Telangana

News April 4, 2026

పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ రాజర్షి షా

image

బజార్‌హత్నూర్ మండలం దిగ్నూర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను కలెక్టర్ రాజర్షి షా శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజన నాణ్యతను స్వయంగా పరిశీలించారు. పాఠశాలలో వండిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన కలెక్టర్, మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని నిర్వాహకులను ఆదేశించారు.

News April 4, 2026

KNR: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

KNR జిల్లా తిమ్మాపూర్ లోని SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో మహిళలకు “బ్యూటీ పార్లర్ మెనేజ్ మెంట్” లో ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ డీ. సంపత్ తెలిపారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలు 18-45 సం.ల వారు అర్హులు అవుతారని పేర్కొన్నారు. ఏప్రిల్ 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, శిక్షణ ఏప్రిల్ 9న ప్రారంభమవుతుంది. శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి ఉంటుందన్నారు.

News April 4, 2026

HYD: కనిపిస్తే కాల్ చేయండి: సీపీ

image

మామిడి పండ్ల సీజన్ ఇంకా పూర్తిగా రాకముందే నిగనిగలాడే పండ్లు మనకు మార్కెట్‌లో అక్కడక్కడా కనిపిస్తున్నాయి. అయితే వాటిని కెమికల్స్‌తో మగ్గబెట్టడటంతో అలా కనిపిస్తాయి. అవి తింటే ఆరోగ్యానికి హానికరం. అందుకే కల్తీ మామిడి పండ్ల గురించి సమాచారం ఉంటే పోలీసులకు ఫోన్ చేయాలని సిటీ కమిషనర్ సజ్జనార్ సూచిస్తున్నారు. 100, 8712661212 నంబర్లకు ఫోన్ చేసి చెప్పాలని కోరారు.

News April 4, 2026

సిటీ నుంచి ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రకు కొత్త విమానాలు

image

శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఏపీలోని విజయవాడ, రాజమండ్రి, కర్ణాటకలోని హుబ్బళ్లికి ఈనెల 10 నుంచి కొత్త విమానాలు ప్రారంభం కానున్నాయి. ఫ్లై 91 సంస్థ ఈ విమాన సర్వీసులను ప్రారంభించనుంది. ప్రతి రోజూ రెండు సర్వీసులు ప్రయాణికులకు సేవలందిస్తాయి. వీటితోపాటు షోలాపూర్‌కూ సర్వీసులు నడుపుతామని కంపెనీ సీఈఓ మనోజ్ తెలిపారు.

News April 4, 2026

సిటీ నుంచి ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రకు కొత్త విమానాలు

image

శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఏపీలోని విజయవాడ, రాజమండ్రి, కర్ణాటకలోని హుబ్బళ్లికి ఈనెల 10 నుంచి కొత్త విమానాలు ప్రారంభం కానున్నాయి. ఫ్లై 91 సంస్థ ఈ విమాన సర్వీసులను ప్రారంభించనుంది. ప్రతి రోజూ రెండు సర్వీసులు ప్రయాణికులకు సేవలందిస్తాయి. వీటితోపాటు షోలాపూర్‌కూ సర్వీసులు నడుపుతామని కంపెనీ సీఈఓ మనోజ్ తెలిపారు.

News April 4, 2026

నల్గొండ: ALERT.. నేడే లాస్ట్ డేట్..!

image

ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల దరఖాస్తుకు నేడే (ఏప్రిల్ 4) చివరి తేదీ. ఆ తర్వాత దరఖాస్తు చేసుకునే వారికి భారీగా ఆలస్య రుసుము వర్తిస్తుందని అధికారులు తెలిపారు. ఏప్రిల్ 15 లోగా రూ.250, 20 లోగా రూ.2,500, 24 లోగా రూ.5,000 అదనంగా చెల్లించాలి. మే 2 వరకు దరఖాస్తు చేసుకునే వారు ఏకంగా రూ.10వేలు లేట్ ఫీ కట్టాల్సి ఉంటుంది. విద్యార్థులు గమనించి వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News April 4, 2026

సీఎం పర్యటన ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి: కలెక్టర్

image

CM ఈనెల 6న జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు జరగకుండా ప్రోటోకాల్ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని స్పష్టం చేశారు. ప్రారంభోత్సవాలు, శిలాఫలకాల ఆవిష్కరణల వద్ద అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేటాయించిన విభాగాల వద్దే ప్రజా ప్రతినిధులు, అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.

News April 4, 2026

జడ్చర్ల: అడవి పంది దాడిలో గాయపడ్డ రైతు మృతి

image

జడ్చర్ల మండలం ఉదండాపూర్ గ్రామంలో శుక్రవారం ఉదయం అడవి పంది దాడిలో గాయపడ్డ రైతు రామకృష్ణ హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. ఆయనకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. నిరుపేద అయిన బాధిత రైతు కుటుంబానికి ప్రభుత్వపరంగా ఆర్థిక సహాయం అందించాలని స్థానికులు కోరుతున్నారు.

News April 4, 2026

నవాబుపేట: రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

image

కాకర్లపహాడ్ వద్ద చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడి, పరిస్థితి విషమంగా ఉండటంతో మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఆ వ్యక్తిని గుర్తించిన వారు ఎవరైనా ఉంటే నవాబుపేట ఎస్సై విక్రమ్‌కు ఫోన్ ద్వారా 8712659340 సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. బంధువులు లేదా తెలిసిన వారు ఎవరైనా ఉంటే త్వరగా స్పందించాలని అధికారులు కోరుతున్నారు.

News April 4, 2026

ఆదిలాబాద్: CM పర్యటనపై కలెక్టర్ సమీక్ష

image

ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ నెల 6న జరిగే సీఎం పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్ రాజర్షిషా సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయడానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు హెలిప్యాడ్ వద్ద ముఖ్యమంత్రి చేరుకుని, అనంతరం సభా ప్రాంగణంలో అభివృద్ధి పనుల శిలాఫలకాలను ఆవిష్కరిస్తారని తెలిపారు.