India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వృద్ధుడు, దివ్యాంగుడైన మామపై <<14828145>>చెప్పుతో దాడి<<>> చేసిన ఘటనలో అతని కోడలిని రిమాండ్కు తరలించినట్లు వేములపల్లి ఎస్ఐ డి.వెంకటేశ్వర్లు తెలిపారు. గత నెల 20న భూ వివాదంలో శెట్టిపాలెంకి చెందిన గగినపల్లి బుచ్చిరెడ్డిపై అతడి కోడలు మణిమాల చెప్పుతో దాడి చేసింది. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. స్పందించిన పోలీసులు విచారణ చేపట్టి మణిమాలను అదుపులోకి తీసుకుని రిమాండ్ చేసినట్లు తెలిపారు.
కోదాడ మండల పరిధిలోని రామాపురం క్రాస్ రోడ్డులో ఆంధ్ర – తెలంగాణ చెక్పోస్ట్ వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు సన్న వడ్లకు బోనస్ ధర ఇస్తున్నందున ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తనిఖీలు చేపడుతున్నారు. రెవెన్యూ, మైనింగ్, పోలీస్, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు పాల్గొంటున్నారు.
త్వరలో క్యాబినెట్ విస్తరణ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఉమ్మడి నల్గొండ నుంచి ప్రస్తుతం ఇద్దరు మంత్రులుగా ఉన్నారు. నల్గొండ నుంచి కోమటిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండగా, సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి ఉత్తమ్ ఉన్నారు. ఈ లెక్కన నల్గొండ, సూర్యాపేట జిల్లాల నుంచి మంత్రి పదవి లభించినట్లైంది. ఇక భువనగిరి జిల్లా మాత్రమే మిగిలుండగా బెర్తు దక్కుతుందో లేదో తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే.
సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో న్యూఢిల్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇవాళ భేటీ అయ్యారు. రీజినల్ రింగ్ రోడ్డు (ఉత్తర భాగానికి) నిర్మాణానికి సంబంధించి జాతీయ రహదారుల ప్రాధికార సంస్ధ వద్ద పెండింగ్లో ఉన్న టెక్నికల్, ఫైనాన్షియల్ అప్రూవల్ను ఆమోదించి పనులు ప్రారంభించాలని గడ్కరీని కోరారు.
రెండు నెలల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్న యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన చిట్యాలలో జరిగింది. ఎస్సై ధర్మ తెలిపిన వివరాలు.. స్థానిక వెంటాపురానికి చెందిన రబోయిన మహేష్(26) రెండు నెలల కిందటే ప్రేమ వివాహం చేసుకున్నాడు. దంపతుల మధ్య మనస్పర్ధలతో వారిద్దరు వేరువేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన మహేష్ గురువారం ఇంట్లో ఉరివేసుకున్నాడు. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.
త్వరలో తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఉండనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఉమ్మడి NLG జిల్లా నుంచి రేవంత్ క్యాబినెట్లో బెర్త్ ఎవరికి అనే చర్చ నడుస్తోంది. ST సామాజిక వర్గానికి చెందిన MLA బాలు నాయక్, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన MLA రాజగోపాల్ రెడ్డి, బీసీ MLA ఐలయ్య జిల్లా నుంచి మంత్రి పదవి రేసులో ముందున్నట్లు పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. వీరిలో ఎవరు మంత్రి అవుతారో కామెంట్ చేయండి.
ఆరు గ్యారంటీల అమలులో భాగంగా ఇందిరమ్మ ఇళ్లకు అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు ముమ్మరంగా సర్వే నిర్వహిస్తున్నారు. ఇళ్లను పేదలకు పంపిణీ చేసేందుకు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక యాప్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ యాప్లో అధికారులు అర్హులైన లబ్ధిదారుల వివరాలను నమోదు చేస్తున్నారు. కాగా నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున ఉమ్మడి నల్గొండ జిల్లాలో 42 వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు.
పెన్షన్ల పెంపుపై ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో లబ్ధిదారులు నిరాశకు గురవుతున్నారు. నల్గొండ జిల్లాలో సుమారు లక్ష మందికి పైగానే పెన్షన్లు అందుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా ఇప్పటివరకు పెన్షన్ల పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పింఛన్ల పెంపుపై మార్గదర్శకాలు విడుదల కాకపోవడంతో పెంపు ఇప్పట్లో ఉంటుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల తేదీ ఎప్పుడు ప్రకటించినా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే ఓటరు జాబితా పూర్తి చేయడంతోపాటు పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. బ్యాలెట్ బాక్సులు, సామగ్రి సిద్ధం చేసి పెట్టుకున్నారు. నల్లగొండలో 856, యాదాద్రి భువనగిరిలో 428, సూర్యాపేటలో 486 గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తుంది.
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మౌనానికి అర్థం ఏమిటనే సర్వత్రా చర్చ సాగుతుంది. వలిగొండలో సీఎం చేపట్టిన మూసీ ప్రక్షాళన యాత్రలో ఆయన కనిపించలేదు. నల్లగొండలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న విజయోత్సవ సభకు సైతం డుమ్మా కొట్టారు. భువనగిరి ఎంపీ అభ్యర్థిని గెలిపిస్తే అధిష్టానం సముచిత స్థానం కల్పిస్తామని చెప్పి.. అది నేటికి కార్యరూపం దాల్చకపోవడంతో ఆయన సైలెంట్గా ఉన్నట్లు చర్చ జరుగుతోంది.
Sorry, no posts matched your criteria.