India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పెళ్లి కాలేదనే మనస్తాపంతో యువతి హుస్సేన్సాగర్లో దూకి <<19029844>>ఆత్మహత్యకు<<>> పాల్పడింది. పోలీసుల వివరాలు.. విజయలక్ష్మి అనే యువతి తల్లితో కలిసి మైత్రినగర్లో ఉంటుంది. ఇటీవల విజయలక్ష్మికి పెళ్లి సంబంధాలు రావడంతో వివాహం అనంతరం తల్లి దివ్యాంగురాలు కావడంతో తనతో పాటే ఉంటుందని చెబుతుండటంతో సంబంధాలు వెనక్కిపోయాయి. దీంతో మనస్థాపంతో విజయలక్ష్మి హుస్సేన్సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదుచేశారు.

కేతేపల్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. తుంగతుర్తి గ్రామానికి చెందిన మేకల కాపరి జటంగి సైదులు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందారు. సోమవారం మేకల మేత కోసం చెట్టు కొమ్మలు కొడుతుండగా కాలు జారి పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో పడిపోయారు. దీంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

పిల్లలతో సహా తల్లి విజయ ఆత్మహత్య కేసు మిస్టరీగానే మిగిలింది. దుబాయ్ నుంచి <<19026610>>భర్త సురేందర్రెడ్డి<<>> వచ్చినా కారణాలు వెలుగులోకి రాలేదు. తన భార్య స్ట్రాంగ్ ఉమెన్, అలా ఎందుకు చేసిందో అర్థం కావడం లేదని కన్నీరుమున్నీరయ్యారు. JAN 29న ఫోన్లో IIT సీటు కొడతా నాన్న అని చెప్పిన తన కూతరి మాటలు తలుచుకొని ఆయన బోరునవిలపించారు. తన పుట్టినరోజే ఇలా జరగడం తట్టుకోలేక, ఎవరి కోసం బతకాలి? అంటూ భావోద్వేగానికి లోనైయ్యారు.

ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతోంది. సోమవారం మొత్తం 24 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను వెనక్కి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎదులాపురంలో 19, మధిర, వైరాలో రెండేసి, కల్లూరులో ఒకటి చొప్పున ఉపసంహరణలు జరిగాయి. సత్తుపల్లిలో ఎవరూ వెనక్కి తగ్గలేదు. నేడు ఉపసంహరణకు చివరి రోజు కావడంతో మరిన్ని విత్డ్రాలు జరిగే అవకాశం ఉంది.

మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో B.P.Ed & D.P.Ed సెమిస్టర్-1 రెగ్యులర్ సంబంధిచి పరీక్షలో స్వల్ప మార్పు చేస్తున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ ఉపేందర్రెడ్డి తెలిపారు. ఈనెల 11వ తారీఖున మున్సిపల్ ఎన్నికలు కారణంగా ఆరోజు జరగవలసిన పరీక్షను 13వ తేదీకి రీ-షెడ్యూల్ చేసినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని సంబంధిత కళాశాలలు, విద్యార్థులు గమనించాలని ఆయన కోరారు.

తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయ్స్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) 2026 నూతన క్యాలెండర్, డైరీని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, డీఆర్వో సంగీతతోపాటు ట్రెసా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ కుమార్, జిల్లా అధ్యక్షుడు జనార్దన్ఋరావు పాల్గొన్నారు. రెవెన్యూ సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు.

మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో MA హిస్టరీ, టూరిజం సెమిస్టర్-1( R-25) సంబంధించిన పరీక్షల టైం టేబుల్ని యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. ఈనెల 10 నుంచి 20 మధ్య పరీక్షలు జరుగుతాయని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ ఉపేందర్రెడ్డి తెలిపారు. సంబంధిత కళాశాలలు, విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు. పూర్తి పరీక్షల టైం టేబుల్కు అధికారిక ఎంజీయూ వెబ్సైట్ను సందర్శించాలన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదివి టాపర్లుగా నిలిచే 10TH విద్యార్థులకు గుడ్ న్యూస్. స్టేట్ ర్యాంకర్కు రూ.5లక్షల నగదు బహుమతి, జిల్లా టాపర్లకు రూ.2లక్షలు, నియోజకవర్గ, మండల టాపర్లకు రూ.10వేలు అందజేస్తామని DRO వెంకటాచారి తెలిపారు. కలెక్టరేట్లో ‘చదువుకో తెలంగాణ’ గోడపత్రికను ఆయన లక్డీకాపూల్లో ఆవిష్కరించిన సందర్భంగా ఈ మేరకు ప్రకటన వెల్లడించారు. ఈ పథకంతో మొత్తం రూ.2.2కోట్ల బహుమతులు అందించనున్నట్లు పేర్కొన్నారు.

ఎన్నికల్లో అభ్యర్థులు బీ ఫాం పొంది పోటీ చేయాల్సి ఉంటుంది. అయితే బీ ఫాం లేకుండా పోటీచేస్తే ఎన్నికల అధికారులు వారిని ఇండిపెండెంట్లుగా పరిగణిస్తారు. అయితే బీఫాం అంటే ఏంటో చాలామందికి తెలియదు. బీ ఫాం అంటే గుర్తింపు పొందిన పార్టీలు అభ్యర్థులను తమ పార్టీ తరఫున ఎన్నికల్లో నిలబెడుతున్నట్లు ప్రతిపాదిస్తూ అధికారికంగా ప్రకటించడం. పార్టీ అధ్యక్షుడు లేదా పరిశీలకుడు సదరు అభ్యర్థిని ఎంపిక చేసి బీ ఫాం అందజేస్తారు.

ప్రజల నుంచి తిరస్కారం పొందిన నేటితరం నేతలకు పదవి వ్యామోహం పోవడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాదులో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో పదవులన్నీ కేసీఆర్ కుటుంబం అనుభవించిందని పేర్కొన్నారు. వందల ఎకరాల ఫాంహౌస్, రూ.వేల కోట్ల వ్యాపారాలు మీకు ఎలా వచ్చాయని CM ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు చేయాల్సిన తప్పులన్నీ చేశారని మండిపడ్డారు.
Sorry, no posts matched your criteria.