Nalgonda

News March 7, 2025

నల్గొండ: బీసీ గురుకులాలలో ప్రవేశాలు

image

మహాత్మ జ్యోతిరావ్ ఫులే బీసీ గురుకుల సంక్షేమ పాఠశాలలో 6, 7, 8, 9వ తరగతులలో బ్యాక్ లాక్ సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి నల్గొండ జిల్లా కో-ఆర్డినేటర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని గురుకులాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ విద్యార్థులు ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఏప్రిల్ 20న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

News March 7, 2025

NLG: సూసైడ్.. ముగ్గురు అరెస్ట్

image

వ్యక్తి ఆత్మహత్యకు కారణమైన అతడి భార్యతో పాటు మరో ఇద్దరిని మాడ్గులపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాలు.. ఆగామోత్కూర్‌కు చెందిన వెంకన్నతో సరితకు పెళ్లైంది. వీరి కాపురంలో మనస్పర్ధలు రావడంతో సరిత భర్త వెంకన్నకు దూరంగా ఉంటోంది. మనస్తాపానికి గురైన వెంకన్న గత నెల 22న ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సరిత, ఊరుబిండు మల్లయ్య, మన్నెం శ్రీనులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు.

News March 7, 2025

మిర్యాలగూడ: యువకుడి సూసైడ్ UPDATE

image

మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలో <<15675150>>యువకుడు <<>>ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. SI వివరాలు.. దామరచర్ల (M) వాడపల్లికి చెందిన అరుణ్‌(26) పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్నాడు. ఈ నెల 1న బయటికి వెళ్లి ఇంటికి రాలేదు. ఈ క్రమంలో రైల్వే స్టేషన్‌ సమీపంలో శవమై కనిపించాడు. ఆన్‌లైన్ బెట్టింగ్‌ వల్ల ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. యువకుడి ఆత్మహత్యకు బంక్ ‌యజమాని కారణమని కుటుంబీకులు ఆందోళన చేపట్టారు.

News March 7, 2025

మిర్యాలగూడ: యువకుడు ఆత్మహత్య.!

image

మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటు చేసుకుంది. మిర్యాలగూడ రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని యువకుడు రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సుమారు 25 ఏళ్ల వయస్సు కలిగి బూడిద కలర్ టీ షర్ట్ ధరించి, నల్ల కలరు లోయర్ ధరించి ఉన్నాడు. సమాచారం తెలిసిన వారు రూరల్ ఎస్ఐ లోకేష్ కుమార్ 8712670189కు తెలపాలని కోరారు.

News March 6, 2025

NLG: తెలంగాణ ఐసెట్ 2025 నోటిఫికేషన్ విడుదల

image

NLG MGUలో ఐసెట్ 2025 నోటిఫికేషన్‌ను సెట్ ఛైర్మన్, ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్, కన్వీనర్ అల్వాల రవి విడుదల చేశారు. జూన్ 8, 9వ తేదీల్లో 4 విడతలుగా తెలంగాణ వ్యాప్తంగా 16 ఆన్‌లైన్ పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు కన్వీనర్ ఆచార్య అల్వాల రవి తెలిపారు. ఆన్‌లైన్ దరఖాస్తులు మార్చి 10 నుంచి మే 3 వరకు సమర్పించవచ్చును. పూర్తి వివరాలకు https://icet.tsche.ac.inను సందర్శించాలన్నారు.

News March 6, 2025

పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన నల్గొండ కలెక్టర్, ఎస్పీ

image

నల్గొండలోని ప్రగతి జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఇంటర్ పరీక్షల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. విద్యార్థులందరూ ఇంటర్ పరీక్షలు భయపడకుండా రాసి తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తేవాలన్నారు.

News March 6, 2025

చేనేత ఉత్పత్తుల ప్రదర్శనలో చండూరు వాసులు

image

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో చేనేత కళాకారుల ఉత్పత్తుల ప్రదర్శనలతో కూడిన వివిధత కా అమృత మహోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము బుధవారం సాయంత్రం ప్రారంభించారు. తెలంగాణ వ్యాప్తంగా 20 మంది చేనేత హస్త కళాకారులు ఈ ప్రదర్శనకు ఎంపిక కాగా నల్గొండ జిల్లా చండూరుకి చెందిన జాతీయ అవార్డు గ్రహీత గంజి యాదగిరి, జాతీయ మెరిట్ అవార్డు గ్రహీత చిలుకూరు శ్రీనివాసులు వారిలో ఉండడం విశేషం.

News March 6, 2025

మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలో యువకుడి సూసైడ్

image

మిర్యాలగూడ రైల్వే స్టేషన్‌ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం అటుగా వెళ్లిన స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 6, 2025

NLG: LRSపై అధికారుల ప్రచారం ఫలించేనా?

image

జిల్లాలో లే అవుట్ల క్రమబద్ధీకరణ కోసం ఏర్పాటు చేసిన LRS పథకానికి 25 శాతం రాయితీపై పుర అధికారులు విస్తృత ప్రచారం చేపట్టారు. ఈనెల 31 లోగా LRS పథకం కింద పన్నులు చెల్లించేందుకు ముందుకు వచ్చేవారికి 25 శాతం ఫీజు రాయితీ ఇస్తున్నందున సద్వినియోగం చేసుకోవాలన్నారు. రెవిన్యూ, పురపాలక శాఖల ప్రమేయం లేకుండా నేరుగా రిజిస్ట్రేషన్ కార్యాలయంలోనే LRS చెల్లింపులు చేసేందుకు ఉన్నతాధికారులు అవకాశం కల్పించారు.

News March 6, 2025

NLG: పెరుగుతున్న హనీట్రాప్ బాధితులు!

image

నల్గొండ జిల్లాలో హనీట్రాప్ బాధితులు పెరుగుతున్నారు. పరువుపోతుందనే భయంతో వారు ఫిర్యాదు చేసేందుకు వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా బ్లాక్ మెయిలింగ్‌తో డబ్బు వసూళ్లకు అలవాటుపడిన సైబర్ నేరగాళ్లు అమ్మాయిలతో న్యూడ్ కాల్స్ చేయిస్తూ బాధితులను బెదిరించి నిలువుదోపిడీ చేస్తున్నారు. ఏకంగా ఎమ్మెల్యే వీరేశానికి న్యూడ్ కాల్ చేయగా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.