డి: పద్మ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

image

పద్మ అవార్డులకు నామినేషన్లను ఆహ్వానిస్తూ హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు విడుదల చేసిందని కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. 2025 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించే పద్మ అవార్డులకు నామినేషన్లను ఆహ్వానిస్తున్నట్టు పేర్కొన్నారు. www.padmaawards. gov.inలో జూలై 31లోగా ఆసక్తి ఉన్న జిల్లాకు చెందిన వారు డీఐవో ఎన్ఐసీ ద్వారా సంబంధిత హెచ్ఐ్వడీలకు నామినేషన్లను సమర్పించాలని సూచించారు.

News July 1, 2024

MDK: పోలీసుల పేరుతో దాడి దోపిడీ

image

మెదక్ జిల్లాలో పోలీసుల పేరుతో పట్టపగలే దారి దోపిడీ జరిగింది. నంగనూరు మండలం పాలమాకులకు చెందిన చిత్తారి శర్మ నర్సాపూర్‌లో బంధువుల ఇంటికి వెళ్తున్నారు. బస్సు దిగి నడిచి వెళ్తుండగా వచ్చిన ఇద్దరు దుండగులు తాము పోలీసులమని చెప్పి అడ్డుకున్నారు. శర్మను ఒకరు పట్టుకోగా మరొకరు మెడలోని బంగారం గొలుసు, ఉంగరం తీసుకొని పారిపోయారు. ఈ మేరకు బాధితుడి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు SI పుష్పరాజ్ తెలిపారు.

News July 1, 2024

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పొన్నం

image

కుటుంబ సమేతంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆ ఏడు కొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఉభయ రాష్ట్రాల ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. వర్షాలు, ఆరోగ్యం, పాడి పంటలు, సుఖ సంతోషాలతో ఇబ్బందులు లేకుండా ఉండాలని ఆ భగవంతుడుని ప్రార్థిస్తున్నానని అన్నారు.