India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భారత గ్రాండ్ మాస్టర్, తెలుగు తేజం కోనేరు హంపి ఫీడే మహిళల వరల్డ్ ర్యాపిడ్ చేస్ ఛాంపియన్గా నిలిచారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కోనేరు హంపీకి ‘X’ వేదికగా అభినందనలు తెలిపారు. ఈ వేదికగా ఆమె ఫోటోను జోడించిన ఎంపీ అర్వింద్ ఈ అపూర్వ విజయంతో ఆమె దేశమంతటికీ గర్వకారణంగా నిలిచిందని ప్రశంసించారు.
బిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన బోరెడ్డి అరవింద్ రెడ్డి కెనడా క్రికెట్ జట్టులో ఆడుతూ రాణిస్తున్నాడు. ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లిన అరవింద్ రెడ్డి చదువుతో పాటు ఆ దేశ డొమెస్టిక్ జట్టు తరఫున ఎంపికై అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. దీంతో అతడిని తల్లిదండ్రులు బోరెడ్డి బాలకిషన్ రెడ్డి, మంజులతో పాటు పలువురు అభినందించారు.
NZB జిల్లాలో ఈ ఏడాదికి సంబంధించిన కేసుల వివరాలను ఇన్ ఛార్జ్ CP సింధు శర్మ వెల్లడించారు. శారీరక నేరాలు, ఆస్తి నేరాలు గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది కాస్త ఎక్కువే అయ్యాయి. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ, మృతి చెందిన కేసులు, సైబర్ నేరాలు, పోక్సో, మిస్సింగ్, గేమింగ్ ఆక్ట్ కేసులు కూడా ఎక్కువగానే నమోదయ్యాయి. గతేడాది 356 ఆత్మహత్యలు జరగగా ఈ యేడు 442 జరిగాయి. గాంజా కేసులు 22 నమోదు కాగా 58 మందిని అరెస్ట్ చేశామన్నారు.
మనం ఊరుకుంటే ప్రభుత్వం కదలదు… ప్రతీ ఒక్కరు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. ఆదివారం ఆమె నిజామాబాద్ సభలో మాట్లాడుతూ.. గ్రామ గ్రామాన కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని సూచించారు. కాగా విద్యార్థులు, రైతులు, మహిళలను, ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని దుయ్యబట్టారు.
నిజామాబాద్ కలెక్టరేట్లో సోమవారం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ ఇతర అన్ని జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్లతో జిల్లా కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహిస్తున్నట్టు జిల్లా ఇంటర్ విద్యా అధికారి (DIEO) రవికుమార్ తెలిపారు. ఇంటర్ విద్యార్థులకు మానసిక సంసిద్ధతను పెంపొందించేందుక, విద్యార్థుల్లో ఆంటీ డ్రగ్స్, ఆత్మహత్యల నిరోధించేందుకు తదితర అంశాలపై సమీక్ష జరుపనున్నారని, అందరూ హాజరుకావాలని ఆయన సూచించారు.
గుండెపోటుతో వ్యవసాయ కూలీ మృతి చెందిన ఘటన మిర్దాపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఆర్మూర్ సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. బోధన్ మండలం కందుర్తికి చెందిన ఓ వ్యవసాయ కూలీ మిర్దాపల్లిలో పొలం పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం పొలం గట్టుపై పనిచేస్తుండగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
జైలు నుంచి వచ్చాక తొలి సారిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం డిచ్పల్లికి రాగా అక్కడ మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. హారతులిచ్చి తిలకందిద్దారు. రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, విజి గౌడ్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రెంజల్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో శనివారం నాగుపాము దర్శనం ఇచ్చింది. కార్యాలయంలో పని చేస్తున్న ఓ ఉద్యోగి బాత్రూమ్కి వెళ్లగా అక్కడ పాము కనిపించడంతో ఉద్యోగులకు తెలిపారు. మిగతా ఉద్యోగులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. పాములు పట్టె వారికి సమాచారం ఇవ్వడంతో పామును పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేశారు.
నిజామాబాద్ జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓగా జి. సాయన్న శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇది వరకు జిల్లా సీఈఓగా ఉన్న అధికారి ఉద్యోగ విరమణ చేయడంతో నందిపేట్ ఎండీఓకు ఇన్ఛార్జి బాధ్యతలను అప్పగించారు. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో డీఆర్డీఓ గా విధులు నిర్వహిస్తున్న సాయన్న బదిలీ పై నిజామాబాద్ జిల్లా పరిషత్కు వచ్చారు.
బోధన్ నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ కార్మికులు శనివారం హైదరాబాద్లో ఎమ్మెల్సీ కోదండరాంను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ కార్మికులకు రావాల్సిన వేతన బకాయిలు చెల్లించాలని కోరారు. వేతనాలు లేక కార్మికులు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జనరల్ సెక్రెటరీ ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.