India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉగాది పండగ సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో సందడి నెలకొంది. ఉగాది పర్వదినం సందర్భంగా కావలసిన వస్తువులు, పూజా సామగ్రి, కొత్త బట్టలు కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపారు. ఉగాది పచ్చడి తయారు చేసేందుకు అవసరమయ్యే కొత్త మట్టి కుండలకు గిరాకీ బాగా పెరిగింది. తోరణాలు కట్టేందుకు మామిడి ఆకులు, ఉగాది పచ్చడికి మామిడికాయలు, వేపపూత, చింతపండు, మోదుగ, బంతి, చామంతి పూలు భారీ రేటు పలికాయి.
నిజామాబాద్ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. శనివారం ధర్పల్లి, మంచిప్పలో అత్యధికంగా 41.0℃ ఉష్ణోగ్రత నమోదైంది. ఏర్గట్ల, కమ్మర్పల్లి, వేంపల్లి, కోటగిరిలో 40.9, వేల్పూర్, చింతకుంటలో 40.8, పెర్కిట్ 40.7, తొండకూర్, ఇస్సాపల్లి 40.4, మెండోరా, లక్ష్మాపూర్ 40.3, బాల్కొండ 40.2, ఆలూరు, మాచర్ల, ముప్కాల్లో 40.0℃ ఉష్ణోగ్రత నమోదైంది. కాగా ఈ ప్రాంతాలన్నింటికీ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
కరాటే పోటీల విజేతలకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ బహుమతులు అందజేశారు. హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో 4 రోజుల పాటు జరిగిన కరాటే పోటీల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. స్పోర్ట్స్ యూనివర్సిటీ యువతకు, క్రీడాకారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సాట్ ఛైర్మన్ శివసేనారెడ్డి, ఎండీ సోనిబాల, కరాటే ఇండియా అధ్యక్షుడు భారత్ శర్మ పాల్గొన్నారు.
జిల్లా ప్రజలకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. విశ్వావసు నామ సంవత్సరంలో జిల్లా ప్రజలందరికి శుభాలు చేకూరాలని ఆకాంక్షించారు. తెలుగు నూతన సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో ఆనందోత్సాహాలు నింపాలని అభిలషించారు. ఉగాది పండగను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని అన్నారు. విశ్వావసు నామ సంవత్సరంలో జిల్లా మరింత ప్రగతి సాధించాలని ఆకాంక్షించారు.
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలకు పోలీస్ కమీషనర్ సాయి చైతన్య పోలీస్ శాఖ తరఫున విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. విశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా ప్రజలందరూ ఎలాంటి అభద్రతాభావంతో లేకుండా సుఖశాంతులతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే ప్రజలు శాంతి భద్రతల విషయంలో పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు.
మీ సేవ సెంటర్లలో శనివారం సర్వర్ డౌన్ ప్రాబ్లమ్ ఎదురైంది. దీనితో మీ సేవ సెంటర్లకు వెళ్లిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా విద్యార్థులు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వెళ్లగా సర్వర్ డౌన్ చూపగా ఉదయం నుండి మధ్యాహ్నం వరకు సెంటర్లలో పడిగాపులు కాశారు. కాగా రాజీవ్ యువ వికాస పథకం కోసం దరఖాస్తు చేసుకునేందుకు అధిక సంఖ్యలో అభ్యర్థులు రావడంతో ఈ ఇక్కట్లు అని తెలిసింది.
నిజామాబాద్ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. శుక్రవారం మెండోరాలో 41.5℃, పెర్కిట్, మోర్తాడ్, కోటగిరి 41.4, మల్కాపూర్, వేంపల్లె 41.3, లక్మాపూర్, యడపల్లి 41.2, ముప్కాల్, వైల్పూర్ 41.1, కమ్మర్పల్లి, యర్గట్ల, కొండూరు 41, బాల్కొండ 40.9, మంచిప్ప 40.8, గోపన్నపల్లి, తొండకూర్ 40.7, మోస్రా, మగ్గిడి 40.5, రెంజల్, సిరికొండ, భీంగల్, మాచెర్ల 40.4, ధర్పల్లి, గన్నారం, కోనసమందర్లో 40.2℃ ఉష్ణోగ్రత నమోదైంది.
కరెంట్ షాక్తో మృతి చెందినపై ఫోటోలోని వ్యక్తిని గుర్తు పడితే తమకు సమాచారం ఇవ్వాలని నిజామాబాద్ 1వ టౌన్ SHO రఘుపతి కోరారు. ఇతను నెహ్రు పార్క్ ఏరియా దగ్గర ఉన్న లేబర్ అడ్డా దగ్గర నుంచి పనికి వెళ్తు ఉంటాడన్నారు. శుక్రవారం ఖలీల్వాడి, నిజామాబాద్ ఏరియాలో నిర్మాణంలో ఉన్న భవనంలో పని చేస్తుండగా కరెంట్ షాక్ తగిలి చనిపోయాడని చెప్పారు. ఇతడి గురించి తెలిస్తే తమకు సమాచారం అందించాలన్నారు.
అక్రమంగా విక్రయిస్తున్న ఎండు గంజాయిని టాస్క్ఫోర్స్ బృందం పట్టుకుంది. టాస్క్ఫోర్స్ DPEO ఆదేశాల మేరకు డిస్ట్రిక్ట్ టాస్క్ఫోర్స్ CI సీహెచ్. విలాస్, SI సింధు ఆధ్వర్యంలో ఖానాపూర్ గ్రామంలోని జన్నెపల్లి రోడ్డులో రైల్వేగేట్ వద్ద మాలపల్లికి చెందిన సోహెబ్ ఖాన్ అనే వ్యక్తి వద్ద ఉన్న బ్యాగులో 2100 గ్రాముల ఎండు గంజాయి లభించింది. అతణ్ని అరెస్టు చేసి ఎస్హెచ్ఓకు అప్పగించారు.
నిజామాబాద్ నగర శివారులోని పాంగ్రలో చంద్రకళ(55) అనే మహిళా హత్యకు గురైంది. కూలిపోయిన స్థితిలో మృతదేహం లభ్యమైంది. ఈమెకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఈ నెల 23వ తేదీన కూతురితో మాట్లాడిన చంద్రకళ మరుసటి రోజు నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన కూతురు రమ్య ఇంటికి వచ్చి చూసే సరికి హత్యకు గురైంది. సమాచారం అందుకున్న 4వ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
Sorry, no posts matched your criteria.