India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నిజామాబాద్ నగర పాలక సంస్థతో పాటు భీంగల్, ఆర్మూర్, బోధన్ మున్సిపాలిటీల మేయర్, ఛైర్మన్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. NZbమేయర్ పదవిని జనరల్ (మహిళ)కు, బోధన్ మున్సిపల్ ఛైర్మన్ అన్ రిజర్డ్వ్డ్కు రిజర్వ్ చేయగా ఆర్మూర్, భీంగల్ మున్సిపల్ ఛైర్మన్ పదవులను జనరల్ మహిళకు రిజర్వ్ చేశారు.

త్వరలో జరగబోయే నగరపాలక సంస్థ ఎన్నికల్లో నిజామాబాద్ కార్పొరేషన్ పదవి మహిళ (జనరల్)కు రిజర్వ్ అయింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ శనివారం ప్రకటన విడుదల చేసింది. గత రెండు పర్యాయాలు మహిళ (జనరల్)కు రిజర్వ్ అవగా BRS నుంచి ఆకుల సుజాత, దండు నీతూ కిరణ్ మేయర్ పదవిని చేపట్టారు. ఈ పర్యాయం BJP, కాంగ్రెస్, BRS, MIM పార్టీలు మేయర్ పదవిని కైవసం చేసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి.

NZB కార్పొరేషన్లో పోటీకి వందలాది ఆశావహులు రెడీ అయ్యారు. 60 డివిజన్లలో కేవలం రెండు ప్రధాన పార్టీల్లోనే 500 మంది దరఖాస్తులు చేసుకున్నారు. కాంగ్రెస్ నుంచి 300 మంది బీజేపీ నుంచి 200 మంది టికెట్లకు అప్లై చేశారు. ఎవరి రూట్లో వారు టికెట్ల లాబీయింగ్ చేసుకుంటున్నారు. బీజేపీ ఇప్పటికే 14 మందికి మీకే టికెట్ అని సంకేతాలు ఇచ్చినట్టు సమాచారం. రిజర్వేషన్లు రాగానే వారి పేర్లు ప్రకటించే ప్లాన్ చేసింది బీజేపీ.

NZB పూసలగల్లి వాసి ఆన్లైన్ ట్రేడింగ్ పేరిట సైబర్ నేరగాళ్ల చేతిలో రూ.1.10 లక్షల మోసానికి గురయ్యాడు. లాభాలు గడించే సూచనలు చేసేందుకు రూ.3 వేలు చెల్లించి తమ గ్రూపులో చేరాలని మెస్సేజ్ వచ్చింది. డబ్బులు చెల్లించగా సైబర్ నేరగాళ్లు అతడి ఫోన్కు ఒక QR కోడ్ పంపించి, దాన్ని స్కాన్ చేస్తే మెళుకువలు తెలుస్తాయన్నారు. అది స్కాన్ చేయగానే బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు మాయమయ్యాయని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

వన్యప్రాణుల వేట కోసం దుండగులు వేసిన ఉచ్చు ఒక పాడిఆవు ప్రాణాలను బలితీసుకుంది. రెంజల్ మండలం దూపల్లికి చెందిన కారె సాయికుమార్ అనే రైతు తన ఆవును మేత కోసం జాన్కంపేట్ శివారులోకి తీసుకెళ్లారు. అడవిపందుల కోసం పేలుడు మందును పశువులకు పెట్టే తవుడులో ముద్దలుగా చేసి ఉంచారు. మేత మేస్తున్న క్రమంలో ఆవు ఆ తవుడు ముద్దను తినగానే ఒక్కసారిగా నోట్లోనే పేలుడు సంభవించి ఆవు నోటిభాగం తీవ్రంగా ఛిద్రమై మృతి చెందింది.

నిజామాబాద్ నగర పాలక సంస్థతోపాటు భీంగల్, ఆర్మూర్, బోధన్ మున్సిపాలిటీల వార్డులకు శనివారం మహిళా రిజర్వేషన్లను ప్రకటించనున్న నేపథ్యంలో పోటీ చేసే ఆశావహుల్లో ఉత్కంఠత నెలకొంది. ఏ స్థానం ఎవరికి రిజర్వు అవుతుందోనని కార్పొరేటర్, కౌన్సిలర్ ఆశావహులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అధికార కాంగ్రెస్, BJP, BRSపార్టీల నేతలు తమ వారిని నిలబెట్టించేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు.

నిజామాబాద్ ITI కాలేజ్ గ్రౌండ్ వద్ద ఎండు గంజాయి అమ్ముతున్నారన్న సమాచారం మేరకు నిన్న ఒకరిని అరెస్ట్ చేసినట్లు 2వ టౌన్ SI సయ్యద్ ముజాయిద్ తెలిపారు. నిందితుడు షేక్ అఫ్రోజ్ అలియాస్ రోడ్డ అఫ్రోజ్ నుంచి 210 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. MH నుంచి గంజాయి తీసుకుని వచ్చి NZBలో అమ్ముతుంటాడని, ఇతడిపై వివిధ PS లలో గంజాయికి సంబంధించిన కేసులు 13కు పైగా ఉన్నాయన్నారు.

మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో భాగంగా జిల్లాలోని NZB నగరపాలక సంస్థతో పాటు భీంగల్, ఆర్మూర్, బోధన్ మున్సిపాలిటీల వార్డులకు మహిళా రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు శనివారం డ్రా జరుపుతున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. దీని కోసం నిర్వహించే సమావేశానికి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సకాలంలో హాజరు కావాలని కలెక్టర్ కోరారు.

తెలంగాణ మోడల్ స్కూల్స్లో 2026– 27 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతి, 7- 10 తరగతుల ఖాళీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. JAN 28 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. హాల్ టికెట్లు ఏప్రిల్ 9 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 19న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. వివరాల కోసం https://tgms.telangana.gov.inలో సంప్రదించాలని డైరెక్టర్ నవీన్ నికోలస్ ఒక ప్రకటనలో తెలిపారు.

తెలంగాణ మోడల్ స్కూల్స్లో 2026– 27 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతి, 7- 10 తరగతుల ఖాళీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. JAN 28 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. హాల్ టికెట్లు ఏప్రిల్ 9 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 19న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. వివరాల కోసం https://tgms.telangana.gov.inలో సంప్రదించాలని డైరెక్టర్ నవీన్ నికోలస్ ఒక ప్రకటనలో తెలిపారు.
Sorry, no posts matched your criteria.