India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

విద్యార్థులకు ఏఐ, కోడింగ్ అంశాలను సులభంగా బోధించాలని డీఈవో భిక్షపతి ఉపాధ్యాయులకు సూచించారు. జిల్లాలోని 29 అటల్ టింకరింగ్ ల్యాబ్ పాఠశాలలకు చెందిన భౌతిక శాస్త్ర, గణిత ఉపాధ్యాయులకు పైథాన్ లాంగ్వేజ్, ఏఐ అంశాలపై మూడు రోజుల శిక్షణ శుక్రవారం డైట్ కళాశాలలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో క్వాలిటీ కోఆర్డినేటర్ రామచంద్రయ్య పాల్గొన్నారు.

నల్గొండలోని పారిశ్రామిక కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐతో పాటు ఇతర చట్టబద్ధ సౌకర్యాలను వెంటనే అమలు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతిపత్రం అందజేశారు. కార్మికులకు శాశ్వత ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన కోరారు.

నిడమనూరు మండలం ఎర్రబెల్లి గ్రామాన్ని శుక్రవారం తెలంగాణ రైతు కమిషన్ సభ్యుల బృందం సందర్శించింది. ఈ సందర్భంగా గ్రామంలోని బత్తాయి తోటను పరిశీలించి రైతు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జాలిపర్తి నాగేశ్వరావు అనే రైతు బత్తాయి తోటలో రాలిన కాయలను కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, కమిటీ సభ్యులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో లకుమాల మధుబాబు తదితరులు పాల్గొన్నారు.

చౌటుప్పల్ మండలం <<17212670>>ఖైతాపూరం వద్ద<<>> గతనెల 26న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఏఎస్పీ ప్రసాద్ చికిత్స పొందుతూ మృతి చెందారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీలు చక్రధరరావు, శాంతరావు అక్కడికక్కడే మృతిచెందగా.. తీవ్ర గాయాలైన ప్రసాద్ను హైదరాబాద్లోని కామినేని ఆసుపత్రిలో చేర్చారు. నెల రోజులపాటు మృత్యువుతో పోరాడిన ఆయన ఈరోజు తుదిశ్వాస విడిచారు.

NLGలో జరిగిన <<17539485>>మర్డర్ <<>>కేసును వన్ టౌన్ CI ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి బృందం 24 గంటలు గడవకముందే ఛేదించింది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన లారీ క్లీనర్ షేక్ సిరాజ్.. రమేశ్ను హత్య చేసినట్లు DSP శివరాంరెడ్డి వెల్లడించారు. సిరాజ్ రోజూ పడుకునే ప్లేస్లో రమేశ్ పడుకోవడంతో కోపోద్రిక్తుడైన సిరాజ్ బండరాళ్లతో కొట్టి హత్య చేశాడన్నారు. కేసు ఛేదించిన బృందాన్ని జిల్లా ఎస్పీ అభినందించారు.

గ్రామీణ విద్యార్థుల్లో సాంకేతిక ప్రతిభను వెలికి తీసేందుకు నల్గొండలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ) లను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. నైపుణ్య విద్యలో శిక్షణ పొందేందుకు ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకొనే అవకాశం కల్పించింది. రేపటి వరకు చాన్స్ ఉన్నందున విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్ కోరుతున్నారు.

జిల్లాలో చేయూత పింఛన్లను సెప్టెంబర్ 4వ తేదీ వరకు లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి తెలిపారు. ముఖ గుర్తింపు సాఫ్ట్వేర్ ద్వారా పోస్టాఫీసుల్లో అందజేయనున్నట్టు తెలిపారు. పెన్షన్ దారులంతా రూ.16 చిల్లరను అడిగి తీసుకోవాలని పేర్కొన్నారు. మధ్య దళారులను నమ్మకూడదని సూచించారు.

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ముసాయిదా ఓటరు జాబితా విడుదలైంది. తుది ఓటరు జాబితా తయారీకి విడుదల చేసిన నోటిఫికేషన్ ఆధారంగా జిల్లాలోని 869 గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఓటర్లు, పోలింగ్ కేంద్రాల జాబితాలను గ్రామ పంచాయతీల్లో ప్రదర్శించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇందులో భాగంగా జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య గురువారం జాబితాను విడుదల చేశారు.

బత్తాయి రైతుల సమస్యలు తెలుసుకునేందుకు తెలంగాణ రైతు కమిషన్ సభ్యుల బృందం నేడు, రేపు నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ఎర్రబెల్లి, గుంటిపల్లి గ్రామాల్లో పర్యటించనుంది. కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డితో పాటు పలువురు సభ్యులు గ్రామాల్లోని బత్తాయి, పామాయిల్ ఆయా తోటలను పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకుంటారు.

భారత సైన్యంలో అగ్నివీర్ పథకం కింద అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ క్లర్క్ పోస్టుల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారని జిల్లా ఉపాధి కల్పన అధికారి పద్మ తెలిపారు. అభ్యర్థులు JAN 2005 నుంచి JUL 2008 మధ్య జన్మించి ఉండాలని, ఇంటర్ లేదా డిప్లొమాలో ఏదైనా గ్రూపులో 50% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలన్నారు. అభ్యర్థులు https://agnipathvayu.cdac.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.