India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం బ్రిడ్జి వరద కారణంగా ధ్వంసమైంది. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు పెద్ద ఎత్తున వరద రావడంతో మునిగిపోయింది. బ్రిడ్జిపై నుంచి సైతం వరద నీరు ప్రవహించడంతో రోడ్డు మార్గం ధ్వంసం అయింది. మహారాష్ట్ర నుంచి వరద నీరు తగ్గుముఖం పడటంతో త్రివేణి సంగమం వద్ద సైతం వరద ఉద్ధృతి తగ్గింది.
BRS అనుబంధ సింగరేణి కార్మిక సంఘం TBGKSకు MLC కవిత గుడ్ బై చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల TBGKS గౌరవ అధ్యక్ష పదవి నుంచి BRS కవితను తప్పించి కొప్పుల ఈశ్వర్కు బాధ్యతలు కట్టబెట్టింది. HMSతో దోస్తీ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆదివారం HMS గౌరవ అధ్యక్షురాలిగా కవితను సంఘం ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ ప్రతిపాదించగా.. అందరూ మద్దతు పలికారు. కాగా.. కవిత వీటిలో దేనిపై స్పందించలేదు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో, ప్రాజెక్టు నుంచి ఔట్ ఫ్లో తగ్గుముఖం పట్టింది. నిన్న ఇన్ ఫ్లో 6 లక్షలు, ఔట్ ఫ్లో 5.50 లక్షల క్యూసెక్కులు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఇన్ ఫ్లో 3.70 లక్షలు, ఔట్ ఫ్లో 3,26,853 క్యూసెక్కులకు తగ్గింది. కాగా ప్రాజెక్టులో తాజాగా 1088 (69.85TMC) అడుగులకు నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలతో నిజామాబాద్ జిల్లాలో వరద ప్రభావానికి లోనైన ప్రాంతాలలో NDRF, SDRF బృందాలు అందించిన సేవలు ప్రశంసనీయమని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అభినందించారు. జాతీయ, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళాలు కనబరచిన తెగువ, కృషి కారణంగా జిల్లాలో ఎక్కడ కూడా ప్రాణనష్టం వంటి సంఘటనలు చోటుచేసుకోకుండా నివారించగలిగామన్నారు.
నందిపేట్ ఉమ్మెడ బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన గణేశ్ నిమజ్జన స్థలాన్ని సీపీ సాయి చైతన్య శనివారం సందర్శించారు. అక్కడి భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలు, నిమజ్జన కోసం ఏర్పాటు చేసిన క్రేన్లు, లైటింగ్, వైద్య సదుపాయాలను పరిశీలించారు. నిమజ్జన కార్యక్రమాన్ని శాంతియుతంగా, ఎటువంటి లోటుపాట్లకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో జరిగే లో చూడాలని పోలీసులకు ఆదేశించారు.
ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు ఆనుకుని దిగువన గల పోచంపాడ్ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి శనివారం పరిశీలించారు. ఈ కేంద్రంలో చేప పిల్లల ఉత్పత్తి కోసం చేపడుతున్న చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులకు వివరాలు అడిగి తెలుసుకున్నారు. గంబూషియా చేప పిల్లలను పెంచుతున్న ఫిష్ పాండ్స్ ను సందర్శించారు. గంబూషియా చేప పిల్లలను పెద్ద సంఖ్యలో పెంచాలని నిర్వాహకులకు సూచించారు.
SRSP పూర్తి స్థాయి నీటి మట్టం 1091.00 అడుగులు, 80.5 టీఎంసీలకు గాను, ప్రస్తుతం 1084.5 అడుగులు, 58.357 టీఎంసీల వద్ద నీరు నిలువ ఉంది. భారీ వర్షాలు కురుస్తుండడంతో ఎగువ ప్రాంతాల నుంచి శనివారం మధ్యాహ్నం వరకు 4.90 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. దీంతో 39 ఫ్లడ్ గేట్లతో పాటు వరద కాలువ, కాకతీయ, సరస్వతీ, లక్ష్మి మెయిన్ కెనాల్స్ ద్వారా దిగువకు 6 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
కురిసిన వర్షాలకు నిజామాబాదు జిల్లాలోని 21 మండలాల్లో 41,098 ఎకరాల పంట నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసిందని అధికారులు తెలిపారు. ఇందులో 14,663 మంది రైతులకు సంబంధించి 28,131 ఎకరాల వరి, 5,418 మందికి చెందిన 12,054 ఎకరాల సొయా, 382 మందికి చెందిన 565 ఎకరాల మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చామని పేర్కొన్నారు.
నిజామాబాద్ జిల్లాలో మండల, గ్రామ పంచాయతీ, వార్డుల వారీగా విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఈనెల 30లోగా తెలియజేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. అభ్యంతరాలను పరిశీలించి, అవసరమైన మార్పులు చేసిన తర్వాత సెప్టెంబర్ 2వ తేదీన వార్డుల వారీగా, ఫొటోతో కూడిన తుది ఓటరు జాబితాను ప్రకటిస్తామని కలెక్టర్ తెలిపారు.
హైదరాబాద్లో రేపటి నుంచి తెలంగాణ యువ ప్రో కబడ్డీ లీగ్ ప్రారంభం కానుంది. ఈ లీగ్లో పాల్గొనే శాతవాహన జట్టు క్రీడాకారులు నిజామాబాద్ జిల్లాలో తమ శిక్షణ పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకున్నారు. జట్టుకు జిల్లాకు చెందిన మీసాల ప్రశాంత్ కోచ్గా వ్యవహరించనున్నారు. క్రీడాకారులు అద్భుతమైన ప్రతిభ కనబరిచి విజయం సాధించాలని జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్షుడు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు ఆకాంక్షించారు.
Sorry, no posts matched your criteria.