Nalgonda

News February 21, 2025

NLG: మహాశివరాత్రికి 70 స్పెషల్ బస్సులు

image

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని RTC ప్రత్యేక బస్సులను నడిపించనుంది. ఈ నెల 25 నుంచి 27 వరకు ఉమ్మడి జిల్లాలోని 7 డిపోల పరిధిలో 70 బస్సులను నడిపించడానికి అధికారులు ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లా నుంచి దూర ప్రాంతాలకు కాకుండా మూడు జిల్లాలోనే వివిధ దేవాలయాలకు బస్సులు నడిపించేలా ప్రణాళికలు రూపొందించారు. DVK డిపో నుంచి మాత్రం శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు నడిపిస్తారు.

News February 21, 2025

నాగారం: ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ధర్నా

image

ఓ యువతి ప్రియుడి ఇంటి ధర్నా చేసిన ఘటన మండలంలోని లక్ష్మాపురం గ్రామంలో జరిగింది. బాధితురాలి వివరాలు.. లక్ష్మాపురం గ్రామానికి చెందిన కానిస్టేబుల్ మల్లెపాక నాగరాజు వెంపటి గ్రామానికి చెందిన యువతి మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి తనను మోసం చేశాడని గురువారం అతడి ఇంటి ముందు బైఠాయించింది. వేరే అమ్మాయిని వివాహం చేసుకుని తనకు ఫొటోలు పంపాడని తనకు న్యాయం చేయాలని కోరింది.

News February 21, 2025

నార్కెట్ పల్లి: నేషనల్ హైవేపై ట్రాఫిక్ ఆంక్షలు ఎత్తివేత

image

దురాజ్ పల్లి లింగమంతులస్వామి జాతర సందర్భంగా ఈ నెల 16వ తేదీ నుంచి HYD- VJD హైవేపై ఉన్న ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు ఎత్తివేశారు.గురువారం జాతర ముగియడంతో NKP, KDD, టేకుమట్ల, బీబీగూడెం, రాఘవపురం గ్రామ స్టేజీ వద్ద ఉన్న ట్రాఫిక్ ఆంక్షలను ఎత్తివేసి బారికేడ్లు తొలగించారు. దీంతో HYD- VJD, VJD- HYDకు వెళ్లే వాహనదారులు యథాతథంగా వెళ్లవచ్చని సూచించారు.

News February 21, 2025

NLG: ‘ఈసారి ఓవర్ లోడ్ సమస్యలే లేవు’

image

వేసవిలో విద్యుత్ సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని దక్షిణ తెలంగాణ పంపిణి సంస్థ సీఎండి ముషారఫ్ ఫరూకీ ఆదేశించారు. గురువారం ఆయన NLG కలెక్టర్ కలెక్టరేట్లో విద్యుత్ సరఫరాకు సంబంధించి “వేసవి కార్యాచరణ ప్రణాళిక” పై సమీక్ష నిర్వహించారు. గతేడాది FEB 20 నాటికి జిల్లాలో 66 సబ్ స్టేషన్‌లపై ఓవర్ లోడ్ ఉండేదని.. ఈసారి ఒక సబ్ స్టేషన్లో ‌ కూడా ఓవర్ లోడ్ లేదని తెలిపారు.

News February 21, 2025

వేసవి కార్యాచరణ ప్రణాళికపై కలెక్టర్ సమీక్ష

image

గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం సైతం జిల్లాలో తాగునీటికి సమస్యలు రాకుండా చూసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎంపీడీవోలు, తహశీల్దారులను ఆదేశించారు. గురువారం ఆమె ఉదయాదిత్య భవన్లో తహశీల్దారులు, ఎంపీడీవోలతో వేసవి కార్యాచరణ ప్రణాళిక పై సమీక్ష నిర్వహించారు. ఎక్కడైనా తాగునీటి పైపులు, నల్లాలు తదితర అత్యవసర మరమ్మతులు ఉన్నట్లయితే గ్రామపంచాయతీ నిధుల నుంచి చేయించాలని ఆదేశించారు.

News February 20, 2025

పెద్దగట్టు జాతరకు వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం

image

సూర్యాపేట జిల్లాలో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఇద్దరు యువకులు పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరకు బైక్‌పై వెళ్లి వస్తుండగా సూర్యాపేట రూరల్ పరిధి కేసారం గ్రామం సమీపంలోని వాగులో పడ్డారు. ఈ ప్రమాదంలో కాసరాబాద్ గ్రామానికి చెందిన సుధీర్(21) మృతి చెందగా, సంపత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుణ్ని ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News February 20, 2025

ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా నూతన కమిటీ ఎన్నిక

image

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నల్గొండలో నిర్వహిస్తున్న 46వ మహాసభలో జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీని రాష్ట్ర కార్యదర్శిగా నాగరాజు ప్రకటించారు. అధ్యక్ష, కార్యదర్శులుగా నరేష్, శంకర్‌లు, ఉపాధ్యక్షుడుగా కుర్ర సైదానాయక్ మిగతా కమిటీ సభ్యులుగా జగన్ నాయక్, వీరన్న, న్యూమన్, ప్రసన్న, పుట్ట సంపత్‌లు ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన జిల్లా కమిటీకి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

News February 20, 2025

NLG: ఇసుక అక్రమ రవాణాపై ఇక ఉక్కుపాదం

image

ఇసుక అక్రమ రవాణాను అరికట్టడంలో భాగంగా నిఘాను, తనిఖీలను తీవ్రతరం చేయాలని NLG కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టే విషయమై గురువారం ఆమె జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్‌తో కలిసి అధికారులతో ఉదయాదిత్య భవన్లో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ద్వారా ఆయా ఇసుక రీచ్ లలో అనుమతించిన వాహనాలు, అనుమతించిన వారికి మాత్రమే ఇసుకను తీసుకువెళ్లే అధికారం ఉందని అన్నారు.

News February 20, 2025

NLG: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ థార్ గ్యాంగ్ లీడర్ అరెస్ట్

image

అంతర్రాష్ట్ర దొంగల ముఠా.. థార్ గ్యాంగ్‌కు చెందిన ప్రధాన నిందితుడు మహమ్మద్ అష్రఫ్ ఖాన్‌‌ను అరెస్టు చేసినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. గురువారం ఎస్పీ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అరెస్ట్ వివరాలను వెల్లడించారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని, ప్రధాన నిందితుడిపై దేశవ్యాప్తంగా పలు దొంగతనాల కేసులు ఉన్నాయని అన్నారు. అతడి నుంచి రూ.25 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

News February 20, 2025

నల్గొండ: ‘రెవిన్యూ మేళాను సద్వినియోగం చేసుకోవాలి’

image

నల్గొండ పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఆస్థి పన్ను సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ మేళా నిర్వహించడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ హమ్మద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో భాగంగా ప్రతి మంగళ, గురు, ఆదివారాలలో దరఖాస్తులు స్వీకరించబడునని, ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.