Nizamabad

News November 8, 2024

కామారెడ్డి: ప్లాస్టిక్ సంచిలో డెడ్‌బాడీ లభ్యం..!

image

కామారెడ్డి పట్టణంలోని PMH కాలనీ సమీపంలో రైలు పట్టాల పక్కన గుర్తుతెలియని మృతదేహం లభించింది. మృతుని వయస్సు 35-40 సంవత్సరాల మధ్య ఉంటుందని కామారెడ్డి SHO చంద్రశేఖర్ తెలిపారు. ఎక్కడో హత్య చేసి ప్లాస్టిక్ సంచిలో పెట్టి ఇక్కడ పారేసినట్లుగా ఉందని ఆయన పేర్కొన్నారు. మృతుని ఒంటిపై తెలుపు రంగు షర్ట్, నీలం రంగు ప్యాంట్ ఉందని మృతునికి సంబంధించి వారు ఉంటే కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలన్నారు.

News November 8, 2024

నిజామాబాద్: ఆర్టీసీ స్పెషల్ బస్సులపై తగ్గింపు

image

ఆర్టీసీ స్పెషల్ బస్సులపై 20 శాతం ధరలు తగ్గించినట్లు నిజామాబాద్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ జాన్ రెడ్డి తెలిపారు. శుభకార్యాలు విహారయాత్రలకు వెళ్లేవారు ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. వీటికి సైతం రాయితీ కల్పిస్తున్నట్లు వెల్లడించారు. రీజనల్ పరిధిలో ఐదు ఆర్టీసీ డిపోలలో బస్సుల అవసరం ఉన్నవారు సంప్రదించాలని ఆయన కోరారు.

News November 8, 2024

NZB: నిర్ణీత గడువులోపు సర్వేను పూర్తి చేయాలి

image

ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్య, ఉపాధి, కుల వివరాల సేకరణకై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కుటుంబ సర్వేను నిర్ణీత గడువు లోపు పూర్తి చేసేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్ శరత్ సూచించారు. స్థానిక రోడ్లు-భవనాల శాఖ అతిథి గృహంలో ఆయన జిల్లా అధికారులతో సమావేశమై ఇంటింటి సర్వే ప్రగతిని సమీక్షించారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అధికారులు పాల్గొన్నారు.

News November 7, 2024

బాన్సువాడ కళాశాలను తనిఖీ చేసిన నోడల్ అధికారి

image

ప్రభుత్వ జూనియర్ కళాశాల బాన్సువాడ(co-ed)లో ఇవాళ సాయంత్రం కామారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం, కళాశాల అభివృద్ధి కమిటీ సభ్యుడు ఇజాజుద్దీన్, దాసరి శ్రీనివాస్‌తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాలలో ఏర్పాటు చేసిన స్టడీ అవర్స్‌ను పరిశీలించారు. అదే విధంగా పరీక్షల వరకు విద్యార్థులను కష్టపడి చదివించాలని సూచించారు. 

News November 7, 2024

370 కేంద్రాల్లో ధాన్యం సేకరణ: NZB కలెక్టర్

image

ప్రస్తుతం 370 కేంద్రాల్లో రైతుల నుంచి ధాన్యం సేకరణ ప్రక్రియ కొనసాగుతోందని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. సుమారు 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలనే లక్ష్యంతో జిల్లా వ్యాప్తంగా 673 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామన్నారు. వాటిలో సన్న ధాన్యం సేకరణ కోసం 439 కేంద్రాలను, దొడ్డురకం ధాన్యం కొనుగోళ్ల కోసం 234 కేంద్రాలను రైతులకు అందుబాటులో ఉంచామని ఆయన వెల్లడించారు.

News November 7, 2024

నిజామాబాద్ జిల్లాలో నలుగురు సీఐల బదిలీ

image

నిజామాబాద్ జిల్లాలో నలుగురు సర్కిల్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. నార్త్ రూరల్ సీఐ బి.సతీష్ కుమార్, ఆర్మూర్ టౌన్ SHO రవి కుమార్, రుద్రూర్ సీఐ కె.జయేష్ రెడ్డిలను బదిలీ చేస్తూ ఐజీ కార్యాలయంలో రిపోర్ట్ చేయమని ఆదేశించారు. ఇక నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ పురుషోత్తంను రామగుండం ట్రాఫిక్-1 SHOగా బదిలీ చేశారు.

News November 7, 2024

NZB: గ్రామ పంచాయతీ ఎన్నికలు.. అందరి దృష్టి వారిపైనే..

image

కులగణన తర్వాత గ్రామ పంచాయతీ జరగనున్న సంగతి తెలిసిందే. దీని కోసం 2,3 నెలలు పట్టనుండగా గ్రామాల్లో ఆశావహులు అప్పుడే ఎన్నికల సన్నాహాల్లో మునిగి తేలుతున్నారు. కులాలు, కాలనీల వారీగా లెక్కలు వేసుకుంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో గ్రామాల నుంచి పట్టణాలకు వెళ్లిన వారి వివరాలను సేకరిస్తున్నారు. ఫోన్లు చేసి మామ, బాబాయ్, అల్లుడు అంటూ వరుసలు కలుపుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు.

News November 7, 2024

NZB: చిన్నారిని హత్య చేసిన తల్లితో పాటు మరొకరికి జీవిత ఖైదు

image

మూడేళ్ల కూతురును హత్య చేసిన తల్లితో పాటు మరోవ్యక్తికి జీవిత ఖైదు విధిస్తూ నిజామాబాద్ ఎస్సీ, ఎస్టీ కోర్టు న్యాయమూర్తి శ్రీనివాస్ బుధవారం తీర్పు చెప్పారు. జిల్లాలోని బోధన్ మండలం కల్దుర్కికి చెందిన సంజీవ్, మోర్తాడ్కు చెందిన కూలీ రజిత అలియాస్ రాధతో సహజీవనం చేస్తూ రాధ కూతురు తమకు అడ్డుగా ఉందని భావించారు. దీనితో 2023లో చిన్నారిని కొట్టి నీటిలో ముంచి చంపినట్లు కేసు నిర్దారణ అయ్యింది.

News November 6, 2024

గవర్నర్‌ను కలిసిన షబ్బీర్ అలీ

image

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మను బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయనకు పుష్పగుచ్ఛం అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన కుటుంబ సమగ్ర సర్వే వివరాలను ఆయనకు వివరించారు. కాగా ఈ కార్యక్రమం పట్లు ఆయన హర్షం వ్యక్తం చేశారు.

News November 6, 2024

బిక్కనూరు: చెరువులో పడి వ్యక్తి మృతి

image

చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన బిక్కనూర్‌లో జరిగింది. పెద్దమల్లారెడ్డికి చెందిన కొట్టాల సిద్ధరాములు (66) ఈ నెల 4న చేపల వేటకు వెళ్లాడు. తిరిగి రాకపోవడంతో జాలరులు గాలింపు చేపట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. కాగా బుధవారం చెరువులో మృత దేహం లభ్యమైనట్లు ఎస్ఐ సాయికుమార్ తెలిపారు. మృతుడి భార్య బాలమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.