India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
NLG: పట్టణ ప్రజలు కలుషిత తాగునీటితో ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజులకోసారి సరఫరా చేస్తున్న సాగర్ వాటర్లో పురుగులు, చెత్త చెదారం వస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులకు, పాలకవర్గానికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పానగల్ వద్ద మిషన్ భగీరథ నీళ్లను ఫిల్టర్ చేయకుండా డైరెక్ట్ సరఫరా చేస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు.
సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే మందుల సామేలు పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. తుంగతుర్తి శాసనసభ్యుడు మందుల సామేలు, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
మహిళపై గొడ్డలితో దాడి చేసిన ఘటన నారాయణపురం(M) వాయిల్లపల్లిలో జరిగింది. పోలీసుల వివరాలు.. గ్రామానికి చెందిన సుభాశ్ భూమి పక్కన చెన్నకేశవ, మారయ్య, లింగస్వామి, ఎర్రయ్యల భూమి ఉంది. కొద్ది రోజులుగా సుభాశ్ ఫెన్సింగ్ వేసుకున్న భూమిలో అర ఎకరం భూమి తమదంటూ గొడవ పడుతున్నారు. శనివారం ఫెన్సింగ్ కడ్డీలను ధ్వంసం చేసే సమయంలో సుభాశ్ భార్య అడ్డుకునేందుకు వెళ్లగా పద్మపై నలుగురు గొడ్డలితో దాడి చేశారు. కేసు నమోదైంది.
ఉరేసుకొని ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన వలిగొండ(M) ప్రొద్దుటూరులో శనివారం జరిగింది. స్థానికులు, పోలీసుల వివరాలు.. గోపాల్-శకుంతల పెద్ద కుమారుడు శివప్రసాద్(27) ఇంటి వద్దనే ఉంటాడు. ఇటీవల తన సోదరుడు రోడ్డుప్రమాదంలో మృతి చెందాడు. అప్పటి నుంచి సోదరుడిని జ్ఞాపకం చేసుకుంటూ మనస్తాపం చెంది ఇంట్లో ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI తెలిపారు.
మునగాల మండల పరిధిలోని తాడ్వాయిలో విష జ్వరాలు విజృంభిస్తుండడంతో వైద్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. శనివారం రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ శ్రీశైలం ఆధ్వర్యంలో గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించారు. జ్వరం, దగ్గు ఇతర లక్షణాలున్న గ్రామస్థులకు రక్త పరీక్షలు నిర్వహించారు. శిబిరంలో పేరు నమోదు చేసుకున్న 64 మందిలో 9 మందికి జ్వరం లక్షణాలు ఉన్నట్లు వైద్యాధికారి తెలిపారు.
కోదాడలో శనివారం జబర్దస్త్ నటులు అప్పారావు, వినోద్ సందడి చేశారు. పట్టణానికి చెందిన స్నేహిత ఉమెన్స్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకురాలు మాతంగి శైలజ నివాసంలో జరిగిన ఓ శుభకార్యానికి వారు హాజరయ్యారు. వారిని చూసి అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. అనంతరం ఆటపాట నిర్వహించి వారు అభిమానులను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు బంధువులు మిత్రులు పాల్గొన్నారు.
మిర్యాలగూడ నెల్లిమెట్ల జంక్షన్ వద్ద రూరల్ ఎస్సై ధనుంజనాయుడు, సిబ్బంది వాహన తనిఖీలు చేపట్టానే. చింతపల్లివైపు నుంచి వస్తున్న కారును చూసి అనుమానం వచ్చి తనిఖీ చేశారు. దీంతో కారులో 140కేజీల గంజాయి బయటపడింది. విలువ సుమారు రూ. 35 లక్షల ఉంటుందన్నారు. నిందితులు అరుణ్, రేంజు, ఆనంద్, కొర్ర అర్జున్లను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. మరో నలుగురు పరారీలో ఉన్నారని వెల్లడించారు.
ఉమ్మడి జిల్లాలో ఆర్టీసీ కొత్తగా మరో కేటగిరీ బస్సు సర్వీసులను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. ఉమ్మడి జిల్లాలోని ఏడు డిపోల పరిధిలో త్వరలో కొత్త మార్గాలకు 30 బస్సులు, పాత మార్గాల్లో అదనంగా మరో 30 బస్సులతో పాటు నల్గొండ, సూర్యాపేట పరిధిలో మరో 50 విద్యుత్తు బస్సులు అందుబాటులోకి రానున్నాయి. రీజియన్ పరిధిలో మొత్తం 640 బస్సులు ఉండగా.. నిత్యం 2.50 లక్షల KM తిరుగుతూ సుమారు రూ.150కోట్ల ఆదాయం వస్తుంది.
నడిగూడెం మండలంలోని తెల్లబల్లి గ్రామంలో డెంగ్యూ జ్వరాలతో ప్రజలు బాధపడుతున్నారని గ్రామస్థులు తెలిపారు. గ్రామంలో సీజనల్ వ్యాధుల పట్ల సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో సుమారు 50 మందికి పైనే డెంగ్యూ జ్వరానికి గురై చికిత్స పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాంతకంగా మారక ముందే అధికారులు వైద్య సిబ్బంది స్పందించి ప్రజలు డెంగ్యూ జ్వరాల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
సూర్యాపేట జిల్లా సింగిరెడ్డి పాలెం పాఠశాల తనిఖీల్లో భాగంగా ఉన్నతాధికారుల అనుమతులు లేకుండా సెలవులో ఉన్న HM నరేందర్, టీచర్ శ్రీనివాస్పై జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సీరియస్ అయ్యారు. షోకాజ్ నోటీసులు జారీ చేయాలని విద్యాశాఖ అధికారిని ఆయన ఆదేశించారు. సమయపాలన పాటించి విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించాలని కోరారు.
Sorry, no posts matched your criteria.