India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి MDK జిల్లాలో న్యూఇయర్ రోజు జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతిచెందారు. వివరాలు.. జోగిపేటలో డివైడర్ను ఢీకొని మహ్మద్ పాషా(25) మృతి చెందగా, హత్నూరలో రోడ్డు పక్కన నిద్రిస్తున్న నీరుడి కృష్ణ(27) పై నుంచి లారీ వెళ్లడంతో చనిపోయాడు. కొండపాకలో స్నేహితులను కలిసి వస్తుండగా భాను చందర్(22) సూచిక బోర్డును ఢీకొని మృతిచెందగా, మెదక్లో మున్సిపల్ జవాన్ సంజీవ్(41) అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో పెట్టుకుని మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. అందులో భాగంగా సంగారెడ్డి జిల్లాలో 282, సిద్దిపేటలో 87, నర్సపూర్ లో 7 చొప్పున మొత్తం 376 కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరు పర్చినట్లు పేర్కొన్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో చలి తీవ్రత పెరిగిపోయింది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. కోహిర్ 8.4, అల్గోల్ 9.1, న్యాల్కల్ 9.9, మల్చల్మ 10.0, నల్లవల్లి 10.2, సత్వార్ 10.3, మొగుడంపల్లి 10.9, అల్మాయిపేట, దిగ్వాల్ 11.1, లక్ష్మీ సాగర్ 11.6, ముక్తాపూర్ 11.7, బోడగాట్ 11.9, మునిగడప 12.0, జహీరాబాద్ 12.1, నర్సాపూర్, కొత్తపేట, కంది 12.2, దామరంచ, బేగంపేట 12.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ప్రతి విద్యార్థి అభివృద్ధే లక్ష్యంగా సిబ్బంది పనిచేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీసీ సంక్షేమ శాఖ సెక్రటరీ, కమిషనర్, ఎంజేపీ గురుకుల సొసైటీ కార్యదర్శి, ఆర్సీఓ, ప్రిన్సిపల్స్, జిల్లా అధికారులతో మంత్రి జూమ్ మీటింగ్ నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. తరచుగా గురుకుల పాఠశాలల హాస్టల్స్ తనిఖీ చేయాలన్నారు. అలసత్వం వహించకుండా ప్రతి విద్యార్థిపై శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో బుధవారం ఉదయం 8.30 గంటల వరకు నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలోని కోహీర్ 13.6, జహీరాబాద్, గుమ్మడిదల 14.1, న్యాల్కల్ 14.3, ఆర్సీపురం 14.6, ఝరాసంగం 14.7, అందోల్, మొగుడంపల్లి 14.8, మెదక్ జిల్లాలోని శివంపేట 15.0, టేక్మాల్, నర్సాపూర్ 15.6, వెల్దుర్తి 15.9, సిద్దిపేట జిల్లాలోని మర్కూక్ 15.1, వర్గల్, ములుగు 15.5, కుకునూరుపల్లి 16.1°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే శరవేగంగా కొనసాగుతోంది. ఈ నెల 31లోగా పరిశీలన చేసి, వివరాలను యాప్లో నమోదు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు ఆదేశించారు. ఏ గ్రామంలో సర్వే చేస్తారో ముందు రోజే చాటింపు చేయాలని, ఏ ఒక్క దరఖాస్తును వదిలిపెట్టొద్దు అంటూ ఆయా జిల్లాల కలెక్టర్లు తెలిపారు. అధికారులు సర్వే కోసం మీ ఇంటికి వచ్చారా..? కామెంట్ చేయండి.
ఈ ఏడాది నేటితో పూర్తవుతోంది. అయితే మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లా ప్రజలకు ఈ సంవత్సరం ఎన్నో తీపి జ్ఞాపకాలతో పాటు చేదు అనుభవాలను మిగిల్చింది. చేసిన తప్పుల నుంచి ఎన్నో గుణపాఠాలు నేర్చుకుని ఉంటారు. వాటన్నింటిని సరిదిద్దుకునే ప్రయత్నమూ చేసుంటారు. మరీ ఈ ఏడాది మీరేం సాధించారు? ఏం కోల్పోయారు? ఏం నేర్చుకున్నారు? మీ మధుర జ్ఞాపకాన్ని కామెంట్ చేయండి.
సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ హుడా లే అవుట్ వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. స్థానికుల వివరాలు.. యూటర్న్ తీసుకునే క్రమంలో టిప్పర్, బైక్ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న ఇద్దరు యువకులు హరీశ్, బన్నీ అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న కొల్లూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
2024కి వీడ్కోలు పలికి నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చిన్నాపెద్ద సిద్ధమయ్యారు. యువతులు న్యూ ఇయర్ సందర్భంగా ఇంటి ముందు ముగ్గులు వేసి 2025కి వెల్కమ్ చెప్పేందుకు రెడీగా ఉండగా.. యువకులు పార్టీలు, దావత్లు అంటూ ఫుల్ జోష్ మీద ఉన్నారు. కొందరు మాత్రం ఇంట్లోనే కుటుంబ సభ్యులతో కేక్ కట్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరి న్యూ ఇయర్కు మీప్లాన్స్ ఏంటో కామెంట్ చేయండి.
ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన దుబ్బాక మండలం రామక్కపేట గ్రామంలో చోటుచేసుకుంది.. దుబ్బాక ఎస్ఐ గంగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. రామక్కపేటకి చెందిన అనుముల లింగం (48) అనే వ్యక్తి ఆదివారం తన వ్యవసాయ పొలం వద్ద వ్యవసాయ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడి మృతి చెందాడు.
Sorry, no posts matched your criteria.