Nizamabad

News February 20, 2025

నిజామాబాద్: రాష్ట్రంలో BRS అధికారంలోకి రావడం కలనే: మహేశ్

image

తెలంగాణలో ఇక BRS అధికారంలోకి రావడం కలనే అని, రెండోసారి కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని TPCC అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఆయన నిజామాబాద్‌లో మాట్లాడుతూ.. BRS, BJP నాయకులు చేస్తున్న ఆరోపణలను ఖండించారు. ప్రతిపక్ష లీడర్ హోదాను KCR.. KTR, హరీశ్‌రావ్‌కు అప్పగించాలన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి రావడం ఖాయమని స్పష్టం చేశారు. 

News February 20, 2025

NZB: NEXT ఎలక్షన్‌లో 100 MLA సీట్లు మావే: TPCC చీఫ్

image

బీసీలపై ప్రేమతోనే కులగణన చేపట్టామని TPCC అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. BRS, BJP ఒక్కటే అని, అవి లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నాయని విమర్శించారు. రాష్ట్రం నుంచి 8 మంది BJP ఎంపీలు ఉంటే కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా తేలేదన్నారు. బీజేపీ మతం పేరుతో రాజకీయాలు చేస్తోందన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 ఎమ్మెల్యే సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

News February 20, 2025

నిజామాబాద్: విషాదం.. మృతులంతా ఒకే FAMILY

image

నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం పెగడపల్లి గ్రామ శివారులో పొలాల్లో గురువారం ఉదయం కరెంట్ షాక్‌తో <<15520125>>ముగ్గురు మృతిచెందిన<<>> సంగతి తెలిసిందే. స్థానికులు తెలిపిన వివరాలు.. రెంజల్ మండలం సాటాపూర్ గ్రామానికి చెందిన భార్యాభర్తలు ఓర్సు గంగారాం(45), బాలమణి (40) వారి కొడుకు కిషన్(22) ఉదయం పంట పొలంలో వరికి నీరు పెట్టేందుకు వెళ్లగా బోరు మోటార్ వద్ద కరెంట్ షాక్ తగలడంతో ముగ్గురు మృతిచెందినట్లు భావిస్తున్నారు. 

News February 20, 2025

NZB: ఎంతమంది ఆధార్ అప్డేట్ పెండింగ్‌లో ఉందంటే..?

image

నిజామాబాద్ జిల్లాలో ఐదేళ్లలోపు చిన్నారులు 61,412 మంది, 15 ఏళ్ల వయస్సు ఉన్న 40,275 మంది ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ పెండింగ్‌లో ఉందని ఆధార్ డిప్యూటీ డైరెక్టర్ చైతన్య రెడ్డి తెలిపారు. ఆయన హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ అధికారులతో మాట్లాడుతూ.. పుట్టిన శిశువు నుంచి ఐదేళ్లలోపు చిన్నారులకు ఆధార్ నమోదు చేసేలా యంత్రాంగం చొరవ చూపాలని కోరారు.

News February 20, 2025

BREAKING: నిజామాబాద్‌లో విషాదం.. ముగ్గురి మృతి

image

నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. బోధన్ మండలం పెగడపల్లిలో కరెంట్ షాక్‌తో ముగ్గురు చనిపోయారు. ట్రాన్స్‌ఫార్మర్ వద్ద చోరీ చేస్తుండగా వారికి షాక్ కొట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతులంతా రెంజల్ మండలం సాటాపూర్ గ్రామానికి చెందిన గంగారాం, బాలమణి, కిషన్‌గా గుర్తించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News February 20, 2025

కామారెడ్డి: నరేందర్ రెడ్డిని గెలిపించాలి: MP

image

కామారెడ్డి సత్యాగార్డెన్‌లో పట్టభద్రులతో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఏడాది కాలంలో ఏకంగా 55 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. మెదక్, NZB, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల MLC అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు.

News February 20, 2025

కామారెడ్డి: కన్న కూతురిపై అత్యాచారం.. తండ్రికి 7 ఏళ్ల శిక్ష

image

కన్న కూతురిపై అత్యాచారం చేసిన తండ్రికి 7ఏళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ కామారెడ్డి కోర్టు తీర్పు వెలువరించింది. బీబీపేట PS పరిధిలో తల్లి ఇంట్లో లేని సమయంలో 15 ఏళ్ల కుమార్తెపై తండ్రి దేవరాజు లైంగిక దాడికి పాల్పడ్డాడు. తల్లి రాగానే జరిగిన విషయాన్ని ఆమె చెప్పగా PSలో ఫిర్యాదు చేసింది. నిందితుడిపై నేరం రుజువు కావడంతో జిల్లా జడ్జి లాల్ సింగ్ శ్రీనివాస్ నాయక్ బుధవారం తీర్పును వెలువరించారు.

News February 20, 2025

నిజామాబాద్: ‘బాల్య వివాహాలు లేని జిల్లాగా చేయండి’

image

జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ ప్రాజెక్ట్‌లో భాగంగా సాధన స్వచ్ఛంద సంస్థ సిబ్బంది నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతుని బుధవారం కలిశారు. బాల్య వివాహాలు లేని జిల్లాగా ఏర్పాటు చేసేందుకు జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో అవగాహన కార్యక్రమాలు చేపడతామని వివరించారు. జిల్లా కోఆర్డినేటర్ మధుసూదన్, నవీపేట్, బోధన్, భీమ్‌గల్ మండలాల సోషల్ మొబిలైజర్ చరణ్ సింగ్, సాయి చరణ్ గౌడ్, నిరీక్షణ ఉన్నారు.

News February 20, 2025

NZB: మార్కెట్ యార్డులో డైరెక్ట్ కొనుగోలు కేంద్రం ఏర్పాటు

image

రైతుల శ్రేయస్సు దృష్ట్యా నిజామాబాద్ మార్కెట్ యార్డులో డైరెక్ట్ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశామని మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పాగంగారెడ్డి తెలిపారు. మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదేశాల మేరకు బుధవారం నుంచి మార్కెట్ యార్డులో కొనుగోళ్లను ప్రారంభించామన్నారు. అన్ని సీజన్లలో రైతులు నేరుగా కొనుగోలు కేంద్రంలో పంట ఉత్పత్తులను అమ్ముకునే అవకాశము ఉంటుందన్నారు రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు.

News February 20, 2025

ఆధార్ బయోమెట్రిక్‌ను అప్ డేట్ చేయించాలి: కలెక్టర్

image

పాఠశాలల్లోని విద్యార్థులందరి ఆధార్ బయోమెట్రిక్‌ను అప్ డేట్ చేయించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో బుధవారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరగింది. కలెక్టర్ మాట్లాడుతూ..  భవిష్యత్తులో జేఈఈ వంటి పరీక్షలు రాసే సమయంలో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తవని సూచించారు.