Medak

News June 27, 2024

సిద్దిపేట: నేడు దరఖాస్తులకు చివరి తేదీ

image

సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీ కళాశాల పరిశోధన కేంద్రంలో బీఎస్సీ అటవీ శాస్త్రానికి సంబంధించి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 27 చివరి తేదీ అని కళాశాల పరిశోధన కేంద్రం డీన్ తెలిపారు. ర్యాంకుల ఆధారంగా 50, పేమెంట్ ఆధారంగా 10, ఈడబ్ల్యూఎస్ కోటా కింద మరో 5మందికి ప్రవేశాలు కల్పిస్తామన్నారు. www.fcrihyd.in వెబ్సైటును సందర్శించాలన్నారు. మరిన్ని వివరాలకు 9666460939 నంబరుకు సంప్రదించాలన్నారు.

News June 27, 2024

ఆరు నెలల్లో అన్నీ తారుమారవుతాయి.. పరేషాన్‌ కావద్దు: KCR 

image

‘ఆరు నెలల్లో అన్నీ తారుమారవుతాయి.. పరేషాన్‌ కావద్దు’ అని మాజీ CM KCR పార్టీ నాయకులతో అన్నారు. ఎవరికీ ఎప్పుడూ ఏదీ తక్కువ చేయలేదని, అయినా కొందరు పార్టీ మారడం బాధాకరమన్నారు. అధికార దాహంతో పార్టీ వీడుతున్న నాయకులపై సుప్రీంకోర్టుకు వెళ్దామని పేర్కొన్నారు. బుధవారం పార్టీ MLAలు బండారి లక్ష్మారెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్‌, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, చామకూర మల్లారెడ్డి కేసీఆర్‌ను కలిశారు.

News June 27, 2024

సిద్దిపేట: 79 మంది కానిస్టేబుళ్లు బదిలీ

image

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో 78 మంది కానిస్టేబుళ్లను బదిలీ చేస్తూ సీపీ అనూరాధ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని 27 పోలీస్ స్టేషన్ల పరిధిలో చాల కాలంగా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లను బదిలీ చేశారు. ఒకే స్టేషన్‌లో దాదాపు ఐదేళ్ల పాటు విధులు నిర్వహించిన వారు బదిలీల ఈ జాబితాలో ఉన్నారు.

News June 27, 2024

మెదక్: ఐటీఐఆర్‌ను కేంద్రం మళ్లీ తీసుకురావాలి: జగ్గారెడ్డి

image

కేంద్ర ప్రభుత్వం ఐటీఐఆర్‌‌ను మళ్లీ తీసుకురావాలని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యేTGPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. బుధవారం గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. 2014లో అధికారంలోకి వచ్చిన BJP సర్కార్ ITIRను రద్దు చేశారని తెలిపారు. దీన్ని రద్దు చేయకపోతే ఈ పదేళ్లలో 15 లక్షల ఉద్యోగాలు వచ్చేవన్నారు. ఈ విషయంపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు వినతి పత్రం సమర్పిస్తానని ఆయన అన్నారు.

News June 26, 2024

జహీరాబాద్: ఆర్టీసీ బస్సు ఢీ.. వ్యక్తి మృతి

image

జహీరాబాద్ మండలం సత్వార్ గ్రామం సమీపంలో వద్ద బైకు మహారాష్ట్ర ఆర్టీసీ బస్సు ఢీ కొన్న యువకుడు మృతి చెందిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. బైక్‌పై ప్రయాణిస్తున్న చిరాగ్ పల్లి గ్రామానికి చెందిన అజ్మత్ షా (24) మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు జహీరాబాద్ పోలీసులు తెలిపారు.

News June 26, 2024

మెదక్: రైల్‌లో పిల్లాడిని వదిలి వెళ్లిన తల్లిదండ్రులు

image

చేగుంట మండలం వడియారం రైల్వే స్టేషన్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. సుమారు 15 నెలల వయసు గల మగ పిల్లవాడిని కాచిగూడ నుండి మెదక్ వెళ్లే రైల్లో కోచ్ నెంబర్ S9లో గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. పిల్లాడి అరుపులను చూసిన స్థానికులు గమనించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. బాబును చేరదీసి రైల్వే అధికారులు ఎవరైనా గుర్తిస్తే తమను సంప్రదించాలని సూచించారు.

News June 26, 2024

తొందర పడకండి ఎమ్మెల్యేలతో కేసీఆర్

image

ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌస్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మాజీ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఇటీవల పలువురు ఎమ్మెల్యేలు పార్టీ మారడంతో నేతలతో ఆయన వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. నిన్న పలువురు ఎమ్మెల్యేలతో సమావేశం కాగా, ఇవాళ హరీశ్ రావు, మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, కాలేరు వెంకటేశ్, సుధీర్ రెడ్డి, లక్ష్మారెడ్డిలతో భేటీ అయ్యారు. పార్టీ మారుతున్న నేతల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యేలకు సూచించారు.

News June 26, 2024

మెదక్: మంజీరా నదిలో పడి మహిళా ఆత్మహత్య

image

కొల్చారం మండలం పోతంశెట్టి పల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. యాదాద్రి జిల్లాకు చెందిన వడ్డెర కుల కులస్తులు గ్రామంలో బండరాయి కొట్టుకుంటూ జీవిస్తున్నారు. అయితే ఈనెల 22న బండరాయి కొట్టుకుని జీవించే ఆండాలు అనే మహిళ ఇంట్లో కొడుకుతో గొడవ పడి ఇంట్లో నుండి వెళ్లిపోయింది. బుధవారం గ్రామ శివారులోని ఏడుపాయల వెళ్లే రహదారిలో మంజీరా నదిలో మృతదేహం లభించింది. బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

News June 26, 2024

మెదక్‌లో ART కేంద్రం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్

image

ఎయిడ్స్‌ బాధితులకు వైద్యం కోసం రాష్ట్రంలో కొత్తగా 16 జిల్లాల్లో 18చోట్ల యాంటీ రిట్రోవైరల్‌ థెరపీ(ఆర్ట్‌) కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ బాధ్యతలను తెలంగాణ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ(టీశాక్స్‌)కి అప్పగించారు. మెదక్ జిల్లాలో ఏఆర్టీ సెంటర్ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే ఎయిడ్స్ బాధితులకు అందుబాటులోకి రానున్నాయి.

News June 26, 2024

సిద్దిపేట: లవ్ మ్యాటర్ ఇంట్లో తెలిసి అమ్మాయి సూసైడ్

image

ప్రేమ విషయం ఇంట్లో తెలియడంతో యువతి సూసైడ్ చేసుకుంది. పోలీసుల వివరాలు.. ములుగు మండలం కొక్కొండకు చెందిన మహేశ్వరి(22) నూజివీడు కంపెనీలో పనిచేస్తూ విజయ్‌ను లవ్ చేసింది. సోమవారం రాత్రి మహేశ్వరి అక్కతో విజయ్ చాట్ చేశాడు. ఈ క్రమంలో ఇద్దరు కలిసి దిగిన ఫోటోలను ఆమెకు పంపాడు. దీంతో తమ ప్రేమ వ్యవహారం పేరెంట్స్‌కు తెలిసిందని మనస్తాపంతో యువతి ఉరేసుకుంది. మృతురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.