India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి చెరువులో<<14983898>>SI సాయికుమార్<<>>తోపాటు కానిస్టేబుల్ శ్రుతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మృతదేహాలు దొరికాయి. నిన్న మం. నుంచి SI ఫోన్ ఆఫ్ కాగా అధికారులు ఆరా తీశారు. ఉదయం డ్యూటీ నుంచి వెళ్లిన శ్రుతి ఇంటికి రాకపోవడంతో పేరెంట్స్ బీబీపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా చెరువులో గాలింపు చేపట్టిన పోలీసులు అర్ధరాత్రి శ్రుతి, నిఖిల్ మృతదేహాలు, ఉదయం SI మృతదేహం గుర్తించారు.
ప్రైవేట్ బౌన్సర్ల వ్యవస్థపై ఎంపీ రఘునందన్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. HYDలో ఆయన మాట్లాడుతూ.. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితే ఊరంతా కోపగించుకుటారని.. అందరికీ శత్రువులు అవుతారంటూ పెద్దలు చెప్పారని కామెంట్ చేశారు. రాష్ట్రంలో బౌన్సర్లను పెట్టుకుని నెట్టేయించే సంస్కృతిని తెచ్చిందే ఆనాడు TPCC చీఫ్గా పని చేసిన రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. HYD సీపీ సీవీ ఆనంద్ చేతనైతే బౌన్సర్ల మీద చర్యలు తీసుకోవాలన్నారు.
మెదక్ చర్చి అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి రూ.35 కోట్లు ప్రకటించారు. చర్చి అభివృద్దికి ఎన్ని నిధులు అవసరమైతే అన్ని నిధులు కేటాయిస్తానని వెల్లడించారు. అంతకు ముందు మెదక్ చర్చి శతాబ్ది ఉత్సవాల్లో రేవంత్ రెడ్డి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్, మంత్రులు దామోదర్ రాజనర్సింహ, శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ సురేష్ షెట్కార్, ఎమ్మెల్యే రోహిత్ పాల్గొన్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో BJPని బలోపేతం చేసేందుకు అధిష్ఠానం దృష్టిసారించింది. JANలో తెలంగాణ వ్యాప్తంగా జిల్లాలకు కొత్త సారథులను నియమించనున్నారు. పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపుతూ BJPని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మరి మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలకు నూతన అధ్యక్షులు ఎవరు అవుతారో వేచి చూడాలి. దీనిపై మీ కామెంట్?
మెదక్ జిల్లాలో బుధవారం సీఎం రేవంత్ రెడ్డి పర్యటన వివరాలను అధికారికంగా ప్రకటించారు. ఉదయం 11 గంటలకు కొల్చారం మండలం ఘనపూర్కు హెలికాప్టర్లో వస్తారు. అనంతరం వనదుర్గమాతను దర్శించుకుని పూజలో పాల్గొంటారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, 11:45కి మెదక్ చర్చికి వెళ్తారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ఎస్పీ కార్యాలయం వద్ద గల హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్లో హైదరాబాద్ వెళ్తారు.
మెదక్ జిల్లాలోని కేథడ్రల్ చర్చి ఓ అద్భుతం. ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద చర్చిగా దీనికి పేరుంది. 175 అడుగుల ఎత్తు, 100 అడుగుల వెడల్పుతో ఠీవిగా కనిపించే ఈ చర్చిని భారతీయ, విదేశీ నిపుణులు నిర్మించారు. క్రిస్మస్ వేడుకలకు రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఇక్కడ వైభవంగా జరిగే వేడుకల్లో వివిధ ప్రాంతాల భక్తులు పాల్గొంటారు. నేడు చర్చిని ఉపరాష్ట్రపత్రి, సీఎం సందర్శించుకోనున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి మెదక్ జిల్లాలో బుధవారం పర్యటించనున్నారు. పర్యటన షెడ్యూల్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బేగంపేట నుంచి హెలికాప్టర్లో నేరుగా ఏడుపాయల చేరుకుంటారు. మన దుర్గామాతను దర్శించుకున్న అనంతరం వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అక్కడి నుంచి మెదక్ చర్చికి చేరుకొని శతాబ్ది, క్రిస్మస్ ఉత్సవాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం హైదరాబాద్ తిరిగి వెళ్తారు.
తాజ్ దక్కన్లో ABV ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజపేయి శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, ఎంపీ సుధాన్షు తివారీతో కలిసి మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ.. ప్రధానిగా వాజపేయి దేశానికి చేసిన సేవలు వెలకట్టలేనివని అంటు ఆయన సేవలను కొనియాడారు.
చలి మంటలు కాచుకుంటుండగా చీరకు నిప్పంటుకొని మహిళ మృతి చెందిన ఘటన వెల్దుర్తి మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని హస్తాల్ పూర్ గ్రామానికి చెందిన మామిండ్ల బుచ్చమ్మ(55) ఈనెల 19న రాత్రి చలిమంట కాచుకుంటుండగా చీరకు నిప్పంటుకొని తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ నేడు మృతి చెందినట్లు బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఓపెన్ స్కూల్ పది, ఇంటర్మీడియట్ అడ్మిషన్లకు గడువు ఈనెల 30 వరకు పెంచినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. అడ్మిషన్ రుసుం మీసేవ, ఆన్ లైన్ కేంద్రాల్లో మాత్రమే చెల్లించాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు సమీపంలోని ఓపెన్ స్కూల్ అధ్యయన కేంద్రాల్లో సంప్రదించాలని సూచించారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకొని ఎక్కువ మంది చేరేలా చూడాలని కోరారు.
Sorry, no posts matched your criteria.