Nizamabad

News June 27, 2024

ఆర్మూర్ అభివృద్ధి కోసం పోరాటానికి సిద్ధం: ఎమ్మెల్యే

image

ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సొంత నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించగా, ఆర్మూర్ నియోజకవర్గంలోనూ పైలెట్ ప్రాజెక్టు కింద ఇంటిగ్రేటెడ్ పాఠశాలను నిర్మించాలన్నారు. దీనిపై వారం రోజులలో ప్రభుత్వం నిర్ణయం తెలపాలన్నారు. లేకపోతే దీక్ష చేయడానికి అనుమతి ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు.

News June 26, 2024

NZB: జిల్లా వ్యాప్తంగా పాఠశాలల బంద్ విజయవంతం

image

నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా బుధవారం పాఠశాలల బంద్ విజయవంతమైనట్లు ఏబీవీపీ ఇందూర్ విభాగ్ కన్వీనర్ కైరి శశి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని, ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో వసూలు చేస్తున్న ఫీజులను నియంత్రించాలని, విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు పాఠశాలల బంద్ పిలుపు ఇవ్వడం జరిగిందన్నారు. బంద్‌లో దామ సునీల్, జగదీష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారన్నారు.

News June 26, 2024

NZB: జిల్లా వ్యాప్తంగా పాఠశాలల బంద్ విజయవంతం

image

నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా బుధవారం పాఠశాలల బంద్ విజయవంతమైనట్లు ఏబీవీపీ ఇందూర్ విభాగ్ కన్వీనర్ కైరి శశి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని, ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో వసూలు చేస్తున్న ఫీజులను నియంత్రించాలని, విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు పాఠశాలల బంద్ పిలుపు ఇవ్వడం జరిగిందన్నారు. బంద్‌లో దామ సునీల్, జగదీష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారన్నారు.

News June 26, 2024

మాదకద్రవ్యాలకు బానిసలు కావద్దు: కామారెడ్డి ఎస్పీ

image

యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే జీవితం నాశనం అవుతుందని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని సందీపని జూనియర్ కళాశాల వద్ద పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా ఎస్పీ జండా ఊపి ప్రారంభించి మాట్లాడుతూ.. విద్యార్థులు మాదకద్రవ్యాలకు బానిసలు కావద్దని సూచించారు. విద్యార్థులు ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

News June 26, 2024

NZB: చిరుతను తప్పించబోయి కారు బోల్తా.. మహిళ మృతి

image

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతిచెందిన ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలో చోటుచేసుకుంది. ఎల్లమ్మ కుంట శివారులో మంగళవారం రాత్రి రోడ్డుపై  వెళ్తున్న కారుకు చిరుత అడ్డురావడంతో దాన్ని తప్పించబోయి కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో గాంధారి మండలం యాచారం గ్రామానికి చెందిన మాలోత్ లలిత అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె భర్త మాలోత్ ప్రభాకర్ తీవ్రంగా గాయపడ్డాడు.

News June 26, 2024

నిజామాబాద్‌‌లో దారుణ హత్య.. వివరాలు ఇవే!

image

నిజామాబాద్‌లో వ్యక్తి <<13508067>>దారుణ హత్య<<>>కు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటన మంగళవారం వెలుగుచూసింది. ధర్మపురి హిల్స్ ప్రాంతంలోని రంజానీ బాబా దర్గా ప్రాంతంలో హాసన్(50)ను గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి, గొంతు కోసి దారుణంగా హత్యచేసినట్లు స్థానికులు తెలిపారు. సోమవారం రాత్రి హత్య జరిగిందని, దర్గా నిర్వహణలో వచ్చే డబ్బుల కారణంగా అతడిని హత్యచేసి ఉండవచ్చని సీఐ సురేశ్ అనుమానం వ్యక్తం చేశారు.

News June 26, 2024

నిజామాబాద్ GGHలో సూపర్ స్పెషాలిటీ సేవలు

image

నిజామాబాద్ GGHలో సూపర్ స్పెషాలిటీ సేవలు సేవలు అందిస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.ప్రతిమారాజ్ తెలిపారు. ఆసుపత్రిలో కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించడంతో కామారెడ్డి, నిర్మల్, మహారాష్ట్ర నుంచి ప్రజలు ఇక్కడికి వస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసుపత్రిలో గుండె సంబందిత శస్త్ర చికిత్సలు, రొమ్ము క్యాన్సర్, థైరాయిడ్ క్యాన్సర్, యూరాలజీతో పాటు న్యూరాలజీ సేవలు అందిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.

News June 26, 2024

NZB: పూర్వ ప్రాథమిక విద్య ప్రారంభానికి చర్యలు: రాష్ట్ర కార్యదర్శి కరుణ

image

అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్య ప్రారంభానికి చర్యలు చేపట్టాలని రాష్ట్ర మహిళా శిశుసంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ అన్నారు. జిల్లా కలెక్టర్లతో ఆమె మంగళవారం వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా వాల్ పెయింటింగ్స్ వేయించాలని సూచించారు. పిల్లల పోషక లోపాల నివారణ కట్టుదిట్టమైన చర్యలను చేపట్టి ప్రాథమిక విద్యకేంద్రాలుగా మార్చాలని పేర్కొన్నారు.

News June 25, 2024

NZB: పీజీ పరీక్షల రీవాల్యుయేషన్ షెడ్యూల్ విడుదల

image

తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని పీజీ ఒకటవ, మూడవ, ఐదవ సెమిస్టర్ రెగ్యూలర్ పరీక్షలకు హాజరైన విద్యార్థులకు విశ్వవిద్యాలయ పరీక్షల విభాగం రీకౌంటింగ్ తేదీని ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేసింది. విద్యార్థులు జులై 1 లోపు ఫీజు చెల్లించాలని సూచించింది. ఒక్కో పేపర్ రివాల్యుయేషన్‌కు రూ.500 చెల్లించాలని పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య అరుణ పేర్కొన్నారు.

News June 25, 2024

NZB: ‘బదిలీలు పారదర్శకంగానే జరిగాయి’

image

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసు అధికారుల బదిలీల్లో పైరవీలు జరుగుతున్నాయని కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చాయి. దీనిపై సీపీ కార్యాలయ యంత్రాంగం స్పందించింది. పత్రికల్లో కథనాలు వచ్చిన విధంగా ఎక్కడ అలా జరగలేదు. ఇప్పటి వరకు బదిలీలు పూర్తిస్థాయి పారదర్శకంగా జరిగాయి. మెరిట్ ఆధారంగా మాత్రమే బదిలీలు జరిగాయని ఏదో రకంగా ఊహించుకుని రాయడం పద్ధతి కాదని ఓ ప్రకటనలో పేర్కొంది.