India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విద్యాశాఖ మంత్రిగా ఉండి వారి భవిష్యత్తును CM రేవంత్ రెడ్డి ప్రశ్నార్థకం చేస్తున్నారని, సీఎం చేతకాని పాలన విద్యార్థులకు శాపంగా మారిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ‘X’ వేదికగా మండిపడ్డారు. విష ఆహారం తిని వాంకిడి గురుకుల విద్యార్థిని మరణించిన ఘటన మరువక ముందే నిర్మల్ జిల్లా దిలావర్పూర్ కేజీబీవీ పాఠశాలలో విష ఆహారం తిని 10 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలు కావడం CM పాలన వైఫల్యానికి నిదర్శనం అన్నారు.
మెదక్ మం. జానకంపల్లికి చెందిన మల్లయ్య కుమార్తె శ్రావణి(17) మెదక్ కస్తూర్బా పాఠశాలలో టెన్త్ చదువుతుంది. ఈనెల 22న బోనాల పండుగకు ఇంటికొచ్చిన శ్రావణి శనివారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ‘నా చావుకు తల్లిదండ్రులే కారణం’ అని లేటర్ రాసి ఉరేసుకుంది. తన చెల్లి మృతికి కారణమైన తండ్రి మల్లయ్య, పినతల్లిపై చర్యలు తీసుకోవాలని స్రవంతి, ఆకృతి ఫిర్యాదు చేశారు. మల్లయ్య మొదటి భార్య చనిపోగా జ్యోతిని 2వ పెళ్లి చేసుకున్నాడు.
ఉమ్మడి జిల్లాలో నాలుగో విడత రుణమాఫీ కోసం అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో 11,301 మంది రైతులకు రూ.110 కోట్లు, సిద్దిపేట జిల్లాలో రూ.95 కోట్లకు అర్హులైన 9,063 మంది రైతులు నాలుగో విడత జాబితా కింద పేర్లు ఉన్నాయి. మెదక్ జిల్లాలో రూ.56 కోట్లకు అర్హులైన 7వేల మంది రైతులను లబ్ధిదారుల జాబితాలో గుర్తించారు. తమ ఖాతాలో ప్రభుత్వం నగదు ఎప్పుడు జమ చేస్తుందోనని వారు చూస్తున్నారు.
శివంపేట మండలం కొంతాన్పల్లి గ్రామంలో భార్య అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్లగా.. భర్త ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొంతాన్పల్లి గ్రామానికి చెందిన గున్నాల అశోక్ గౌడ్(35) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. భార్య శ్యామల అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్లడంతో ఇంటివద్ద ఒంటరిగా ఉన్న అశోక్ గౌడ్.. శనివారం రాత్రి ఉరేసుకున్నాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఉమ్మడి జిల్లాలో నాలుగో విడత రుణమాఫీ కోసం అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో 11,301 మంది రైతులకు రూ.110 కోట్లు, సిద్దిపేట జిల్లాలో రూ.95 కోట్లకు అర్హులైన 9,063 మంది రైతులు నాలుగో విడత జాబితా కింద పేర్లు ఉన్నాయి. మెదక్ జిల్లాలో రూ.56 కోట్లకు అర్హులైన 7వేల మంది రైతులను లబ్ధిదారుల జాబితాలో గుర్తించారు. తమ ఖాతాలో ప్రభుత్వం నగదు ఎప్పుడు జమ చేస్తుందోనని వారు చూస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికలు జిల్లా రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేశాయి. అసెంబ్లీ ఎన్నికల్లో BRS కంచుకోటను పదుల పరుచుకుంది. ఉమ్మడి జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలకు 7 స్థానాల్లో BRS విజయం సాధించినప్పటికీ అధికారం కాంగ్రెస్ హస్తగతం అయింది. పటాన్చెరు ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరగా, మరికొందరు చేరుతారని ప్రచారం ఉంది. ఉమ్మడి జిల్లాలో సత్తా చాటినప్పటికీ BRSకు కోలుకోలేని దెబ్బ తగిలిందని విశ్లేషకులు అంటున్నారు. COMMENT
రాష్ట్రంలో కందుల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మద్దతు ధరపై రూ.400 బోనస్ ఇచ్చి కంది రైతులను ఆదుకోవాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్రావు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో సుమారు 6 లక్షల ఎకరాల్లో 2.5లక్షల మెట్రిక్ టన్నుల కందులు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని అన్నారు.
కొల్చారం మండలం పోతన శెట్టిపల్లి గ్రామ శివారులోని ఏడుపాయల మంజీరా నదిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించింది. మంజీరా నదిలో మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చనిపోయిన వ్యక్తి సుమారు 40-50 ఏళ్ల వయసు గలవారిగా గుర్తించారు. ఎవరికైనా మృతుడి సమాచారం తెలిస్తే సమాచారం అందజేయాలని పోలీసులు సూచించారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో చలి తీవ్రత పెరిగి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రాష్ట్రంలోనే అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా కోహిర్లో 13.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. శివంపేటలో 13.9, నల్లవల్లి 14.2, అల్గోల్, అంగడి కిష్టాపూర్ 14.9, అల్మాయిపేట 15.0, పుల్కల్ 15.1, కాగజ్ మద్దూర్, కంకోల్, కంది, పాశమైలారం 15.2 డిగ్రీలు నమోదయ్యాయి. చాలా చోట్ల పొగమంచుతో వాహనదారులు ఇబ్బంది పడగా.. అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.
ఢిల్లీలో భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నో సంస్కరణలు అమలు చేసి దేశ ఆర్థిక అభివృద్ధిని పరుగులు పెట్టించారన్నారు. జీవితంలో ఎన్నో అత్యున్నత పదవులు చేపట్టిన ఆయన నిరాడంబరతకు ఆదర్శం అన్నారు.
Sorry, no posts matched your criteria.