Nizamabad

News March 27, 2025

NZB: రాజీవ్ యువ వికాసానికి ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి: కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం స్వయం ఉపాధి పథకాలకు నిజామాబాద్ జిల్లాలోని ఎస్సీ వర్గానికి చెందిన నిరుద్యోగ యువతీ, యువకులు ఏప్రిల్ 5లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు ఒక ప్రకటనలో తెలిపారు. ఒక రేషన్ కార్డుకు ఒకరు మాత్రమే అర్హులని, ఈ పథకం ద్వారా గరిష్ఠంగా రూ.4 లక్షల వరకు ఋణం అందించనున్నట్లు పేర్కొన్నారు.

News March 27, 2025

NZB: 53 రోజులు బాల్ భవన్ వేసవి శిక్షణ తరగతులు

image

నిజామాబాద్ జిల్లా కేంద్రం బాల్ భవన్‌లో ప్రత్యేక వేసవి శిక్షణ తరగతులు ఏప్రిల్ 16 నుంచి జూన్ 10 వరకు కొనసాగుతాయని సూపరింటెండెంట్ ఉమా బాల తెలిపారు. చిన్నారుల్లో సృజనాత్మకతను పదును పెట్టేందుకు చిత్ర లేఖనం, భరతనాట్యం, మెహెందీ, ఇంద్రజాలం, స్కేటింగ్, యోగా, కర్రసాము అల్లికలు తదితర 30 అంశాల్లో బాల బాలికలు శిక్షణ ఇస్తామన్నారు. ఆసక్తి ఉన్న 5-16 ఏళ్ల లోపు చిన్నారులు ఏప్రిల్ 2 నుంచి దరఖాస్తులు చేసుకోవాలన్నారు.

News March 26, 2025

డిచ్‌పల్లి: చిన్నారులు ఉన్నత స్థానాలకు ఎదగాలి: కలెక్టర్

image

మానవతా సదన్ చిన్నారులు ఉన్నత స్థానాలకు ఎదగాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకాంక్షించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. అనాధ బాలలను అన్ని విధాలుగా ఆదుకునేందుకు వీలుగా ఇది వరకు జిల్లాలో కలెక్టర్‌గా కొనసాగిన ప్రస్తుత రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి యోగితారాణా తన హయాంలో 2016లో నెలకొల్పారు. మానవతా సదన్ రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలో ప్రత్యేకతను చాటుకుంటోందని అన్నారు.

News March 26, 2025

NZB: ఆస్తి పన్ను చెల్లింపు కోసం వన్‌టైం సెటిల్మెంట్: కలెక్టర్

image

ఆస్తి పన్ను బకాయిల చెల్లింపులపై రాయితీ సదుపాయాన్ని వర్తింపజేస్తూ ప్రభుత్వం వన్ టైం సెటిల్మెంట్‌ను అమలు చేస్తోందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఆస్తి పన్ను బకాయి ఉన్న వారు నిర్ణీత గడువు లోపు ఒకే విడతలో బకాయిలు చెల్లిస్తే, 90 శాతం వడ్డీ మాఫీ వర్తిస్తుందని అన్నారు. నిజామాబాద్ నగర పాలక సంస్థతో పాటు బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీల పరి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News March 26, 2025

నిజామాబాద్ POLITICS.. కాంగ్రెస్ ప్రక్షాళన

image

TG కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టారు. 18 ఏళ్ల తర్వాత జిల్లా కాంగ్రెస్ కమిటీలతో రేపు ఢిల్లీలో మీటింగ్ పెట్టనున్నారు. ఇందులో జిల్లా, బ్లాక్, మండల కాంగ్రెస్ అధ్యక్షుల ఎంపిక ఉంటుందని టాక్. నిజామాబాద్ డీసీసీ చీఫ్‌గా మోహన్ రెడ్డి ఈ కార్యక్రమానికి వెళ్లారు. ఆయనకు ఇటీవల రాష్ట్ర సహకార యూనియన్ ఛైర్మన్‌ను అప్పగించారు.

News March 26, 2025

బిక్కనూర్: పుట్టెడు దుఃఖంలో పరీక్ష రాసిన అమ్మాయి

image

తండ్రి మృతి చెందినా దుఃఖాన్ని దిగమింగుతూ పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్థినిని చూసి పలువురు కంటతడి పెట్టారు. బిక్కనూర్‌కు చెందిన సత్యం అనే వ్యక్తి బుధవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన కుమార్తె కీర్తన పుట్టెడు దుఃఖంలో పదో తరగతి పరీక్ష రాసింది. కన్న తండ్రి చనిపోయినా బాధను దిగమింగి పరీక్షలు రాసిన విద్యార్థినిని తోటి విద్యార్థులు ఓదార్చారు. అంతటి బాధలో పరీక్ష రాసిన అమ్మాయి గ్రేట్ కదా.

News March 26, 2025

నిజామాబాద్ జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

image

నిజామాబాద్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మంగళవారం మల్కాపూర్లో అత్యధికంగా 40.2℃ఉష్ణోగ్రత నమోదైంది. అటు నిజామాబాద్ పట్టణం, మంచిప్ప, కోటగిరిలో 40, మోస్రా 39.9, ధర్పల్లి, లక్మాపూర్ 39.8, యెడపల్లె, మెండోరా 39.7, ఎర్గట్ల, పెర్కిట్, మోర్తాడ్ 39.5, వేంపల్లి, వైల్‌పూర్ 39.3, సిరికొండ, ముప్కాల్, కమ్మర్పల్లి, తుంపల్లి 39.2, మాచర్ల, భీంగల్లో 39.1℃ఉష్ణోగ్రత నమోదైంది.

News March 26, 2025

బాన్సువాడ: పెళ్లైన నెలకే నవవధువు ఆత్మహత్య

image

బాన్సువాడ కొల్లూరులో లక్ష్మి, వెంకటేశ్‌లకు FEB 23న వివాహం జరిగింది. అయితే ఇష్టంలేని పెళ్లి చేయడంతోనే లక్ష్మి మంగళవారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుందని సీఐ అశోక్ తెలిపారు. సూసైడ్ అటెంప్ట్ విషయాన్ని గమనించిన కుటుంబీకులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు బాన్సువాడ ఏరియా ఆసుపత్రి డాక్టర్ తెలిపారు. మృతురాలి తల్లి చంద్రకళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు.

News March 25, 2025

NZB: ‘మహిళా సంఘాలకు 200 పైచిలుకు కొనుగోలు కేంద్రాలు’

image

యాసంగి సీజన్ ధాన్యం సేకరణ ప్రక్రియలో భాగంగా మహిళా స్వయం సహాయక సంఘాలకు విరివిగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేటాయించాలని నిర్ణయించినట్లు మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే పీ.సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. జిల్లాలో 670 కొనుగోలు కేంద్రాలకు గానూ మహిళా సంఘాలకు కనీసం 200పైచిలుకు కేంద్రాలను కేటాయించేలా చర్యలు తీసుకున్నామన్నారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి మహిళా సంఘాలకు ఆయన కీలక సూచనలు చేశారు.

News March 25, 2025

సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి!

image

మంత్రివర్గ విస్తరణలో భాగంగా బోధన్ MLAకు కల్పిస్తారన్న చర్చ నడుస్తోంది. కాగా MLC మహేశ్ కుమార్ గౌడ్‌కు PCC పదవి వరించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే BSWDకి చెందిన కాసుల బాల్‌రాజ్‌‌కు ఆగ్రోస్ ఇండస్ట్రీస్ ఛైర్మన్‌గా నియమించింది. బాల్కొండకు చెందిన ఈరవత్రి అనిల్‌కు టీజీఎండీసీ ఛైర్మన్‌గా నియమించింది. కాగా ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటి వరకు ఎవరికి మంత్రి పదవీ దక్కలేదు. జిల్లాకు అమాత్య యోగముందా కామెంట్ చేయండి.