India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
∆} ఖమ్మం జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ∆} ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ∆} ఖమ్మంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటన ∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సెలవు ∆} పలు శాఖల అధికారులతో ఖమ్మం జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన
శ్రీ రామనవమి శోభాయాత్ర సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలుంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. శోభాయాత్ర ఉదయం 9 గంటలకు సీతారాంబాగ్ నుంచి ప్రారంభమై సుల్తాన్ బజార్ వరకు కొనసాగుతుందని వారు పేర్కొన్నారు. ఈ మార్గంలో ఉన్న ప్రాంతాల్లో ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ డైవర్షన్ అమలులో ఉంటుందని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకొని ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు.
CM రేవంత్ రెడ్డి భద్రాచలం పర్యటన ఖరారైంది. ఆదివారం ఉదయం 10 గంటలకు హెలికాప్టర్లో సారపాకలోని గెస్ట్ హౌస్కు చేరుకుంటారు. 10:30కు భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామిని దర్శించుకుంటారు. 11:10 నుంచి 12.30 వరకు మిథిలా స్టేడియంలో జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటారు. 12:35కు సారపాకలో సన్నబియ్యం లబ్ధిదారుడి నివాసంలో భోజనం చేయనున్నారు. అనంతరం ఐటీసీ గెస్ట్ హౌస్ నుంచి HYDకు తిరుగుపయనమవుతారు.
నల్గొండ ఎస్పీ కార్యాలయంలో పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన యువ తేజం మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. ఈ జాబ్ మేళాకు 6497 మంది పైగా నిరుద్యోగ యువతీ, యువకులు హాజరు కాగా, 3033 మంది ఉద్యోగాలకు ఎంపికకాగా, వారికి ఎస్పీ శరత్ చంద్ర పవార్ నియామక పత్రాలు అందజేశారు. చదువుకున్న యువత చెడు వ్యసనాలకు లోనవకుండా ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఎస్పీ సూచించారు.
మునుగోడు నియోజకవర్గం ప్రపంచంలోనే అత్యధిక ఫ్లోరైడ్ ఉన్న ప్రాంతమని స్థానిక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో మిషన్ భగీరథ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ట్యాంకుల్లో బోరు, భగీరథ నీళ్లు కలుస్తున్నాయని, దీనికి స్వస్తి పలకాలన్నారు. శుద్ధి చేసిన తాగునీరందేలా శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. అధికారులు, నాయకులు అలర్ట్గా ఉండి తాగునీటి సమస్య లేకుండా చూడాలని పేర్కొన్నారు.
MBNR జిల్లా కోయిలకొండలోని మహిమాన్విత క్షేత్రమైన శ్రీరామకొండ సాక్షాత్తు శ్రీరామచంద్రుడి పాదం స్వయంభుగా వెలసిన క్షేత్రంగా విరాజిల్లుతోంది. శ్రీరాముడు వనవాస కాలంలో ఇక్కడ తన పాదం మోపి సేదతీరినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకుని వెళ్లే సమయంలో ఇక్కడ ఒక మూలికపడి కొండ మొత్తం వనమూలికలకు ప్రసిద్ధగా మారిందని ప్రజలు నమ్ముతారు. ఇక్కడి కోనేరులో నీరు ఎల్లప్పుడూ ఉండడం విశేషం.
మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ మండలంలోని శ్రీరామకొండపై వెలసిన స్వయంభు శ్రీరామపాద ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామకొండ క్షేత్రంలో శ్రీసీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నట్లు శ్రీరామకొండ అర్చకుడు రాఘవేంద్రరావు తెలిపారు. శనివారం శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయం నుంచి శ్రీరామకొండ వరకు శ్రీసీతారాముల పల్లకీ సేవ నిర్వహించామన్నారు. ఆదివారం ఉ.11.45 గంటలకు జరిగే కళ్యాణంలో భక్తులు పాల్గొనాలని కోరారు.
విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి చెందిన ఘటన కొల్చారం మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ మహమ్మద్ గౌస్ తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని వరిగుంతం గ్రామానికి చెందిన పోచయ్య (39) తాను నూతనంగా నిర్మిస్తున్న ఇంటి గోడపై నీరు పడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి గాయాలపాలయ్యాడు. ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు తెలిపారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ నుంచి చించోలి వరకు జాతీయ రహదారి నెంబర్-167 ప్రధాన రహదారి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. బ్రిడ్జి నిర్మాణ పనుల్లో భాగంగా ప్రయాణికులు, వాహనదారులు రాత్రి సమయంలో జాగ్రత్తగా వెళ్లాలని అధికారులు సూచించారు. మొత్తం రూ.706.08 కోట్ల వ్యయంతో 108 కిలోమీటర్ల రహదారిని మహబూబ్నగర్ నుంచి చించోలి వరకు నిర్మిస్తున్నారు.
వరంగల్ జిల్లా నిరుద్యోగ యువతీయువకులకు ఈ నెల 11న టాస్క్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేస్తున్న మెగా జాబ్ మేళా పోస్టరును కలెక్టర్ సత్య శారదా దేవి, మేయర్ గుండు సుధారాణితో మంత్రి సురేఖ శనివారం ఆవిష్కరించారు. జిల్లాలో నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. జిల్లా పర్యటనలో భాగంగా జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు.
Sorry, no posts matched your criteria.