Nalgonda

News July 27, 2024

నల్గొండ, సూర్యాపేటను మించిన యాదాద్రి జిల్లా 

image

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా జాబ్ కార్డుదారులకు నూరు రోజుల పనిదినాలు కల్పించడంలో యాదాద్రి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. మరోవైపు NLG, SRPT, యాదాద్రి జిల్లాల్లోని ప్రజల్లో సగటు భూమి యాదాద్రిలోనే అత్యధికం కావడం విశేషం. మూడేళ్లలో ఉమ్మడి జిల్లాలో ప్రజల తలసరి ఆదాయం క్రమంగా పెరుగుతోంది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సామాజిక ఆర్థిక ముఖచిత్రం 2024లో వెల్లడించింది.

News July 27, 2024

NLG: ఆయకట్టులో చిగురిస్తున్న ఆశలు!

image

నాగార్జునసాగర్ ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో కృష్ణానది జలకళను సంతరించుకుంది. సాగర్ ఎగువన ఉన్న ఆల్మట్టి, తుంగభద్ర జలాశయాల నుంచి శ్రీశైలానికి వరద వస్తోంది. శ్రీశైలం గరిష్ఠ నీటిమట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 860.40 అడుగులుగా ఉంది. రెండు రోజుల్లో శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.

News July 26, 2024

నల్గొండ: కూలీలతో కలిసి నాటు వేసిన ఎమ్మెల్యే 

image

విమర్శలు, ప్రతీ విమర్శలు, నియోజకవర్గ అభివృద్ధి పనులంటూ బిజీగా ఉండే మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కూలీలతో మమేకయ్యారు. వారితో కలిసి నాటు వేశారు. రుణమాఫీ అయిందా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే తమతో కలిసి నాట్లు వేయడం సంతోషంగా ఉందని కూలీలు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని బీఎల్ఆర్ తెలిపారు.

News July 26, 2024

చిన్నారులపై పెరిగిన లైంగిక వేధింపులు: ఎంపీ చామల

image

దేశంలో చిన్నారులపై లైంగిక వేధింపులు పెరిగాయని లోక్‌సభ భువనగిరి MP చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నారుల సంక్షేమంలో 176 దేశాల్లో 113వ స్థానంలో భారత్
నిలవడం శోచనీయమని పేర్కొన్నారు. చిన్నారుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటని ప్రశ్నించగా, దీనిపై కేంద్రమంత్రి అన్నపూర్ణ
దేవి స్పందిస్తూ మిషన్ వాత్సల్య యోజన ద్వారా దేశంలో చిన్నారుల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తున్నామన్నారు.

News July 26, 2024

త్వరలోనే వైద్య కళాశాలల నిర్మాణం పూర్తి

image

గత ప్రభుత్వం NLG, SRPT, యాదాద్రిలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేసింది. SRPTలో భవనం పూర్తైనా NLG, యాదాద్రి జిల్లాలో పూర్తి చేయలేదు. ఈ బడ్జెట్‌లో వైద్య రంగానికి రూ.11,468 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ నిధులతో నల్గొండతో పాటు యాదాద్రిలో వైద్య కళాశాల భవనాల నిర్మాణం పూర్తి చేయనుంది. మరోవైపు జిల్లాలో ప్రతి ఒక్కరికి ప్రత్యేక గుర్తింపు సంఖ్యతో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డును జారీ చేయనుంది.

News July 26, 2024

నల్గొండ: పెళ్లి చెడగొట్టాలని యత్నం.. యువకులపై కేసు 

image

పెళ్లి సంబంధం చెడగొట్టడానికి యత్నించిన యువకులపై కేసు నమోదైంది. నల్గొండలోని ఓ కాలనీకి చెందిన యువతికి పట్టణానికి చెందిన యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. తనకు ఈ పెండ్లి ఇష్టం లేదని ఆ యువతి ఇంటి పక్కన ఉండే తెలిసిన యువకుడికి చెప్పింది. అతడు మరో స్నేహితుడి సహాయంతో ఈ నెల 16న పెళ్ళి కొడుడికి ఫోన్ చేసి యువతిని పెళ్లి చేసుకోవద్దని, అమ్మాయి మైనర్ అని బెదిరించారు. యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News July 26, 2024

NLG: అమ్మో రేషన్ బియ్యమా.. మాకొద్దు!

image

రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. పౌరసరఫరాల శాఖ, ఎన్ఫోర్స్‌మెంట్‌ అధికారులు అక్రమ వ్యాపారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇటీవల ఉమ్మడి జిల్లాలో తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో కొంతమంది రేషన్ డీలర్లు, బియ్యం వ్యాపారులు రేషన్ బియ్యం కొనుగోలు చేయడానికి సాహసించడం లేదు. రేషన్ బియ్యం కొనుగోలు చేయలేమంటూ తెగేసి చెబుతుండటం గమనార్హం.

News July 26, 2024

జీరో బిల్‌తో ప్రభుత్వానికి రూ.350 కోట్ల భారం

image

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గృహజ్యోతి పథకం కింద నెలకు 200 యూనిట్ల విద్యుత్‌ వినియోగాన్ని ఉచితంగా ఇస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఈ పథకానికి 8.50 లక్షల దరఖాస్తులు రాగా.. ఐదు లక్షల కనెక్షన్ల వరకు ప్రస్తుతం అధికారులు జీరో బిల్‌ నమోదు చేస్తున్నారు. సాంకేతిక, ఇతర కారణాలతో కొంత మందికి అర్హత ఉన్నా ఈ పథకంలో లబ్ధి చేకూరడం లేదు. ఉమ్మడి జిల్లాలో జీరో బిల్‌ నమోదు చేయడం వల్ల రూ.350 కోట్ల మేర ఆర్థిక భారం పడుతోంది.

News July 26, 2024

ఉమ్మడి జిల్లాలో ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు విడుదల

image

ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ఏడాదికి 42 వేల ఇళ్లను నిర్మించనున్నారు. మరోవైపు పూర్తయిన రెండు పడక గదుల ఇళ్లను త్వరలోనే లబ్ధిదారులకు అందజేస్తామని, అసంపూర్తిగా ఉన్నవాటిని పూర్తి చేస్తామని గురువారం శాసనసభలో బడ్జెట్ సమావేశంలో ప్రభుత్వం వెల్లడించింది. ఉమ్మడి జిల్లాలో రెండు పడకగదుల ఇళ్లు 16,254 మంజూరుకాగా.. అందులో 6,391 పూర్తయ్యాయి.

News July 26, 2024

NLG: ముసురుతో ముప్పే..! పంటలకు నష్టం

image

ఎప్పుడెప్పుడా అని నింగి వైపు చూసిన రైతన్నకు ఆశించిన స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఏకధాటిగా కురుస్తున్న ముసురు వానతో వివిధ పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదముంది. అల్పపీడన ప్రభావం వల్ల ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న ముసురు వాన వల్ల పంటల్లో తేమ శాతం అధికమవుతోంది. చేన్లలో నీరు నిల్వ ఉండటంతో.. చేలు జాలువారి పంటను దెబ్బతీసే ప్రమాదముంది.