Nalgonda

News February 21, 2026

నల్గొండ: పర్యాటక అభివృద్ధికి మాస్టర్ ప్లాన్: కలెక్టర్

image

జిల్లాలోని చారిత్రక, ఆధ్యాత్మిక, ప్రకృతి సంపదను వినియోగించుకుని పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సమీక్షా సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో పర్యాటక కేంద్రాల అభివృద్ధి ద్వారా స్థానిక యువతకు ఉపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యమన్నారు. ఇందుకోసం సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందించి, అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని అధికారులకు సూచించారు.

News February 20, 2026

నల్లగొండ ITIలో CNC టెక్నీషియన్ కోర్సు

image

ఆధునిక సాంకేతిక రంగంలో స్థిరపడాలనుకునే నిరుద్యోగ యువతకు నల్లగొండ ప్రభుత్వ ఐటీఐ కళాశాల అద్భుత అవకాశం కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకం పీఎంకేవీవై 4.0లో భాగంగా నూతనంగా ఏర్పాటు చేసిన అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్‌లో ‘CNC టర్నింగ్ టెక్నీషియన్’ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఎ.నర్సింహ్మాచారి తెలిపారు. ఆసక్తి గలవారు ఈనెల 25లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News February 20, 2026

NLG: ఎన్నికల ఖర్చులో చేతివాటం!

image

జిల్లాలో ఎన్నికలు ముగిసిన తరుణంలో ఇప్పుడు ఖర్చుల లెక్కలపై చర్చ మొదలైంది. ఎన్నికల నిర్వహణ పేరుతో అయ్యే వ్యయంపై సరైన ఆడిట్ వ్యవస్థ లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని, కొందరు అధికారులు అందినకాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలోనూ ఎన్నికల ఖర్చులను భారీగా పెంచి చూపి, వ్యక్తిగత లాభం పొందిన ఘటనలున్నాయి. ఎన్నికల ఖర్చులపై ఆడిట్ లేకపోవడంతో రూ.లక్షల్లో దుర్వినియోగం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

News February 20, 2026

నల్గొండ: మున్సిపాలిటీల్లో ‘కోఆప్షన్’ కోలాహలం

image

జిల్లాలోని మున్సిపాలిటీల్లో నూతన పాలక వర్గాల ఏర్పాటు ప్రక్రియ ముగియడంతో, రాజకీయ సమీకరణాలు ఇప్పుడు కోఆప్షన్ సభ్యుల భర్తీ చుట్టూ తిరుగుతున్నాయి. పట్టణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే ఈ పదవులను దక్కించుకోవడానికి ద్వితీయ శ్రేణి నాయకులు, ఆశావహులు తీవ్ర ప్రయత్నాలు మొదలుపెట్టారు. మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడిన వారు, పార్టీ కోసం కష్టపడిన వారు నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూస్తున్నారు.

News February 20, 2026

నల్గొండ: ప్రభుత్వ బడి విద్యార్థులకు ‘రవాణా’ భరోసా

image

మారుమూల ప్రాంతాల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. దూర ప్రాంతాల నుంచి ప్రయాణించే విద్యార్థుల కోసం ఉద్దేశించిన రవాణా భత్యం నిధులను రాష్ట్ర సమగ్ర శిక్షా విభాగం తాజాగా విడుదల చేసింది. జిల్లాలో అర్హులైన ప్రతి విద్యార్థికి నెలకు రూ.600 చొప్పున ప్రభుత్వం కేటాయించింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి జూన్ నుంచి మార్చి వరకు నిధులను విడుదల చేసింది

News February 20, 2026

నల్గొండ: ఇక అందరి దృష్టి MPTC, ZPTC ఎన్నికలపైనే!

image

మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే GPలు, పురపాలక సంఘాల ఎన్నికలు పూర్తి కావడంతో ఇక అందరి దృష్టి MPTC, ZPTC ఎన్నికలపై పడింది. త్వరలోనే ఈ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందన్న సంకేతాలతో రాజకీయ పార్టీలు, అధికార యంత్రాంగం రంగం సిద్ధం చేస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 353 MPTC, 33 ZPTC స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

News February 20, 2026

నల్గొండలో చెరువుల నవీకరణకు మోక్షం!

image

పట్టణాల్లో పర్యావరణ పరిరక్షణ, భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘అమృత్ 2.0’ పథకం జిల్లాలో వేగవంతం కానుంది. ఈ పథకం కింద ఎంపిక చేసిన చెరువుల అభివృద్ధికి నిధులు మంజూరు కావడంతో, పనులు ప్రారంభించేందుకు మున్సిపల్ యంత్రాంగం సిద్ధమైంది. జిల్లాలోని తొమ్మిది చెరువులను తొలిదశలో ఎంపిక చేసి, వాటి అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.22.35 కోట్లను కేటాయించింది.

News February 20, 2026

NLG: హాల్ టికెట్లపై ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా పరీక్షకు అనుమతి!

image

జిల్లాలో ఈనెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఐఈవో దస్రూ నాయక్ తెలిపారు. పరీక్షల సరళిపై ఇప్పటికే అధికారులు, సిబ్బందికి పూర్తిస్థాయి శిక్షణ ఇచ్చామన్నారు. జిల్లా వ్యాప్తంగా 45 కేంద్రాలు ఏర్పాటు చేశామని.. 27,905 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. ఆన్‌లైన్ హాల్ టికెట్లపై ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా పరీక్షకు అనుమతిస్తారని తెలిపారు.

News February 20, 2026

నల్గొండ: రైతులు ఖాతాల్లో ‘సన్నాల’ బోనస్ రూ.71.47 కోట్లు జమ

image

వానాకాలం సీజన్‌లో సన్న రకం ధాన్యం పండించిన రైతులకు ప్రభుత్వం బోనస్ నగదు విడుదల చేసింది. జిల్లాలోని 31,416 మంది రైతుల ఖాతాల్లో రూ.71.47 కోట్లను నేరుగా జమ చేసింది. ఇప్పటికే ధాన్యం విలువ కింద రూ.355.18 కోట్లు చెల్లించగా, తాజా బోనస్‌తో రైతులకు అదనపు లబ్ధి చేకూరింది. ప్రభుత్వ నిర్ణయంపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News February 19, 2026

NLG: బాధితుడికి అండగా నిలిచిన కలెక్టర్

image

నల్గొండ కలెక్టర్ బి. చంద్రశేఖర్ తన ఉదారతను చాటుకున్నారు. కొండమల్లేపల్లి పర్యటన నుంచి తిరిగి వస్తుండగా ధర్వేశిపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదాన్ని గమనించిన ఆయన, వెంటనే తన వాహనాన్ని ఆపి క్షతగాత్రుడైన పరశురామ్‌ను పరామర్శించారు. స్వయంగా అంబులెన్స్‌కు సమాచారం అందించి, బాధితుడిని ఆసుపత్రికి పంపే వరకు అక్కడే ఉండి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. కలెక్టర్ సమయస్ఫూర్తిని స్థానికులు కొనియాడుతున్నారు.