India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బాలికపై లైంగిక దాడికి ప్రయత్నించిన వ్యక్తికి 16నెలల జైలు శిక్ష విధిస్తూ పోక్సో కోర్టు స్పెషల్ జడ్జి కులకర్ణి విశ్వనాథ్ తీరునిచ్చారు. వివరాలిలా.. మర్రిగూడ మండలం శివన్నగూడెంకి చెందిన నర్సిరెడ్డి 2017లో బాలికపై లైంగిక దాడికి యత్నించాడు. బాలిక కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కోర్టులో హాజరుపరిచగా.. 16నెలల శిక్ష, రూ.1500 జరిమానా విధించారు.
మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచుతాం అంటూ కాల్ చేసే సైబర్ మోసగాళ్లతో జాగ్రత్త అని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్ ద్వారా లేదా SMS వస్తున్నట్లయితే, అది సైబర్ మోసగాళ్ళ పని అయ్యి ఉంటుందని పేర్కొన్నారు. క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచే ఆఫర్తో సైబర్ మోసగాళ్ళు బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి మిమ్మలను నమ్మించి మోసం చేస్తారని అన్నారు.
CPM రాష్ట్రకార్యదర్శి కామ్రేడ్ జాన్వేస్లీ నేడు నల్గొండకు రానున్నారు. జిల్లా కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ అనంతరం స్థానిక కోమటిరెడ్డి ఫంక్షన్హాల్లో సమావేశం నిర్వహించి CPM జాతీయ మహాసభల ముసాయిదా తీర్మానం, రాజకీయ తీర్మానాలపై చర్చ నిర్వహించనున్నట్లు CPM జిల్లా కార్యదర్శి వీరారెడ్డి తెలిపారు. జిల్లా కమిటీ సభ్యులు, మండల కార్యదర్శులు, శాఖ కార్యదర్శులు, ఇతర CPM కమిటీ, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొంటారన్నారు.
నల్గొండ జిల్లాలో ఇంటర్ పరీక్షలు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ. శాంతి కుమారికి తెలిపారు. ఇంటర్ పరీక్షల నిర్వహణ, ఎల్ఆర్ఎస్ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్ ఆఫ్ పోలీస్, మున్సిపల్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆమె పాల్గొన్నారు.
కనగల్ మండలం జీ యడవల్లి గ్రామ వాగులో పడి ఆరేళ్ల బాలుడు మృతిచెందాడు. ఏఎస్ఐ కే. నర్సింహా రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పర్సనబోయిన బోపాల్- అరుణ దంపతుల చిన్న కుమారుడు చరణ్ తేజ్ (6) గురువారం సెలవు దినం కావడంతో పొలం వద్ద ఉన్న తండ్రి దగ్గరకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో వాగు నీటి గుంతలో పడి మరణించాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నల్గొండ జిల్లా పోలింగ్ 94.66 శాతం నమోదయింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన వారంతా పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ పూర్తయిన అనంతరం పోలింగ్ బాక్స్లను పోలీసు బందోబస్తు నడుమ జిల్లా కేంద్రంలోని ఆర్జాలబావి గిడ్డంగుల సంస్థ గోదాములకు తరలించారు.
వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటింగ్లో భాగంగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 12 గంటల వరకు 2,598 మంది ఉపాధ్యాయులు ఓట్లు వేయగా 55.48% పోలింగ్ నమోదైంది. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయగా ఎన్నికల అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
నార్కట్ పల్లి మండలం తొండల్ వాయికి చెందిన గీత కార్మికుడు దంతూరి శంకర్ బుధవారం సాయంత్రం పాముకాటుతో మరణించారు. గ్రామ సమీపంలోని తాటి చెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా పాము కాటు వేసిందని, కిందికి దిగిన శంకర్ తోటి గీత కార్మికుడికి విషయం చెప్పి కిందపడిపోయాడని స్థానికులు తెలిపారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. శంకర్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
TGSRTC బస్సుల్లో డిజిటల్ చెల్లింపులను అమలులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా ఐ-టిమ్స్ మెషీన్లను ప్రవేశపెట్టనుంది. తొలి విడతలో భాగంగా 310 మెషీన్లను కొనుగోలు చేసింది. దీంతో నల్గొండ రీజియన్లోని నార్కట్ పల్లి, నల్గొండ, దేవరకొండ, మిర్యాలగూడ డిపోల ప్రయాణికులకు చిల్లర బాధలు తప్పనున్నాయి.
నల్గొండ రాక్ హిల్స్ కాలనీకి చెందిన విద్యార్థిని రేష్మిత వరంగల్లో ఉరేసుకొని బుధవారం ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. వరంగల్ ములుగు రోడ్డులోని వ్యవసాయ కాలేజీలో రేష్మిత ఫస్టియర్ చదువుతోంది. ముభావంగా ఉండడంతో ఇటీవలే ఇంటికి తీసుకొచ్చి మళ్లీ కాలేజీకి పంపించారు. బుధవారం శివరాత్రి కావడంతో తోటి విద్యార్థులు సొంతూరు వెళ్లగా బుధవారం ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
Sorry, no posts matched your criteria.