India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TU పరిధిలో దోస్త్ ఆన్లైన్ 2024-25డిగ్రీ ప్రవేశానికి రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రత్యేక కేటగిరి విద్యార్థులకు ఈ నెల 2న ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని దోస్త్ కో ఆర్డినేటర్ ఆచార్య కె.సంపత్ కుమార్ పేర్కొన్నారు. ఉదయం 10:30 నుంచి సా.5గం. వరకు పరిశీలన ఉంటుందన్నారు. విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్తో పాటు రెండు సెట్ల జీరాక్స్ కాపీలతో అడ్మిన్ కార్యాలయంలో హాజరు కావాలన్నారు. వివరాలకు 984804793,8374406322.
నిజాంసాగర్ ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కేంద్రాన్ని గురువారం కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆకస్మికంగా సందర్శించారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించి వివిధ కారణాలతో లబ్ధి కాని ప్రజల నుంచి దరఖాస్తుల, పరిశీలన, డిస్పోజల్ను పరిశీలించారు. ప్రజాపాలన కేంద్రాల ద్వారా స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి వేగంగా ప్రజలకు లబ్ధి చేకూర్చాలని ఎంపీడీవో గంగాధర్ను కలెక్టర్ ఆదేశించారు.
కోల్కతాలో ఇటీవల జరిగిన 2వ ఆసియా చెస్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో కామారెడ్డి జిల్లా పిట్లంకు చెందిన క్రీడాకారులు సత్తాచాటారు. సీనియర్ విభాగంలో తక్కడ్పల్లి ప్రతిభ 5 గోల్డ్మెడల్స్, 1 సిల్వర్ మెడల్ సాధించారు. బాన్సువాడకు చెందిన రుషాంక్ సబ్ జూనియర్ విభాగంలో 2 గోల్డ్ మెడల్స్, సీనియర్ విభాగంలో పిట్లంకు చెందిన విజయ్ రాఘవేంద్ర రావు 2 సిల్వర్ మెడల్స్ సాధించారు. వీరిని సీఎం రేవంత్ రెడ్డి సన్మానించారు.
డిచ్పల్లి మండలంలోని 7వ బెటాలియన్ సమీపంలో ఉన్న ఖిల్లా రామాలయం ప్రీ వెడ్డింగ్ షూట్లకు కేరాఫ్గా మారింది. ఆగస్టు నెల పెళ్లిళ్ల సీజన్ కావడంతో కొత్త జంటలు ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం ఖిల్లాకు క్యూ కట్టాయి. 17వ శతాబ్దం నాటి ఖిల్లా దగ్గర షూట్ చేసుకోవడం సంతోషంగా ఉందని పలు జంటలు ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాయి.
కాలకృత్యాలు కోసం వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందిన ఘటన NZBలో చోటు చేసుకుంది. డిచ్పల్లికి చెందిన మహమ్మద్ అతరుల్లా (38) తన భార్య జువేరియా ఉస్మా డెలివరీ నిమిత్తం నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వచ్చాడు. ఇవాళ తెల్లారుజామున అతరుల్లా కాలకృత్యాలు తీర్చుకునేందుకు బాత్రూంకి వెళ్లగా, ప్రమాదవశాత్తు కాలు జారి పడ్డాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని మొత్తం పది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్లను నియమించారు. కాగా నిజామాబాద్ అర్బన్లో ఇద్దరు, ఆర్మూర్, భీంగల్, కామారెడ్డి, బోధన్లో పనిచేస్తున్న సబ్ రిజిస్ట్రార్లు బదిలీ అయ్యారు.
హైదరాబాద్లో పని ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి కత్తితో గాయపరిచి ఉడాయించిన ఘటన జీడిమెట్ల PS పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు కామారెడ్డి జిల్లాకు చెందిన యాదికి, శ్రీనివాస్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. జీడిమెట్లకు తీసుకొచ్చి ఓ వైన్షాపు వద్ద మద్యం తాగారు. బుధవారం మళ్లీ మద్యం తాగి యాది వద్ద ఉన్న డబ్బులు ఇవ్వాలని శ్రీనివాస్ గొడవకు దిగాడు. దీంతో ఒప్పుకోకపోవడంతో కత్తితో దాడి చేశాడు.
కామారెడ్డిలో అంతర్ జిల్లా దొంగను కామారెడ్డి పట్టణ, సీసీఎస్ పోలీసులు బుధవారం పట్టుకుని పంచలోహ విగ్రహం స్వాధీనం చేసుకున్నామని పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. దొంగను నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం గ్రామానికి చెందిన చిల్లా గంగాదాసుగా పేర్కొన్నారు. అతడు మాక్లూర్ మండలం మాదాపూర్కు చెందిన దర్పల్లి సాయిలు, నిర్మల్ జిల్లాకు చెందిన కోసడిగి మోహన్లతో కలిసి పలు దొంగతనాలకు పాల్పడ్డాడన్నారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రం ధర్మపురి కాలనీకి చెందిన తుమ్మల లక్ష్మి (32) అనే వివాహిత బుధవారం బాసరలోని గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ గణేష్ ఘాట్ వద్ద ఉన్న ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ ఆధారంగా బంధువులకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
పారిస్ ఒలింపిక్స్ లో నేడు నిజామాబాద్కు చెందిన క్రీడాకారిణి నిఖత్ జరీన్ మ్యాచ్ జరనుంది. మహిళల 50కేజీల ప్రిక్వార్టర్స్ మ్యాచులో నిఖత్.. వుయుతో తలపడనుంది. మధ్యాహ్నం 2.31కి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా మెుదటి మ్యాచులో నిఖత్.. జర్మనీ క్రీడాకారిణిని మట్టికరిపించిన విషయం తెలిసిందే. ALL THE BEST
Sorry, no posts matched your criteria.