Nizamabad

News August 2, 2024

NZB: మత్తు పదార్థాల నిరోధానికి కలిసికట్టుగా కృషిచేయాలి: కలెక్టర్

image

మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల నిరోధానికి కలిసికట్టుగా కృషి చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. కలెక్టరేట్లో శుక్రవారం కలెక్టర్ అధ్యక్షతన ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల రవాణా, వినియోగం పెను సవాలుగా మారిందని అన్నారు.

News August 2, 2024

NZB: చిన్నారిపై లైంగిక దాడి.. పోక్సో కేసు

image

నిజామాబాద్ నగరంలో ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడగా నిందితుడిపై పోక్సో కేసు నమోదుచేసినట్లు టూ టౌన్ ఎస్సై రాము తెలిపారు. పూసలగల్లీ ప్రాంతంతో ఓ బాలిక(5) ఇంటి ఎదుట ఆడుకుంటుండగా గణేశ్ అనే వ్యక్తి అక్కడికి వచ్చాడు. చాక్లెట్ ఇప్పిస్తానంటూ బాలికను తన ఇంటికి తీసుకువెళ్లి లైంగికదాడికి పాల్పడినట్లు బాధిత కుటుంబసభ్యులు గురువారం ఫిర్యాదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశామని SI తెలిపారు.

News August 2, 2024

కామారెడ్డి: మహిళను హత్య చేసిన ఘటనలో వ్యక్తి అరెస్ట్

image

ఇటీవల ఓ వ్యక్తి తనతో సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేసినట్లు నిందితుడు మాధవ్ అంగీకరించడంతో అరెస్టు చేసినట్లు పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఉమా భర్త అశోక్‌తో మూడేళ్ల క్రితమే విడిపోయింది. దీంతో పంచముఖి కాలనీలో అద్దె ఇంట్లో ఉమా, మాధవ్ సహజీవనం చేస్తున్నారు. తనతో గొడవ పడిందని, ఆమె మెడకు చున్నీ బిగించి, గొంతు నులిమి హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నారని చెప్పారు.

News August 2, 2024

కామారెడ్డి: మద్యం తాగి చెరువులో దూకేశాడు

image

యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కామారెడ్డి(D) బీర్కూర్‌‌‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రవీణ్‌కుమార్(25) ఎలక్ట్రిషీయన్‌గా పనిచేస్తున్నాడు. మద్యం తాగేందుకు డబ్బులివ్వాలని తల్లిని అడగగా ఇవ్వలేదు. దీంతో అమ్మమ్మను, తల్లిని కొట్టి మద్య తాగి, బాజన్ చెరువులో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా సమాచారం అందుకున్న పోలీసులు కాపాడి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

News August 2, 2024

BREAKING.. కామారెడ్డి: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామ శివారులో శుక్రవారం ఉదయం 44 నంబర్ జాతీయ రహదారిపై రోడ్డుప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. స్థానికులు సదాశివనగర్ పోలీసులకు సమాచారం అందించారు.

News August 2, 2024

నిజామాబాద్: వాగులో కొట్టుకొచ్చిన మృతదేహం

image

నిజామాబాద్ రూరల్ మండలంలోని కొండూర్ గ్రామ శివారులోని వాగులో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం గురువారం కొట్టుకొచ్చినట్లు స్థానికులు గమనించారు. గ్రామస్థులు రూరల్ పోలీస్‌లకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని వయస్సు సుమారు (50) ఏళ్లు ఉంటుందని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ మహేశ్ తెలిపారు.

News August 2, 2024

SRSP: 40,786 క్యూసెక్కులకు పెరిగిన ఇన్ ఫ్లో

image

ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలతో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నీటి ఇన్ ఫ్లో పెరుగుతోంది. గురువారం ఉదయం 6 గంటల వరకు ప్రాజెక్టుకు ఇన్ ఫ్లోగా యావరేజ్‌ గా 5,166 క్యూసెక్కుల అది పెరుగుతూ రాత్రి 9 గంటలకు 40,786 క్యూసెక్కులుగా ఇన్ ఫ్లో పెరిగింది. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 80 టీఎంసీలకు గాను ప్రస్తుతం 37.891 టీఎంసీల నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.

News August 2, 2024

KMR జిల్లాలోని పలు ప్రాజెక్టుల పరిస్థితి ఎలా ఉందంటే!

image

నిజాంసాగర్ ప్రాజెక్ట్ ప్రస్తుత నీటి మట్టం 1389.55 అడుగులుగా నీటి నిల్వ సామర్థ్యం 3.866 టీఎంసీలుగా ఉంది. కల్యాణి ప్రాజెక్ట్ నీటి మట్టం 409.50 మీటర్లు కాగా ప్రస్తుతం 406.90 మీటర్లుగా ఉంది. సింగీతం రిజర్వాయర్ నీటి మట్టం 416.550 మీటర్లకు గాను ప్రస్తుతం అంతే స్థాయిలో 416.550 మీటర్లుగా ఉంది. ఇక కౌలాస్ నాలా ప్రాజెక్ట్ ప్రస్తుత నీటిమట్టం 454.70 మీటర్లుగా నీటి నిల్వ సామర్థ్యం 0.580 టీఎంసీలుగా ఉంది.

News August 1, 2024

నిజామాబాద్ జిల్లాలో నేటి HIGHLIGHTS

image

* సత్తాచాటిన కామారెడ్డి జిల్లా వాసులు.. CM రేవంత్ సన్మానం
* కామారెడ్డి: పని ఇప్పిస్తానని.. కత్తితో దాడి
* నిజాంసాగర్ లో పర్యటించిన జిల్లా కలెక్టర్ ఆశిష్.. ఒకరి సస్పెన్షన్.. మరొకరికి నోటీసు జారి
* ఓర్వలేక KCR అసెంబ్లీకి రావట్లేదు: జుక్కల్ MLA తోట
* NZB: గోదావరిలో దూకి వివాహిత ఆత్మహత్య
* నిజామాబాద్: పలు ఎస్ఐల బదిలీ
* జిల్లాలో పలు చోట్ల BRS శ్రేణుల ఆందోళన.. CM రేవంత్ దిష్టిబొమ్మలు దగ్ధం

News August 1, 2024

KTR అరెస్టుపై MP అరవింద్ సెటైర్లు

image

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్టుపై సెటైర్లు వేశారు. అసెంబ్లీ నుంచి కేటీఆర్ ను మార్షల్స్ బయటకు ఎత్తుకెళ్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. అయితే ఆ వీడియోని ఎంపీ అరవింద్ ఫేస్ బుక్, ఎక్స్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ‘అప్పుడు.. కన్ను మిన్ను కనపడలే.. ఇప్పుడు.. ఖాకీలు కూడా దేకట్లే’ అని కేటీఆర్ పై అర్వింద్ సెటైర్లు వేశారు.