India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ సెక్రెటరీ వి.పి.గౌతమ్ అధికారులను ఆదేశించారు. నల్గొండ కలెక్టరేట్లో ఇంజనీరింగ్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఇళ్ల అప్పగింతకు ముందే విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ, రహదారులు వంటి సౌకర్యాలు 100 శాతం పూర్తి కావాలని స్పష్టం చేశారు.

జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ బి.చంద్రశేఖర్ తెలిపారు. ఈనెల 11న జరిగే ఎన్నికల సరళిపై మంగళవారం ఆయన ఎస్పీ శరత్ చంద్ర పవార్తో కలిసి సమీక్షించారు. జిల్లాలో నల్గొండ కార్పొరేషన్తో పాటు మిర్యాలగూడ, చండూరు, చిట్యాల, నందికొండ, హాలియా, దేవరకొండ మున్సిపాలిటీల్లో మొత్తం 473 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు.

చిట్యాల మండలం పెద్దకాపర్తిలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను రాష్ట్ర గృహనిర్మాణ శాఖ సెక్రెటరీ వీపీ గౌతమ్, కలెక్టర్ బీ.చంద్రశేఖర్తో కలిసి తనిఖీ చేశారు. లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. మార్చి చివరి నాటికి రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలే లక్ష్యమని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో జయలక్ష్మి, సర్పంచ్ కాటం వెంకటేశం, తదితర అధికారులు పాల్గొన్నారు.

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఇప్పటికే 333 మంది రౌడీషీటర్లు, పాత నేరస్థులపై బైండోవర్ కేసులు నమోదు చేశామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమలులో ఉంటుందని, గుంపులుగా చేరితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మద్యం, నగదు పంపిణీపై నిఘా ఉంచామని జిల్లా ఎస్పీ తెలిపారు.

ప్రధాన పార్టీల నుంచి టికెట్లు ఆశించి భంగపడిన ఆయా పార్టీల నేతలు రెబల్స్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోయారు. నల్గొండ కార్పొరేషన్తోపాటు MLG, DVK, హాలియా, చండూరు, చిట్యాల, నందికొండ మున్సిపాలిటీల్లో ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తూ ప్రధాన పార్టీ అభ్యర్థులకు చెమటలు పట్టించారు. కొందరు గెలిచే అవకాశాలు ఉన్నాయని భావిస్తుండగా మరికొందరు గెలుపోవటములను ప్రభావితం చేస్తారన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

జిల్లాలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా నిష్పక్షపాతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఎన్నికల నిర్వహణకు ఎస్పీ పర్యవేక్షణలో ఆరుగురు డీఎస్పీలు, 29 మంది సీఐలు, 84 మంది ఎస్ఐలు, ఇతర పోలీస్ సిబ్బందితో కలిపి 1,097 మంది, 5 ప్లాటున్ల టీజీఎస్పీ పోలీస్ సిబ్బందిని నియమించారు.

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నల్గొండ జిల్లా వ్యాప్తంగా పోలీస్ యంత్రాంగం నిఘా కట్టుదిట్టం చేసింది. ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాలతో చేపట్టిన విస్తృత తనిఖీల్లో 4.9 కేజీల వెండి, మద్యం సీసాలు, 64 చీరలను స్వాధీనం చేసుకున్నారు. బస్టాండ్లు, లాడ్జీల్లో స్వయంగా తనిఖీలు చేపట్టిన ఎస్పీ.. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బస్టాండ్లు, లాడ్జీల్లో స్వయంగా జిల్లా ఎస్పీ తనిఖీలు చేశారు.

మున్సిపల్ ఎన్నికల్లో ప్రచార పర్వం ముగియడంతో తాయిలాల పంపిణీకి తెరలేచింది. అభ్యర్థులు ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో రూ.లక్షలు కుమ్మరిస్తుండడంతో ఓటు విలువ పెరిగింది. జిల్లాలో నల్గొండ కార్పొరేషన్ సహా మిర్యాలగూడ, హాలియా, చండూర్, దేవరకొండ, చిట్యాల, నందికొండ మున్సిపాల్టీల్లో భారీగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. నల్గొండలో ఒక్కో డివిజన్లో రూ.50 లక్షల పైగానే డబ్బు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం.

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం అత్యంత అప్రమత్తమైంది. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన నాకాబందీ చేపట్టారు. 48 గంటల ‘మౌన కాలం’ అమల్లోకి రావడంతో ప్రచారాలు, సభలపై నిషేధం విధించారు. సెక్షన్ 163 అమలు చేస్తూ అక్రమ నగదు, మద్యం తరలింపుపై ప్రత్యేక నిఘా ఉంచారు. ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు ప్రజలు సహకరించాలని ఎస్పీ కోరారు.

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని ఆయా మున్సిపాలిటీల పరిధిలోని అన్ని విద్యాసంస్థలకు ఈ నెల 10, 11 తేదీల్లో రెండు రోజుల పాటు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి. చంద్రశేఖర్ తెలిపారు. ఈ ఉత్తర్వులు నల్గొండ కార్పొరేషన్, మిర్యాలగూడ, హాలియా, నందికొండ, చండూరు, దేవరకొండ, చిట్యాల మున్సిపాలిటీలకు వర్తిస్తాయని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.