India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మహిళల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఎలాంటి ఆపద వచ్చినా వెంటనే స్పందిస్తూ పోలీస్ శాఖ వారికి రక్షణ కల్పిస్తుందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. నల్లగొండ మహిళా పోలీస్ స్టేషన్, షీటీమ్ పోలీస్ స్టేషన్, భరోసా సెంటర్లను ఎస్పీ మంగళవారం పరిశీలించారు. ఆకతాయిలు మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆ సందర్భంగా ఎస్సీ హెచ్చరించారు.
తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్గా పటేల్ రమేష్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు.
VRAలను విధులలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట మంగళవారం నిరసన వ్యక్తంచేశారు. GO 81 ప్రకారం 60 ఏళ్లలోపు వారిని 61ఏళ్లు నిండిన ఉద్యోగుల వారసులను విధులలోకి తీసుకోవాలని కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. VRAలను గత ప్రభుత్వం 81వ GO ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 20,555 VRAలు ఉంటే 16,758 మందిని విధుల్లోకి తీసుకుంది. మిగతా 3,797మందిని ఎలక్షన్ల తర్వాత తీసుకుంటామని ఇప్పుడు పట్టించుకోవడం లేదన్నారు.
విదేశాల్లో చదువుకునే వారు స్కాలర్షిప్ పొందేందుకు అర్హులైన మైనార్టీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీల సంక్షేమ అధికారి టి.విజేందర్రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం ద్వారా విదేశీ విశ్వవిద్యాలయాల్లో పీజీ, డాక్టోరల్ కోర్సు అభ్యసిస్తూ ఉపకార వేతనం పొందవచ్చన్నారు. telangana epass.cgg.gov.inలో దరఖాస్తు తీసుకోవాలని సూచించారు.
తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాకు చెందిన tgpsc గ్రూప్-2 ఉచిత గ్రాండ్ టెస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ కె.విజయ్కుమార్ తెలిపారు. ఈ నెలలో మొత్తం 4 గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. tgbcstudycircle.cgg.gov.in వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలన్నారు.
రామన్నపేట మండలం లక్ష్మాపురం గ్రామానికి చెందిన మంగినపల్లి నర్సిరెడ్డి వ్యవసాయ క్షేత్రంలో “డ్రోన్ వ్యవసాయ రసాయన పిచికారి” యంత్రాన్ని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. వ్యవసాయ రంగాన్ని విద్యగా ఎంచుకోవడం దేశ ప్రగతిలో భాగస్వామ్యం కావడమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
యూట్యూబర్ హర్షసాయి పేరు చెప్పి సైబర్ మోసానికి పాల్పడిన ఘటనపై కేసు నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం.. డిండి మండలం జయ్రతండాకు చెందిన హనుమంత్ NGKL జిల్లాలో ఇటుక బట్టి వ్యాపారం చేస్తున్నాడు. మే14న హర్షసాయి పేరులో ఫోన్ చేసి సాయం చేస్తానని నమ్మించాడు. కొంత డబ్బు చెల్లించాలనగా నమ్మిన బాధితుడు పలు దఫాలుగా రూ.54,500 పంపాడు. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో మోసపోయానని గ్రహించి సైబర్ క్రైంకు ఫిర్యాదు చేశాడు.
ఉమ్మడి జిల్లాలో అదనపు ఆదాయంపై ఆర్టీసీ దృష్టి సారించింది. మహిళలు కేవలం ఉచిత ప్రయాణం అందించే పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మాత్రమే ప్రయాణిస్తుండడంతో.. డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు అధికంగా ఉంటుండడంతో బస్సులు ఎక్కేందుకు పురుషులు ఆసక్తి చూపడం లేదు. ఈ సమస్యను అధిగమించేందుకు ఆర్టీసీ లక్ష్యే లక్ష్యం పేరుతో కసరత్తు చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో ఏటా కూరగాయల సాగు తగ్గుతూ వస్తోంది. దీంతో కూరగాయలను వ్యాపారులు ఇతర జిల్లాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. జిల్లాలో కూరగాయల సాగుపై రైతులు ఆసక్తి చూపకపోవడంతో దిగుమతి తగ్గి డిమాండ్ పెరిగి ధరలు మండుతున్నాయి. దీనికి తోడు వర్షాభావ పరిస్థితుల కారణంగా ఉమ్మడి జిల్లాలో అరకొరగా సాగయ్యే కూరగాయలు సైతం మార్కెట్కు రావడం లేదు.
పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడని శాలిగౌరారం ఎస్సై వాస ప్రవీణ్పై ఎస్పీ శరత్ చంద్ర పవార్ చర్యలు తీసుకున్నారు. వీ. ఆర్కు అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అతనిపై శాఖాపరమైన విచారణ కొనసాగుతుందని.. నివేదిక వచ్చాక చర్యలుండలున్నట్లు తెలుస్తోంది. శాలిగౌరారం నూతన ఎస్సైగా సైదులును నియమించారు.
Sorry, no posts matched your criteria.