Nalgonda

News September 4, 2025

సెప్టెంబర్ కోటా…సన్న బియ్యం పంపిణీ షురూ

image

సెప్టెంబర్ నెలకు సంబందించి సన్న బియ్యం పంపిణీ ప్రారంభమైంది. బుధవారం నుంచి పూర్తిస్థాయిలో షాపులు తెరిచి బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే 75 శాతం బియ్యం గోదాముల నుంచి రేషన్ షాపులకు చేరింది. ఈ నెల నుంచి కొత్త గా 44,099 కార్డులకు బియ్యం అందనుంది. కాగా నల్గొండలో కొందరు రేషన్ డీలర్లు రెండో తేదీన, మరికొందరు మూడో తేదీ నుంచి పూర్తిస్థాయిలో షాపులు తెరిచి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు.

News September 3, 2025

నల్గొండ: వినాయకుడి నిమజ్జనం ఇక్కడే..

image

వినాయక నిమజ్జనానికి జిల్లా వ్యాప్తంగా పోలీసు శాఖ భారీ ఏర్పాట్లు చేసిందని ఎస్పీ శరత్ చంద్ర పవర్ తెలిపారు. ప్రధాన నిమజ్జన ప్రాంతాలైన నల్గొండలోని వల్లభరావు చెరువు, మూసీ నది,14వ మైలు, మిర్యాలగూడలోని వాడపల్లి, నాగార్జునసాగర్‌, దయ్యాలగండి, అడవిదేవులపల్లి, దేవరకొండలోని కొండబీమనపల్లి, డిండి వద్ద బందోబస్తు కట్టుదిట్టం చేశారు. పికెట్లు, ప్లడ్‌ లైట్లు, క్రేన్లను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు.

News September 3, 2025

పోలీసుల సూచనలను పాటించాలి: నల్గొండ ఎస్పీ

image

గణేష్ నిమజ్జన సమయంలో పోలీసుల సూచనలను పాటించాలని ఎస్పీ శరత్చంద్ర పవర్ నిర్వాహకులను కోరారు. చిన్నపిల్లలు, మహిళలు వృద్దులు జాగ్రత్తగా ఉండాలని, గుంపుల వద్ద వాహనాలలో టపాకులు పేల్చవద్దని సూచించారు. నిర్దేశించిన మార్గంలోనే వెళ్లాలని, స్వచ్ఛంద సేవకుల విధులకు ఆటంకం కలిగించవద్దన్నారు. అత్యవసరమైతే 100, 112కు కాల్ చేయాలని ఎస్పీ సూచించారు.

News September 3, 2025

NLG: పంట నష్టం పై సర్వే..!

image

జిల్లాలో కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంట నష్టంపై అధికారులు సర్వే మొదలు పెట్టనున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా జిల్లాలో వరి, పత్తి పంటలకు సంబంధించి 284 ఎకరాల్లో నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. నష్టం అంచనాలు తయారు చేసి నివేదికలు పంపాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఇవాల్టి నుంచి వారం పాటు జిల్లా వ్యాప్తంగా అధికారులు సర్వే నిర్వహించనున్నారు.

News September 3, 2025

NLG: పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికం

image

నల్గొండ జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జిల్లాలో మొత్తం 5,42,589 మంది మహిళా ఓటర్లు ఉండగా, పురుషుల సంఖ్య 5,30,860. దీంతో పురుషుల కంటే మహిళా ఓటర్లు 11,729 మంది అధికంగా ఉన్నారు. గత ఎన్నికల సమయంలో 844 గ్రామ పంచాయతీలు ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య 869కి చేరింది.

News September 3, 2025

NLG: పల్లె ఓటర్లు @ 10,73,506

image

నల్గొండ జిల్లాలోని గ్రామ పంచాయతీల్లోని ఓటర్ల సంఖ్య పది లక్షలు దాటింది. మంగళవారం విడుదల చేసిన పంచాయతీ ఓటర్ల తుది జాబితా ప్రకారం జిల్లా వ్యాప్తంగా 33 మండలాల్లో 10,73,506 ఓటర్లు ఉన్నట్లు తేలింది. 2019లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో 9,30,205 ఓటర్లు ఉండగా, ప్రస్తుత జాబితాలో 1,43,301 మంది ఓటర్లు పెరిగారు. ఈ జాబితాతోనే త్వరలో నిర్వహించనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు యంత్రాంగం సిద్ధమవుతోంది.

News September 3, 2025

జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి దరఖాస్తు చేసుకోవాలి: కలెక్టర్

image

జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి అర్హత ఉన్న వారందరూ దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. కుటుంబ పెద్ద మరణించిన సందర్భంలో కేంద్రం ద్వారా అమలు చేసే ఈ పథకం కింద ఒకేసారి రూ.20 వేల ఆర్థిక సహాయం అందుతుందని ఆమె తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆసరా పెన్షన్ పొందుతున్నప్పటికీ, ఈ పథకానికి అర్హులేనని అన్నారు. దరఖాస్తులన్నింటినీ విచారణ చేసి త్వరితగతిన ఆర్డీఓకు పంపించాలని అధికారులను ఆదేశించారు.

News September 2, 2025

గణేష్ నిమజ్జనానికి పటిష్ఠమైన ఏర్పాట్లు: ఎస్పీ

image

వినాయక నిమజ్జనానికి పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు. నల్గొండలోని వల్లభరావు చెరువు వద్ద గణేష్ నిమజ్జన ప్రాంతాన్ని ఆయన కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి పరిశీలించారు. నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా లైటింగ్, బారికేడ్లు, క్రేన్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ సరఫరా వంటి ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

News September 2, 2025

NLG: విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వాలని HRC ఆదేశం

image

నల్గొండలోని నలంద ఫార్మసీ కళాశాల యాజమాన్యం తమకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని విద్యార్థులు తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌‌కి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన హెచ్‌ఆర్‌సీ ఛైర్మన్ షమీమ్ అక్తర్, బీ ఫార్మసీ పూర్తి చేసిన విద్యార్థులకు వారి టీసీ, ఇతర సర్టిఫికెట్లను వెంటనే అందజేయాలని సోమవారం ఆదేశాలు జారీ చేశారు.

News September 2, 2025

అంచనాలు రూపొందించి సమర్పించాలి : కలెక్టర్

image

ఇటీవల కురిసిన భారీ వర్షాలు వల్ల దెబ్బతిన్న రహదారులకు సంబంధించి అంచనాలు రూపొందించి సమర్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి R&B అధికారులను ఆదేశించారు. సోమవారం CM రేవంత్ రెడ్డి HYD నుంచి వర్షాలు, వరద నష్టాలపై కలెక్టర్లు, ఎస్పీలు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ఇటీవల భారీ వర్షాలకు R&B రహదారులు దెబ్బతిన్నాయని కలెక్టర్ వివరించారు.