Nizamabad

News March 31, 2025

NZB: 1981లో మంచినూనె ధర ఎంతో తెలుసా..?

image

ప్రస్తుతం నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకి పైపైకి పోతుంటే..ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు రాజిగో రాజన్న అన్న పాట గుర్తోస్తోంది. సామాన్యులు వాటిని కొనుగోలు చేయాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది.  గతంలోనే పరిస్థితులు బాగున్నాయని అంటున్నారు జనాలు.1981లో kg మంచినూనె ₹13:80, 1/2kg శనగపిండి ₹2:50, జిందాతిలిస్మాత్ ₹1:10, బట్టల సబ్బు ₹1:60, కొబ్బరికాయ ₹1:75గా ఉన్న ఓ బిల్లు వైరల్ అవుతోంది.

News March 31, 2025

NZB: సనాతన ధర్మాన్ని, సనాతన సంప్రదాయాలను కాపాడాలి: MLA

image

సనాతన ధర్మాన్ని, సనాతన సంప్రదాయాలను కాపాడటంలో ప్రతి ఒక్కరూ ముందుండాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కోరారు. ఆదివారం ఆయన నగరంలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో, పలు ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. బస్వా గార్డెన్ లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఇందూరు నగర శాఖ నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ జీవితం అంటేనే సుఖ దుఃఖాల కలయిక అని పేర్కొన్నారు.

News March 31, 2025

సాటాపూర్ గేట్ వద్ద వడ్ల లారీ బోల్తా

image

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం సాటాపూర్ గేట్ వద్ద ఆదివారం రాత్రి వడ్ల లారీ బోల్తా పడింది. ఎడపల్లి వైపు వెళ్తున్న ధాన్యం లారీ పెట్రోల్ బంక్ వద్ద డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో లారీలో ఉన్న వరి ధాన్యం బస్తాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోవడంతో వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న ఎడపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను డైవర్ట్ చేశారు.

News March 31, 2025

నిజామాబాద్ జిల్లా ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు: కలెక్టర్

image

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా వేసవి తీవ్రతలోనూ నియమ నిష్ఠలతో దాదాపు నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు నిర్వర్తించడం ఎంతో గొప్ప విషయమన్నారు. అన్ని వర్గాల ప్రజలు సుఖః సంతోషాలతో కాలం వెళ్లదీయాలని, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

News March 31, 2025

నిజామాబాద్ జిల్లాలో దంచికొడుతున్న ఎండలు..

image

నిజామాబాద్ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. ఆదివారం కోటగిరిలో 41℃, కమ్మరపల్లి, బోధన్, మెండోరా 40.9, పొతంగల్ 40.8, వేల్పూర్ 40.7, సాలూర, ఇందల్వాయి, డిచ్‌పల్లి 40.6, మక్లూర్, ఎడపల్లి, ఆర్మూర్ 40.5, ధర్పల్లి, నిజామాబాద్ 40.4, ముగ్పాల్ 40.4, నందిపేట్ 40.3, రెంజల్, మోస్రా 40.2, బోధన్లో 40.1℃ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.కాగా ఈ ప్రాంతాలన్నీ ఆరెంజ్ జోన్‌లో ఉన్నాయి.

News March 30, 2025

NZB: బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో పంచాంగ శ్రవణం

image

బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా కార్యాలయంలో ఆదివారం పంచాంగ శ్రవణం నిర్వహించారు. జోషి మధుసూదన్ శర్మ విశ్వవసునామ సంవత్సరం ఎలా ఉండబోతుందోనని వివరించారు. కార్యక్రమంలో మాజీ మేయర్ దండు నీతూ కిరణ్, మాజీ నుడా చైర్మన్ ప్రభాకర్, జాగృతి అధ్యక్షుడు అవంతి శ్రీనివాస్, శంకర్, రామ్ కిషన్ రావు తదితరులతో పాటు మహిళా నాయకురాల్లు పాల్గొన్నారు.

News March 30, 2025

వర్ని: అదనపు కలెక్టర్‌పై కేసు

image

గతంలో NZB జిల్లా అదనపు కలెక్టర్‌గా పని చేసి ప్రస్తుతం సంగారెడ్డిలో పని చేస్తున్న చంద్రశేఖర్‌తో పాటు సస్పెన్షన్‌లో ఉన్న DSO చంద్రప్రకాశ్, పౌరసరఫరాల శాఖ DT నిఖిల్‌పై కేసు నమోదు చేశామని వర్ని SI మహేశ్ తెలిపారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ కేటాయింపుల్లో పోర్జరీ సంతకాలు చేసిన పత్రాలతో వేధిస్తున్నట్లు ఓ మిల్లర్ ఇచ్చిన ఫిర్యాదుపై కోర్టు ఉత్తర్వుల మేరకు కేసు నమోదు చేశామన్నారు.

News March 30, 2025

NZB: యువకుడి ఆత్మహత్యాయత్నం

image

బెట్టింగ్ యాప్‌లో డబ్బులు పోగొట్టుకున్న యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన నిజామాబాద్ జిల్లా రూరల్ మండలం ఆకుల కొండూరు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఆకాశ్ ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌కు పాల్పడి సుమారు రూ.3 లక్షల వరకు నష్టపోయాడు. దీంతో గడ్డి మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు NZBలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువకుడు చికిత్స పొందుతున్నాడు.

News March 30, 2025

NZB: దరఖాస్తుకు రేపే చివరి తేదీ

image

మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమ గురుకులాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి 6, 7, 8, 9వ తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం.. ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ఆర్సీవో సత్యనాథ్ రెడ్డి తెలిపారు. ఆన్‌లైన్లో దరఖాస్తులు సమర్పించడానికి ఈ నెల 31 వరకు అవకాశం ఉందన్నారు. ఏప్రిల్ 20న పరీక్ష జరుగుతుందని, అందులో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు రిజర్వేషన్, నిబంధనల ప్రకారం సీట్లు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు.

News March 30, 2025

నిజామాబాద్‌: ఉగాది ఎఫెక్ట్.. కొత్త కుండలకు గిరాకీ

image

ఉగాది పండగ సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో సందడి నెలకొంది. ఉగాది పర్వదినం సందర్భంగా కావలసిన వస్తువులు, పూజా సామగ్రి, కొత్త బట్టలు కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపారు. ఉగాది పచ్చడి తయారు చేసేందుకు అవసరమయ్యే కొత్త మట్టి కుండలకు గిరాకీ బాగా పెరిగింది. తోరణాలు కట్టేందుకు మామిడి ఆకులు, ఉగాది పచ్చడికి మామిడికాయలు, వేపపూత, చింతపండు, మోదుగ, బంతి, చామంతి పూలు భారీ రేటు పలికాయి.