Nizamabad

News July 20, 2024

NZB: ‘నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యమే రోడ్డు ప్రమాదాలకు కారణం’

image

నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కారణంగానే రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుని ఎంతోమంది ప్రాణాలను కోల్పోతున్నారని NZB జిల్లా జడ్జి సునీత కుంచాల, సీపీ కల్మేశ్వర్ అన్నారు. జిల్లా పోలీసు శాఖ సౌజన్యంతో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ‘మైనర్ డ్రైవింగ్- డ్రంక్ అండ్ డ్రైవింగ్’ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నిబంధనల ఆవశ్యకతను వివరించారు. ప్రతి ఒక్కరూ విధిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు.

News July 20, 2024

మెండోరా: ‘నా భర్త మృతదేహాన్ని తెప్పించండి సారూ’

image

నిజామాబాద్ జిల్లా మెండోరాకు చెందిన మాకురి వినోద్ బతుకుదెరువుకోసం బెహరన్ దేశం వెళ్లాడు. కాగా ఈనెల17న డ్యూటీలో ఉండగానే ప్రమాదవశాత్తు మృతి చెందాడు. వినోద్ మృతదేహన్ని త్వరగా స్వదేశానికి తీసుకు వచ్చేలా చూడాలని అతని భార్య యమున, పిల్లలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

News July 20, 2024

NZB జిల్లా ఆసుపత్రిలో మూడేళ్ల బాలుడు కిడ్నాప్ 

image

నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. నగరంలోని మానిక్ భండార్‌కు చెందిన ఓ వ్యక్తి తన భార్య డెలివరీ కోసం శుక్రవారం రాత్రి ఆసుపత్రికి వచ్చాడు. రాత్రి తన మూడేళ్ల బాలుడితో కలిసి ఆసుపత్రి కారిడార్‌లో నిద్రించాడు. లేచి చూసేసరికి బాలుడిని ఎవరో ఎత్తుకెళ్లరాని బాధితుడు తెలిపాడు. వెంటనే ఆసుపత్రిలో ఉన్న పోలీసులకు విషయం చెప్పడంతో వారు కేసు నమోదు చేశారు.

News July 20, 2024

నిజాంసాగర్ JNVలో ప్రవేశాలు

image

నిజాంసాగర్ నవోదయ విద్యాలయంలో ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపల్ సత్యవతి తెలిపారు. 01.05.2013 నుంచి 31.7.2015 సంవత్సరాల మధ్యలో జన్మించి 5వ తరగతి పాసైన విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. సెప్టెంబర్ 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఈ అవకాశాన్ని వినియోగించు కోవాలని కోరారు.

News July 20, 2024

HYDలో ఘోర రోడ్డు ప్రమాదం.. నిజామాబాద్ వాసి మృతి

image

HYDలోని దుండిగల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇంజినీరింగ్ చదువుతున్న NZB జిల్లాకు చెందిన ఆశ్మిత్, జస్వంత్, నవనీత్ మరో స్నేహితుడు హరితో కలిసి శుక్రవారం సాయంత్రం టీ తాగేందుకు కారులో వెళ్లారు. దుండిగల్ ఎగ్జిట్ నం.5 వద్ద బౌరంపేట-గండిమైసమ్మ వైపు వెళ్తున్న ట్యాంకర్‌ను కారు ఢీకొంది. దీంతో అక్షయ్, అశ్మిత్, హరి అక్కడికక్కడే మృతి చెందినట్లు CI శంకరయ్య తెలిపారు. గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు.

News July 20, 2024

నేడు బిక్కనూర్ మండలానికి మంత్రి జూపల్లి

image

రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నేడు బిక్కనూర్ మండలంలో పర్యటించనున్నారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భీమ్ రెడ్డి చెప్పారు. మండల కేంద్రంలో నిర్వహించే రైతు సంబరాలలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో కలిసి ఆయన పాల్గొంటారని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరుకానున్నట్లు, పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలన్నారు.

News July 19, 2024

నిజామాబాద్: లాడ్జీలలో పోలీసుల తనిఖీలు

image

నగరంలోని లాడ్జీలలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. సీపీ కల్మేశ్వర్ ఆదేశాల మేరకు సీసీఎస్ ఏసీపీ బోనాల కిషన్ ఆధ్వర్యంలో నగరంలోని పలు లాడ్జీలలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. లాడ్జీలలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరగకుండా వాటిని నిరోధించడానికి ఈ తనిఖీలు నిర్వహించారు. సీసీఎస్ ఇన్స్పెక్టర్ సురేష్, టౌన్ సీఐ నరహరి, మహిళా సీఐ శ్రీలత, నాలుగవటౌన్ ఎస్ఐ పాండేరావు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

News July 19, 2024

NZB: హోటళ్లలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల తనిఖీలు

image

నిజామాబాద్ నగరంలోని పలు హోటళ్లలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హోటళ్ల పరిసరాలతో పాటు కిచెన్లలో ఆహార పదార్థాలను పరిశీలించారు. నిబంధనలు పాటించని, నిర్వహణ సరిగ్గాలేని హోటళ్లకు జరిమానాలు విధించారు. హైదరాబాద్ రోడ్డులోని ఓ హోటల్‌కు రూ.15వేలు, కంఠేశ్వర్ బైపాస్ రోడ్డులోని ఓ హోటల్‌కు రూ.5వేల జరిమానా విధించారు.

News July 19, 2024

TU: సాంబారులో పురుగు.. రిజిస్ట్రార్ చర్యలు

image

గర్ల్స్ హాస్టల్లో సాంబారులో పురుగు ఘటనపై టీయూ రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి చర్యలు చేపట్టారు. ఈ మేరకు హాస్టల్ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి త్రిసభ్య కమిటీని నియమించారు. ఈ మేరకు కమిటీ విచారణ జరిపి ఘటనకు గల కారణాలను తెలుసుకొని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేర్ టేకర్ల 24గం.ల పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకున్నారు. మరోవైపు పర్యవేక్షణా నిమిత్తం ఐదుగురు మహిళా ఆచార్యులతో కమిటీని నియమించారు.

News July 19, 2024

నిజామాబాద్‌లో కుక్కల బెడదకు చెక్..!

image

నిజామాబాద్ నగరంలో కుక్కల బెడద నివారణకు అధికారులు చర్యలు చేపట్టారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కాలనీల్లో కుక్కల బెడద ఉంటే 08462-220234 నంబర్‌కు కాల్ చేయాలని అధికారులు సూచించారు. అంతేకాకుండా కాలనీల్లో యానిమల్ బర్త్ కంట్రోల్ టీంలను రంగంలోకి దించారు. బృందాల సభ్యులు వీధుల్లోని శునకాలను పట్టుకుని వాటికి సంతాన నియంత్రణ ఆపరేషన్లు చేస్తున్నారు.