Nalgonda

News July 29, 2024

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎస్సైల బదిలీలు

image

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని స్టేషన్లలో పనిచేస్తున్న ఎస్సైలను బదిలీ చేస్తూ సోమవారం డీజీపీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. నార్కెట్ పల్లి ఎస్సైగా క్రాంతి కుమార్, చిట్యాల ఎస్సైగా ధర్మ, నాగారం ఎస్సైగా ఐలయ్య, నూతనకల్ ఎస్సైగా మహేంద్ర నాథ్, తిరుమలగిరి ఎస్సైగా సురేశ్, అర్వపల్లి ఎస్సైగా బాలకృష్ణ బదిలీ అయ్యారు.

News July 29, 2024

కోదాడలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

image

కోదాడ పట్టణంలోని శ్రీమన్నారాయణ కాలనీ బీసీ హాస్టల్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆనవాళ్లను బట్టి గుర్తించిన వ్యక్తులు కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని పట్టణ సీఐ రాము తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News July 29, 2024

నల్గొండ: జిల్లాలో స్థానిక ఎన్నికల జోష్

image

నల్గొండ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. CM రేవంత్ ప్రకటనతో ఆశావహుల్లో జోష్ పెరిగింది. సర్పంచుల పదవీకాలం పూర్తయి 6 నెలలు అవుతుండగా, MPTC, ZPTCల పదవీ కాలం ఈనెల 5న ముగిసిన విషయం తెలిసిందే. పంచాయతీ ఎన్నికలు త్వరలో నిర్ణయిస్తామని, ఆగస్టు మొదటి వారంలోగా ఓటర్ల జాబితా సిద్ధం చేయాలంటూCMరేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. తొలుత MPTC,ZPTCల ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

News July 29, 2024

ముక్కు నేలకు రాసి రాజీనామా చేసి వెళ్లిపోతా: జగదీశ్ రెడ్డి

image

సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి గతంలో హత్య కేసులో నిందితుడని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. దీనిపై జగదీశ్ రెడ్డి స్పందిస్తూ.. మంత్రి కోమటిరెడ్డి ఆరోపణలు ఏ ఒక్కటి నిరూపించినా ముక్కు నేలకు రాసి రాజీనామా చేసి వెళ్లిపోతానని అన్నారు. నిరూపించలేకపోతే కోమటిరెడ్డి రాజీనామా చేయాలన్నారు. అయితే జగదీశ్ రెడ్డి సవాలును స్వీకరిస్తానని కోమటిరెడ్డి సభాముఖంగా తెలియజేశారు.

News July 29, 2024

మోటార్లకు మీటర్లు పెట్టడానికి KCR ఒప్పుకోలేదు: MLA జగదీశ్ రెడ్డి

image

విద్యుత్ రంగంపై శాసనసభలో చర్చ జరుగుతోంది. సూర్యాపేట ఎమ్మెల్యే మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ ఈ అంశంపై మాట్లాడారు. మోటార్లకు మీటర్లు పెట్టడానికి మాజీ సీఎం కేసీఆర్ ఒప్పుకోలేదని అన్నారు. కేసీఆర్ హయాంలో విద్యుత్ సంస్థల ఆదాయం పెంచామన్నారు. కేంద్రం ఇచ్చే రూ.30వేల కోట్లు కూడా వదులుకున్నామని చెప్పారు. సబ్ స్టేషన్, విద్యుత్ రంగ సంస్థల కోసం అప్పులు చేసినట్లు తెలిపారు.

News July 29, 2024

NLG: ఓటరు జాబితా తయారీపై కసరత్తు

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఓటర్ల జాబితా తయారికి ఎన్నికల సంఘం కసరత్తు మొదలు పెట్టింది. 2023 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితా ఆధారంగా పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితాను తయారు చేయనుంది. అందుకోసం ప్రతి జిల్లా నుంచి ఐదుగురు డేటా ఎంట్రీ ఆపరేటర్లను ఓటర్ల జాబితా తయారీ కోసం ఎంపిక చేసి ఓటర్ల జాబితా తయారీపై హైదరాబాద్లో వారికి ఒక రోజు శిక్షణ ఇవ్వనుంది.

News July 29, 2024

NLG: వ్యవసాయ అధికారులకు భారంగా రైతు వేదికలు!

image

ఉమ్మడి జిల్లాలో రైతు వేదికల నిర్వహణ వ్యవసాయ అధికారులకు భారంగా మారుతుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 73 మండలాల్లో 314 రైతు వేదికలు ఉన్నాయి. వాటికి ప్రతి నెలా రావలసిన నిధులు నిలిచిపోయాయి. వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో ఇప్పటికే వివిధ పంటల సాగులో రైతులు నిమగ్నమయ్యారు. ఈ వేదికల్లో ప్రతి మంగళవారం రైతు నేస్తం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. నిధుల లేమీ కారణంగా వ్యవసాయ అధికారులు ఇబ్బందులు పడుతున్నారు.

News July 29, 2024

ముగిసిన ఉపాధ్యాయ పదోన్నతుల ప్రక్రియ

image

జిల్లాలో ఉపాధ్యాయ పదోన్నతుల ప్రక్రియ రెండో విడత కూడా ముగిసింది. గత నెల 20 వరకు ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను పూర్తిచేసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఒక్కో ఉపాధ్యాయుడు మూడు సబ్జెక్టుల్లో కూడా పదోన్నతులు పొంది ఒక్క సబ్జెక్టులోనే జాయిన్ కావడంతో మిగతా రెండు పోస్టులు ఖాళీగానే మిగిలిపోయాయి. దీంతో అధికారులు నాట్ విల్లింగ్ తో మిగిలిన పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేశారు.

News July 29, 2024

511 అడుగులకు చేరిన సాగర్ నీటిమట్టం

image

నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 54,438 వేల క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 6,744 క్యూసెక్కులు ఉంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 511.40 అడుగులకు చేరినట్లు డ్యామ్ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం నీటి నిలువ 134.0598 టీఎంసీలుగా ఉంది.

News July 29, 2024

సాగర్ నీళ్లొస్తే ఫుల్ బిజీ

image

సాగర్‌కు వరద కొనసాగుతుండడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో వ్యవసాయ పనులు మొదలయ్యాయని సాగర్ నిండితే జోరందుకుంటాయని వారు చెబుతున్నారు. తమకు చేతినిండా పని దొరుకుతుందని రైతు కూలీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగు దాదాపు సాగర్ ఆయకట్టు కిందే ఉంది.