Medak

News June 30, 2024

రూ. 451 కోట్ల రుణమాఫీ: డీసీసీబీ ఛైర్మన్

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో రుణమాఫీ పథకంలో 57,585 మంది రైతులకు రూ. 451 కోట్ల రుణమాఫీ జరగనుందని ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ ఛైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి పేర్కొన్నారు. వర్గల్ విద్యాధరి క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. లబ్ధి పొందిన రైతులకు రూ. 450 కోట్ల రుణాలు అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

News June 30, 2024

సంగారెడ్డి: బాధ్యతలు స్వీకరించిన ఓడిఎఫ్ సీజీఎం

image

సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎద్దుమైలారంలోని ఆయుధ కర్మాగారం (ఓడిఎఫ్)చీఫ్ జనరల్ మేనేజర్ శివ శంకర ప్రసాద్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన ఆయనను అధికారులు, ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సీజీఎం మాట్లాడుతూ.. అధికారులు, ఉద్యోగుల సహకారంతో ఆయుధ కర్మాగారం అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

News June 30, 2024

నిరుద్యోగులపై కాంగ్రెస్‌ పార్టీది కపట ప్రేమ: హరీశ్‌ రావు

image

ఎన్నికల ముందు నిరుద్యోగులపై కపట ప్రేమ చూపించిన కాంగ్రెస్‌.. గద్దెనెక్కిన తర్వాత వారి గుండెల మీద తన్నుతున్నారని MLA హరీశ్‌ రావు విమర్శించారు. రాహుల్‌ గాంధీని అశోక్‌నగర్‌కు పిలిపించి మరీ హామీ ఇప్పించారని, 2లక్షల ఉద్యోగాలు నింపుతామని రాహుల్‌ మాట ఇచ్చారని గుర్తుచేశారు. జాబ్‌ క్యాలెండర్‌ ఏమైందని నిలదీశారు. గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షకు APలో 1:100 పిలుస్తున్నప్పుడు ఇక్కడ ఎందుకు సాధ్యంకాదని ప్రశ్నించారు.

News June 30, 2024

చేగుంట ప్రమాదంలో అన్నదమ్ముల మృతి

image

చేగుంట రోడ్డు ప్రమాదంలో <<13531104>>మృతుల సంఖ్య ఆరు<<>>కు చేరింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ముల మృతి తీరని విషాదం నింపింది. మధ్యప్రదేశ్‌కు చెందిన చిక్యా రాజేశ్, రాజు, మహేశ్ సోదరులు మేకల వ్యాపారం చేస్తున్నారు. శుక్రవారం జరిగిన ప్రమాదంలో రాజు స్పాట్‌లోనే చనిపోగా.. నిన్న రాజేశ్ చనిపోయాడు. మహేశ్ చికిత్స పొందుతున్నాడు. స్వస్థలం నుంచి వచ్చిన వారి బంధువులు మృతదేహాలను చూసి కన్నీరుమున్నీరయ్యారు.

News June 30, 2024

సంగారెడ్డి: కుటుంబ కలహాలతో వివాహిత సూసైడ్

image

కుటుంబ కలహాలతో వివాహిత సూసైడ్ చేసుకున్న ఘటన గుమ్మడిదల మండలంలో జరిగింది. పోలీసుల వివరాలు.. కొత్తపల్లికి చెందిన పోచయ్యకు నర్సాపూర్ మండలం నారాయణపూర్‌కు చెందిన మౌనిక(26)తో 8ఏళ్ల క్రితం పెళ్లైంది. శనివారం ఉదయం దంపతులు గొడవ పడ్డారు. అనంతరం భర్త పనికి వెళ్లగా ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లలను బయటకు పంపి మౌనిక తలుపులు వేసుకుంది. పిల్లల ఏడ్పులతో స్థానికులు వచ్చి తలుపులు పగలగొట్టి చూడగా ఆమె ఉరేసుకుంది.

News June 30, 2024

మెదక్ జిల్లాలో RRR పనులు వేగం

image

RRRకు జాతీయ హోదా, ఒకేసారి నిర్మించాలన్న నిర్ణయంతో పనులు వేగం కానున్నాయి. దీని ఉత్తర భాగం ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 110KM మేర నిర్మాణం కానుంది. ఇది జగదేవపూర్, గజ్వేల్, తూప్రాన్, నర్సాపూర్‌, సంగారెడ్డి వయా కంది వరకు నిర్మించనున్నారు. గజ్వేల్‌, తూప్రాన్‌, సంగారెడ్డి వద్ద హైవేలతో కలవనుంది. RRR కోసం భూములు కోల్పోయిన బాధితులు మళ్లీ నిర్వాసితులు కానున్నారు. దీంతో అలైన్‌మెంటు మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.

News June 30, 2024

మెదక్: ఆపరేషన్ ముస్కాన్‌పై ఎస్పీ సమీక్ష

image

మెదక్: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మెదక్ జిల్లా ఎస్పీ డా.బాలస్వామి తెలిపారు. శనివారం ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం నిర్వహణ గురించి ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చిన్న పిల్లల్ని ఎవరైనా వెట్టిచాకిరి గురిచేస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. బాలల ఉజ్వల భవిష్యత్తు నిర్మాణంలో సమాజంలోని ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు.

News June 29, 2024

దుబ్బాక: గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

దుబ్బాక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి ఆధ్యాపకులకు నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ భవాని తెలిపారు. డిగ్రీ కళాశాలలో కామర్స్-2, తెలుగు-1, కంప్యూటర్ సైన్స్-1 పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు వివరించారు. సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 50 శాతం పైగా మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలని వివరించారు. జూలై 1 లోపు కళాశాలలో దరఖాస్తులు అందించాలని సూచించారు.

News June 29, 2024

సిద్దిపేట: కేసుల్లో శిక్షల శాతం పెంచాలి: సీపీ

image

కేసుల్లో శిక్షల శాతం (కన్వెక్షన్ రేట్) పెంచాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ సూచించారు. కోర్టు డ్యూటీ విధులు నిర్వహించే కానిస్టేబుళ్లతో సమీక్ష నిర్వహించారు. కేసుల్లో నిందితులకు శిక్షలు పడేటట్టు కోర్టు కానిస్టేబుల్ కీలక పాత్ర వహించాలని, నాన్ బేలబుల్ వారెంట్స్ ఎగ్జిక్యూట్ చేయాలన్నారు. బాధితులకు న్యాయం జరగాలంటే కేసుల్లో నిందితులకు శిక్షలు పడాలన్నారు. క్రమశిక్షణతో పారదర్శకంగా విధులు నిర్వహించారు.

News June 29, 2024

మెదక్ సబ్ జైలును సీనియర్ సివిల్ జడ్జి తనిఖీ

image

సీనియర్ సివిల్ జడ్జి సిహెచ్. జితేందర్ మెదక్ సబ్ జైలునుతనిఖీ చేశారు. జైలులో ఉన్న ఖైదీల ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. వంటశాల తనిఖీ చేసి ఆహార నాణ్యతపై జైలు పర్యవేక్షణ అధికారితో చర్చించారు. న్యాయ విజ్ఞాన సదస్సులో ముద్దాయిలకు వివిధ అంశాలపై లీగల్ ఏయిడ్ అపాయింట్మెంట్, జైల్ అదాలత్, ప్లీ బార్గెయినింగ్ చట్టాలపై అవగాహన కల్పించారు. జైల్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, జైలు సిబ్బంది ఉన్నారు.