India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

వృద్ధాప్య, వితంతు, వికలాంగ, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులకు ఆసరా పెన్షన్లను ఈ నెల 29 నుంచి పోస్ట్ ఆఫీసుల ద్వారా పంపిణీ చేయనున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి తెలిపారు. లబ్ధిదారులు సెప్టెంబర్ 4 వరకు నేరుగా పోస్ట్ ఆఫీసుల ద్వారా తమ పెన్షన్ను తీసుకోవచ్చని చెప్పారు. మధ్యవర్తులను ఆశ్రయించవద్దని ఆయన సూచించారు.

నల్గొండ ఎన్జీ కాలేజీలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్లో డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆగస్టు 30వ తేదీ చివరి గడువు అని ప్రిన్సిపల్ డా. సముద్రాల ఉపేందర్, కోఆర్డినేటర్ డాక్టర్ బొజ్జ అనిల్ కుమార్ తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. మరిన్ని వివరాల కోసం 7382929610, 9533101295, 7989339180 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

క్రీడల పట్ల విద్యార్థులు ఆసక్తి పెంచుకొని రాణించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. జాతీయ క్రీడా దినోత్సవం, హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని గురువారం ఆమె మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి కలెక్టర్ నుంచి మేకల అభినవ్ స్టేడియం వరకు నిర్వహించిన జాతీయ క్రీడా దినోత్సవ రన్ను జెండా ఊపి ప్రారంభించారు.

ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం తన కార్యాలయంలో డీఈవో బిక్షపతి, జిల్లా సెక్టోరియల్ అధికారులు, ఎంఈవోలతో ఆమె విద్యా విషయక సమీక్ష నిర్వహించారు. విద్యార్థులకు అందుతున్న పుస్తకాలు, యూనిఫాంలు, విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరుపై ఆమె సమీక్షించారు. విద్యార్థుల సామర్థ్యాలు పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలందరినీ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్బీవై)లో నమోదు చేయించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి వై.శేఖర్ రెడ్డి ఆదేశించారు. ఉపాధి సిబ్బందితో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ పథకం కింద నమోదైన వారికి జూన్ 1 నుంచి మే 31 వరకు బీమా వర్తిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

జాతీయ కుటుంబ ప్రయోజన పథకం దరఖాస్తుల స్వీకరణ, పరిశీలనను వేగవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఈ విషయమై గురువారం ఆమె ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో 2017 నుంచి ఇప్పటి వరకు 33,600 మరణాలు సంభవించినప్పటికీ, ఈ పథకం కింద కేవలం 3,121 దరఖాస్తులు మాత్రమే వచ్చాయని కలెక్టర్ అన్నారు. దరఖాస్తుల సంఖ్య మరింత పెరగాలని ఆమె సూచించారు.

గ్రామాల్లో పొలిటికల్ హీట్ మొదలైంది. ఓవైపు జిల్లాలో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తుండడంతో ప్రధాన పార్టీలకు చెందిన లీడర్లు గ్రామాల్లో ప్రజలకు మరింత దగ్గర అయ్యేందుకు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. వినాయక చవితి వేడుకలు తమకు కలిసి వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఆయా గ్రామాల్లో గణేష్ మండపాల వద్ద లోకల్ లీడర్లు ఫోటోలతో ఫ్లెక్సీలు, హోర్డింగులు దర్శనమిస్తున్నాయి.

అధికార కాంగ్రెస్ పార్టీలో పదవుల పందేరానికి తెరలేచింది. పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు కావస్తున్న నామినేటెడ్ పదవులు భర్తీ చేయకపోవడంతో ఆ పార్టీ నేతల్లో తీవ్ర నైరాశ్యం నెలకొన్న విషయం తెలిసిందే. ప్రభుత్వం ఏర్పాటుకు మునుపు జెండా మోసిన వారంతా ఆశలు పెట్టుకున్నారు. కాగా గణేష్ నిమజ్జనం జరిగే లోపు నామినేటెడ్ పదవులు భర్తీ పూర్తి చేయాలని నిర్ణయించడంతో నేతల్లో మళ్లీ ఆశలు పుట్టుకొస్తున్నాయి.

నల్గొండ ఎస్ఎల్బీసీ డాన్ బోస్కో అకాడమీలో ఈనెల 29న ప్రఖ్యాత కంపెనీల ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు అకాడమీ డైరెక్టర్ బాలశౌరిరెడ్డి తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని టెన్త్ నుంచి పీజీ, టెక్నికల్ కోర్సులు ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువత మేళాను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. జెన్ ప్యాక్ట్, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, హెటిరోడ్రగ్స్, మెడిప్లస్, డీమార్ట్, వరుణ్ మోటార్స్ తదితర కంపెనీలు పాల్గొంటాయని వివరించారు.

నల్గొండ ప్రజలకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్తో కలిసి ఆమె జిల్లా కేంద్రంలోని రామాలయంలోని మొదటి గణేశ్ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుభిక్షంగా, సంతోషంగా ఉండాలని, తలపెట్టిన కార్యాలు నిర్విఘ్నంగా సాగాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.