India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి మంగళవారం ఉదయం 11 గంటలకు 29 గేట్ల ద్వారా 1.25లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఎగువ నుంచి 1.50 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. 29 వరద గేట్ల నుంచి కాకుండా ఇందిరమ్మ కాల్వ ద్వారా 18 వేలు, కాకతీయ కాల్వ ద్వారా 4500 క్యూసెక్కులు వెరసి మొత్తం 1,51,897 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. కాగా 1090 (76.894TMC) అడుగులకు నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని రోజులుగా భారీ వర్షం కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే సెప్టెంబర్ 1న ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు మండలంలో అత్యధిక వర్షపాతం 105.8 mm వర్షపాతం నమోదయింది. ఆ తర్వాత ఇచ్చోడ లో 102.0mm, ఆదిలాబాద్ రూరల్ మండలం పిప్పల్ధరిలో 101.0mm వర్షపాతం నమోదయింది. ఈరోజు కూడా జిల్లాలో భారీ వర్షాలు ఉన్నాయని.. ప్రజలు జాగ్రత్త వహించాలని వాతావరణ కేంద్రం తెలిపింది.
దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన ఖైరతాబాద్ గణేశుడిని మొదటిసారి 1954లో స్వాతంత్ర్య సమరయోధుడు సింగరి శంకరయ్య ప్రతిష్టించారు. సమాజ ఐక్యతకు బాలగంగాధర్ తిలక్ పిలుపు నుంచి ప్రేరణపొంది దీనిని రూపొందించారు. మహా గణపతిని ప్రతిష్ఠించినప్పుడు ఎత్తు కేవలం అడుగు మాత్రమే. బడా గణేశ్ను ఎందరో ప్రముఖులు దర్శించుకున్నారు. దర్శించుకుంటున్నారు. ఈ క్రమంలో బడా గణేశ్కు NTR పూజలు చేసిన ఫొటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.
రాచకొండ పోలీసులు గణపతి నిమజ్జనాల వేళ ప్రజలకు సూచనలు చేశారు.
✓ కరెంటు తీగలు జాగ్రత్త
✓ వాహనం రివర్స్ చేయొద్దు
✓ డ్రైవర్ మద్యం తాగి ఉండకూడదు
✓ పిల్లలు వాహనం వెంబడి రాకూడదు
✓ ప్రతి వాహనానికి ఇన్చార్జ్లు ఉండాలి
✓ పెద్ద విగ్రహాలకు ముందే పోలీసులకు సమాచారం ఇవ్వాలి
✓ క్రేన్ దగ్గర దూరం పాటించాలి
లండన్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో HYDకు చెందిన ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. 2 కార్లు ఎదురెదురుగా ఢీకొనగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతులను నాదరుల్ చెందిన తర్రె చైతన్య (22), ఉప్పల్కు చెందిన రిషితేజ (21)గా పోలీసులు గుర్తించారు. గణేశ్ నిమజ్జనం చేసి వస్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్టు అధికారులు తెలిపారు.
లండన్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో HYDకు చెందిన ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. 2 కార్లు ఎదురెదురుగా ఢీకొనగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతులను నాదరుల్ చెందిన తర్రె చైతన్య (22), ఉప్పల్కు చెందిన రిషితేజ (21)గా పోలీసులు గుర్తించారు. గణేశ్ నిమజ్జనం చేసి వస్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్టు అధికారులు తెలిపారు.
నల్గొండలోని నలంద ఫార్మసీ కళాశాల యాజమాన్యం తమకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని విద్యార్థులు తెలంగాణ మానవ హక్కుల కమిషన్కి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన హెచ్ఆర్సీ ఛైర్మన్ షమీమ్ అక్తర్, బీ ఫార్మసీ పూర్తి చేసిన విద్యార్థులకు వారి టీసీ, ఇతర సర్టిఫికెట్లను వెంటనే అందజేయాలని సోమవారం ఆదేశాలు జారీ చేశారు.
ఇందిరమ్మ ఇల్లు కట్టకుండానే ఖాతాలో రూ. లక్ష జమయిన ఘటన కామేపల్లి మండలం రేపల్లెవారి గ్రామం జాగన్నతండాలో జరిగింది. బాధితుడు తేజావత్ రవి వివరాలిలా.. ‘నాకు ఇల్లు మంజూరయిన విషయం అధికారులు చెప్పలేదు. కానీ నా ఖాతాలో రూ. లక్ష జమకాగా ఆరా తీయగా ఇల్లు మంజూరయిందని తెలిసింది. ఈ ఘటనపై కలెక్టర్కు ఫిర్యాదు చేశాను. ఇల్లు కట్టుకునేందుకు అనుమతి ఇవ్వాలి’ అని ప్రభుత్వాన్ని వేడుకున్నాడు.
అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు సమయానికి నాణ్యమైన పోషక ఆహారం అందించాలని HYD కలెక్టర్ హరి చందన సంబంధిత సిబ్బందికి సూచించారు. సోమవారం యూసుఫ్గూడ ఆరోగ్యనగర్లోని నాట్కో అంగన్వాడీ కేంద్రం, సుభాష్నగర్లోని మరో అంగన్వాడీ కేంద్రాన్ని ఆమె సందర్శించి పరిశీలించారు. పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు నాణ్యమైన పోషకాహారం అందించాలన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ముందుగా జిల్లా ప్రజాపరిషత్, మండల ప్రజా పరిషత్ ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ZPTC సభ్యుల ఎన్నికకు గులాబీ రంగు బ్యాలెట్ పత్రం, MPTC సభ్యుల ఎన్నికకు తెలుపు రంగు బ్యాలెట్ పత్రం ఇచ్చేందుకు నిర్ణయించారు. అయితే 42 శాతం రిజర్వేషన్లకు ఆమోదం లేనప్పటికీ ప్రత్యామ్నాయ మార్గంలో ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోందని అధికారులు పేర్కొంటున్నారు.
Sorry, no posts matched your criteria.