India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నిజామాబాద్ నగర శివారులోని సారంగాపూర్లో ఇటీవల ప్రారంభించిన స్విమ్మింగ్ పూల్లో ఈత నేర్చుకునేందుకు వెళ్లిన ఓ యువకుడు నీటిలో మునిగి మృతి చెందాడు. నిజాం కాలనీకి చెందిన సయ్యద్ ఆశ్రఫ్(22), అతని అన్నతో కలిసి స్విమ్మింగ్ ఫూల్లో ఈత కొట్టేందుకు వెళ్ళాడు. స్విమ్మింగ్ కోచ్ లేకపోయినా ఆశ్రఫ్ ట్యూబ్ ధరించకపోయినా అతడిని ఈత కొట్టేందుకు అనుమతించారు. దీంతో అతడు లోతుకు వెళ్లి నీటిలో మునిగి మృతి చెందాడు.
నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన సంహిత హర్యానాలో జరిగిన నెట్బాల్ పోటీల్లో విజయం సాధించింది. ఉత్తమ ప్రతిభ కనబరిచిన కుమారి సంహితను సిల్వర్ మోడల్తో సత్కరించారు. వినాయక్ నగర్లోని ఓ పాఠశాలలో 9వ తరగతి చదువుతుంది. చిన్న వయసులోనే తెలంగాణ నుంచి నెట్బాల్ క్రీడా విభాగంలో మెడల్ సాధించిన జట్టు క్రీడాకారులందరిని జిల్లా క్రీడాధికారి ముత్తన్న బుధవారం అభినందించారు.
శివరాత్రికి దేవాలయాలకు వెళ్లి వచ్చే సరికి అగంతకులు తాళం వేసిన మూడిళ్లలో తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడ్డారు. గంగస్థాన్ నుంచి కేశాపూర్ వెళ్ళేదారిలో రియల్టర్ బలరాం రెడ్డి ఇంట్లో 25 తులాల బంగారం, ఆర్టీసీ కాలనీలోని రవీందర్ ఇంట్లో 2 తులాల బంగారం, ఏక శిలా నగర్లోని పెద్దమ్మ గుడి సమీపంలోని కిరాణ వ్యాపారి రవీందర్ ఇంట్లో రూ.60 వేల నగదును అపహరించారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని మహిళ మృతి చెందినట్లు వన్ టౌన్ SHO రఘుపతి తెలిపారు. ఈ నెల 23న ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఓ మహిళ అపస్మారక స్థితిలో పడి ఉండటంతో 108 ద్వారా చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.. బుధవారం మహిళ మృతి చెందింది. మృతురాలిని ఎవరైనా గుర్తుపడితే వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని రఘుపతి సూచించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ నిమిత్తం ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం సందర్శించారు. నిజామాబాద్ డివిజన్ కు సంబంధించి నిజామాబాద్ ఆర్డీవో కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఎన్నికల సామాగ్రి పంపిణీ తీరుతెన్నులను కలెక్టర్ పరిశీలించారు.
కన్న తల్లిని కొడుకు చంపిన ఘటన పిట్లంలో మంగళవారం జరిగింది. SI రాజు వివరాలిలా.. సాబేర బేగం(60)కు నలుగురు కొడుకులు, కూతురు ఉన్నారు. రెండో కొడుకైన శాదుల్ నాలుగేళ్ల క్రితం తన తమ్ముడైన ముజిబ్ను కత్తితో పొడిచి చంపాడు. ఈ కేసులో రాజీపడాలని తల్లిని కోరగా ఆమె నిరాకరించింది. దీంతో రోకలి బండతో తలపై దాడి చేయగా.. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రంజాన్ మాసం ప్రారంభం నేపథ్యంలో సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. కలెక్టర్ తన ఛాంబర్లో మంగళవారం జిల్లా అధికారులతో సమావేశమై, రంజాన్ ఉపవాస దీక్షల సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లు, సౌకర్యాలపై సమీక్ష జరిపారు. ఎలాంటి ఇబ్బందులు, లోటుపాట్లకు తావులేకుండా జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాలలో సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నిజామాబాద్ జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ కోసం 255 మంది దరఖాస్తు చేసుకోగా 195 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఎన్నికల విధులు కేటాయించబడిన ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా కలెక్టరేట్లో ఓటరు సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేసి పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ జరిపామన్నారు.
నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో నిర్వహించిన ప్రవేశ పరీక్షల్లో 96.78 శాతం హాజరు నమోదైందని గురుకులాల ప్రవేశ పరీక్షల రీజనల్ కో ఆర్డినేటర్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 20 సెంటర్లు ఏర్పాటు చేశారన్నారు. పరీక్షల కోసం 7,906 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, 7,651 మంది పరీక్షలు రాసినట్లు వెల్లడించారు. కాగా 255 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.
వేరే వ్యక్తి ఇంట్లోకి ఎందుకు వచ్చాడని అడిగినందుకు భార్య తిట్టిందని భర్త ఆదిభట్ల PSలో ఫిర్యాదు చేశాడు. పోలీసుల ప్రకారం.. ఇంద్రసేనారెడ్డి భార్యతో రాగన్నగూడలో ఉంటున్నాడు. భార్య NZB జిల్లా భోదన్లోని ఓ గ్రామంలో జీపీ కార్యదర్శిగా పనిచేస్తుంది. 15 రోజులకు ఒకసారి వస్తుంటుంది. ఈ క్రమంలో 23న భార్యకు ఫోన్ చేస్తే ఎత్తలేదు. కాసేపటికి ఇంట్లో నుంచి ఓ వ్యక్తి పరార్ అవ్వడంతో ప్రశ్నించగా, ఆమె తిట్టిందని తెలిపారు.
Sorry, no posts matched your criteria.