India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టాస్క్లు పూర్తి చేస్తే కమిషన్ వస్తుందని ఆశ చూపి ఓ వ్యక్తి నుంచి రూ.1.05 లక్షలు సైబర్ నేరగాళ్లు కొట్టేశారు. పటాన్చెరు పోలీసులు తెలిపిన వివరాలు.. గోకుల్నగర్ చెందిన ఓ వ్యక్తికి జూన్ 14న టాస్క్లు పూర్తి చేస్తే కమిషన్ ఇస్తామంటూ ఫోన్కు మెసేజ్ వచ్చింది. అతను వివరాలు నమోదు చేసి దఫదఫాలుగా రూ.1.05 లక్షలు జమ చేశాడు. అనంతరం అవతలి వ్యక్తి స్పందించలేదు. మోసపోయానని బాధితుడు PSలో ఫిర్యాదు చేశాడు.
‘ఫసల్’ బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలుచేయబోతోంది. ఇందులో భాగంగానే ఉమ్మడి జిల్లాకు సంబంధించిన సమావేశం సంగారెడ్డిలో మే 23న జరిగింది. ప్రీమియం భారం మొత్తం ప్రభుత్వమే భరించనుంది. గ్రామ యూనిట్గా వరి, మొక్కజొన్న, మండలం యూనిట్గా పత్తిని గుర్తించారు. రైతుల అభిప్రాయం తీసుకున్న కలెక్టర్లు తర్వలో మార్గదర్శకాలు ఇవ్వనున్నారు. ఉమ్మడి జిల్లాలో ఈ వానాకాలంలో సుమారుగా 14 లక్షల ఎకరాల్లో పంట సాగు కానుంది.
HYD ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సులు పూర్తి చేసి బ్యాక్ లాగ్స్ సబ్జెక్టులు మిగిలిన విద్యార్థులకు వన్ టైం ఛాన్స్ కల్పించినట్లు ఓయూ ఎగ్జామినేషన్స్ కంట్రోలర్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. బీఈడీ, ఎంఈడీ, బీపీఈడీ, ఎంపీఈడీ, బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్, ఎంఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో బ్యాక్ లాగ్ పరీక్షలకు హాజరయ్యేందుకు విద్యార్థులకు ఈ అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు.
హెల్త్ విభాగంలోని అన్ని ఖాళీ పోస్టులను భర్తీ చేసి, ఆయా సంస్థలను బలోపేతం చేయాలని అధికారులను అందోల్ MLA, మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. శనివారం హైదరాబాద్లోని ఆరోగ్యశ్రీ హెల్త్కేర్ ట్రస్ట్ కార్యాలయంలో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఫుడ్ సేఫ్టీ తనిఖీలు నిరంతరం నిర్వహించాలని ఆదేశించారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తే సహించబోమన్నారు.
తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ, మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖను నర్సాపూర్ నియోజకవర్గ ఇంచార్జీ పిసిసి ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ సమస్యలు, నియోజకవర్గ అభివృద్దికి నిధుల కేటాయింపు గురించి చర్చించారు. వారితో నాయకులు మైనంపల్లి హనుమంతరావు, ఆంజనేయులు గౌడ్, ఎలక్షన్ రెడ్డి ఉన్నారు.
సిద్దిపేట: తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకుల డిమాండ్ పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు లేఖ రాశారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన మేరకు గ్రూప్ -2, గ్రూప్-3 పోస్టులను పెంచి పరీక్షలు నిర్వహించాలని లేఖలో కోరారు. జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతిపై కార్యాచరణ ప్రకటించాలన్నారు.
మొదట కలెక్టర్గా చేసి అనంతరం ప్రజాప్రతినిధిగా మారిన వెంకట్రామిరెడ్డి ధరణి పేరుతో చేసిన మోసాలు బయటపెడతానని మెదక్ ఎంపీ రఘునందన్ రావు చెప్పారు. ఓ గెస్ట్ హౌస్లో ఉండి వివాదాస్పద ల్యాండ్ను తన నియంత్రణలోకి తెచ్చుకున్నారని, లావణి పట్టా భూముల్లో నిరుపేదలను బెదిరించి భూములు కొని.. కంపెనీల పేరుతో లాక్కున్నారని చెప్పారు. మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు పెండింగ్ చెక్కులను క్లియర్ చేయించే ప్రయత్నం చేస్తానన్నారు
ఆరుద్ర కార్తె వచ్చినా.. వానల కోసం రైతన్నలకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆశించినంత మేర వానలు పడకపోవడంతో ఇప్పటి వరకు చాలామంది రైతులు వరినార్లు పోయలేదు. ఈనెల మొదటి వారం నుంచే వరి పంట పండించే రైతులు నార్లు వేసే పనిలో నిమగ్నమయ్యేవారు. కానీ ఇప్పటివరకు ప్రక్రియ మొదలుకాలేదు. దీంతో ఈ యేడు వరి నాట్లు ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో అరుదైన చికిత్స నిర్వహించారు. పట్టణానికి చెందిన పుట్టి యశోద అనే మహిళ గత ఆరు నెలలుగా కడుపులో కణతితో బాధపడుతుంది. స్థానికంగా ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేసుకోగా అనస్తీషియా డాక్టర్ రాఘవేంద్ర, డాక్టర్ హేమరాజ్ సింగ్ ఆపరేషన్ నిర్వహించి ఆమె కడుపులో నుండి 7.50 కిలోల కణతి తొలగించారు.
రైతు రుణమాఫీ చరిత్రాత్మక ఘట్టమని హుస్నాబాద్ ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. తెలంగాణ రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేసి వ్యవసాయాన్ని పండగ చేయాలన్నదే కాంగ్రెస్ లక్ష్యమన్నారు. రైతు బిడ్డగా, రాష్ట్ర మంత్రిగా రైతన్నకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. వ్యవసాయం పండుగలా, రైతే రాజు అనే నినాదాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిజం చేస్తోందన్నారు.
Sorry, no posts matched your criteria.