India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటన నవీపేట మండలంలో చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి ఓ కుటుంబం కారులో బాసర వెళ్తుండగా నవీపేట మండలం అబ్బాపూర్ వద్ద అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.
నవీపేట్లోని ఆటోనగర్కు చెందిన బాలాజీ తన చెల్లెలితో కలిసి ప్యాసింజర్ రైల్లో ప్రయాణిస్తుండగా ఆదివారం తెల్లవారుజామున ఫకీరాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. లోకో పైలట్ గమనించి ట్రైన్ను ఆపి క్షతగాత్రుడిని బాసరకు తీసుకురాగా 108 అంబులెన్స్ సిబ్బంది పరిశీలించి మృతి చెందాడని నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయారెడ్డి తెలిపారు.
రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఆదివారం
బాన్సువాడ మార్కండేయ మందిరంలో పోలింగ్ కొనసాగుతోంది. ఇందులో బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ బాన్సువాడ పద్మశాలి సంఘం అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ జంగం గంగాధర్, బాన్సువాడ పద్మశాలి సంఘం అధ్యక్షులు జిల్లా కాశీనాథ్, గొంట్యాల బాలకృష్ణ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.
అంతర్జాతీయ ఫుట్ బాల్ క్రీడాకారిణి గుగులోత్ సౌమ్య తన స్థాయిని మరిచి సిబ్బందితో కలిసి పనిచేశారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న ఉమెన్ ఫుట్బాల్ టోర్నీకి వర్షం అడ్డంకిగా మారింది. దీంతో మైదానంలో నీరు నిలిచిపోయి మ్యాచ్కు అనుకూలించలేదు. సౌమ్య స్వయంగా తన చేతితో ఆ నీటిని బాకెట్లలో నింపి బయట పారవేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు.
కామారెడ్డి GR కాలనీలో భారీ చోరీ జరిగింది. తాళం వేసి బయటకు వెళ్లిన యజమాని పది నిమిషాల్లో తిరిగి వచ్చేసరికి దొంగలు చొరబడి నగలు, నగదు ఎత్తుకెళ్లారు. విశ్రాంత ఆర్టీసీ ఉద్యోగి రాములు కూరగాయల కోసం నిన్న 2.29కు ఇంటికి తాళం వేసి మార్కెట్ వెళ్లాడు. 2.39కి ఇంటికి వచ్చే సరికి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. ఏడున్నర తులాల బంగారం, ముప్పై తులాల వెండి, రూ. 50వేల నగదు ఎత్తుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామ శివారులో శనివారం చిరుత పులి సంచారం కలకలం రేపింది. అచ్చంపేట క్లబ్ వద్ద పులి కనిపించడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సమీపంలోనే నవోదయ, మోడల్ పాఠశాలలు ఉండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు వెంటనే పులి జాడ కనిపెట్టాలని గ్రామస్థులు కోరుకుంటున్నారు.
* జిల్లా వ్యాప్తంగా డాక్టర్ల నిరసన.. నిందితులను శిక్షించాలని డిమాండ్
* రోడ్డెక్కిన రైతులు.. షరతులు లేని రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్
* సైబర్ నేరస్థుడిని అరెస్ట్.. రిమాండ్కు తరలింపు
* వేల్పూర్: పోలీసులకు MLA వేముల అల్టిమేట్ వార్నింగ్
* NZB: నగరంలో మున్సిపల్ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు
* NZB: భవనంపై నుంచి కింద పడి మహిళ మృతి
* నిజామాబాద్: చిరుత కలకలం
* కామారెడ్డి: భయపెట్టిస్తున్న జ్వరాలు
నిజామాబాద్ రూరల్ మండలంలోని గుండారం-మల్కాపూర్ శివారులో మేకపై చిరుతపులి దాడి కలకలం సృష్టించింది. మల్కాపూర్ గ్రామ శివారులోనీ అటవీ ప్రాంతంలో మేకపై దాడి చేయడంతో మృతి చెందింది. ఘటనా స్థలంలో చిరుత పాదముద్రలు కనిపించాయని గ్రామస్థులు తెలిపారు. చిరుత దాడితో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఎఫ్ఆర్వో సంజీవ్ గౌడ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
రైతు రుణమాఫీ ఆగస్టు 15లోపు పూర్తి చేస్తామని చెప్పి రైతులను ప్రభుత్వం మోసం చేసిందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. రూ.2లక్షల రుణమాఫీ ఎవరికీ జరిగిందో చెప్పాలని వేముల ప్రభుత్వం పై విరుచుకపడ్డారు. ఎలాంటి కండిషన్స్ పెట్టకుండా రెండు లక్షల రుణమాఫీ చెయ్యాలని, వచ్చిన 8నెలలకే ప్రభుత్వం పై వ్యతిరేక పెరిగిందని అని వేముల ప్రశాంత్ రెడ్డి వేల్పూర్ X రోడ్ వద్ద జరిగినా ధర్నాలో విమర్శించారు.
బోధన్, కాచిగూడ ప్యాసింజర్ రైలును శుక్రవారం రాత్రి రైల్వే అధికారులు పున: ప్రారంభించారు. మూడు నెలల క్రితం ఈ రైలును రద్దు చేశారు. ఈ రైలు బోధన్ నుంచి కాచిగూడ, మహబూబ్గర్ మీదుగా గుంతకల్ వరకు నడుస్తుంది. బోధన్ రైల్వే స్టేషన్ నుంచి రోజు ఉదయం 5:30 గంటలకు బయలుదేరి కాచిగూడ స్టేషన్ మీదుగా 11 గంటలకు చేరుకుంటుంది. తిరిగి సాయంత్రం 4:30 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి రాత్రి 11 గంటలకు బోధన్కు చేరుకుంటుంది.
Sorry, no posts matched your criteria.