India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చౌటుప్పల్ మం. పంతంగిలో దారుణం జరిగింది. స్థానికుల వివరాలిలా.. హన్మంతరెడ్డి HYDలో ఉంటున్నారు. అతడికి సోదరుడు, ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. వీరికి 7.24 ఎకరాల భూమి ఉంది. వివాదం పరిష్కరించుకోవడానికి హన్మంతరెడ్డి గ్రామానికి వచ్చాడు. ఎటూ తేలకపోవడంతో మనస్తాపంతో సూసైడ్ చేసుకున్నాడు. వివాదం పరిష్కారమయ్యాకే అంత్యక్రియలు నిర్వహించాలని మృతుడి బంధువులు డిసైడ్ అవడంతో మూడు రోజులుగా మృతదేహం మార్చురీలోనే ఉంది.
కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ త్వరలో ఉంటుందని కేబినెట్ మీటింగ్లో విధి విధానాలు రూపొందించినట్లు మంత్రి ఉత్తమ్ తాజాగా వెల్లడించడంతో ఉమ్మడి జిల్లా ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. సన్నబియ్యం పంపిణీ చేపడతామని చెప్పడంతో లబ్ధిదారులు ఖుషీ అవుతున్నారు. నూతన కార్డుల కోసం 39,874, కార్డుల్లో మార్పునకు 63,691 దరఖాస్తులొచ్చాయి. ఉమ్మడి జిల్లాలో 10,07,090 కార్డులుండగా, లబ్ధిదారుల సంఖ్య 29,84,569గా ఉంది.
వానకాలం ప్రారంభమైనందున వరదల వలన నష్టం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క అదనపు కలెక్టర్లను ఆదేశించారు. యాదాద్రి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీజనల్ వ్యాధుల పట్ల, వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దాసరి చందన జిల్లా అధికారులను ఆదేశించారు. పార్లమెంటు ఎన్నికలు, వరంగల్-ఖమ్మం-నల్గొండ శాసన మండలి పట్టభద్రుల ఉప ఎన్నికల అనంతరం తిరిగి ఈ సోమవారం ప్రారంభమైన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె ప్రజల వద్ద నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ప్రజావాణిలో సమస్యలపై జిల్లా కలెక్టర్కు, అధికారులకు దరఖాస్తులు సమర్పించారు.
మిర్యాలగూడ మండలం యాద్గార్పల్లికి చెందిన కుంచం శివ తల్లిందండ్రులు లేరనే బాధను దిగమింగి ఐఐటీ జేఈఈలో సత్తా చాటాడు. జాతీయ స్థాయిలో జనరల్ కేటగిరీలో 211, బీసీ కేటగిరీలో 24లో ర్యాంకు సాధించాడు. ఆరేళ్ల క్రితం శివ తల్లి జ్యోతి అనారోగ్యంతో చనిపోగా, నాలుగేళ్ల క్రితం తండ్రి శ్రీను భూగర్భ డ్రైనేజీలో ఊపిరాకడ మృతిచెందాడు. దీంతో మేనమామ నోముల నాగార్జున దగ్గర ఉండి చదువుల్లో రాణిస్తున్నాడు.
ఉమ్మడి నల్గొండ జిల్లా DCCB ఛైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిపై డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానాన్ని పెట్టారు. అవిశ్వాసానికి మద్దతుగా 14 మంది డైరెక్టర్లు సంతకాలు చేసి డీసీవోకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ పరిణామంతో మహేందర్ రెడ్డి డీసీసీబీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు.
నల్గొండ ఎంపీ రఘువీర్కి 5లక్షల పైచిలుకు మెజార్టీ ఇచ్చి చరిత్ర సృష్టించారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు మోదీపై అవిశ్వాసాన్ని ప్రతిబింబించిందన్నారు. బీజేపీపై ప్రజలకు విశ్వాసం లేనందునే 63 సీట్లు తగ్గాయని, అదే సమయంలో కాంగ్రెస్ బలం రెట్టింపు అయిందన్నారు. రాజ్యాంగాన్ని రక్షించే తీర్పును ప్రజలిచ్చారని తెలిపారు.
అత్త, భర్త మందలించారని వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మోతె మండలంలో జరిగింది. రాంపురంతండాకు చెందిన నాగు దంపతులు ఉఫాధి కోసం HYDలో ఉంటున్నారు. కాగా ఈ దంపతులు 10రోజులక్రితం తండాకు వచ్చారు. అప్పటి నుంచి ఇంట్లో మరుగుదొడ్డి నిర్మాణం మొదలు పెట్టారు. కాగా ఈ విషయమై ఉమ ఆమె భర్త, అత్త మధ్య గొడవకు దారి తీసింది. దీంతో మనస్తాపానికి గురైన ఉమ గడ్డిమందు తాగింది. ఆసుపత్రికి తరలించాగా చికిత్స పొందుతూ మృతి చెందింది.
కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో జరిగే అభివృద్ధి పనులలో నాణ్యత ఉండాలని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. అధికారులు అలక్ష్యంగా ఉంటే సహించేది లేదని హెచ్చరించారు. హుజూర్నగర్లోని రెండు నియోజకవర్గాల్లో జరుగుతున్న పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్శాఖ ద్వారా 85 పనులకు 2 నియోజకవర్గాల్లో కొత్త, రెన్యూవల్ కలిపి రూ.124.65 కోట్ల పనులు జరుగుతున్నాయని అధికారులు వివరించారు
సోమవారం నుంచి సూర్యాపేట జిల్లాలో ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ తెలిపారు. ఇటీవల జరిగిన పార్లమెంట్, శాసన మండలి ఎన్నికలు ముగియడంతో ఎన్నికల సంఘం కోడ్ ముగిసిందని జిల్లాతో పాటు అన్ని మండలాల్లో తహశీల్దార్ల కార్యాలయాల్లో సోమవారం నుంచి ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా చేపట్టాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.