India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

SRSP కాకతీయ కాల్వ పనుల బిల్లులు చెల్లించడంలో నిర్లక్ష్యం ప్రదర్శించిన నీటిపారుదల శాఖపై రంగారెడ్డి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంకటేశ్వర ఇంజినీర్స్ అండ్ కాంట్రాక్టర్స్ చేసిన రూ.16కోట్ల పనుల బిల్లుల పెండింగ్పై కేసు నమోదైంది. కోర్టు ఆదేశాలు పాటించకపోవడంతో నిజామాబాద్ జిల్లా పోచంపాడ్ కార్యాలయంలో రూ.50 లక్షల విలువైన ఫర్నిచర్, 24 ఏసీలు, 2 కార్లు జప్తు చేయాలని న్యాయమూర్తి శనివారం ఆదేశాలు జారీ చేశారు.

నిజామాబాద్ ఏఎస్పీగా శుభం ప్రకాశ్ నియమితులయ్యారు. వరంగల్ ఏసీపీగా ఉన్న శుభం ప్రకాశ్ను అడిషనల్ ఎస్పీగా నిజామాబాద్కు బదిలీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులను జారీ చేసింది. 2022 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ఆయన స్వస్థలం మహారాష్ట్రలోని వార్ధా జిల్లా. ఐఐటీ ఖరగ్పూర్లో కంప్యూటర్ సైన్స్లో ఇంజినీరింగ్ పూర్తి చేశారు.

ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 20 నుంచి 26 వరకు నిర్వహించే సంక్షేమ వారోత్సవాలను సంబంధిత అధికారులు విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, దిలీప్ కుమార్ సూచించారు. శనివారం వారు మాట్లాడుతూ.. సంక్షేమ శాఖల అధికారులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, మండలాల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు వారోత్సవాలను విజయవంతం చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు.

ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 20 నుంచి 26 వరకు నిర్వహించే సంక్షేమ వారోత్సవాలను సంబంధిత అధికారులు విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, దిలీప్ కుమార్ సూచించారు. శనివారం వారు మాట్లాడుతూ.. సంక్షేమ శాఖల అధికారులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, మండలాల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు వారోత్సవాలను విజయవంతం చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు.

ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 20 నుంచి 26 వరకు నిర్వహించే సంక్షేమ వారోత్సవాలను సంబంధిత అధికారులు విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, దిలీప్ కుమార్ సూచించారు. శనివారం వారు మాట్లాడుతూ.. సంక్షేమ శాఖల అధికారులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, మండలాల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు వారోత్సవాలను విజయవంతం చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు.

నిజామాబాద్ జిల్లాకు సంబంధించి జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీని రెండేళ్ల కాల పరిమితికి ఏర్పాటు చేస్తూ తెలంగాణ రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కలెక్టర్ ఛైర్మన్గా ఉన్న కమిటీలో సభ్యులుగా జి.సాయి ప్రసాద్, బాల కుమార్, నర్సింహులు, భూపతి, రామదయానంద్, మహ్మద్ గౌస్, శ్రీనివాస్, శ్రీకాంత్, మాజిద్, జాన్సన్లను నియమించారు.

ఈనెల 22న నిర్వహించనున్న యూనివర్సిటీ వార్షికోత్సవం పనులను వేగవంతం చేయాలని టీయూ వీసీ ప్రొ.టి. యాదగిరి రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం వార్షికోత్సవ నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కమిటీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని సౌకర్యాలు ఉండేలా చూడాలని సూచించారు. ఇంజినీరింగ్, ఆర్ట్స్ కళాశాలల ప్రిన్సిపల్ ఆరతి, రాంబాబు పాల్గొన్నారు.

నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్కు చెందిన Life sciences sector skill development council, తెలంగాణ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం (MoU) చేసుకున్నారు. ఈ ఒప్పందం ద్వారా తెలంగాణ యూనివర్సిటీ నుంచి ఉత్తీర్ణులైన M.Sc, B.Sc, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ విద్యార్థులకు వివిధ సెక్టార్ కంపెనీల కోసం ఈ సంస్థ ముఖాముఖి నిర్వహించనుంది. రిజిస్ట్రార్ ప్రొ.యాదగిరి పాల్గొన్నారు.

నిజామాబాద్ జిల్లాలో ఏప్రిల్ 18 ఉదయం 7 గంటలకు పోలీస్ కమిషనరేట్ & నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఎన్ఎస్సీ, ఎన్పీఎల్-2026 స్పోర్ట్స్ మీట్ ర్యాలీ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. పాత కలెక్టరేట్ గ్రౌండ్ నుంచి పాలిటెక్నిక్ గ్రౌండ్ వరకు ఈ ర్యాలీ చేపట్టనున్నారు.

ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించారు. కాంగ్రెస్ను గెలిపిస్తే ఆరు నెలల్లోపు పీఆర్సీని అమలు చేస్తామని హామీ ఇచ్చి 28 నెలల గడుస్తున్నా మాట ఎత్తడం లేదన్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ శుక్రవారం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు చేపట్టే నిరసన ప్రదర్శనకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు కవిత ట్వీట్ చేశారు.
Sorry, no posts matched your criteria.