Nalgonda

News December 11, 2024

వేగుచుక్క.. నాగార్జునసాగర్

image

కరవుకాటకాలతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాలకు వేగుచుక్కలా నిలిచింది నాగార్జునసాగర్ ప్రాజెక్టు. 1955 డిసెంబరు 10న నాటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ చేతుల మీదుగా ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. NLG జిల్లా నందికొండ వద్ద కృష్ణ నదిపై ఈ ప్రాజెక్టును నిర్మించిన విషయం తెలిసిందే. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద మానవ నిర్మిత ప్రాజెక్టుగా సాగర్ ప్రసిద్ధి చెందడం తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణం.

News December 11, 2024

మంత్రి పదవిపై ఐలయ్య రెస్పాన్స్

image

ఐలయ్యకు మంత్రి పదవి అని వస్తున్న కథనాలపై ఆయన స్పందించారు. బీసీ కోటాలో పరిగణనలోకి తీసుకొని తనకు మంత్రి పదవి ఇస్తారనని భావిస్తున్నట్లు MLA ఐలయ్య చెప్పారు. అయితే తాను కాంగ్రెస్​కు విధేయుడనని, పార్టీ చెప్పింది చేయడమే తన పని అని చెప్పారు. తనకు ఇప్పటికే క్యాబినెట్ ​ర్యాంక్​ కలిగిన ప్రభుత్వ విప్ ఇచ్చారని, మంత్రి పదవి ఇచ్చినా.. ఇవ్వకున్నా బాధేమీ ఉండదని చెప్పారు.

News December 11, 2024

ఎంజి యూనివర్సిటీ బిఈడి రిజల్ట్స్

image

MG విశ్వవిద్యాలయం బీఈడీ 2వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్, మొదటి సెమిస్టర్ బ్యాక్లాగ్ ఫలితాలను మంగళవారం యూనివర్శిటీ అధికారులు విడుదల చేశారు. ఫలితాల వివరాలు ఎంజీయూ వెబ్సైట్లో పొందుపరిచినట్లు సిఓఈ డా. ఉపేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 2వ సెమిస్టర్‌లో 1813 మంది పాస్ కాగా, 692 మంది ప్రమోట్ అయ్యారు. 85 మంది డిటైన్డ్ అయినట్లు తెలిపారు. మొదటి సెమిస్టర్‌లో 299 మంది పాస్ కాగా 237 మంది ఫెయిల్ అయ్యారు.

News December 10, 2024

పుష్ప-2లో అల్లు అర్జున్‌ షర్ట్ మన పోచంపల్లిదే..

image

ఇటీవల విడుదలైన పుష్ప-2 సినిమా రికార్డులు కొల్లగొడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో కొన్నిచోట్ల క్యాస్టూమ్స్‌గా పోచంపల్లి వస్త్రాలు మెరిశాయి. పోలీస్‌ ఆఫీసర్‌ బన్వర్‌సింగ్‌ షెకావత్‌తో.. ‘పుష్ప అంటే ఫ్లవర్‌ అనుకుంటివ..’ అని చెప్పే డైలాగ్‌లో హీరో అల్లు అర్జున్ ధరించినది పోచంపల్లి ఇక్కత్ చొక్కానే. పోచంపల్లిలో షూటింగ్ సమయంలో ఈ షర్ట్ కొన్నట్లు స్థానికులు తెలిపారు. 

News December 10, 2024

NLG: నేటి నుంచి దరఖాస్తుల పరిశీలన షురూ

image

ఇందిరమ్మ ఇళ్ల కోసం నల్గొండ జిల్లాలో 4.36, సూర్యాపేట జిల్లాలో 3.62 లక్షల దరఖాస్తులు రాగా వాటిని అధికారులు నేటి నుంచి పరిశీలించనున్నారు. ప్రతీ దరఖాస్తుదారుడి వివరాలను ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తారు. గ్రామాల్లో పంచాయతీల్లో కార్యదర్శులు, మున్సిపల్ వార్డుల్లో వార్డు ఇన్‌ఛార్జిలు సర్వే చేపట్టనున్నారు. సర్వే ఏ విధంగా చేయాలనే విషయంపై వారికి ఇప్పటికే శిక్షణ ఇచ్చారు.

News December 10, 2024

NLG: అప్రెంటిస్ షిప్‌లో దరఖాస్తుల ఆహ్వానం

image

బీకాం, బీఎస్సీ కంప్యూటర్, బీటెక్ మెకానిక్, డిప్లొమా మెకానికల్ పూర్తిచేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్. వారికి మూడేళ్లపాటు ఆర్టీసీలో అప్రెంటిస్ షిప్ ఇస్తున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం జాన్ రెడ్డి తెలిపారు. ఈ నెల 20వ తేదీలోగా ఆసక్తి గల అభ్యర్థులు నల్లగొండ రీజనల్ మేనేజర్ కార్యాలయంతో పాటు ఉమ్మడి జిల్లాలోని ఏడు డిపోల్లో దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు.

News December 10, 2024

నల్గొండ జిల్లాలో అంగన్వాడీల అరిగోస!

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న సుమారు 4 వేల మంది అంగన్వాడీలు అరిగోస పడుతున్నారు. అరకొర వేతనాలతో కుటుంబం గడవక అష్టకష్టాలు పడుతున్నారు. వచ్చే జీతం మూరెడు బాధ్యతలు మాత్రం బారెడు అన్న చందంగా అంగన్వాడీ కేంద్రం పనులే కాకుండా ఇతర ప్రభుత్వ పనుల ఒత్తిడితో అధిక భారమై సతమతమవుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్నా అంగన్వాడీల ఒక్క సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News December 9, 2024

NLG: మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు!

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహించనున్నారు. జిల్లాలోని మూడు పాత రెవెన్యూ డివిజన్ల వారీగా ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. మొదటి విడతలో నల్గొండ, రెండో విడతలో మిర్యాలగూడ, ఆఖరి విడతలో దేవరకొండ డివిజన్ పరిధిలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

News December 8, 2024

4 లైన్ల రోడ్లకు రూ.236 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం

image

యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నుండి నార్కెట్ పల్లి- అద్దంకి -మెదర్ మెట్ల వరకు 236 కోట్ల రూపాయల వ్యయంతో 4లైన్ల నూతన సిసి రోడ్డును మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు శనివారం రాష్ట్ర రోడ్లు ,భవనాల శాఖ ద్వారా జి ఓఆర్ టి నంబర్ 926 జారీ చేసింది. వైటిపిఎస్ నుండి నామ్ రోడ్ వరకు 4 లైన్ల సిసి రోడ్ మంజూరు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

News December 7, 2024

రేవంత్ రెడ్డి ఏడాది పాలన.. ఉమ్మడి NLG REPORT

image

రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి సరిగ్గా ఏడాది. కాగా ఇటీవల యాదాద్రి ఆలయాన్ని సందర్శించిన రేవంత్.. ఆలయ అభివృద్ధికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూసేకరణను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. యాదాద్రి టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇవాళ నల్గొండకు రానున్న రేవంత్ బ్రహ్మణవెల్లంల ప్రాజెక్టు ప్రారంభం, నల్గొండలో మెడికల్ కాలేజీని ప్రారంభించనున్నారు. ఏడాది పాలనపై మీ కామెంట్.