Nalgonda

News February 1, 2025

రేపు పెద్దగట్టు ఆలయం వద్ద దిష్టి పూజ

image

పెద్దగట్టు జాతర వద్ద ఆదివారం దిష్టి పూజ నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే 2వ అతిపెద్ద జాతరైన పెద్దగట్టు లింగమంతుల ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు జరుగనున్న విషయం తెలిసిందే. ఆదివారం అర్ధరాత్రి దిష్టి పూజ నిర్వహిస్తారని పెద్దగట్టు ఛైర్మన్ నర్సయ్య యాదవ్ తెలిపారు. భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు.

News February 1, 2025

మిర్యాలగూడ: భూ తగాదాలతో యువకుడిపై హత్యాయత్నం..!

image

మిర్యాలగూడ కోర్టు ఎదుట దామరచర్ల మం. వీర్లపాలెంకి చెందిన అల్లం మహేశ్‌పై నలుగురు యువకులు కత్తులతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానికుల వివరాల ప్రకారం.. 30 ఏళ్ల క్రితం మంద మహేశ్, శేఖర్ కుటుంబ సభ్యుల వద్ద అల్లం మహేశ్ కుటుంబ సభ్యులు వీర్లపాలెంలోని భూమిని కొనుగోలు చేశారు. ఆ భూమికి సంబంధించి రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. భూమి విషయంలోనే మహేశ్‌పై మంద కుటుంబ సభ్యులు దాడి చేశారన్నారు.

News February 1, 2025

ఇండోనేషియా అమ్మాయితో గుండ్రాంపల్లి యువకుడు పెళ్లి

image

చిట్యాల మండలం గుండ్రాంపల్లికి చెందిన అబ్బాయి ఇండోనేషియాకు చెందిన అమ్మాయి హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. గ్రామానికి చెందిన సీమ సాలయ్య-యాదమ్మల కుమారుడు నాగరాజు హైదరాబాద్లోని సాప్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇండోనేషియాకి చెందిన రిక్కి సన్డా సెఫిట్రి అదే కంపెనీలో పనిచేస్తోంది. వీరి పరిచయం కాస్త ప్రేమగా మారి.. ఇటీవల బంధువులు సమక్షంలో ఒక్కటయ్యారు.  

News February 1, 2025

NLG: ఎల్ఆర్ఎస్‌కు నో రెస్పాన్స్..!

image

జిల్లాలో అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ ప్రక్రియ అనుకున్నంత వేగంగా జరగడం లేదు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ కోసం 72,642 మంది రూ.1000 చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 732 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. వివిధ కారణాలతో 93 దరఖాస్తులను మూసేశారు. 37,814 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. 14,702 మంది స్థలాలకు అనుమతి లభించగా.. ఇప్పటివరకు 662 మంది మాత్రమే ఫీజు చెల్లించారు.

News February 1, 2025

నల్గొండ: ఈసారైనా బడ్జెట్లో మోక్షం కలిగేనా…!

image

కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. దశాబ్దాల కాలం నుంచి నూతన రైల్వే లైన్ల కోసం నల్గొండ జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు. శంషాబాద్ -SRPT – VJD హై స్పీడ్ రైల్వే లైన్, డోర్నకల్-SRPT-NLG-గద్వాల్ రైల్వే లైన్ కోసం గత ఏడాది సర్వే చేశారు. డోర్నకల్-MLG రైల్వే లైన్, హైదరాబాద్-యాదాద్రి ఎంఎంటీఎస్ రైలుపై బడ్జెట్లో ప్రకటన ఉంటుందో లేదో మరి చూడాలి.?

News February 1, 2025

NLG: జిల్లా ప్రజలకు కలెక్టర్ సూచన

image

WGL- KMM- NLG ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో ఈనెల 3న నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేయడంతో పాటు,  ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరగదని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదులు ఇచ్చేందుకు రావద్దని సూచించారు.

News January 31, 2025

నల్గొండ: ఇండియా క్రికెట్ టీంకు సెలెక్ట్.. సన్మానం 

image

త్రిపురారం మండలంలోని మాటూరుకి చెందిన ధనావత్ వస్త్రాంనాయక్ భారత దివ్యాంగుల క్రికెట్ జట్టుకు ఎంపికయ్యారు. దీంతో అతనికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మాటూరు మాజీ సర్పంచ్ వాంకుడోత్ లలిత పాండు నాయక్ అతణ్ని ఘనంగా సన్మానించారు. స్నేహితులు, బంధువులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

News January 31, 2025

NLG: ఫిబ్రవరి 8న ప్రవేశ పరీక్ష

image

జవహర్ నవోదయలో 9, 11 తరగతుల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఫిబ్రవరి 8న నిర్వహించే ప్రవేశ పరీక్షకు హాజరుకావాలని జవహర్ నవోదయ పాఠశాల ప్రిన్సిపల్ నాగభూషణం ఒక ప్రకటనలో తెలిపారు. www.navodaya.gov.in వెబ్ సైట్ ద్వారా అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. 

News January 31, 2025

బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న చెర్వుగట్టు

image

చెర్వుగట్టు శ్రీ పార్వతి జిల్లా రామలింగేశ్వర స్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. ఫిబ్రవరి 2 నుంచి చెర్వుగట్టులో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఆలయానికి రంగులు వేసే కార్యక్రమం పూర్తి కావచ్చిందని టెంపుల్ కార్యనిర్వాహణాధికారి నవీన్ కుమార్ అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. 

News January 31, 2025

మునుగోడు: ఎంపీటీసీ స్థానాల పునర్విభజన పూర్తి

image

మునుగోడు మండల పరిషత్ ప్రాదేశిక (ఎంపీటీసీ) స్థానాల పునర్విభజనను అధికారులు పూర్తి చేశారు. నూతనంగా ఏర్పాటైన గట్టుప్పల్ మండలంలో వెల్మకన్నె ఎంపీటీసీ స్థానం కలవడంతో దానిని తొలగించారు. ప్రస్తుతం ఉన్న 31 గ్రామ పంచాయతీలను 13 ఎంపీటీసీ స్థానాలుగా గుర్తించారు. ఒక్కో ఎంపీటీసీ స్థానంలో 2వేల ఓటర్లు ఉండేలా సిద్ధం చేశారు. ఏదైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని ఎంపీడీవో శాంతకుమారి ఒక ప్రకటనలో తెలిపారు.