Telangana

News March 17, 2024

NLG: మోగిన నగారా… గెలుపు కోసం పార్టీల వ్యూహాలు

image

సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగడంతో ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్ సభ స్థానాల్లో గెలుపు కోసం ప్రధాన పార్టీల నేతలు వ్యూహాలకు పదును పెడుతున్నారు. పోలింగ్ కు సుమారు రెండు నెలల సమయం ఉండటంతో ప్రధాన పార్టీల్లో ప్రచారం, అభ్యర్థి చేసే ఖర్చుపై కొంత చర్చ సాగుతోంది. రెండు సెట్టింగ్ స్థానాలను నిలబెట్టుకునేలా అధికార పార్టీ ఓవైపు పావులు కదుపుతుండగా.. మరో వైపు బిఆర్ఎస్, బిజెపిలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి.

News March 17, 2024

జనగామ: పార్లమెంట్ ఎన్నికలు ముగిసే వరకు ప్రజావాణి రద్దు

image

పార్లమెంట్ ఎన్నికల ముగిసే వరకు జనగామ జిల్లాలో ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాష ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తదుపరి ప్రజావాణి కార్యక్రమ తేదీల వివరాలను ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత తెలియజేస్తామని తెలిపారు. కావున ప్రజలు ఈ విషయాన్ని గమనించి అర్జీలతో కలెక్టరేట్ కు రావద్దని సూచించారు.

News March 17, 2024

వనపర్తి: విద్యుదాఘాతంతో ఒకరి మృతి

image

వనపర్తి మండలంలోని పెద్దగూడెం గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలంలో విద్యుదాఘాతంతో ఒకరు మృతి చెందిన సంఘటన ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన ఖలీల్ ట్రాన్స్ఫార్మర్ వద్ద వ్యవసాయ బోరుకు సంబంధించిన విద్యుత్తు కనెక్షన్ పనులు చేస్తుండగా అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా కావడంతో అతను అక్కడికక్కడ మృతి చెందాడు. ఈఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 17, 2024

ఉద్యోగ నోటిఫికేషన్లు: HYDలో ఇదీ పరిస్థితి..!

image

గ్రూప్‌-1‌, DSC నోటిఫికేషన్లతో HYD‌లోని లైబ్రరీలకు తాకిడి పెరిగింది. అమీర్‌పేట, అశోక్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్‌‌లోని కోచింగ్‌ సెంటర్లు కిటకిటలాడుతున్నాయి. TGలో అతిపెద్దదైన అఫ్జల్‌గంజ్‌ స్టేట్ సెంట్రల్ లైబ్రరీ‌లో అభ్యర్థులు కుస్తీ పడుతున్నారు. రూ. 5 భోజనం తింటూ 8 నుంచి 10 గంటల సేపు చదువుతున్నారు. వీరి కోసం మౌలిక వసతులతో పాటు అదనపు పుస్తకాలు అందుబాటులోకి తెస్తున్నట్లు లైబ్రేరియన్ తెలిపారు.

News March 17, 2024

ఉద్యోగ నోటిఫికేషన్లు: HYDలో ఇదీ పరిస్థితి..!

image

గ్రూప్‌-1‌, DSC నోటిఫికేషన్లతో HYD‌లోని లైబ్రరీలకు తాకిడి పెరిగింది. అమీర్‌పేట, అశోక్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్‌‌లోని కోచింగ్‌ సెంటర్లు కిటకిటలాడుతున్నాయి. TGలో అతిపెద్దదైన అఫ్జల్‌గంజ్‌ స్టేట్ సెంట్రల్ లైబ్రరీ‌లో అభ్యర్థులు కుస్తీ పడుతున్నారు. రూ. 5 భోజనం తింటూ 8 నుంచి 10 గంటల సేపు చదువుతున్నారు. వీరి కోసం మౌలిక వసతులతో పాటు అదనపు పుస్తకాలు అందుబాటులోకి తెస్తున్నట్లు లైబ్రేరియన్ తెలిపారు.

News March 17, 2024

నల్గొండ: పట్టభద్రుల ఓటర్లు 5,06,527 మంది

image

నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల స్థానానికి ఉప ఎన్నికల నేపథ్యంలో ఓటు నమోదు కార్యక్రమం ఈనెల 14వ తేదీతో ముగిసింది. నియోజకవర్గ పరిధిలోని 12 జిల్లాల్లో 5,06,527 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో నల్గొండ – 87,596, సూర్యాపేట – 55,837, యాదాద్రి భువనగిరి – 39,066 మంది ఎమ్మెల్సీ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వచ్చేనెల 4న ఓటరు తుది జాబితా విడుదల చేయనున్నారు.

News March 17, 2024

ఎల్లారెడ్డిపేట: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ స్టేజి వద్ద రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఈ ప్రమాదంలో కేసీఆర్ కాలనీకి చెందిన మంద నారాయణ(56) అనే వ్యక్తి హమాలి పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. శనివారం రాత్రి రోడ్డు పక్కన నడుచుకుంటూ వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కుమారుడు ప్రశాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News March 17, 2024

ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిపై ఉత్కంఠ..!

image

ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక విషయంలో ఎడతెగని ఉత్కంఠ కొనసాగుతోంది. పలువురి పేర్లు వినిపిస్తున్నప్పటికీ పార్టీ ఇంకా ఎలాంటి నిర్ణయానికి రాలేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సీటు కోసం అధిష్ఠానం వద్ద గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని టాక్. కాగా, త్వరలో అభ్యర్థిని ప్రకటించనున్నట్లు సమాచారం.

News March 17, 2024

మెదక్‌: ఆటో‌ డ్రైవర్‌ ఆత్మహత్య

image

మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుండముల కిరణ్ (23) అనే ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఉరేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

News March 17, 2024

ప్రతి సోమవారం ప్రజావాణి రద్దు: కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

image

జిల్లాలో పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ (కోడ్) ముగిసేంతవరకు ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ నేడు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజావాణి కార్యక్రమ తేదీల, వివరాలను ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత వెల్లడించడం జరుగుతుందని అన్నారు. జిల్లాలోని ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి సహకరించాలన్నారు.