Nalgonda

News December 23, 2024

మార్చి 1 నుంచి యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు

image

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనర్సింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు దేవస్థానం ఏర్పాట్లు ప్రారంభించినట్లు ఆలయ ఈవో భాస్కర రావు తెలిపారు. మార్చి 1 నుంచి 11 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. మార్చి 7న శ్రీవారి ఎదుర్కోలు, 8న స్వామి అమ్మవార్ల తిరుకల్యాణోత్సవం, 9నశదివ్యవిమాన రథోత్సవం, 10న పూర్ణాహుతి, చక్రతీర్థం,11న శతఘటాభిషేకం, డోలోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

News December 23, 2024

నల్గొండ: లక్షల్లో అప్లై.. పరీక్షకు మాత్రం గైర్హాజరు

image

వారం క్రితం గ్రూప్-2 పరీక్ష ముగిసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఆసక్తి చూపిస్తున్న అభ్యర్థులు పరీక్షలు రాయడానికి మాత్రం విముఖత వ్యక్తం చేస్తున్నారు. వందల్లో ఉద్యోగాలు ఉంటే లక్షల్లో దరఖాస్తులు ఉంటున్నాయి. కానీ సగం మంది కూడా పరీక్షలు రాయలేదు. గతేడాది గ్రూప్-4 పరీక్షకు హాజరు శాతం బాగానే ఉన్నా గ్రూప్-2కు మాత్రం నల్గొండ జిల్లాలో 49.10 శాతం మందే హాజరయ్యారు.

News December 22, 2024

నల్గొండ డీఈవోపై చర్యలకు ఆదేశించిన మహిళా కమిషన్

image

నల్లగొండ డీఈవో బిక్షపతిపై రాష్ట్ర మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తన భర్త, నల్లగొండ డీఈవో బిక్షపతి మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడని.. ఆయన మొదటి భార్య మాధవి మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. మాధవి ఫిర్యాదుతో స్పందించిన మహిళా కమిషన్ నల్లగొండ డీఈవో బిక్షపతి వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టింది. ఆయనపై శాకపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యా శాఖ సెక్రటరీని ఆదేశించింది.

News December 22, 2024

నల్గొండ డీఈవోపై చర్యలకు ఆదేశించిన మహిళా కమిషన్

image

నల్లగొండ డీఈవో బిక్షపతిపై రాష్ట్ర మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తన భర్త, నల్లగొండ డీఈవో బిక్షపతి మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడని.. ఆయన మొదటి భార్య మాధవి మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. మాధవి ఫిర్యాదుతో స్పందించిన మహిళా కమిషన్ నల్లగొండ డీఈవో బిక్షపతి వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టింది. ఆయనపై శాకపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యా శాఖ సెక్రటరీని ఆదేశించింది.

News December 22, 2024

ముగిసిన రీసెర్చ్ మెథడాలజీ శిక్షణ కార్యక్రమం

image

MG యూనివర్సిటీ మేనేజ్మెంట్ విభాగం ఆధ్వర్యంలో ఐసిఎస్ఎస్ఆర్ సమర్పించిన పది రోజుల రీసెర్చ్ మెథడాలజీ శిక్షణ కార్యక్రమం ఇవాళ ముగిసింది. ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్, కోర్సు కోఆర్డినేటర్ ఆచార్య అలువాల రవి, కోర్సు కోఆర్డినేటర్ మిరియాల రమేష్ తదితరు పాల్గొన్నారు.

News December 21, 2024

నల్గొండ ప్రజలకు విషమిచ్చి చంపండి: కోమటిరెడ్డి

image

CM రేవంత్‌ మూసీని అభివృద్ధి చేసి NLG జిల్లా ప్రజల బాగు కోరుతుంటే బావబామ్మర్దులు(కేటీఆర్, హరీశ్‌రావు) అడ్డుపడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అసెంబ్లీలో ఫైరయ్యారు. తాము బతకాలని లేకుంటే విషమిచ్చి చంపండని అసహనం వ్యక్తం చేశారు. గత పదేళ్ల నుంచి నల్గొండ జిల్లాకు ఒక్క ఎకరాకు కూడా ఎక్కువగా ఇరిగేషన్ వాటర్ ఇవ్వలేదన్నారు. ఏ ఒక్క సాగు నీటి ప్రాజెక్టుకు రూ.100 కోట్లు కేటాయించిన దాఖలాలు లేవన్నారు.

News December 21, 2024

రైతు జీవితాల్లో ఇక సం’క్రాంతి’ : కోమటిరెడ్డి

image

సంక్రాంతి నుండి సాగు చేస్తున్న ప్రతి రైతుకు రైతు భరోసాను అమలు చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నల్గొండలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడా. సంక్రాంతి నుంచే కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. ఇందిరా స్వశక్తి మహిళ సంఘాలను బలోపేతం చేసేందుకు లక్ష కోట్ల రూపాయలను ఇచ్చి మహిళలను కోటీశ్వరులను చేస్తామని తెలిపారు.

News December 20, 2024

నల్గొండ మంత్రులు ఏదడిగినా కాదనరు: కూనంనేని

image

నల్గొండ మంత్రులపై ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అసెంబ్లీలో ప్రశంసలు కురిపించారు. నల్గొండ జిల్లా మంత్రులు బోళాశంకరులని ఏది అడిగినా ఆలోచించకుండానే సరే అంటారని చెప్పారు. కానీ ఖమ్మం జిల్లా మంత్రులు ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఓకే చేస్తారని గురువారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో వ్యాఖ్యానించారు. కాగా జిల్లా మంత్రులపై కూనంనేని వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. కూనంనేని వ్యాఖ్యలపై మీ కామెంట్స్.

News December 20, 2024

మంత్రి పదవిపై రాజగోపాల్ రెడ్డి కామెంట్స్

image

మంత్రి పదవిపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పదవులపై ఆశ లేదని రావాల్సిన టైంలో మంత్రి పదవి వస్తుందన్నారు. ఇప్పటివరకు ఏ పదవులు అడగలేదని.. పార్టీ కోసం కష్టపడే వారికి అధిష్ఠానం పదవులు ఇస్తుందన్నారు. ఏ డ్రెస్సులు వేసుకున్నా ఆఖరికి బీఆర్ఎస్ నేతలకు జైలు డ్రెస్సే గతి అంటూ ఎద్దేవా చేశారు. త్వరలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని జోస్యం చెప్పారు.

News December 20, 2024

రేవంత్, ఉత్తమ్‌కు కోమటిరెడ్డి సన్మానం 

image

సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శాలువాతో సన్మానించారు.  పిలాయిపల్లి, దర్మారెడ్డి కాల్వల ఆధునీకరణకు నిధులు కేటాయించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, బీర్ల అయిలయ్య, వేముల వీరేశం, మందుల సామేల్ తదితరులున్నారు.