India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాజీవ్ గాంధీ క్విజ్ కాంపిటీషన్ పేరిట జూన్ 2023లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో క్విజ్ పోటీలు నిర్వహించింది. ప్రతీ నియోజకవర్గంలో మొదటి 40 స్థానాల్లో ఉన్నవారికి ప్రైజులు ఇస్తామని ప్రకటించగా పెద్ద ఎత్తున యువత పాల్గొన్నారు. పరీక్ష ముగిసి ఏడాది దాటినా ఫలితాల ఊసే లేదు. పరీక్ష రాసిన అభ్యర్థులు ఫలితాలు, ప్రైజుల కోసం ఎదురు చూస్తున్నారు. అధికారంలోకి వచ్చారు కదా ఇప్పటికైనా ఇస్తారేమో అని యువత చర్చించుకుంటున్నారు.
నాగార్జున సాగర్ ప్రాజెక్టు తాజా సమాచారం ఈ విధంగా ఉంది.
ఇన్ ఫ్లో: 52,471 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో: 5,944 క్యూసెక్కులు
పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు
ప్రస్తుత నీటి మట్టం 509 అడుగులు
పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312.5050 టీఎంసీలు
ప్రస్తుత నీటి నిల్వ 129.9780 టీఎంసీలు
రెండు మూడు రోజుల్లో శ్రీశైలం డ్యామ్ నిండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే డ్యామ్ గేట్లు ఎత్తే అవకాశం ఉంది. ఇప్పటికే రిజర్వాయర్లో 120 టీఎంసీలకుపైగా నీటి నిల్వ ఉంది. మరో 90కిపైగా టీఎంసీలు వస్తే ప్రాజెక్టు పూర్తిగా నిండుతుంది. ఆ తర్వాత గేట్లు ఎత్తి దిగువన ఉన్న నాగార్జున సాగర్కు నీటిని వదలనున్నట్లు సమాచారం.
నల్లగొండ ఎస్బిఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (RSETI) లో పదవ తరగతి పాసైన గ్రామీణ మహిళలకు బ్యూటీ పార్లర్ కోర్సులో 30 రోజుల ఉచిత శిక్షణ అందజేస్తున్నామని సంస్థ సంచాలకులు E. రఘుపతి శనివారం తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజనం ఉంటుందన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన 19 నుండి 45 ఏళ్ల లోపు మహిళలు అర్హులని తెలిపారు. ఆసక్తి గలవారు ఆగస్టు 2లోపు సంస్థ ఆఫీసులో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
భువనగిరి బస్టాండ్లో ఓ వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు. మహిళల మరుగుదొడ్ల స్లాబ్ పైకి ఎక్కి తొంగి చూశాడు. టాయిలెట్కు వెళ్లిన మహిళా కండక్టర్ అతడిని గమనించి, స్థానికులను అప్రమత్తం చేసింది. దుండగుడిని కిందకు లాగిన స్థానికులు దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.
గ్రామపంచాయతీ ఎన్నికలకు అధికారులు సిద్ధమయ్యారు. నల్గొండ జిల్లాలో 844, యాదాద్రి జిల్లాలో 421, సూర్యాపేట జిల్లాలో 475 గ్రామ పంచాయతీలున్నాయి. తాజా మాజీ సర్పంచులతోపాటు గత ఎన్నికల్లో ఓడిపోయిన వారు సర్పంచ్ పదవిని దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఆశావహుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. సర్పంచ్గా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యేలను కోరుతున్నారు.
నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 52,199 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 6,282 క్యూసెక్కులు ఉంది. సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 506.60 అడుగులు ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 312.04టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 125.97 టీఎంసీలుగా ఉంది.
జిల్లాలో అన్ని ప్రభుత్వ చౌకధర దుకాణాలకు ఆగస్టు నెల కోటా బియ్యాన్ని ఈనెల 31 వరకు సరఫరా చేయాలని డీఎస్ఓ వెంకటేశ్వర్లు ఆదేశించారు. పట్టణంలోని మండల గోదాంను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అన్ని చౌకధర దుకాణాల్లో కార్డుదారులకు బియ్యం పంపిణీ చేయాలన్నారు. ఆగస్టు నెలకు జిల్లాకు 6836.36 మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయించారన్నారు.
ఉమ్మడి జిల్లాలోని సహకార బ్యాంకుల ద్వారా పంట రుణాల పరిమితిని రూ. లక్ష నుంచి రూ.1.50 లక్షలకు పెంచినట్లు డీసీసీబీ ఛైర్మన్ కుంభం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం నల్గొండ డీసీసీబీ బ్యాంకులో మేనేజ్ మెంట్ కమిటీ నిర్ణయం తీసుకుంది. తీర్మానం జీవోలు జారీ చేయగా వాటిని డీసీసీబీ ఛైర్మన్ అధికారులతో కలిసి విడుదల చేశారు. నాబార్డు డీడీఎం సత్యనారాయణ, డీసీఓలు తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లాలోని చెరువుల్లో చేప పిల్లలు వదిలేందుకు గుత్తేదారులు ఎవరూ ముందుకు రావటం లేదు. మత్స్యకారుల జీవనోపాధి కోసం గత సర్కారు ఉచిత చేప పిల్లల పంపిణీకి శ్రీకారం పుట్టిన విషయం తెలిసిందే. జిల్లాలోని చెరువుల్లో చేప పిల్లలు వదిలేందుకు మత్స్యశాఖ అధికారులు టెండర్లను ఆహ్వానించారు.. ఈ నెల 10 నుంచి 23 వరకు టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది. కానీ ఉమ్మడి జిల్లాలో ఒక్కరు కూడా టెండర్లు వేసేందుకు ముందుకురాలేదు.
Sorry, no posts matched your criteria.