India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. మహీదర వెంచర్లో కార్యకలాపాలు నిర్వహించడం కోసం విశాల్ (8) అనే చిన్న పిల్లవాడు వెళ్లగా కుక్కలు దాడి చేయడంతో చిన్నారి చనిపోయాడు. బిహార్ రాష్ట్రం నుంచి కూలి పనికి చిన్నారి కుటుంబం పటాన్ చెరువుకు వచ్చింది. మృతదేహాన్ని పటాన్ చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకొని చేనేత రంగంలో విశిష్ట ప్రతిభ కనబరిచిన చేనేత కార్మికులకు కొండ లక్ష్మణ్ బాపూజీ పేరిట రాష్ట్రస్థాయి పురస్కారాలు ప్రధానం చేస్తామని జిల్లా చేనేత జౌళి శాఖ అధికారి సంతోష్ ప్రకటించారు. చేనేత సహకార, సహకారేతర రంగంలో పనిచేస్తున్న కార్మికులు వచ్చే నెల 10 వ తేదీలోపు దరఖాస్తులను కలెక్టరేట్ కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు.
మెదక్ జిల్లా చేగుంట 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వడియారం వై జంక్షన్ వద్ద ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి వచ్చిన మరో లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వెనుక ఉన్న లారీలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మరికొందరికి గాయాలైనట్టు తెలుస్తుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
BRS, BJP కుమ్మక్కయ్యాయని ముఖ్యమంత్రి డిల్లీలో ఆరోపించడం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మెదక్ ఎంపీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీయే గెలిపించిందని సీఎం స్థాయి వ్యక్తి గాలి మాటలు మాట్లాడటం సరికాదన్నారు. రఘునందన్ రావు సొంత నియోజకవర్గం దుబ్బాకలో బీఆర్ఎస్ మెజారిటీ సాధించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిచిన అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ గెలిచిందని ప్రశ్నించారు.
గ్రామీణ ప్రాంతాల్లో అధిక శాతం మంది వివిధ రంగాలకు చెందిన కూలీలు ఉంటారు. ఈ మేరకు ప్రభుత్వం కార్మికులకు లేబర్ కార్డును అందించడం జరిగిందని జిల్లా సహాయ కార్మిక అధికారి యాదయ్య అన్నారు. కేవలం రూ.110 చెల్లించి కార్డు పొందవచ్చన్నారు. దరఖాస్తుకు కావాల్సిన ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ ఖాతాతో పాటు రెండు ఫోటోలతో దరఖాస్తు అందించాలన్నారు. మెదక్ జిల్లాలో 30 వేలు మంది కార్మికులు ఉన్నట్లు తెలిపారు.
జిల్లాలో ధరణి పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. గురువారం చిలిపిచేడ్ మండల తహశీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తహశీల్దారుతో ధరణి దరఖాస్తుల పరిష్కరణ పురోగతిని కలెక్టర్ పరిశీలించి పరిష్కరించేందుకు తగు సూచనలు చేశారు. ప్రత్యేక కార్యాచరణ ద్వారా ధరణి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు.
ధరణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం నుంచి అధికారులతో గురువారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని చెప్పారు. ప్రజావాణి దరఖాస్తులను కూడా వెంటనే పరిష్కరించేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు.
BRSకు మరో షాక్ తగలనుందా..?, పటాన్చెరు MLA గూడెం మహిపాల్రెడ్డి BJPలో చేరుతారా.. జిల్లాలో అవుననే చర్చ జరుగుతోంది. మహిపాల్రెడ్డి ఆకస్మికంగా ఢిల్లీ పర్యటనతో పార్టీ మారుతారనే టాక్. జహీరాబాద్ మాజీ MP, BJP నేత బీబీ పాటిల్తో మహిపాల్రెడ్డి సమావేశం కావడంతో ఆయన BJP వైపు అడుగులు వేస్తున్నారన్న అభిప్రాయాన్ని కలిగిస్తోంది. తన అనుచరులకు చెప్పకుండా ఢిల్లీకి వెళ్లడం సైతం పలు అనుమానాలకు తావిస్తుంది.
మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామంలోని వ్యవసాయ పొలం వద్ద రాగుల అశోక్ అనే రైతు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అయితే అశోక్ తలపై గాయం ఉండడంతో భూ వివాదంలో ప్రత్యర్థులు దాడి చేసి హత్య చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామస్తుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న రామాయంపేట పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కుమార్తెను లైంగికంగా వేధిస్తున్న తండ్రిని భార్య హత్య చేసిన ఘటన సంగారెడ్డిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. అర్ధరాత్రి మద్యం మత్తులో తండ్రి కుమార్తెను లైంగికంగా వేధిస్తుండడంతో భార్య గొడ్డలితో నరికి చంపింది. అనంతరం తల్లీకుమార్తె పోలీస్ స్టేషన్ ముందు లొంగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.