India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బోధన్ మండలంలోని అమ్ధాపూర్ గ్రామానికి చెందిన హరికృష్ణ (38) దుబాయ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. హరికృష్ణ గత నెల అక్టోబర్ 24వ తేదీన బతుకు దెరువు కోసం దుబాయ్ వెళ్లాడు. అక్టోబర్ 31న రోడ్డు దాటుతుండగా కారు ప్రమాదంలో మరణించాడు. మృతదేహం గురువారం స్వగ్రామానికి రానున్నట్లు స్థానికులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లాలో రేపు పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. మంత్రి జూపల్లి పర్యటన ఎడపల్లి మండలంలో సైతం ఉండనున్నట్లు బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహా తెలిపారు. మంత్రి పర్యటన నేపథ్యంలో సొసైటీ ఛైర్మన్, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, సొసైటీ కార్యదర్శులు అందుబాటులో ఉండాలన్నారు.
ఉత్తర తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన భీంగల్ మండలంలోని లింబాద్రి గుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో 15 నుంచి 17 వరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ RM జానిరెడ్డి తెలిపారు. ఆర్మూర్, నిజామాబాద్, ధర్పల్లి, సిరికొండ నుంచి లింబాద్రి గుట్టకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని, భక్తులు వీటిని ఉపయోగించుకోవాలని ఆయన కోరారు.
తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది జులై/ఆగస్టులో జరిగిన డిగ్రీ కళాశాలల పరీక్షల ఫలితాల రీవాల్యుయేషన్ కోసం విద్యార్థులు తమ కళాశాలల్లో దరఖాస్తు చేసుకోవాలని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొ.అరుణ తెలిపారు. డిగ్రీ 1, 2, 3, 4, 5, 6 సెమిస్టర్స్ బ్యాక్ లాగ్స్ కోసం వన్ టైం ఛాన్స్ కింద అవకాశం ఇచ్చామన్నారు. వివరాలకు తెలంగాణ యూనివర్సిటీ వెబ్ సైట్ను సందర్శించాలని కోరారు.
మంగళవారం రాత్రి పెద్దపల్లి-రాఘవాపూర్ దగ్గర ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేసింది. నిజామాబాద్-కాచిగూడ, గుంతకల్లు, బోధన్, కరీంనగర్-బోధన్ మధ్య నడిచే రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని వృద్ధుడు మృతి చెందినట్లు జక్రాన్ పల్లి ఎస్ఐ తిరుపతి తెలిపారు. గ్రామానికి చెందిన నడిపి గంగాధర్ (67) సోమవారం ఇంట్లో మంచంపై పడుకుని బీడీ తాగుతుండగా బీడీకి ఉన్న నిప్పు రవ్వలు మంచంపై పడ్డాయి. దీంతో మంచం కాలిపోయి గంగారం తీవ్ర గాయాల పాలయ్యాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా మంగళవారం మృతి చెందినట్లు ఎస్ఐ వెల్లడించారు.
దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలోనే అన్నదాతల ఆత్మహత్యలు జరిగాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. కేంద్ర, మహారాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమాన్ని మరిచిపోయాయని ఫైర్ అయ్యారు. మహారాష్ట్రలో బీజేపీ అసత్య ప్రచారం చేస్తుందన్నారు. తెలంగాణలో ఇచ్చిన మాట ప్రకారం గ్యారంటీలను కాంగ్రెస్ అమలు చేస్తోందని చెప్పుకొచ్చారు.
ఆర్మూర్ మార్గంలో అడవి మామిడిపల్లి వద్ద ఆర్యూబీ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 17, 18 తేదీల్లో గ్రూప్ -3 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నిర్ణీత సమయం కంటే ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ఆర్యుూబీ పనులు జరుగుతున్నందున నవంబర్ 10 నుంచి డిసెంబర్ 10 వరకు నిజామాబాద్ – ఆర్మూర్ మార్గంలో రాకపోకలు మళ్లించామన్నారు.
బిక్కనూర్ మండలం కాచాపూర్ గ్రామ ప్రాథమిక పాఠశాలలో పనిచేసే ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేసినట్లు మండల విద్యాధికారి రాజా గంగారెడ్డి తెలిపారు. పాఠశాలలో మైనర్ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు శ్రీనివాస్, అతనికి సహకరించిన ప్రధానోపాధ్యాయుడు కాంత్ రెడ్డిని జిల్లా విద్యాశాఖ అధికారి రాజు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం మినీ సమావేశ మందిరంలో పౌరసరఫరాలు, మార్కెటింగ్, తదితర అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, కొనుగోళ్లు చేసిన ధాన్యాన్ని సంబంధిత రైస్ మిల్లులకు తరలించాలని, ట్యాబ్ ఎంట్రీలు త్వరగా చేయాలని అధికారులకు సూచించారు.
Sorry, no posts matched your criteria.