Nalgonda

News July 7, 2024

NLG: రైతు భరోసా.. మెజార్టీ రైతుల అభిప్రాయమిదే..!

image

కాంగ్రెస్ ప్రభుత్వం ఆమలు చేయనున్న రైతు భరోసాను ఒక్కో రైతుకు 10 ఎకరాల వరకు పరిమితం చేయాలని జిల్లాలోని మెజారిటీ రైతులు అభిప్రాయపడ్డారు. ఒక రైతుకు అంతకుమించి భూమి ఉన్నా రైతు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అంతేకాదు వ్యవసాయ భూములకు మాత్రమే రైతు భరోసా అమలు చేయాలని, రియల్ఎస్టేట్ వెంచర్లు, వ్యవసాయేతర భూములకు రైతు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు.

News July 7, 2024

సింగపూర్‌లో కోదాడ యువకుడి అనుమానాస్పద మృతి

image

కోదాడకి చెందిన చౌడవరపు పవన్ అనే యువకుడు సింగపూర్ బీచ్‌లో శనివారం అనుమానాస్పదంగా మృతి చెందాడు. కోదాడలో ఉన్న తల్లిదండ్రులు పవన్ మృతితో శోకసంద్రంలో మునిగిపోయారు. యువకుడి తండ్రి శ్రీనివాసరావు కోదాడలో నూనె వ్యాపారం చేస్తున్నారు. రెండు నెలల్లో రెండో కుమారుడు అమెరికా వెళ్లాల్సి ఉంది. ఇంతలోనే ఈ ఘటన జరిగింది. 

News July 7, 2024

NLG: అరుణాచలానికి ప్రత్యేక బస్సులు

image

తమిళనాడులోని అరుణాచలేశ్వరుడి గిరి ప్రదక్షిణ కోసం ప్రతి పౌర్ణమికి ఉమ్మడి జిల్లాలోని ఏడు డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్ఎం రాజశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి నెల పౌర్ణమికి రద్దీని బట్టి ప్రత్యేక బస్సులు నడుపుతామని పేర్కొన్నారు. అరుణాచలం వెళ్లే భక్తులకు ఏపీలోని కాణిపాకం, తమిళనాడు వెల్లూరు గోల్డెన్ టెంపుల్ దర్శనం ఉంటుందన్నారు.

News July 7, 2024

NLG: ఆగస్టు 4న టీటీసీ పరీక్షలు

image

టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ కోర్స్ థియరీ పరీక్షలు ఆగస్టు 4న ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు డీఈఓ భిక్షపతి తెలిపారు. ఆగస్టు 4న ఆదివారం ఎడ్యుకేషనల్ సైకాలజీ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ పరీక్ష ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మెథడ్స్ ఆఫ్ టీచింగ్ జనరల్ పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు, మెథడ్స్ ఆఫ్ టీచింగ్ స్పెషల్ పరీక్ష 3.30 నుంచి 4:30 వరకు జరుగుతాయని తెలిపారు.

News July 7, 2024

నల్లమలలో జంతువుల వృద్ధి

image

ఉమ్మడి నల్గొండలో విస్తరించి ఉన్న నల్లమలలో రెండేళ్లలో జంతువులు గణనీయంగా వృద్ధి చెందినట్లు అటవీ అధికారులు చెబుతున్నారు. నాగార్జున సాగర్ అటవీ డివిజన్ పరిధిలో పెద్దపులి సంచారాన్ని నిర్ధారించడంతో పాటు అరుదైన జాతికి చెందిన రాబందు సైతం ఇక్కడ కనిపించడంతో వాటి సంరక్షణకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కాగా నల్గొండ పరిధిలో ఉన్న డివిజన్‌లో నాగార్జున సాగర్, కంబాళపల్లి, దేవరకొండ రేంజ్‌లున్నాయి.

News July 7, 2024

రానున్న 3 రోజులపాటు ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్

image

జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలలో రానున్న 3 రోజులపాటు ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ నిర్వహించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. శనివారం ఆయన జిల్లా అధికారులు, మండలాల ప్రత్యేక అధికారులు, జీపీ ప్రత్యేక అధికారులతో గ్రామాలలో స్పెషల్ సానిటేషన్ డ్రైవ్ పై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. GP ఆవరణతో పాటు, ఇతర ప్రభుత్వ సంస్థలు, రహదారులకు ఇరువైపులా పిచ్చి మొక్కలు లేకుండా తొలగించాలన్నారు.

News July 6, 2024

గరిడేపల్లి: పోలీస్ స్టేషన్ నుంచి దొంగ పరార్

image

గరిడేపల్లి పోలీస్ స్టేషన్ నుంచి శనివారం ఓ దొంగ పరారైయ్యాడు. వ్యవసాయ మోటార్ల చోరీ కేసులో అదుపులోకి తీసుకోని విచారిస్తుండగా పోలీసుల కళ్లుగప్పి చాకచక్యంగా పరారైనట్టు తెలుస్తోంది. కేసులో పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లో ఉంచారు. పరారీ అయిన అనుమానితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై ఎస్పీ సీరియస్ అయినట్లు సమాచారం. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News July 6, 2024

సింగపూర్‌లో కోదాడ యువకుడి మృతి

image

సింగపూర్‌లో తెలుగు యువకుడు మృతి చెందాడు. వివరాలిలా. కోదాడకి చెందిన చౌడవరపు పవన్ సింగపూర్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం స్నేహితులతో కలిసి బీచ్‌కు వెళ్లాడు. అలల ఉద్ధృతికి కొట్టుకుపోయి మృతి చెందాడు. పవన్ మృతితో అతని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. 

News July 6, 2024

నల్గొండ: విద్యార్థులను కరిచిన ఎలుకలు

image

డిండి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థినులను ఎలుకలు కరిచిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. జులై 2న 16 మంది విద్యార్థినులు ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారని, పాఠశాలలో ఎలుకలు కరవడంపై ప్రిన్సిపల్ సంబంధం లేని సమాధానం చెబుతున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. ఇకనైనా ప్రభుత్వ అధికారులు జోక్యం చేసుకొని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

News July 6, 2024

నల్గొండ: విద్యార్థులను కరిచిన ఎలుకలు

image

డిండి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థినులను ఎలుకలు కరిచిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. జులై 2న 16 మంది విద్యార్థినులు ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారని, పాఠశాలలో ఎలుకలు కరవడంపై ప్రిన్సిపల్ సంబంధం లేని సమాధానం చెబుతున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. ఇకనైనా ప్రభుత్వ అధికారులు జోక్యం చేసుకొని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.