India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎడపల్లి మండలం అంబం గ్రామానికి చెందిన రఘుపతి శ్రీనివాస్ (35) గురువారం ఉదయం వారి కులస్తులతో కలిసి గ్రామ చెరువులో చేపల వేటకు వెళ్లారు. ప్రమాదవశాత్తు కాలికి వల చుట్టుకొని నీటిలో మునిగిపోయాడు. తోటి వారు రక్షించేందుకు చూసినా ఫలితందక్కలేదు. మృతుడి భార్య మమతా ఫిర్యాదు మేరకు ఎడపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
గుండెపోటుతో యువకుడు మృతి చెందిన ఘటన పిట్లం మండలం హస్నాపూర్లో జరిగింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ముజీజ్కు బుధవారం ఛాతీలో నొప్పి రావడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కాగా బుధవారం రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.
టీజీపీఎస్సీ గ్రూప్-2 పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నిజామాబాద్ బీసీ స్టడీ సెంటర్లో గ్రాండ్ టెస్ట్లు నిర్వహించనున్నట్లు జిల్లా బీసీ అభివృద్ధి అధికారి శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. మొదటి గ్రాండ్ టెస్ట్ జులై 08, 09, రెండో టెస్ట్ జులై 15, 16, మూడో టెస్ట్ జులై 22, 23, నాలుగో టెస్ట్ జులై 30, 31వ తేదీల్లో నిర్వహిస్తామని పేర్కొన్నారు.
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రానికి చెందిన యువకుడు మస్కట్లో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రాము(42) మూడు నెలల క్రితం మస్కట్కు వెళ్లాడు. అక్కడ బుధవారం రోడ్డు దాటుతుండగా వెనుకనుంచి వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు
ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సొంత నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించగా, ఆర్మూర్ నియోజకవర్గంలోనూ పైలెట్ ప్రాజెక్టు కింద ఇంటిగ్రేటెడ్ పాఠశాలను నిర్మించాలన్నారు. దీనిపై వారం రోజులలో ప్రభుత్వం నిర్ణయం తెలపాలన్నారు. లేకపోతే దీక్ష చేయడానికి అనుమతి ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు.
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా బుధవారం పాఠశాలల బంద్ విజయవంతమైనట్లు ఏబీవీపీ ఇందూర్ విభాగ్ కన్వీనర్ కైరి శశి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని, ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో వసూలు చేస్తున్న ఫీజులను నియంత్రించాలని, విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు పాఠశాలల బంద్ పిలుపు ఇవ్వడం జరిగిందన్నారు. బంద్లో దామ సునీల్, జగదీష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారన్నారు.
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా బుధవారం పాఠశాలల బంద్ విజయవంతమైనట్లు ఏబీవీపీ ఇందూర్ విభాగ్ కన్వీనర్ కైరి శశి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని, ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో వసూలు చేస్తున్న ఫీజులను నియంత్రించాలని, విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు పాఠశాలల బంద్ పిలుపు ఇవ్వడం జరిగిందన్నారు. బంద్లో దామ సునీల్, జగదీష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారన్నారు.
యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే జీవితం నాశనం అవుతుందని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని సందీపని జూనియర్ కళాశాల వద్ద పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా ఎస్పీ జండా ఊపి ప్రారంభించి మాట్లాడుతూ.. విద్యార్థులు మాదకద్రవ్యాలకు బానిసలు కావద్దని సూచించారు. విద్యార్థులు ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతిచెందిన ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలో చోటుచేసుకుంది. ఎల్లమ్మ కుంట శివారులో మంగళవారం రాత్రి రోడ్డుపై వెళ్తున్న కారుకు చిరుత అడ్డురావడంతో దాన్ని తప్పించబోయి కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో గాంధారి మండలం యాచారం గ్రామానికి చెందిన మాలోత్ లలిత అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె భర్త మాలోత్ ప్రభాకర్ తీవ్రంగా గాయపడ్డాడు.
నిజామాబాద్లో వ్యక్తి <<13508067>>దారుణ హత్య<<>>కు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటన మంగళవారం వెలుగుచూసింది. ధర్మపురి హిల్స్ ప్రాంతంలోని రంజానీ బాబా దర్గా ప్రాంతంలో హాసన్(50)ను గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి, గొంతు కోసి దారుణంగా హత్యచేసినట్లు స్థానికులు తెలిపారు. సోమవారం రాత్రి హత్య జరిగిందని, దర్గా నిర్వహణలో వచ్చే డబ్బుల కారణంగా అతడిని హత్యచేసి ఉండవచ్చని సీఐ సురేశ్ అనుమానం వ్యక్తం చేశారు.
Sorry, no posts matched your criteria.