Medak

News June 29, 2024

తూప్రాన్: జ్యోతిబా పూలే విద్యాలయంలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం

image

తూప్రాన్ పట్టణ శివారుల పోతరాజుపల్లిలోని మహాత్మజ్యోతిబాపూలే గురుకుల విద్యాలయం (వెల్దుర్తి)లో విద్యార్థి మల్లీశ్వరి (12) ఆత్మహత్యాయత్నం చేసింది. ఝరాసంఘం మండలం గిన్నాయపల్లికి చెందిన మల్లీశ్వరి ఈ ఏడాది ఏడో తరగతిలో చేరింది. సోమవారం విచ్చేసిన మల్లీశ్వరి ఇంటికి వెళ్తానంటూ మారాం చేసింది. అనంతరం విద్యాలయంలో దురద మందు తాగగా.. ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 29, 2024

అల్లాదుర్గం: విద్యార్థులే.. పాఠశాల స్వీపర్లు

image

మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం గడి పెద్దాపూర్ పాఠశాలలో విద్యార్థులే స్వీపర్లుగా మారి పాఠశాల శుభ్రం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రామ పంచాయతీ సిబ్బంది పాఠశాలలను శుభ్రం చేయాలని ఆదేశాలున్నప్పటికీ పట్టించుకోవడం లేదు. ఫలితంగా విద్యార్థులు స్వీపర్లుగా పనిచేస్తున్నారు. బాల కార్మికులతో పనులు చేయించవద్దని ఆదేశాలు ఉన్నా.. ఫలితంగా విద్యార్థులే శుభ్రం చేస్తున్నారు

News June 29, 2024

చేగుంట: ప్రమాదంలో 250 మేకలు మృతి

image

మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం శివారులో 44వ జాతీయ రహదారి బైపాస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 250 మేకలు మృతి చెందాయి. రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మధ్యప్రదేశ్ వాసులు మృతి చెందగా.. లారీలో ఉన్న 460 మేకల్లో సుమారు 250 మేకలు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ మేకల మండికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

News June 29, 2024

సంగారెడ్డి: నేడు తార డిగ్రీ కళాశాలలో ఉద్యోగ మేళా

image

సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ రత్న ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. డిగ్రీ ఉత్తీర్ణులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎంపికైన వారికి ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని చెప్పారు. SHARE IT

News June 29, 2024

SRD: ప్రభుత్వ పాఠశాలల ఆడిట్ షెడ్యూల్ విడుదల

image

సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, కేజీబీవీ, యూఆర్ఎస్, ఆదర్శ పాఠశాలలకు సంబంధించిన నిధులపైన జూలై 20 నుంచి 22 వరకు ఆడిట్ నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆడిట్లకు సంబంధించిన అన్ని రకాల యూసీలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.

News June 29, 2024

సంగారెడ్డి: ‘మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి’

image

మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ప్రభుత్వం తన వంతు సహకారం అందిస్తుందని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో మహిళా సాధికారత సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ మహిళలు ఆర్థిక క్రమశిక్షణలో ముందుంటారని చెప్పారు. అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డిఆర్డిఓ జ్యోతి పాల్గొన్నారు.

News June 29, 2024

అమ్మ ఆదర్శ పాఠశాల పనులు వేగవంతం చేయండి: కలెక్టర్

image

జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాల పెండింగ్ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ పనుల్లో నాణ్యత పాటించాలని సూచించారు. బడి మానేసిన పుల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీఈవో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

News June 29, 2024

సిద్దిపేట: ‘సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించండి’

image

సీజనల్ వ్యాధుల వల్ల ప్రబలే అంటూ వ్యాధులపైన క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని DMHO డాక్టర్ శ్రీనివాస్ సూచించారు. వర్గల్ UPHCని ఆకస్మిక సందర్శించారు. అనంతరం సిబ్బందితో సమీక్ష నిర్వహించిన ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో జ్వర పీడితులకు తక్షణమే రక్త నమూనాలు సేకరించి చికిత్స అందించాలని, అవసరం ఉన్న సమయంలో మెడికల్ క్యాంపులు నిర్వహించాలని సూచించారు.

News June 28, 2024

మెదక్ రోడ్డు ప్రమాదం.. మృతులు వీరే..

image

మెదక్ జిల్లా వడియారం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల వివరాలు గుర్తించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం రేవా జిల్లాకు చెందిన మేకల వ్యాపారులు చిక్వ రాజు (57), చిక్వ మనీష్ కుమార్(30), కూలీలు ఎండి ఇబ్రహీం(21), ఎండీ షబ్బీర్ ఖాన్(48), ఎండీ జీసన్(21)గా గుర్తించారు. క్షతగాత్రులు రేవా జిల్లాకు రమేష్, మహేష్, శుక్లాల్, మనీలాల్, మహారాష్ట్రలోని నాగపూర్‌కు చెందిన డ్రైవర్ బుట్టా సింగ్‌గా తేలింది.

News June 28, 2024

విద్యార్థినులకు హృదయ ఆధారిత విద్య అందించాలి: కలెక్టర్ క్రాంతి

image

కస్తూర్బా పాఠశాలలో చదివే విద్యార్థినులకు హృదయ ఆధారిత నైపుణ్య విద్యను అందించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. సంగారెడ్డిలో శుక్రవారం కస్తూర్బా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ బాలికలకు వారం రోజులపాటు వీటిపై అవగాహన కల్పించాలని చెప్పారు. సమావేశంలో డీఇఓ వెంకటేశ్వర్లు, జిల్లా బాలికల అభివృద్ధి అధికారి సుప్రియ పాల్గొన్నారు.