India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఏడుపాయల వనదుర్గా మాత జాతరను ఎల్లలు దాటేలా ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమీక్షలో భక్తులకు ఇబ్బందులు లేకుండా పార్కింగ్, తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం, వైద్య సేవలు, క్యూలైన్లు, సీసీ కెమెరాలు, అగ్నిమాపక ఏర్పాట్లు చేయాలని సూచించారు. అధిక ధరలు, కల్తీ ఆహారం, మత్తు పదార్థాల విక్రయంపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

మాడుగులపల్లి మండలం సీత్యతండాలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భార్య లక్ష్మి తన భర్త రవిని అతికిరాతంగా హతమార్చింది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసుల విచారణలో లక్ష్మీ నేరాన్ని ఒప్పుకొని లొంగిపోయింది. అన్యోన్యంగా ఉన్న కుటుంబంలో ఈ దారుణం జరగడంతో తండాలో విషాద ఛాయలు అలముకొన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రసిద్ధ ఏడుపాయల వనదుర్గా భవానీ మాత జాతరను అత్యంత ఘనంగా నిర్వహించాలని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులతో కలిసి ఆయన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, జాతర పరిసరాల్లో ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేపట్టి పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికల్లో మహిళా ఓటర్లే నిర్ణయాత్మక శక్తిగా మారారు. మొత్తం 93,020 మంది ఓటర్లలో పురుషుల (45,128) కంటే మహిళలే (47,878) అధికంగా ఉన్నారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి ఏ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంటే, ఆ పార్టీయే ఇక్కడ ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకుంటూ వస్తోంది. ఈ సెంటిమెంట్ ఈసారి కూడా రిపీట్ అవుతుందో లేదో చూడాలి.

మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లు జరుగకుండా ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని NZB కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. బుధవారం ఆమె బాన్సువాడలోని మున్సిపల్ కార్యాలయంలో నిర్వహిస్తున్న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించి మాట్లాడారు. బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు.

మేడిపల్లిలో అర్ధరాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. మౌలాలిలో శుభకార్యానికి 8మంది BTECH విద్యార్థులు వెళ్లారు. ఫంక్షన్ అనంతరం పోచారంలో ఉండే స్నేహితులను దింపేందుకు కారులో బయలుదేరారు. మేడిపల్లికి చేరగానే అదుపు తప్పిన కారు ఎలివేటెడ్ పిల్లర్ను ఢీకొట్టింది. నిఖిల్(22), సాయివరుణ్(23) అక్కడికక్కడే చనిపోయారు. ఒకరికి తీవ్ర, నలుగురికి స్పల్ప గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

చిన్నచింతకుంట మండలం అమ్మాపురం గ్రామ శివారులో శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థానంలో స్వామివారి దిగుడుమెట్లు దాతల సహకారంతో బుధవారం ప్రారంభించారు. దేవాలయం ఛైర్మన్ గౌని గోవర్ధన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు సత్యనారాయణ, శ్రీనివాసులు ఆలయ సిబ్బంది ఆర్.శివానంద చారి, భాస్కర చారి తెలుగు శ్రీనివాసులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

ఉమ్మడి జిల్లాలో ఒక కార్పొరేషన్, 18 మున్సిపాలిటీలకు జరగనున్న ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. మున్సిపాలిటీల్లో పోటీచేసే SC,ST,BC అభ్యర్థులు రూ.1,250,ఇతరులు రూ.2,500 డిపాజిట్ చేయాలి. అదేవిధంగా కార్పొరేషన్లలో పోటీచేసే రిజర్వ్డ్ కేటగిరీఅభ్యర్థులు రూ.2,500, జనరల్ రూ.5,000 చెల్లించాల్సి ఉంటుంది. రిజర్వేషన్లు పొందే అభ్యర్థులు నామినేషన్ ఫారంతోపాటు తప్పనిసరిగా కుల ధ్రువీకరణపత్రాన్ని జతచేయాలి.

GHMCలో 27 ULBల విలీనంతో 300 డివిజన్లు, 60 సర్కిళ్లకు విస్తరించింది. బర్త్, డెత్ ధ్రువీకరణలను డిజిటల్గా అప్గ్రేడ్ చేశారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులను అనుసంధానించి, వార్డు, సర్కిల్ మ్యాపింగ్తో కొత్త ఆన్లైన్ అప్లికేషన్ను అమల్లోకి తీసుకొచ్చారు. మీసేవ కేంద్రాల ద్వారా ఆస్పత్రి లేదా ఫీల్డ్ వెరిఫికేషన్ ఆధారంగా దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతో ప్రజలకు సేవలు త్వరితగతిన అందనున్నాయి.
#SHARE IT

మహానగరంతోపాటు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ తగ్గుతోందా అంటే అవుననే సమాధానం వస్తోంది. 2024తో పోలిస్తే 2025లో ఇళ్ల కొనుగోళ్లు తగ్గాయని రిజిస్ట్రేషన్ గణాంకాలు చెబుతున్నాయి. 2024లో 76,613 ఇళ్లు రిజిస్ట్రేషన్ జరగ్గా 2025లో 75,222 ఇళ్లకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ లెక్కలు చూస్తే మరి ఈ ఏడాది ఎలా ఉంటుందోనని రియల్ వర్గాలు పేర్కొంటున్నాయి.
Sorry, no posts matched your criteria.