India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉరేసుకొని వ్యక్తం ఆత్మహత్య చేసుకున్న ఘటన గుర్రంపోడు మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ మధు వివరాల ప్రకారం.. పిట్టలగూడెం గ్రామానికి చెందిన బైరి పవన్(18) డీజె సిస్టం ఆపరేటర్గా పని చేస్తున్నాడు. గురువారం రాత్రి కుటుంబీకులతో కలిసి నిద్రించాడు. కాగా శుక్రవారం లేచి చూసేసరికి ఇంట్లో ఉరేసుకొని మృతి చెందినట్లు కుటుంబీకులు గుర్తించినట్లు ఎస్ఐ వెల్లడించారు.
నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మహిళా అభ్యర్థిగా మాజీ సర్పంచ్ అర్వ స్వాతి నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి నామినేషన్ పత్రాలు అందజేశారు. నిడమనూరు మండలం వేం పహాడ్ గ్రామ మాజీ సర్పంచ్గా ఆమె పని చేశారు. కాగా గతంలో ఉత్తమ గ్రామ అవార్డు పొందారు. ఉపాధ్యాయుల సమస్యల పట్ల పోరాడుతానని ఆమె హామీ ఇచ్చారు.
నల్గొండ సమీపంలోని రాములబండ తండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా ప్రసవాలతోపాటు పేద ప్రజలకు ఇంకా మంచి వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. గురువారం ఆమె రాములబండ తండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని రిజిస్టర్లను, సౌకర్యాలను పరిశీలించారు.
చిట్యాల మండలం వెలిమినేడు శివారులో రోడ్డుప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. కర్ణాటక రాయచూర్ నుంచి విజయవాడకు హినప్ప రాజు (22) తన స్నేహితులతో వెళ్తున్నాడు. బైక్ అదుపుతప్పి రెయిలింగ్ను ఢీకొట్టింది. ఈప్రమాదంలో హినప్ప రాజు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
చలికాలం పూర్తికాక ముందే ఎండలు మొదలయ్యాయి. ఫిబ్రవరి తొలివారంలోనే పగటి పూట 40 డిగ్రీలకు దగ్గరగా ఉష్ణోగ్రతలునమోదవుతున్నాయి. బుధువారం నల్గొండ (D) అనుముల మం. ఇబ్రహీంపేటలో 37.4, యాదాద్రి (D)బొమ్మలరామారంలో 37.3, సూర్యాపేట (D) నూతన్కల్లో 37.2 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయంపూట దట్టమైన పొగమంచు కురుస్తుండటంతో ఈ విచిత్ర వాతావరణంలో ప్రజలులు అవస్థలు పడుతున్నారు.
చెర్వుగట్టు శ్రీ పార్వతీసమేత జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున అగ్ని గుండాల కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. వీరముష్టి వంశీయులు మొదట పూజలు నిర్వహించి అగ్ని గుండాల కార్యక్రమాన్ని ప్రారంభించడం ఇక్కడ ఆనవాయితీ. పంటను స్వామికి సమర్పించి అగ్ని గుండాలపై నడిస్తే పంటలు బాగా పండి సుభిక్షంగా ఉంటామని భక్తుల నమ్మకం.
తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం యాసంగి కాలానికి సంబంధించిన రైతు భరోసా నిధులను గత నెల 27వ తేదీన కొంతమంది రైతులకు విడుదల చేసింది. సీఎం ఆదేశాల ప్రకారం బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఒక ఎకరం ఉన్న రైతులకు ఎకరానికి రూ.6,000 చొప్పున ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా గత నెల 27వ తేదీ నుంచి బుధవారం వరకు 1,55,232 మంది రైతుల అకౌంట్లో రైతు భరోసా నిధులు జమ అయ్యాయి.
TGS RTC నల్గొండ రీజియన్లోని అన్ని డిపోలలో వివాహాది శుభకార్యాలకు అద్దె ప్రాతిపదికన బస్సులు అందజేస్తామని ఉమ్మడి నల్గొండ జిల్లా రీజనల్ మేనేజర్ కె. జానీ రెడ్డి తెలిపారు. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులను అద్దెకు తీసుకోవచ్చున్నారు. ప్రతి కిలోమీటర్పై గతంలో కంటే రూ.7 తగ్గింపు ఉందని, 6 గంటల వెయిటింగ్ చార్జ్ మినహాయింపు ఉంటుందన్నారు. వివరాలకు సమీప డిపోలను సంప్రదించాలని సూచించారు.
ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలకు బుధవారం 357 మంది గైర్హాజరయ్యారు. ఉదయం జరిగిన ప్రాక్టికల్స్కు మొత్తం 2760 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా.. 2507 మంది హాజరయ్యారు. 253 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన ప్రాక్టికల్స్కు 1985 మంది హాజరుకావాల్సి ఉండగా 1881 మంది పరీక్ష రాశారు. 104 మంది గైర్హాజరయ్యారు.
ఎంజీ యూనివర్సిటీలో వివిధ విభాగాలలో సేవలందిస్తున్న వివిధ అధికారుల పదవీ కాలాన్ని పొడిగిస్తూ ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్ సూచన మేరకు రిజిస్ట్రార్ ఆచార్య అలవాల రవి ఉత్తర్వులు జారీ చేశారు. పరీక్షల నియంత్రణ అధికారిగా సేవలందిస్తున్న డా జి.ఉపేందర్ రెడ్డిని మరో ఏడాది, ఐక్యూ ఏసీ డైరెక్టర్ డా.మిరియాల రమేశ్, ఆడిట్ సెల్ అడిషనల్ డైరెక్టర్గా డా వై.జయంతిని మరో ఏడాది కొనసాగించనున్నారు.
Sorry, no posts matched your criteria.