India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
33 రకాల సన్నరకాల వంగడాలకు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించడంతో ఉమ్మడి జిల్లాలో లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. మిర్యాలగూడ, గరిడేపల్లి, నేరేడుచర్ల, హుజూర్నగర్, కోదాడ, చిలుకూరు ప్రాంతాల్లో లక్షల మంది రైతులు ఏటా సాగర్ ఎడమ కాల్వ కింద సన్నరకాలనే సాగు చేస్తున్నారు. ప్రభుత్వం తాజా నిర్ణయంతో సుమారు 4 లక్షల ఎకరాల్లో పండే సన్నరకాలకు బోనస్ రానుంది.
ప్రతి గ్రామపంచాయతీలో 500 జనాభా కలిగిన తండాలను పంచాయతీలుగా మార్చి ఆరేళ్లు గడిచినా కనీస వసతులు లేవు. మరోవైపు పంచాయతీలకు పక్కా భవనాలు లేకపోవడంతో అద్దె గదుల్లోనే కార్యకలాపాలు సాగుతున్నాయి. వీటన్నింటికీ ఈ ఏడాదిలో పక్కా నిర్మాణాలను నిర్మిస్తామని తెలంగాణ ప్రభుత్వం గురువారం బడ్జెట్లో ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.
పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చి పూర్తి చేస్తామని ప్రభుత్వం చెప్పడంతో జిల్లా ప్రజల్లో ఆశలు రేకెత్తాయి. ప్రాజెక్టులకు బడ్జెట్లో ఈసారి కేటాయింపులు భారీగా పెరిగాయి. అయినా జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టు పనులకు అవి సరిపోని పరిస్థితి నెలకొంది. నల్గొండ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు మొత్తంగా రూ. 8598 కోట్లు అవసరం కాగా ప్రభుత్వం ఈ బడ్జెట్లో రూ.1699.90 కోట్లు కేటాయించింది.
నాగార్జునసాగర్ పరిధిలోని ఎత్తిపోతల పథకానికి బడ్జెట్లో ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించింది. దేవరకొండతో పాటు సాగర్ ఎడమ కాలవ పరిధిలోని నాగార్జునసాగర్, మిర్యాలగూడ, HNR నియోజకవర్గాలలో సుమారు రూ.3 వేల కోట్లతో గతంలో KCR ఎత్తిపోతల నిర్మాణం ప్రారంభించారు. కానీ నిధులు కేటాయించకపోవడంతో పునాది దశలోనే ఉన్నాయి. ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించడంతో ఎత్తిపోతల పథకాల నిర్మాణం ముందుకు సాగనుంది.
బార్డర్లో నల్గొండ జిల్లాకు చెందిన ఆర్మీ జవాన్ అసువులు బాశారు. గ్రామస్థుల వివరాల ప్రకారం.. అనుముల మం. మదారిగూడెనికి చెందిన ఈరేటి మహేశ్ (24). సూర్యాపేట ఆర్మీ రిక్రూట్మెంట్-2022లో సైన్యంలో చేరారు. అస్సాంలోని మంచుకొండల్లో గస్తీ కాస్తుండగా వాతావరణ పరిస్థితుల అనుకూలించక అనారోగ్యానికి గురయ్యారు. చికిత్స పొందుతూ అక్కడే చనిపోయారు. నేడు భౌతికకాయం స్వగ్రామానికి చేరనుంది.
ఉమ్మడి నల్గొండ రైతులకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కీలకం. పంటల సాగు ఎక్కువగా సాగర్ ఆయకట్టు పరిధిలోనే జరుగుతోంది. కొన్ని రోజులుగా సాగర్ నీటిమట్టం డెడ్ స్టోరేజీకి చేరడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఇక ఎగువన కురుస్తోన్న వర్షాలతో శ్రీశైలం డ్యామ్కు వరద పోటేత్తుతుండగా దిగువన ఉన్న నాగార్జున సాగర్కు 31,784 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది. దీంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
NLG జిల్లాలోని నిరుద్యోగ యువతి యువకులకు పలు ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగాలను కల్పించుటకు నేడు ఉదయం 10-30 గంటలకు జిల్లా ఉపాధికల్పన కార్యాలయము, ఐటిఐ క్యాంపస్ నల్లగొండలో మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి S.మాధవరెడ్డి తెలిపారు. ఈ జాబ్ మేళాకు 4 ప్రైవేట్ కంపెనీలు హాజరవుతున్నాయని, ఎంపిక కాబడిన వారు NLG, HYD పరిసర ప్రాంతాలలో పనిచేయాల్సి ఉంటుందన్నారు.
చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు శాశ్వత ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. గురువారం ఆయన చెరువుగట్టు ఆలయాన్ని సందర్శించారు. ఆలయ అర్చకులు, దేవస్థానం కమిటీ కలెక్టర్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గట్టు పైకి వచ్చే రహదారులతో పాటు ఘాట్ రోడ్డు సైతం డబుల్ రోడ్డు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు.
నార్కెట్ పల్లి మండలం, ఎల్లారెడ్డి గూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా చేపట్టిన పనులన్నీ ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. గురువారం ఆయన ఎల్లారెడ్డి గూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల తరగతి గదులు ,వంటగది, తాగునీటి సౌకర్యం, ప్రహరీ ,పాఠశాల ఆటస్థలం, టాయిలెట్స్ తదితర సౌకర్యాలను పరిశీలించారు.
చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న వ్యక్తిని డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గుర్తుతెలియని యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.