India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లాలో ఎక్కడైనా సాగు నీటి సమస్య ఉత్పన్నమైతే సంబంధిత అధికారులను బాధ్యులుగా పరిగణిస్తామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు స్పష్టం చేశారు. విధుల పట్ల అలసత్వ వైఖరిని ప్రదర్శిస్తూ సాగునీటి సరఫరాను సక్రమంగా పర్యవేక్షించని పక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బోధన్ పట్టణంలోని ఇరిగేషన్ గెస్ట్ హౌస్ లో సబ్ కలెక్టర్ వికాస్ మహతో కలిసి కలెక్టర్ ఇరిగేషన్, రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులతో సమీక్షించారు.
సాలూర మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ఆయా విభాగాలను సందర్శించి, రోగులకు అందిస్తున్న వైద్య సేవల తీరును పరిశీలించారు. అందుబాటులో ఉన్న మందుల స్టాక్, వైద్యులు, సిబ్బంది హాజరును తనిఖీ చేశారు. ఇన్ పేషంట్ వార్డును సందర్శించి అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు.
నిజామాబాద్ జిల్లాలో వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. NZB రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనగర్లో చండీ కృష్ణ (37) అనే వ్యవసాయ కూలీ ఫిట్స్తో మృతి చెందాడు. అలాగే రుద్రూర్ మండల కేంద్రంలో కాదారి సాయినాథ్ (38) అనే రైతు పొలం గట్టుపై నడుచుకుంటూ వెళ్తూ బురదలో పడి మృతి చెందాడు. అదేవిధంగా నగరంలోని పూసలగల్లీలో బద్దురి లక్ష్మణ్ (41) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
నిజామాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం వరకు చలి తీవ్రత విపరీతంగా ఉండగా.. గత రెండు మూడు రోజుల నుంచి ఎండ పెరిగింది. దీంతో పొలం పనులు, ఇతర పనులకు వెళ్లే నిజామాబాద్ వాసులు భయపడుతున్నారు. నిజామాబాద్లో ఇవాళ, రేపు 36°C ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. మీ ప్రాంతంలో వాతావరణం ఎలా ఉందో కామెంట్ చేయండి.
మార్చ్ 5 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయని NZB DIEO రవికుమార్ తెలిపారు. జిల్లాలో 36,222 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు వివరించారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 17,789 మంది, రెండో సంవత్సరంలో 18,433 మంది పరీక్షలు రాయనున్నారు. ఇందు కోసం 57 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది.
ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నీలో జిల్లాకు చెందిన ఇద్దరు క్రీడాకారులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏపీలోని కాకినాడలో జరుగుతున్న ఈ టోర్నమెంట్లో జిల్లాకు చెందిన జి. సుమన్, ఆర్.శివకుమార్ రీజినల్ స్పోర్ట్స్ బోర్డ్ హైదరాబాద్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే సుమన్ హైదరాబాదులోని ఏజీ ఆఫీస్లో సీనియర్ ఆడిటర్గా, శివకుమార్ స్థానిక ఇన్కమ్ టాక్స్ ఆఫీస్లో ఓఎస్గా పనిచేస్తున్నారు.
ఇంటర్ విద్యార్థుల హాల్ టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచామని DIEO రవికుమార్ తెలిపారు. ప్రైవేటు కళాశాలల ప్రిన్సిపల్లు హాల్ టికెట్లు ఇవ్వకపోతే విద్యార్థులు ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లతో పరీక్ష కేంద్రంలోకి వెళ్లవచ్చునని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయకుండా వెంటనే హాల్ టికెట్లు అందరికీ ఇవ్వాలని ప్రైవేటు, ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్లను ఆదేశించారు.
నిజామాబాద్ వన్ టౌన్ పరిధిలోని ఓ వ్యక్తి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు SHO రఘుపతి శుక్రవారం తెలిపారు. పూసల గల్లీకి చెందిన బద్దూరి లక్ష్మణ్ (41) గత కొన్ని సంవత్సరాలుగా కాళ్లకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నాడు. దీంతో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుమందు తాగాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మృత దేహాన్ని మార్చరికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారులకు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కీలక సూచనలు చేశారు. శుక్రవారం సాయంత్రం ఆయన అధికారులతో మాట్లాడుతూ ఎలాంటి పొరపాట్లకు, కాపీయింగ్ జరగకుండా చూడాలన్నారు. ప్రశాంత వాతావరణంలో సాఫీగా పరీక్షలను నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలన్నారు. పరీక్షల అనంతరం ఆన్సర్ షీట్లను నిర్ణీత పాయింట్ కు తరలించే జాగ్రత్తగా ఉండాలన్నారు.
బర్డ్ ఫ్లూ నేపథ్యంలో చికెన్ అమ్మకాలు తగ్గడంతో చికెన్ అమ్మకందారులు జిల్లాలో రోజుకో చోట చికెన్ మేళాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నిజామాబాద్ నగరంలోని బోధన్ బస్టాండ్ సమీపంలో శుక్రవారం మేళా ఏర్పాటు చేశారు. ఉచిత చికెన్ పదార్థాల కోసం భారీగా జనం తరలివచ్చారు. చికెన్ సెంటర్ యజమానులు మాట్లాడుతూ.. కొన్ని చోట్ల బర్డ్ ఫ్లూ అంటూ వచ్చిన వార్తలు వాస్తవమేనని.. కానీ మన జిల్లాలో లేదని స్పష్టం చేశారు.
Sorry, no posts matched your criteria.