Nalgonda

News February 24, 2025

ప్రశాంతంగా టీజీ సెట్- 2025 ప్రవేశ పరీక్ష

image

ఆదివారం నిర్వహించిన టీజీ సెట్- 2025 ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఆదివారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలోని చర్లపల్లి బైపాస్ వద్ద ఉన్న తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలలో నిర్వహించిన టీజీ సెట్ ప్రవేశ పరీక్షను తనిఖీ చేశారు. ప్రవేశ పరీక్షకు మొత్తం 12,929 మంది విద్యార్థులను కేటాయించగా, పరీక్షకు 12,503 మంది విద్యార్థులు హాజరయ్యారు.

News February 23, 2025

NLG: నేడు గురుకుల ప్రవేశ పరీక్ష

image

SC, ST, BC, జనరల్ గురుకులాల్లో 5వ తరగతిలో, SC, ST గురుకులాల్లో 6, 7, 8, 9వ తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి ఆదివారం ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. ప్రవేశ పరీక్ష కోసం NLGలో 30 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షకు 12,929 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. మైనార్టీ గురుకులానికి సంబందించి ఇంటర్మీడియట్‌లో చేరేందుకు ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. ఇందు కోసం 3 కేంద్రాలను ఏర్పాటు చేశారు.

News February 23, 2025

నల్గొండ: వణికిస్తున్న బర్డ్ ఫ్లూ

image

NLG, యాదాద్రి జిల్లాలో బర్డ్ ఫ్లూ మాంసప్రియులను వణికిస్తోంది. ఆదివారం వచ్చిందంటే చాలు కచ్చితంగా చికెన్ కావాలనే పరిస్థితి నుంచి కోడిమాంసం తెచ్చుకోవాలంటే జంకే స్థితికి ప్రజలు వచ్చారు. బాయిలర్ కోళ్లతోపాటు ఫారం కోళ్లు, నాటుకోళ్లు కూడా చనిపోతున్నాయి. నిడమనూరు మండలంలో నాటు కోళ్లు మృత్యువాత పడ్డాయి. CPL మండలం నేలపట్లలో బర్డ్ ఫ్లూ కేసు నమోదైన సంగతి తెలిసిందే. 

News February 23, 2025

మిర్యాలగూడ సమీపంలో రోడ్డు ప్రమాదం

image

మిర్యాలగూడ మండలం చింతపల్లి దగ్గర రోడ్డుప్రమాదం జరిగింది. ట్రాక్టర్, బస్సు ఢీకొట్టిన ఘటనలో బస్సు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, మరో 12 మందికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News February 23, 2025

SLBC టన్నెల్ ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్, SP

image

SLBC టన్నెల్ ప్రమాద ఘటన స్థలాన్ని (నాగర్ కర్నూల్ జిల్లా, దోమలపెంట) జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్‌ శనివారం సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరు, కారణాలు అక్కడ ఉన్న ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, ఏసీపీ మౌనిక, ఇతర అధికారులు ఉన్నారు.

News February 23, 2025

నల్గొండ జిల్లా టాప్ న్యూస్

image

✓ SLBC టన్నెల్ పైకప్పు కూలి సొరంగంలో చిక్కుకున్న కార్మికులు ✓ G- 20 సదస్సుకు ఎంపికైన మహాత్మా గాంధీ యూనివర్సిటీ విద్యార్థి ✓ కేతేపల్లిలో బర్డ్ ఫ్లూతో 7,000 కోళ్ల మృతి ✓ ఉమ్మడి జిల్లాలో బర్డ్ ఫ్లూ కేసు నమోదు ✓ తప్పుడు వార్త రాసిన విలేకరిపై చర్యలు తీసుకోవాలి: టీఎన్జీవో

News February 22, 2025

హుజూర్నగర్: డాబా పైనుంచి పడి యువకుడి మృతి

image

గరిడేపల్లి గ్రామానికి చెందిన తుమ్మలపల్లి సాయిరాం పనిచేస్తూ వనస్థలిపురంలో ఉంటున్నాడు. గురువారం రాత్రి హుజూర్నగర్ పట్టణంలోని తన స్నేహితుడు నరేశ్ వాళ్ల బావ ఓరుగంటి శ్రీనివాస్ ఇంటికి వచ్చాడు. వారితో కలిసి డాబా ఎక్కి మద్యం తాగుతుండగా ప్రమాదవశాత్తు పైనుంచి కింద పడి మృతిచెందినట్లు వారు తెలిపారు. తన కుమారుడి మృతిపై అనుమానాలు ఉన్నట్లు మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు SI ముత్తయ్య కేసు నమోదు చేశారు.

News February 22, 2025

నల్గొండ: ఎమ్మెల్సీ ఎన్నికలపై అలర్ట్

image

NLG- KMM- WGL ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గం ఎన్నికల పోలింగ్‌కు మరో ఐదు రోజులే గడువుంది. ఈ నేపథ్యంలో.. అధికార యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈనెల 27న ఉదయం 8 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎన్నికల సందర్భంగా జిల్లాలో 518 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ శరత్‌చంద్ర పవార్ తెలిపారు.

News February 22, 2025

మునుగోడు: ధరణి ఫైళ్లను పరిశీలించిన కలెక్టర్

image

మునుగోడు తహశీల్దార్ కార్యాలయంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి ధరణి ఫైళ్లను పరిశీలించారు. ఇప్పటివరకు ఎన్ని పరిష్కరించారని అడిగి తెలుసుకున్నారు. ధరణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట చండూర్ ఆర్డీఓ శ్రీదేవి తదితరులు ఉన్నారు.

News February 22, 2025

ఫుడ్ సేఫ్టీ అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించాలి: కలెక్టర్ 

image

హోటల్లు, రెస్టారెంట్లు, మాల్స్, చిన్న చిన్న బడ్డీ కోట్లు తదితర ప్రదేశాలలో కల్తీ ఆహార పదార్థాల వల్ల ప్రజలు అనారోగ్యానికి గురి కాకుండా ఫుడ్ సేఫ్టీ అధికారులు తరచూ దాడులు నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ చాంబర్లో నిర్వహించిన జిల్లా స్థాయి ఆహార భద్రత సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇటీవల చికెన్ విషయంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం తనిఖీలు నిర్వహించాలన్నారు.