Nizamabad

News March 31, 2025

నిజామాబాద్ జిల్లాలో దంచికొడుతున్న ఎండలు..

image

నిజామాబాద్ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. ఆదివారం కోటగిరిలో 41℃, కమ్మరపల్లి, బోధన్, మెండోరా 40.9, పొతంగల్ 40.8, వేల్పూర్ 40.7, సాలూర, ఇందల్వాయి, డిచ్‌పల్లి 40.6, మక్లూర్, ఎడపల్లి, ఆర్మూర్ 40.5, ధర్పల్లి, నిజామాబాద్ 40.4, ముగ్పాల్ 40.4, నందిపేట్ 40.3, రెంజల్, మోస్రా 40.2, బోధన్లో 40.1℃ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.కాగా ఈ ప్రాంతాలన్నీ ఆరెంజ్ జోన్‌లో ఉన్నాయి.

News March 30, 2025

NZB: బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో పంచాంగ శ్రవణం

image

బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా కార్యాలయంలో ఆదివారం పంచాంగ శ్రవణం నిర్వహించారు. జోషి మధుసూదన్ శర్మ విశ్వవసునామ సంవత్సరం ఎలా ఉండబోతుందోనని వివరించారు. కార్యక్రమంలో మాజీ మేయర్ దండు నీతూ కిరణ్, మాజీ నుడా చైర్మన్ ప్రభాకర్, జాగృతి అధ్యక్షుడు అవంతి శ్రీనివాస్, శంకర్, రామ్ కిషన్ రావు తదితరులతో పాటు మహిళా నాయకురాల్లు పాల్గొన్నారు.

News March 30, 2025

వర్ని: అదనపు కలెక్టర్‌పై కేసు

image

గతంలో NZB జిల్లా అదనపు కలెక్టర్‌గా పని చేసి ప్రస్తుతం సంగారెడ్డిలో పని చేస్తున్న చంద్రశేఖర్‌తో పాటు సస్పెన్షన్‌లో ఉన్న DSO చంద్రప్రకాశ్, పౌరసరఫరాల శాఖ DT నిఖిల్‌పై కేసు నమోదు చేశామని వర్ని SI మహేశ్ తెలిపారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ కేటాయింపుల్లో పోర్జరీ సంతకాలు చేసిన పత్రాలతో వేధిస్తున్నట్లు ఓ మిల్లర్ ఇచ్చిన ఫిర్యాదుపై కోర్టు ఉత్తర్వుల మేరకు కేసు నమోదు చేశామన్నారు.

News March 30, 2025

NZB: యువకుడి ఆత్మహత్యాయత్నం

image

బెట్టింగ్ యాప్‌లో డబ్బులు పోగొట్టుకున్న యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన నిజామాబాద్ జిల్లా రూరల్ మండలం ఆకుల కొండూరు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఆకాశ్ ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌కు పాల్పడి సుమారు రూ.3 లక్షల వరకు నష్టపోయాడు. దీంతో గడ్డి మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు NZBలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువకుడు చికిత్స పొందుతున్నాడు.

News March 30, 2025

NZB: దరఖాస్తుకు రేపే చివరి తేదీ

image

మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమ గురుకులాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి 6, 7, 8, 9వ తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం.. ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ఆర్సీవో సత్యనాథ్ రెడ్డి తెలిపారు. ఆన్‌లైన్లో దరఖాస్తులు సమర్పించడానికి ఈ నెల 31 వరకు అవకాశం ఉందన్నారు. ఏప్రిల్ 20న పరీక్ష జరుగుతుందని, అందులో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు రిజర్వేషన్, నిబంధనల ప్రకారం సీట్లు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు.

News March 30, 2025

నిజామాబాద్‌: ఉగాది ఎఫెక్ట్.. కొత్త కుండలకు గిరాకీ

image

ఉగాది పండగ సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో సందడి నెలకొంది. ఉగాది పర్వదినం సందర్భంగా కావలసిన వస్తువులు, పూజా సామగ్రి, కొత్త బట్టలు కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపారు. ఉగాది పచ్చడి తయారు చేసేందుకు అవసరమయ్యే కొత్త మట్టి కుండలకు గిరాకీ బాగా పెరిగింది. తోరణాలు కట్టేందుకు మామిడి ఆకులు, ఉగాది పచ్చడికి మామిడికాయలు, వేపపూత, చింతపండు, మోదుగ, బంతి, చామంతి పూలు భారీ రేటు పలికాయి.

News March 30, 2025

NZB: జిల్లాలో పలు ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్

image

నిజామాబాద్ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. శనివారం ధర్పల్లి, మంచిప్పలో అత్యధికంగా 41.0℃ ఉష్ణోగ్రత నమోదైంది. ఏర్గట్ల, కమ్మర్‌పల్లి, వేంపల్లి, కోటగిరిలో 40.9, వేల్పూర్, చింతకుంటలో 40.8, పెర్కిట్ 40.7, తొండకూర్, ఇస్సాపల్లి 40.4, మెండోరా, లక్ష్మాపూర్‌ 40.3, బాల్కొండ 40.2, ఆలూరు, మాచర్ల, ముప్కాల్‌లో 40.0℃ ఉష్ణోగ్రత నమోదైంది. కాగా ఈ ప్రాంతాలన్నింటికీ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

News March 30, 2025

NZB: కరాటే విజేతలకు బహుమతులు అందజేసిన టీపీసీసీ చీఫ్

image

కరాటే పోటీల విజేతలకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ బహుమతులు అందజేశారు. హైదరాబాద్‌‌లోని గచ్చిబౌలి స్టేడియంలో 4 రోజుల పాటు జరిగిన కరాటే పోటీల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. స్పోర్ట్స్ యూనివర్సిటీ యువతకు, క్రీడాకారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సాట్ ఛైర్మన్ శివసేనారెడ్డి, ఎండీ సోనిబాల, కరాటే ఇండియా అధ్యక్షుడు భారత్ శర్మ పాల్గొన్నారు.

News March 29, 2025

NZB: జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

image

జిల్లా ప్రజలకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. విశ్వావసు నామ సంవత్సరంలో జిల్లా ప్రజలందరికి శుభాలు చేకూరాలని ఆకాంక్షించారు. తెలుగు నూతన సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో ఆనందోత్సాహాలు నింపాలని అభిలషించారు. ఉగాది పండగను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని అన్నారు. విశ్వావసు నామ సంవత్సరంలో జిల్లా మరింత ప్రగతి సాధించాలని ఆకాంక్షించారు.

News March 29, 2025

NZB: జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీపీ

image

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలకు పోలీస్ కమీషనర్ సాయి చైతన్య పోలీస్ శాఖ తరఫున విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. విశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా ప్రజలందరూ ఎలాంటి అభద్రతాభావంతో లేకుండా సుఖశాంతులతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే ప్రజలు శాంతి భద్రతల విషయంలో పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు.

error: Content is protected !!