India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మొన్నటి వరకు కిలో రూ.100 ఉండి సామాన్యుడికి భారంగా మారిన టమాటా ధర ఒక్కసారిగా పడిపోయింది. పిట్లంలో శుక్రవారం జరిగిన వారాంతపు సంతలో టమాటా ధర కిలో రూ.25 పలికింది. దీంతో ప్రజలకు కాస్త ఊరట లభించింది. టమాటతో పాటు ఇతర కూరగాయల ధరలు కూడా కాస్త తగ్గుముఖం పట్టాయి.
వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలేందుకు ఎక్కువ ఆస్కారం ఉందని, అందుకే పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను శుక్రవారం ఆదేశించారు. అలాగే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో ఆయా ప్రభుత్వబడుల్లో కొనసాగుతున్న పనులను వేగవంతంగా పూర్తిచేయాలని సూచించారు.
* బాన్సువాడ, ఎల్లారెడ్డిలో CM రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం
* SRSP పునాదికి 60 ఏళ్లు అధికారుల సంబరాలు
* ఆర్మూర్ లో రోడ్డు ప్రమాదం ఒకరు దుర్మరణం
* పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలి: కలెక్టర్ రాజీవ్ గాంధీ
* బడ్జెట్లో KMR జిల్లాకు అన్యాయం: BJP జిల్లా అధ్యక్షురాలు అరుణ తార
* నిజామాబాద్ రైల్వే స్టేషన్లో రూ. 50 లక్షలు పట్టివేత
* SRSP కు వరద తాకిడి. నిజాంసాగర్కు స్వల్ప ఇన్ ఫ్లో
మెండోరా మండలం పోచంపాడ్లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి వరద కొనసాగుతోంది. నేడు మధ్యాహ్నం 3 గంటలకు అందిన సమాచారం మేరకు ప్రాజెక్టులోకి 25,150 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోందని అధికారులు తెలిపారు. క్రమక్రమంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నీటిమట్టం పెరుగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 1072.8 అడుగులకు నీటిమట్టం చేరుకోగా.. ప్రాజెక్టులో 28.389 టీఎంసీల వరకు నీరు నిల్వ ఉంది.
టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ లోయర్ గ్రేడ్ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్స్ www.bse.telangana.gov.in వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ తెలిపారు. 2024 సంవత్సరానికి సంబంధించి ఆగస్టు 4న ఈ పరీక్ష ఉంటుందన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
NZB పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 1వ ఠాణా ఫోన్ల రికవరీలో నంబర్ 1గా నిలిచింది. ఫోన్లు చోరీకి గురైన, పోగొట్టున్న వారి నుంచి 1,432 ఫిర్యాదులు రాగా వాటిలో 904 సెల్ ఫోన్లను గుర్తించారు. అందులో 504 మంది బాధితులకు ఫోన్లు అందించడంతో 1వ ఠాణా ప్రథమ స్థానంలో నిలిచింది. KMR జిల్లాలోని బాన్సువాడ పోలీస్ స్టేషన్ 303 ఫోన్లు రికవరీ చేసి 13వ స్థానం, కామారెడ్డి పట్టణ ఠాణా 206 ఫోన్లు రికవరీ చేసి 21 స్థానంలో నిలిచాయి.
మహిళలపై కత్తితో దాడి చేసిన ఘటన నవీపేట్లో జరిగింది. జలాల్పూర్కి చెందిన గంగవ్వ అదే గ్రామానికి చెందిన సావిత్రి వద్ద నెల కిందట కుక్కర్ కొనుగోలు చేసింది. అది సరిగ్గా పనిచేయకపోవడంతో పలుమార్లు వారికి గొడవ జరిగింది. కాగా గురువారం సావిత్రి.. గంగవ్వను డబ్బులు ఇవ్వాలని అడగ్గా దానికి గంగవ్వ నిరాకరించింది. దీంతో కోపగించుకున్న సావిత్రి ఆమె తలపై కత్తితో నరికింది. ఈ ఘటనపై SI యాదగిరి గౌడ్ కేసు నమోదు చేశారు.
తల్లి, కూతురు <<13707442>>ఆత్మహత్య<<>>కు పాల్పడ్డ విషయం తెలిసిందే. మాలన్ బాయి, కుమార్తె మనీషా, కుమారుడు మంగళ్ దీప్తోతో కలిసి డోంగ్లిలో నివాసముంటుంది. కొద్ది రోజులుగా మాలన్ బాయి అనారోగ్యంగా ఉండటంతో పాటు కుమార్తె మనీషా మానసిక స్థితి బాగలేకపోవడంతో ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని జుక్కల్ SI సత్యనారాయణ అనుమానం వ్యక్తం చేశారు. కాగా ఈ ఏడాది మార్చిలో ఆమె భర్తను హత్య చేసిన కేసులో మాలన్ A1గా ఉంది.
జక్రాన్పల్లి మండలంలోని నారాయణపేటకు చెందిన జానకంపేట్ లక్ష్మీ (55)ని ముగ్గురు దుండగులు బెదిరించి బీరువాలో నుంచి 2 తులాల బంగారు పుస్తెలతాడు, కొంత నగదును దోచుకొని పరారయ్యారు. బుధవారం అర్ధరాత్రి ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ఆమె ఇంటికి వచ్చి ఇంటి తలుపులు కొట్టి, మీ మరిది చనిపోయాడని చెప్పడంతో తలుపులు తీసింది. దీంతో దుండగులు లక్ష్మీని కత్తితో చంపేస్తామని బెదిరించి దొంగతనానికి పాల్పడ్డారు.
అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన చిన్న మల్లయ్య అనే వ్యక్తిని హత్య చేసి పూడ్చిపెట్టిన కేసులో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. సదాశివ నగర్ పోలీస్ స్టేషన్లో ఆయన వివరాలను వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఆ ముగ్గురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఆ ముగ్గురిపై పలు సెక్షన్లలో కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.