Nalgonda

News July 24, 2024

నాగార్జునసాగర్ ప్రాజెక్టు సమాచారం

image

నాగార్జునసాగర్ ప్రాజెక్టు సమాచారం
ఇన్ ఫ్లో : నిల్
ఔట్ ఫ్లో: 8,714 క్యూసెక్కులు
పూర్తి స్థాయి నీటిమట్టం: 590 అడుగులు
ప్రస్తుతం: 503.60 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ: 312.5050 టీఎంసీలు
ప్రస్తుతం: 121.0608 టీఎంసీలు
కుడి కాలువకు: 5,496 క్యూసెక్కులు
ఎడమ కాలువకు: 2,818 క్యూసెక్కులు
మాధవరెడ్డి ప్రాజెక్టుకు: 400 క్యూసెక్కులు

News July 24, 2024

నల్గొండ: 26న కార్గిల్ సిల్వర్ జూబ్లీ విజయ్ దివస్

image

కార్గిల్ సిల్వర్ జూబ్లీ విజయ్ దివస్‌ను ఈ నెల 26న నల్గొండ పట్టణంలోని పానగల్ రోడ్డులో గల రీజనల్ సైనిక్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు మాజీ సైనికుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సంది పాపిరెడ్డి, కొల్లోజు వెంకటాచారి ఓ ప్రకటనలో తెలిపారు. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలోని మాజీ సైనికులు, అమరులైన, మరణించిన సైనికుల కుటుంబ సభ్యులు హాజరుకావాలని కోరారు.

News July 24, 2024

నల్గొండ: ఎంజీయూలో మూడు రోజులు శిక్షణ

image

మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం జియాలజీ, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ సంయుక్త ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా భూగర్భ జలాల మూలాలు సుస్థిరత, నిర్వహణపై విద్యార్థులకు ఈనెల 24 నుంచి 26 వరకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. విద్యార్థులందరు హజరు కావాలని సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ శాస్త్రవేత్త విఠల్, జియాలజీ విభాధిపతి మధుసూదన్రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

News July 24, 2024

నకిరేకల్: మంగళపల్లిలో విష జ్వరాల విజృంభన

image

నకిరేకల్ మండలం మంగళపల్లి గ్రామంలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. గ్రామంలో మొత్తం 2,810 మంది ఉన్నారు. ప్రతి ఇంటిలో ఇద్దరు నుంచి ముగ్గురికి పైనే జ్వరాలు బారిన పడ్డారు. దీంతో అప్రమత్తమైన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి జ్వరాల బారిన పడిన ప్రజలకు వైద్య పరీక్షలు చేస్తూ అవసరమైన వారికి మందులు అందజేశారు.

News July 24, 2024

25 నుంచి మూసీ ఆయకట్టుకు నీటి విడుదల

image

మూసీ జలాశయం నీటిని ఈనెల 25 నుంచి ఆయకట్టుకు విడుదల చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 33వేల ఎకరాల ఆయకట్టు భూములు సాగులోకి రానున్నాయి. వానకాలం సాగుకు నాలుగు విడతలుగా నీటిని విడుదల చేయాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. వారాబంది పద్ధతిన మూసీ నీరు ఆయకట్టుకు విడుదల కానుంది. కాలువలకు నీరు విడుదల చేస్తున్నందున ఆయకట్టలోని చెరువు కుంటలు నిండనున్నాయి. 

News July 24, 2024

నల్గొండ: చికిత్స పొందుతూ ADFO మృతి

image

నల్గొండ అగ్నిమాపక శాఖ ADFO పురుగు మందు తాగి బలవన్మరణం చెందారు. ఎస్సై రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. NLG పట్టణం అప్పాజీ పేటకు చెందిన రాజు(36) సోమవారం ఇంట్లో పురుగు మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. భార్యాభర్తల మధ్య కలహాల కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.

News July 24, 2024

గరిడేపల్లి: విధుల్లో నిర్లక్ష్యం.. పోలీసులు సస్పెండ్

image

గరిడేపల్లి పోలీస్ స్టేషన్‌లోని ఓ హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈనెల 6న బ్యాటరీల దొంగతనం కేసులో ఓ వ్యక్తిని పీఎస్‌లో విచారణకు తీసుకువచ్చారు. కాగా, నిందితుడు అదే రోజు రాత్రి గోడ దూకి పారిపోయాడు. 2 రోజుల తర్వాత పోలీసులు ఆ వ్యక్తిని పట్టుకొని రిమాండ్‌కు తరలించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.

News July 23, 2024

బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం: మంత్రి ఉత్తమ్

image

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం చేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2024-25 లో తెలంగాణను పూర్తిగా విస్మరించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్‌ రాజకీయ ప్రేరేపితమైందని, ప్రజల కోసం కాకుండా బీజేపీ మిత్రపక్షాలు, జేడీయూ, టీడీపీలను ప్రసన్నం చేసుకునేందుకే బడ్జెట్‌ను రూపొందించారని అన్నారు.

News July 23, 2024

జిల్లా గ్రంథాలయాన్ని సందర్శించిన ఛైర్మన్

image

భువనగిరి పట్టణంలోని జిల్లా గ్రంథాలయాన్ని ఛైర్మన్ డా.రియాజ్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రంథాలయాలను నిరుద్యోగులు, విద్యార్థులు వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ సుధీర్, సిబ్బంది, శెట్టి బాలయ్య, అవేజ్ చిస్టీ, మజర్, అతహర్, సాయి కిరణ్ తదితరులు ఉన్నారు.

News July 23, 2024

శక్తి క్యాంటీన్లు.. వారికి రూ.20 లక్షల వరకు లోన్

image

గ్రామీణ మహిళల అభ్యున్నతే లక్ష్యంగా శక్తి క్యాంటీన్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశించింది. MLG RDO ఆఫీసు, DVK, NKL MPDO ఆఫీసు, NLG కలెక్టరేట్, RDO కార్యాలయాల్లో క్యాంటీన్లు ఏర్పాటు చేయించనున్నారు. ఆహార పదార్థాలను ఇళ్ల వద్ద తయారుచేసి క్యాంటీన్లకు తరలించడం, ఆర్డర్లపై పిండివంటలు, మిఠాయిలు, పచ్చళ్లను తయారుచేసి విక్రయిస్తారు. వ్యాపార దక్షత గల మహిళా సంఘాలకు రూ.10 నుంచి రూ.20 లక్షలు రుణంగా ఇవ్వనున్నారు.