Nalgonda

News March 4, 2025

నల్గొండ: జిల్లా పోలీస్ కార్యాలయంలో భరోసా కన్వర్జెన్ మీటింగ్

image

నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో లైంగిక వేధింపులకు గురైన బాధిత మహిళలకు తీసుకోవాల్సిన తక్షణ సహాయక చర్యలపై లీగల్, మెడికల్, ఉమెన్, చైల్డ్ వెల్ఫేర్ సంబంధిత అధికారులతో జిల్లా SP శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో భరోసా కన్వర్జెన్ మీటింగ్‌ను సోమవారం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా అడిషనల్ డిస్ట్రిక్ట్ & సెషన్ జడ్జి కులకర్ణి, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్ పర్సన్ దీప్తి పాల్గొన్నారు.

News March 4, 2025

నల్గొండ: ‘భరోసా ద్వారా బాధిత మహిళలకు అండగా నిలవాలి’

image

భరోసా సెంటర్ ద్వారా బాధిత మహిళలకు రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. నల్లగొండ జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం లైంగిక వేధింపులకు గురైన బాధిత మహిళలకు తీసుకోవాల్సిన తక్షణ సహాయక చర్యలపై లీగల్, మెడికల్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, సంబంధిత అధికారులతో భరోసా కన్వర్జేన్ సమావేశం నిర్వహించారు.

News March 4, 2025

నల్గొండ: అంతర్జాతీయ ప్రమాణాలతో MGU క్రీడా ప్రాంగణాలు

image

MG యూనివర్సిటీ క్రీడా ప్రాంగణాలను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దనున్నట్లు ఉప కులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్ తెలిపారు. విశ్వవిద్యాలయంలోని 2160 స్క్వేర్ మీటర్ల ఇండోర్ స్టేడియం ఫ్లోరింగ్, 400 మీటర్ల ఎనిమిది లేన్ల ట్రాక్‌ను సింథటిక్ ట్రాక్‌గా మార్చేందుకు ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్ ఇండియా లిమిటెడ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు.

News March 3, 2025

 నల్గొండ: MLC కోదండరామ్‌కు బిగ్ షాక్

image

వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ కోదండరాం మద్దతు ఇచ్చిన పన్నాల గోపాల్ రెడ్డికి 24 ఓట్లు రావడంతో కోదండరాంకు ఊహించని షాక్ తగిలింది. ఉద్యమ నాయకుడు, ప్రస్తుత ఎమ్మెల్సీ ప్రచారం చేస్తే 24 ఓట్లు రావడం ఏంటని మేధావులు ముక్కు మీద వేలు వేసుకుంటున్నారు.

News March 3, 2025

నల్గొండ: శ్రీపాల్ రెడ్డి నేపథ్యం ఇదే..!

image

వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ MLCగా విజయం సాధించిన పింగళి శ్రీపాల్ రెడ్డి మహబూబాబాద్ జిల్లా గూడూరులో జన్మించారు. ఆయనకు 52 ఏళ్లు. వృత్తి రీత్యా హనుమకొండలో స్థిరపడ్డారు. ఆయన గతంలో PRTU TS, UTF రాష్ట్ర అధ్యక్షుడిగా, అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(AIFTO) జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పనిచేశారు. 2021లో జాతీయ ఉపాధ్యక్షుడిగా కూడా పని చేశారు. కాగా ఇటీవల ఆయన తన టీచర్ పోస్ట్‌కు రాజీనామా చేశారు.

News March 3, 2025

నల్గొండ: భర్త దాడి.. భార్య మృతి

image

భార్యపై భర్త దాడి చేయగా ఆమె మృతిచెందిన ఘటన నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం సర్వారం గ్రామంలో సోమవారం జరిగింది. ఎస్ఐ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన బండారు మహేశ్వరి(23)కి కేతేపల్లి మండలం బండకిందగూడెం గ్రామానికి చెందిన శ్రీకాంత్‌తో 5 ఏళ్ల క్రితం వివాహమైంది. కాగా, భార్యపై అనుమానంతోనే భర్త ఆమెపై ఈనెల 1న సర్వారంలో దాడి చేశాడు. చికిత్స కోసం ఆమెను ఆస్పత్రికి తరలించగా ఇవాళ కన్నుమూసింది.

News March 3, 2025

నల్గొండ: MLC ఎన్నికలు.. మొదటి రౌండ్ ఫలితాలు

image

WGL-KMM-NLG ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు ఫలితాలను అధికారులు వెల్లడించారు.
1) PRTU అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి – 6,035
2) UTF అభ్యర్థి నర్సిరెడ్డి – 4,820
3) స్వతంత్ర అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి- 4,437
4) స్వతంత్ర అభ్యర్థి పూల రవీందర్- 3,115
5) BJP మద్దతు అభ్యర్థి సరోత్తంరెడ్డి- 2,289
కాగా మొత్తం 19 మంది అభ్యర్థులకు చెల్లిన ఓట్లు 23,641, చెల్లని ఓట్లు 494

News March 3, 2025

నకిరేకల్‌: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

image

నకిరేకల్‌ (M) తాటికల్లు ఫ్లైఓవర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో  సూర్యాపేట జిల్లా తుమ్మల పెన్‌పహాడ్ గ్రామానికి చెందిన ప్రభు, గుర్తుతెలియని మహిళ మృతి చెందారు. సూర్యాపేట నుంచి HYDకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతదేహాలను నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తన కొడుకు మరణంపై మృతుడి తల్లి అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

News March 3, 2025

అరుణాచల గిరి ప్రదర్శనకు ప్రత్యేక బస్సులు: ఆర్ఎం జానీ రెడ్డి

image

అరుణాచల గిరి ప్రదర్శన కోసం మార్చి 12వ తేదీ సాయంత్రం 7 గంటలకు అన్ని డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఉమ్మడి నల్గొండ రీజినల్ మేనేజర్ కే. జాని రెడ్డి తెలిపారు. ప్రతి పౌర్ణమికి రద్దీని బట్టి ప్రత్యేక సర్వీసులు నడిపిస్తామని, అరుణాచలం వెళ్లే భక్తులకు ఏపీలోని కాణిపాకం, తమిళనాడులోని వేలూరు గోల్డెన్ టెంపుల్ దర్శనం కూడా ఉంటుందని వివరాలకు 92980 08888 సంప్రదించాలన్నారు.

News March 3, 2025

చిట్యాల: రోడ్డు ప్రమాదం.. బస్సులోనే ప్రసవం

image

ఆదివారం తెల్లవారుజామున చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో రోడ్డుప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కాగా, ప్రమాదానికి గురైన ప్రైవేటు బస్సులో ఏపీకి చెందిన గర్భిణి శశికళ HYD నుంచి కుటుంబ సభ్యులతో వెళ్తోంది. బస్సు చిట్యాలకు చేరుకున్న సమయంలో శశికళకు నొప్పులు రావడంతో 108 సమాచారం అందించారు. సమయానికి అంబులెన్స్ చేరుకోకపోవడంతో ఆమె బస్సులోనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం NLG ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.