Medak

News June 25, 2024

ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలి: కలెక్టర్

image

జిల్లాలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. మున్సిపాలిటీలు గ్రామాల్లో ప్రభుత్వ భూముల్లో ఫెన్సింగ్ వేయించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి పాల్గొన్నారు.

News June 25, 2024

మెదక్: ఈనెల 28న జిల్లాస్థాయిలో ఎంపిక పోటీలు

image

హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్ క్రీడా పాఠశాలల్లో 4వ తరగతిలో ప్రవేశాలకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను మెదక్ అదనపు కలెక్టర్ వేంకటేశ్వర్లు ఆవిష్కరించారు. 28న మెదక్ ఇందిరాగాంధీ స్టేడియంలో జిల్లాస్థాయిలో ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇతర వివరాలకు 9347344440, 9493594388 నంబర్లును సంప్రదించాలని సూచించారు. జిల్లా యువజన, క్రీడల అధికారి నాగరాజు, శ్రీనివాస్, మాధవరెడ్డి, దేవేందర్ రెడ్డి ఉన్నారు.

News June 24, 2024

సిద్దిపేట: భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్య

image

వర్గల్ మండలం అంబర్పేట గ్రామానికి చెందిన దండు దుర్గేష్(34) పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్న దుర్గేశ్ ఈనెల 13న భార్య పూర్ణిమతో గొడవ పడ్డాడు. దాంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన దుర్గేశ్ ఈనెల 14న పురుగు మందు తాగాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు.

News June 24, 2024

ఫస్టియర్‌లో సంగారెడ్డి, సెకండియర్‌లో మెదక్ FIRST

image

తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఫస్టియర్‌లో మెదక్ జిల్లాలో 3,518 మంది విద్యార్థులకు 1,804(51.28), సంగారెడ్డిలో 9,358కి 5,456(58.03), సిద్దిపేటలో 4,622కి 2,649(57.31) పాసయ్యారు. అటూ సెకండియర్‌ ఫలితాల్లో మెదక్ జిల్లాలో 2,186 మందికి 1,151 మంది(52.65), సంగారెడ్డిలో 5,213కి 2,277(43.68), సిద్దిపేటలో 2,967కి 1,438(48.47) ఉత్తీర్ణత సాధించారు.

News June 24, 2024

స్నేహితుడితో గొడవపడి చెరువులో దూకి ఆత్మహత్య

image

మద్యం తాగే క్రమంలో స్నేహితుడితో గొడవపడి చెరువులో దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేకున్నాడు. ఈ ఘటన చేగుంట మండల కేంద్రంలో జరిగింది. స్థానికుల వివరాలు.. చేగుంటకు చెందిన తిరుపతి, సాయికుమార్(21) ఆదివారం సాయంత్రం తన స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తూ స్నేహితుడిపై దాడి చేశాడు. ఆ క్రమంలో స్నేహితుడు గాయడగా భయపడిన సాయికుమార్ స్థానిక ఊర చెరువులో దూకి ఆత్మహత్య చేకున్నాడు. మృతుడి తలిదండ్రులు గతంలోనే మృతి చెందారు.

News June 24, 2024

ప్రేమించిన వ్యక్తి కాదన్నాడని ఇంటర్ విద్యార్థి సూసైడ్

image

ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించాడని ఇంటర్ విద్యార్థి సూసైడ్ చేసుకున్న ఘటన వర్గల్ మండలంలో ఆదివారం జరిగింది. పోలీసుల వివరాలు.. ఓ గ్రామానికి చెందిన విద్యార్థిని(17) బంగ్లావెంకటాపూర్‌‌ గ్రామానికి చెందిన స్వామిని ప్రేమించింది. శనివారం పెళ్లి ప్రస్తావన తీసుకురాగా.. అతడు నిరాకరించాడు. దీంతో మనస్తాపానికి గురైన విద్యార్థిని ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేశారు.

News June 23, 2024

మెదక్: గుండెపోటుతో కుప్పకూలిన రైతు

image

గుండెపోటుతో రైతు అకస్మాత్తుగా కుప్పకూలిన ఘటన చిన్న శంకరంపేట్ మండలం రుద్రారంలో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గంగోల్ల నర్సింలు (50) వ్యవసాయ పనులు చేయడానికి సిద్ధం అవుతుండగా.. గుండె పోటుతో కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకువెళ్దామనేలోగా మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులున్నారు.

News June 23, 2024

మెదక్: పాలిటెక్నిక్ కౌన్సిలింగ్ ప్రారంభం

image

పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళ పాలిటెక్నిక్‌లో ఆదివారం ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభమయ్యింది. తొలి రోజు స్లాట్ నమోదు చేసుకున్న 274 మంది విద్యార్థులకు గాను 258 మంది హాజరయ్యారని ప్రిన్సిపల్ డాక్టర్ సువర్ణలత తెలిపారు. ఈ నెల 25 తేది వరకు పరిశీలన జరిగుతుందని పేర్కొన్నారు.

News June 23, 2024

సంగారెడ్డి: 38 మంది ఉపాధ్యాయులకు పదోన్నతి

image

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న 38 మంది ఉపాధ్యాయులకు ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి కల్పించినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆదివారం తెలిపారు. తెలుగు మీడియంలో 35, ఉర్దూ మీడియంలో ఒకరు, ఇంగ్లీష్ మీడియంలో ఇద్దరికీ పదోన్నతి కల్పించినట్లు చెప్పారు. పదోన్నతి పొందిన ఉపాధ్యాయులు ఈనెల 24న వారికి కేటాయించిన పాఠశాలలు చేరాలని సూచించారు.

News June 23, 2024

MDK: ఫసల్ ప్రీమియం బాధ్యత ప్రభుత్వానిదే !

image

‘ఫసల్’ బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలుచేయబోతోంది. ఇందులో భాగంగానే ఉమ్మడి జిల్లాకు సంబంధించిన సమావేశం సంగారెడ్డిలో మే 23న జరిగింది. ప్రీమియం భారం మొత్తం ప్రభుత్వమే భరించనుంది. గ్రామ యూనిట్‌గా వరి, మొక్కజొన్న, మండలం యూనిట్‌గా పత్తిని గుర్తించారు. రైతుల అభిప్రాయం తీసుకున్న కలెక్టర్లు తర్వలో మార్గదర్శకాలు ఇవ్వనున్నారు. ఉమ్మడి జిల్లాలో ఈ వానాకాలంలో సుమారుగా 14 లక్షల ఎకరాల్లో పంట సాగు కానుంది.