Nalgonda

News June 9, 2024

ఇండియా -పాక్ మ్యాచ్.. హాజరైన మంత్రి కోమటిరెడ్డి

image

అమెరికాలో జరుగుతున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌ను మంత్రి కోమటిరెడ్డి వీక్షిస్తున్నారు. ఆయనతోపాటు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఉన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మ్యాచ్ వీక్షించడానికి వెళ్లారు.

News June 9, 2024

NLG: ఆర్టీసీ బస్సుపై రాళ్లదాడి

image

నారాయణపూర్ మండలం వాయిల్లపల్లి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు బస్సుపై రాళ్లు విసిరారు. రాళ్లు వేయడంతో అద్దాలు ధ్వంసమై బస్సు లోపల పడ్డాయి. బస్సు చౌటుప్పల్ వెళుతుండగా ఈ ఘటన జరిగింది. బస్సులో ప్రయాణికులు ఎక్కువగా ఉండగా, కొన్ని చోట్ల ఆపకపోవడంతో రాళ్లతో దాడి చేసినట్లుగా ప్రయాణికులు భావిస్తున్నారు. కాగా బస్సును నారాయణపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

News June 9, 2024

NLG: నాలుగో ప్రయత్నంలో విజయం…!

image

రెండుసార్లు MLCస్థానానికి, ఓ సారి MLAస్థానానికి పోటీచేసి ఓడిన మల్లన్న.. నాలుగో ప్రయత్నంలో విజయం సాధించారు. 2015లో NLG- KMM-WGLఎమ్మెల్సీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. 2019లో HZNR అసెంబ్లీ ఉపఎన్నికలో ఇండిపెండెంట్‌గా పోటీచేసి ఓడారు. 2021లో NLG- KMM-WGL ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. ప్రస్తుతం అదే స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో మల్లన్న విజయం సాధించారు.

News June 9, 2024

NLG: పక్షం ముందుగానే సాగు పనులు!

image

ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో గత మూడు, నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ముందుగానే వర్షాలు పడటం, ఈ ఏడాది ఆశాజనకంగానే వర్షాలు ఉంటాయని చెబుతుండటంతో రైతులు పక్షం రోజుల ముందుగానే సాగు పనులు మొదలు పెట్టారు. DVK, నాగార్జునసాగర్, తుంగతుర్తి నియోజకవర్గాల్లోని చాలా ప్రాంతాల్లో రైతులు పత్తి విత్తనాలు వేస్తున్నారు. ఈ సీజన్లో 3 జిల్లాల్లో 21 లక్షల ఎకరాల్లో పంటలు సాగు కానున్నాయి.

News June 9, 2024

NLG: అటు బడిబాట.. ఇటు బదిలీల బాట!

image

ఉమ్మడి జిల్లాలో విద్యార్థులను బడిలో చేర్పించే కార్యక్రమం ఆరంభమైన మరుసటి రోజే ఉపాధ్యాయుల బదిలీల బాట మొదలైంది. ఓ పక్క ఉపాధ్యాయులకు బడిబాట కార్యక్రమం అప్పగిస్తూనే మరో వైపు వారికి బదిలీకి అవకాశం కల్పించింది. దీంతో ఉపాధ్యాయులు చాలా వరకు బదిలీల కోసం ప్రయత్నాలు ప్రారంభించాల్సిన పరిస్థితి నెలకొంది. ఖాళీలు వెతుక్కోవడం, ఆప్షన్లు పెట్టుకోవడం వంటి పనుల్లో బిజీగా ఉంటున్నారు.

News June 9, 2024

NLG: పెట్టుబడి సాయం అందక రైతన్న పాట్లు

image

వానాకాలం సీజన్ ఆరంభం కావడంతో ఉమ్మడి జిల్లాలో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. వర్షాలు కురుస్తుండడంతో పత్తి విత్తనాలు విత్తుతున్నారు. మృగశిర కార్తె ప్రారంభం కావడంతో వరినార్లు పోసుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. కనీసం విధివిధానాలను రూపొందించకపోవడంతో రైతుల్లో అయోమయం నెలకొంది. పెట్టుబడి సాయం కోసం రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు.

News June 9, 2024

భార్య వేధింపులతో భర్త సూసైడ్

image

భార్య, ఆమె కుటుంబ సభ్యుల వేధింపులతో భర్త సూసైడ్ చేసుకున్న ఘటన హుజూర్‌నగర్‌లోని సీతారాంనగర్‌లో శనివారం చోటుచేసుకుంది. ఎస్సై ముత్తయ్య వివరాల ప్రకారం.. చిట్టిప్రోలు రంజిత్‌కుమార్‌ ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య స్వప్న రేషన్‌ దుకాణం నడిపిస్తుంది. కొంత కాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చి గొడవ పడుతున్నారు. భార్య, ఆమె కుటుంబ సభ్యులు వేధిస్తుండటంతో ఆయన ఉరేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.

News June 9, 2024

నాలుగుసార్లు బీఆర్‌ఎస్‌ అభ్యర్థులే..

image

వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి సీఎం అయిన తరువాత 2007లో శాసనమండలి వ్యవస్థను తిరిగి ప్రారంభించారు. WGL–KMM–NLG గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీగా తొలిసారి టీఆర్‌ఎస్‌ నుంచి కపిలవాయి దిలీప్‌కుమార్‌ ఎన్నికయ్యారు. ఆ తరువాత 2009 ఎన్నికల్లోనూ కపిలవాయి విజయం సాధించారు. 2015 తెలంగాణ వచ్చాక టీఆర్‌ఎస్‌ నుంచి పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలుపొందారు. మళ్లీ 2021ఎన్నికల్లో కూడా బీఆర్‌ఎస్‌ నుంచి పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయం సాధించారు.

News June 9, 2024

నల్గొండ: గ్రూప్‌-1 అభ్యర్థులకు ఆర్ఎం కీలక సూచన

image

రేపు గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష రాసే అభ్యర్థుల సౌకర్యార్థం TGSRTC ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఉమ్మడి నల్గొండ జిల్లా రీజినల్ మేనేజర్ S.శ్రీదేవి తెలిపారు. ఉమ్మడి నల్గొండ పరిధిలో 88 సెంటర్లలో పరీక్షకు హాజరయ్యే సుమారు 29,973 అభ్యర్థులకు రవాణాపరంగా ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని డిపో మేనేజర్లకు ఆదేశాలు జారీ చేశామని, RTC బస్సుల్లో ప్రయాణించి క్షేమంగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని కోరారు.

News June 9, 2024

గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు పటిష్ట భద్రత: జిల్లా ఎస్పీ చందన దీప్తి

image

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదివారం నిర్వహిస్తున్న గ్రూప్ –I ప్రిలిమినరీ పరీక్షకు భద్రత పరమైన ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 47 సెంటర్లలో మొత్తం 16,899 మంది అభ్యర్ధులు పరీక్ష రాయనున్నారని, పరీక్షకు వచ్చే అభ్యర్ధులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుదని పేర్కొన్నారు.