India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నల్గొండ – ఖమ్మం – వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల హీట్ నడుస్తోంది. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, పులి సరోత్తంరెడ్డి, శ్రీపాల్ రెడ్డి పింగిళి, పూల రవీందర్ తదితర నేతల మధ్యపోటీ ఉంటుందని చర్చలు జరుగుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు మార్నింగ్ వాక్, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరోసారి కులగణన నిర్వహించనున్నారు. ఇప్పటికే నిర్వహించిన కులగణనలో 3 లక్షల పైచిలుకు మంది పాల్గొన లేదని తెలిసింది. అయితే వారందరి కోసం మళ్లీ కులగణన నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 16 నుంచి 28వ తేదీ వరకు కులగణన నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ సీఎం ప్రకటించారు. ఆన్లైన్ సర్వేతో పాటు టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఎంపీడీవో ఆఫీస్లో ప్రజాపాలన అధికారుల వద్ద కూడా నమోదు చేసుకోవచ్చు.
మునుగోడు మండలం ఉకొండిలో కుటుంబ కలహాలతో వివాహిత పురుగు మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామస్థుల వివరాలిలా.. గ్రామానికి చెందిన నిమ్మల మానస(28), భర్త నగేష్ మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. నగేష్ శుక్రవారం మునుగోడుకు వెళ్లి తిరిగి వచ్చే సరికి మానస పురుగు మందు సేవించి వాంతులు చేసుకుంది. చికిత్స కోసం నల్గొండ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. వీరికి కొడుకు, కూతురు ఉన్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా WGL-KMM-NLG టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల హీట్ నడుస్తోంది. టీచర్ MLC ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, పులి సరోత్తంరెడ్డి, శ్రీపాల్ రెడ్డి పింగిళి, పూల రవీందర్ తదితర నేతల మధ్యపోటీ ఉంటుందని చర్చలు జరుగుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు మార్నింగ్ వాక్, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు.
తెలంగాణ సీనియర్ మహిళా కబడ్డీ పోటీలకు హాలియా మండలం ఇబ్రహీంపేట చెందిన అయేషా ఎంపికయ్యారు. హరియాణాలో జరిగే జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో ఆమె పాల్గొననున్నారు. జాతీయ స్థాయికి ఎంపికైన అయేషాను పలువురు అభినందించారు.
జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గాల కాల పరిమితిని ప్రభుత్వం పొడిగించించిన సంగతి తెలిసిందే. మరో ఆరు నెలల పాటు ప్రస్తుతం ఉన్న పాలకవర్గాలే కొనసాగేలా నిర్ణయం తీసుకోవడంతో ఉమ్మడి జిల్లాలోని డీసీసీబీతో పాటు 107 పీఏసీఎస్ పాలకవర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అలాగే జిల్లాలోని సహకార సంఘాల చైర్మన్లు కూడా యథావిధిగా కొనసాగుతారు.
బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించిన తర్వాతే ఎన్నికల నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో స్థానిక పోరుకు ఇంకొన్నాళ్లు ఆగాల్సిన పరిస్థితి నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడడంతో ఆశావాహులు నిరాశకు గురవుతున్నారు. ఎన్నికలు ఉంటాయనే వార్తల నేపథ్యంలో జిల్లాలోని 868 గ్రామపంచాయతీలలో ఆశావాహులు సిద్ధమయ్యారు. ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందనుకున్న తరుణంలో వాయిదా పడడంతో నిరాశకు గురయ్యారు.
నల్లగొండ పోలీస్ శాఖ, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఆధ్వర్యంలో మిషన్ పరివర్తన్ యువతేజం కార్యక్రమంలో భాగంగా శనివారం మధ్యాహ్నం ఎన్జీ కళాశాలలో మధ్యాహ్నం 3.00 గంటల నుంచి రాత్రి 8.00 గంటల వరకు జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను నిర్వహించినట్లు ఎస్పీ కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. క్రీడాభిమానులంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని తెలిపారు.
MG యూనివర్సిటీ తెలుగు, ప్రాచ్య భాషల పాఠ్యప్రణాళిక మండలి ఛైర్మన్గా కవి, రచయిత, అసోసియేట్ ప్రొఫెసర్, నకిరేకల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా.బెల్లి యాదయ్య నియమితులయ్యారు. ఈ మేరకు MG యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డా.ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, రెండేళ్ల పాటు బెల్లి యాదయ్య ఈ పదవిలో కొనసాగుతారు. ఆయన నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.
అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో కోళ్లను పారేసిన కేసులో కోళ్ల ఫామ్ యజమాని రమావత్ రాజమల్లుని పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. దేవరకొండ ఏఎస్పీ మౌనిక తెలిపిన వివరాల ప్రకారం.. పడమటి తండా సమీపంలో ఉన్న కోళ్ల ఫామ్లో వైరల్ ఫీవర్తో చనిపోయిన కోళ్లను రిజర్వాయర్కు వచ్చే కాలువలో పడవేశాడని, జలాశయంలోని నీటితో ఎలాంటి ప్రమాదం లేదని ASP తెలిపారు.
Sorry, no posts matched your criteria.