Telangana

News September 28, 2024

అలంపూర్: మీసాల యోగ నరసింహస్వామి ఏకైక ఆలయం

image

అలంపూర్ తుంగభద్ర నది సమీపంలో తొమ్మిదవ శతాబ్దం కాలంనాటి పురాతన ఆలయం మీసాల యోగ నరసింహ స్వామి దేవాలయం. ఈ ఆలయంలోని నరసింహస్వామి మీసాలు ఉండి యోగ ముద్రలో దర్శనమిస్తున్నారు. కళ్యాణి చాణిక్య రాజులు నిర్మించిన ఈ ఆలయాన్ని శ్రీకృష్ణదేవరాయలు 16 శతాబ్దంలో అభివృద్ధి చేశారు. మండపంలో పురాతనమైన గంట, పద్మనాభ స్వామి విగ్రహం, ఆలువార్లు శిలా విగ్రహాలు చూడదగ్గవి. ఆలయం ఎదురుగా దండ ఆంజనేయస్వామి, రాతి ధ్వజస్తంభం ఉంది.

News September 28, 2024

NZB: వచ్చే నెల 5న TGO అసోసియేషన్ ఎన్నికలు

image

తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా శాఖ ఎన్నికలు వచ్చే నెల (అక్టోబర్)5 నిర్వహించనున్నట్లు ఎన్నికల నిర్వహణ అధికారి, MVI కె.శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ నగరంలోని టీఎన్జీవో కార్యాలయంలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 5న నామినేషన్లు, స్క్రూటినీ, విత్ డ్రాలతో పాటు ఎన్నిక పక్రియ ఉంటుందని ఆయన వివరించారు.

News September 28, 2024

కరీంనగర్: కాంగ్రెస్‌పై బండి సంజయ్ హాట్ కామెంట్స్

image

కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై హాట్ కామెంట్స్ చేశారు. మూసీ హైడ్రా కూల్చివేతలు, 6 గ్యారంటీలు, మాజీ సర్పంచులకు నిధుల అంశాలే కాంగ్రెస్ కొంప ముంచబోతున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా కాంగ్రెస్ తలగొక్కోంటోందని, ప్రభుత్వ తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అన్నారు.

News September 28, 2024

కరీంనగర్: రోడ్లకు మరమ్మతులు చేపట్టండి: కలెక్టర్

image

భారీవర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, విద్యుత్ స్తంభాలు, పైపులైన్లు, కల్వర్టులకు మరమ్మత్తులు చేయించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, మిషన్ భగీరథ, మున్సిపల్, ఎన్పీడీసీఎల్ తదితరశాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఆగస్టు 31 నుంచి ఈనెల 8 వరకు కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయించాలన్నారు.

News September 28, 2024

MNCL: వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

image

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాయికుంట సంతోష్ నగర్ కాలనీలోని ఓ ఇంట్లో రహస్యంగా నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై శనివారం టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. తమకు అందిన సమాచారంతో వ్యభిచారం నిర్వహిస్తున్న తోట మహేందర్, ఓ మహిళ, విటుడు బోలెం శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు.

News September 28, 2024

తాపడం పనులను ప్రారంభించాలి: మంత్రి సురేఖ

image

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ విమాన గోపురానికి బంగారు తాపడం పనులను ప్రారంభించేందుకు సీఎం రేవంత్ రెడ్డి అనుమతినిచ్చారని, వెంటనే పనులు ప్రారంభించాలని మంత్రి సురేఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బంగారు తాపడం పనుల బాధ్యతను M/s స్మార్ట్ క్రియేషన్స్ కంపెనీకి ప్రభుత్వం అప్పగించింది. ఈ పనులను బ్రహ్మోత్సవాల నాటికి ముందే 2025 మార్చిలోపే పూర్తిచేయాలని మంత్రి సురేఖ అధికారులకు సూచించారు.

News September 28, 2024

NZB: ఎమ్మెల్సీ కవిత కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కనిపించడం లేదని నగరానికి చెందిన తెలంగాణ ఉద్యమకారులు ఆదే ప్రవీణ్ కుమార్, కోనేటి సాయికుమార్, ఈర్ల శేఖర్ శనివారం వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆరు నెలలుగా కవిత కనిపించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. లిక్కర్ కేసులో బెయిల్ పై విడుదలైనా కూడా ఆమె జిల్లాలో కనిపించడం లేదన్నారు. ఆమెను వెతికి జిల్లా ప్రజల ముందు ఉంచాలని కోరారు.

News September 28, 2024

HYD: స్నాతకోత్సవంలో పాల్గొన్న రాష్ట్రపతి

image

నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం 21వ స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ ఛాన్సలర్, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే కోర్సులను విజయవంతంగా పూర్తి చేసుకున్న విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు.

News September 28, 2024

మిర్యాలగూడలో రామ్‌నగర్ బన్నీ చిత్ర యూనిట్

image

బుల్లి తెర నటుడు ప్రభాకర్ తనయుడు నటించిన రామ్ నగర్ బన్నీ టీం మిర్యాలగూడలో సందడి చేసింది. పట్టణంలో ఓ కళాశాలలో మూవీకి సంబంధించిన ప్రోమో జరిగింది. ప్రభాకర్‌తో పాటు హీరోహీరోయిన్లు హాజరయ్యారు. నేటి యువతను ఆకర్షించే విధంగా ఈ చిత్రం ఉంటుందని, ప్రతీ ఒక్కరూ సినిమాను ఆదరించాలని అన్నారు. కళాశాల ప్రిన్సిపల్ శ్రీనాథ్, యాజమాన్యం వారిని ఘనంగా సన్మానించారు.

News September 28, 2024

డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేకనే జగన్ దర్శనం క్యాన్సిల్ చేసుకున్నాడు: బండి

image

తిరుమల దర్శనం కోసం డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేకనే ఏపీ మాజీ సీఎం జగన్ దర్శనాన్ని క్యాన్సిల్ చేసుకున్నాడని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ప్రస్తుత పరిణామాలు, జగన్ వ్యాఖ్యలు చూస్తుంటే నిజంగానే లడ్డు అపవిత్రత అయిందని అనిపిస్తుందన్నారు.హిందూ మతంపై దాడి జరిగినప్పుడు కేవలం RSS, VHP లాంటి సంస్థలే పోరాడుతాయని ఊరుకుంటే సరిపోదని, ప్రతి ఒక్క హిందువు కొట్లాడాలన్నారు.