India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి అనుబంధంగా ఉన్న NLG మెడికల్ కళాశాలలో పెద్ద ఎత్తున బదిలీలు జరిగాయి. కళాశాల ప్రిన్సిపాల్ రాజకుమారి గాంధీ మెడికల్ కళాశాలకు, GGH సూపరింటెండెంట్ డాక్టర్ నిత్యానంద నీలోఫర్ ఆస్పత్రి సూపరింటెండెంట్గా బదిలీ అయ్యారు. మెడికల్ కళాశాలలో ఐదేళ్లుగా పనిచేస్తున్న సీనియర్ ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పలువురు హెచ్వోడీలు 40 మందికి పైగా బదిలీ అయినట్లు తెలుస్తుంది.
రుణమాఫీకి సంబంధించి ఫోన్కు ఏమైనా లింకులు వస్తే ఓపెన్ చేయొద్దని ఎస్పీ శరత్ చంద్ర పవార్ రైతులకు విజ్ఞప్తి చేశారు. సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930 నంబర్కు ఫోన్ చేసి వివరాలు తెలియజేయాలని చెప్పారు. సంబంధిత పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలన్నారు. రుణమాఫీ వేళ సైబర్ నేరగాళ్లు రైతుల ఖాతాల్లో ఉన్న డబ్బును తమ ఖాతాల్లోకి మళ్లించుకునేందుకు ప్రయత్నిస్తారని, ఆధార్ కార్డు, ఓటీపీ వివరాలు చెప్పవద్దన్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏళ్లుగా రెవెన్యూ, అటవీశాఖల మధ్య భూ సరిహద్దుల్లో స్పష్టత లేకపోవడంతో దాదాపు 55 వేల ఎకరాల్లో రెండు శాఖల మధ్య ప్రస్తుతం హద్దుల వివాదం కొనసాగుతోంది. కృష్ణపట్టి ప్రాంతాలైన మఠంపల్లి, మేళ్లచెర్వు, పాలకవీడు, చింతపలపాలెం, దామెరచర్ల, పీఏపల్లి, చందంపేట, పెద్దవూరు హద్దుల తగాదా ఉంది. HYD సరిహద్దుల్లోనూ ఇదే సమస్య ఉంది. దీంతో సమగ్ర సర్వేకు అధికారులు సిద్ధమవుతున్నారు.
ప్రతీ కేసుపై పారదర్శకంగా విచారణ చేపట్టి, నిందితులకు శిక్ష పడేలా కృషి చేయాలని ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం నెలవారి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయా పోలీస్స్టేషన్లలో నమోదైన కేసులను పరిశీలించారు. ఆయా కేసులకు సంబంధించి అధికారులు సేకరిస్తున్న ఆధారాలను పరిశీలించారు. సమవేశంలో అదనపు ఎస్పీలు నాగేశ్వరరావు, జనార్ధన్ రెడ్డి ఉన్నారు.
వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అన్నారు. కలెక్టరేట్లో మెడికల్ ఆఫీసర్లకు నిర్వహించిన సమీక్ష సమావేశంలో ప్రతి మెడికల్ ఆఫీసర్ ఆరోగ్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలన్నారు. ప్రైవేటు ఆసుపత్రులలో సిజేరియన్ సెక్షన్లు చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని, అనుమతులను రద్దు చేస్తామని అన్నారు.
మహిళ మెడలో పుస్తెలతాడు లాక్కెళ్లిన ఘటన పీఏ పల్లి మండల పరిధిలోని మల్లాపురంలో జరిగింది. గ్రామానికి చెందిన గన్నేబోయిన ముత్యాలమ్మ గ్రామ శివారులో పంట పొలంలో పనిచేస్తుంది. అక్కడికి బైక్పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి తెలిసిన వ్యక్తిలా పరిచయం చేసుకుని కూల్ డ్రింక్ తాగమని ఇచ్చాడు. డ్రింక్ తాగుతుండగా రాయితో ఆమె తలపై కొట్టి బంగారం లాక్కెళ్లినట్లు SI నర్సింహులు తెలిపారు.
మునగాల పి.హెచ్. సి. ని ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తనిఖీ చేసారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ మునగాల పి.హెచ్.సి.కి వెళ్లగా ఆ సమయానికి మెడికల్ అఫీసర్, సిబ్బంది లేకపోవటం వల్ల కలెక్టర్ అగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సిబ్బంది హాజరు రిజిస్టర్ని, మెడికల్ స్టోర్ని పరిశీలించారు. అలాగే పి.హెచ్.సి.ని పరిశీలించగా పరిశుభ్రంగా లేకపోవటం పట్ల సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు.
సైబర్ నేరగాళ్లు ఘరానా మోసానికి పాల్పడ్డారు. చండూరుకు చెందిన వీరమళ్ళ నాగరాజు ఎలక్ట్రికల్ షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతని ఫోన్కి ఉదయం ఓ లింక్ వచ్చింది. క్లిక్ చేయడంతో వెంటనే అకౌంట్ నుంచి రెండు దఫాలుగా లక్ష రూపాయలు డెబిట్ అయినట్టు బ్యాంకు నుంచి మెసేజ్ వచ్చింది. వెంటనే బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. రుణమాఫీ నేపథ్యంలో రైతులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ఉపకార వేతనాల కోసం ఇంటర్ విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. గత ఏడాది ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదివిన విద్యార్థులకు ఇంతవరకు స్కాలర్షిప్లు విడుదల చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలేజీలు ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఇంటర్ కాలేజీల్లో 2023-24 సంవత్సరంలో విద్యనభ్యసించిన వేలాది మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఉపకార వేతనాల కోసం ఎదురు చూస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలోని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను బట్టి ఒక్కొక్క విద్యార్ధికి రూ.50 చొప్పున కుట్టు కూలీ సొమ్ము మంజూరైంది. ఏకరూప దుస్తుల కుట్టు పనులను గ్రామైక్య సంఘాల మహిళలకు అప్పగించగా దాదాపుగా కుట్టు పనులు పూర్తి కావొచ్చాయి. BNG జిల్లాలో 40,059 మంది విద్యార్థులు ఉండగా రూ.20,02,950, NLG జిల్లాలో 74,090 మంది విద్యార్థులు ఉండగా రూ.37,04,500, SRPT జిల్లాలో 45530 విద్యార్థులకు 22,76,500 మంజూరయ్యాయి.
Sorry, no posts matched your criteria.