India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటి సాగుకు నీరు అందడం లేదు. దీంతో పంటలు ఎండిపోతున్నాయి. ఎండిన పంట చేలలో రైతులు పశువులను మేపుతున్నారు. దీంతో ఇటు BJP, BRS, CPM పార్టీలు ఉద్యమ బాట పట్టారు. ఎండుతున్న పంటల విషయంపై అధికార పార్టీ సైలెంట్గా ఉండగా.. ప్రతిపక్ష పార్టీలు మాత్రం పోరుబాట కొనసాగిస్తున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎండిన పొలాలను పరిశీలిస్తూ రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డేలో బాగంగా ఈ రోజు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు 30 మంది అర్జీదారులతో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ నేరుగా మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించాలన్నారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్టు సమాచారాన్ని అధికారులు సోమవారం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగుల కాగా ప్రస్తుతం 520.60 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 150.3730 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. సాగర్కు ఇన్ ఫ్లో 23183 క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో 14711 క్యూసెక్కులుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సోమవారం సుమారు 100 మంది సమస్యల పరిష్కారం నిమిత్తం దరఖాస్తులు సమర్పించారు. ఈ దరఖాస్తులలో ఏప్పటిలాగే వ్యక్తిగత సమస్యలు, భూ సమస్యలు, పెన్షన్ మంజూరి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై వచ్చాయి.
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువును మరో మూడు నెలల పాటు పొడిగించారు. ఈ మేరకు ఐ అండ్ పీఆర్ కమిషనర్ హరీశ్ ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 30వ తేదీతో ముగియనున్న అక్రిడేషన్ కార్డుల కాల పరిమితిని జూన్ 30వ తేదీ వరకు పొడిగించారు. అక్రిడేషన్ కార్డుల గడువును పొడిగించడం ఇది నాలుగోసారి. కొత్త అక్రిడిటేషన్ కార్డ్స్ ఇవ్వకుండా పొడిగించుకుంటూ పోవడంపై జర్నలిస్టులు మండిపడుతున్నారు.
నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి వాసవి బజారులో చోరీ జరిగింది. గుర్తు తెలియని దుంగడులు ఓ ఇంట్లో చొరబడి 30 తులాల బంగారం, రూ.5 లక్షల నగదును దోచుకెళ్లారు. గుర్తించిన బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతిచెందారు. వివరాలిలా.. HYDకి చెందిన ఉదయ్కిరణ్ నేరేడుగొమ్ము మండలం పుష్కర ఘాట్లో మునిగి చనిపోయాడు. నల్గొండ మండలానికి చెందిన నవీన్ కుమార్, రాఘవేంద్ర ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మునిగి మృతిచెందారు. సూర్యాపేట జిల్లాలోని బీబీగూడెంలో కారు, బస్సు ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు.
నల్గొండ పట్టణంలోని రూపా లాడ్జిలో గుర్తుతెలియని వ్యక్తి(35) డెడ్ బాడీని పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఇతడు విజయవాడ ఫైర్ వర్క్స్లో పనిచేస్తున్నట్లు లాడ్జి రికార్డ్స్లో ఉందని నల్గొండ టూ టౌన్ పీఎస్ SI సైదులు తెలిపారు. మృతుడిని నవీన్గా గుర్తించామన్నారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించినట్లు తెలిపారు. మృతుడిని ఎవరైనా గుర్తిస్తే 87126 70176 నంబర్కు సమాచారం ఇవ్వాలని కోరారు.
నల్గొండ జిల్లాకు నేడు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రానున్నారు. ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 9 గంటలకు నల్గొండలోని మంత్రి క్యాంపు ఆఫీసుకు చేరుకుంటారు. 9.30 గంటలకు అర్జలాబావిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారు. అనంతరం 10.30 గంటలకు తిప్పర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని తిరిగి హైదరాబాద్ బయలుదేరుతారు.
నేరేడిగొమ్ము వైజాగ్ కాలనీ కృష్ణా తీరంలో బోడుప్పల్కు చెందిన యువకుడు మృతిచెందాడు. స్థానికుల వివరాలిలా.. HYDకు చెందిన కొందరు యువకులు ఆదివారం రాత్రి వైజాగ్ కాలనీకి విహారయాత్రకు వచ్చారు. ఉదయం కృష్ణా తీరంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి యువకుడు మృతి చెందాడు. వైజాగ్ కాలనీ బ్యాక్ వాటర్ వద్ద పర్యవేక్షణ ఉండదని, గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని స్థానికులు చెబుతున్నారు.
Sorry, no posts matched your criteria.