Nizamabad

News August 9, 2024

NZB: పోలీస్ కస్టడీకి యూనియన్ బ్యాంక్ మేనేజర్

image

ఖాతాదారులతో పాటు బ్యాంకును మోసగించిన కేసులో అరెస్టయి జైలులో ఉన్న నిజామాబాద్ యూనియన్ పెద్ద బజార్ బ్యాంకు మేనేజర్ అజయ్‌ను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. 3 రోజుల పోలీసు కస్టడీకి జిల్లా కోర్టు అనుమతించగా శుక్రవారం ఉదయం పోలీసులు జైలు నుంచి తమ కస్టడీలోకి తీసుకున్నారు. మొత్తం 42 మంది బాధితుల నుంచి సుమారు రూ.4 కోట్ల మేర మేనేజర్ తీసుకున్నట్లు ఆరోపణల మేరకు విచారించేందుకు కస్టడీకి తీసుకున్నారు.

News August 9, 2024

NZB: ఏసీబీ దాడుల్లో భారీగా బంగారం, నగదు గుర్తింపు?

image

NZB అశోక్ టవర్స్‌లో నివాసం ఉంటున్న నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రెవెన్యూ విభాగం సూపరింటెండెంట్, ఇన్‌ఛార్జ్ ఆర్వో నరేందర్ ఇంట్లో శుక్రవారం జరుగుతున్న ఏసీబీ సోదాల్లో భారీగా బంగారం, నగదు గుర్తించినట్లు తెలుస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు ఫిర్యాదులు అందడంతో ఏసీబీ అధికారులు నరేందర్ ఉంటున్న ఇంటితో పాటు కార్పొరేషన్ కార్యాలయం, కోటగల్లీ, నిర్మల్‌లోని బంధువుల ఇంట్లో సోదాలు జరుపుతున్నారు.

News August 9, 2024

NZB: మున్సిపల్ అధికారి ఇంట్లో ఏసీబీ సోదాలు

image

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారి ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నారు. ఇది మున్సిపల్ వర్గాల్లో కలకలం రేపింది. రెవెన్యూ విభాగం సూపరింటెండెంట్, ఇంఛార్జి ఆర్వో నరేందర్ ఇంట్లో శుక్రవారం తెల్లవారుజామున ఏసీబీ అధికారుల బృందం మెరుపు దాడి చేసింది. ఆదాయానికి మించిన అస్తులున్నట్లు ఫిర్యాదులు అందడంతో ఏసీబీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

News August 9, 2024

NZB: డైరెక్ట్ బిజినెస్ పేరిట వాట్సాప్ గ్రూపులో కొత్త తరహా మోసం

image

నిజామాబాద్ జిల్లాలో డైరెక్ట్ బిజినెస్ పేరిట వాట్సాప్ గ్రూపులో కొత్త తరహా మోసం ప్రారంభించారని పలువురు బాధితులు ఆరోపిస్తున్నారు. ‘ఆల్ టైప్ ఆఫ్ క్లాత్స్ క్యాష్ ఆన్ డెలివరీ’ పేరిట వాట్సాప్ గ్రూపు నడుపుతూ డైరెక్ట్‌గా కంపెనీల నుంచి వస్తువులు తక్కువ ధరకే మీ ఇంటికే వస్తాయని నమ్మిస్తున్నారు. బ్రాండ్ల పేరిట ఆర్డర్లు తీసుకుని నాసిరకం బట్టలు పంపుతున్నారని ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వస్తోందని చెబుతున్నారు.

News August 9, 2024

నిజామాబాద్: లిఫ్ట్‌లో ఇరుక్కున్న నలుగురు చిన్నారులు

image

నిజామాబాద్ ముబారక్‌నగర్‌లోని సాయి అటాకరి అపార్ట్‌మెంట్‌లో రాత్రి నలుగురు చిన్నారులు లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. మూడో అంతస్తు నుంచి కిందకు దిగేందుకు చిన్నారులు లిఫ్ట్ ఎక్కగా.. లిఫ్టుకు ఉన్న రెండు తీగల్లో ఒకటి తెగిపోయి కిందకు జారింది. మరో తీగ లిఫ్టు పై ఉన్న రింగులో చిన్నారులు చిక్కుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఆపార్ట్‌మెంట్ వాసులు వెంటనే లిఫ్ట్ మరమ్మతులు చేయించి పిల్లలను సురక్షితంగా బయటకు తీశారు. 

News August 9, 2024

NZB: అంత్యక్రియలకు వెళితే.. ఇంట్లో చోరీ

image

బంధువులు చనిపోవడంతో గురువారం అంత్యక్రియలకు వెళ్లగా దొంగలు ఇంట్లో చొరబడి 3తులాల బంగారం అపహరించుకుపోయిన ఘటన నిజామాబాద్ నగరంలోని ఆర్యనగర్‌లో జరిగింది. సంజీవ్ రెడ్డి కాలనీకి చెందిన రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ నారాయణ బంధువులు చనిపోవడంతో అంత్యక్రియలకు వెళ్లి సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చే సరికి చోరీ జరిగింది. ఈ మేరకు 4వ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

News August 8, 2024

ఉమ్మడి NZB జిల్లాల్లో నేటి ముఖ్యాంశాలు

image

*కామారెడ్డి: పోక్సో కేసులో నిందితుడికి ఏడేళ్ల జైలు శిక్ష
*మద్నూర్: బైక్ కొనివ్వలేదని తండ్రిని చంపిన కొడుకు
*NZB: బెల్ట్ షాపులను ఎత్తివేయాలని నిరాహార దీక్ష.. కృపా జ్యోతి అరెస్ట్
*జిల్లాల్లో పెరుగుతున్న జ్వరాల కేసులు
*NZB: పంద్రాగస్టు వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్
*నాగిరెడ్డిపేట్: వన సేవిక రామయ్యను సన్మానించిన కలెక్టర్
*నిజామాబాద్: TU పరీక్షల షెడ్యూల్ విడుదల

News August 8, 2024

KMR: వ్యక్తి మృతికి కారకుడైన నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష

image

ఓ వ్యక్తి మృతికి కారకుడైన నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ.15 వేల జరిమానా విధిస్తూ KMR కోర్టు గురువారం తీర్పు నిచ్చింది. మేంగారం వాసి తలారి సాయిలు తన పొలం చుట్టూ అమర్చిన కరెంట్‌తో చౌల దత్తు మృతి చెందాడు. అనుమానం రాకుండా ఆ మృతదేహాన్ని చెరువులో పడేశాడు. మృతుడి భార్య పిర్యాదు మేరకు కేసు నమోదైంది. నేరం రుజువు కావడంతో కామారెడ్డి జిల్లా జడ్జి లాల్ సింగ్ ఈ మేరకు తీర్పును వెలువరించారు.

News August 8, 2024

TU పరీక్షల షెడ్యూల్ విడుదల

image

TU పరిధిలోని పీజీ 2వ సెమిస్టర్, ఇంటిగ్రేటెడ్ కోర్సుల 8వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్, BLISC 2వ సెమిస్టర్ పరీక్షల టైమ్ టేబుల్‌ను పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య అరుణ విడుదల చేశారు. ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు గమనించాలని కోరారు.

News August 8, 2024

కామారెడ్డి: పోక్సో కేసులో నిందితుడికి ఏడేళ్ల జైలు శిక్ష

image

పోక్సో కేసులో నిందితుడికి ఏడేళ్ల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ KMR కోర్టు గురువారం తీర్చునిచ్చింది. లింగంపేట మండలానికి చెందిన గుడ్డేల రాములు అదే మండలానికి చెందిన బాలిక(8)పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు 2018 జులై 8న పోలీసులు కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో జిల్లా జడ్జి లాల్ సింగ్ నిందితుడికి జైలు శిక్ష విధించారు.