India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టెలివిజన్ ఛానళ్లు, వార్త పత్రికల్లో ప్రభుత్వ పథకాలపై ప్రకటన నిలిపివేయాలని నల్లగొండ కలెక్టర్ దాసరి హరిచందన తెలిపారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోస్టర్లు, కరపత్రాలపై పబ్లిషర్, ప్రింటర్ పేరు, ఫోన్ నంబర్తో సహా ప్రచురించాలని, ప్రింటింగ్ ప్రెస్ యజమానులు ప్రచురణకర్త ద్వారా డిక్లరేషన్ తీసుకోవాలని సూచించారు. ఎన్నికల నిబంధనలో ఉల్లంగిస్తే ప్రజాప్రతినిధ్య చట్టం–1951 కింద కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ వచ్చినందున ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం లేదని, ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత యథావిధిగా ప్రజావాణి ఉంటుందని తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ వచ్చినందున ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం లేదని, ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత యథావిధిగా ప్రజావాణి ఉంటుందని తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
వనదేవతల దర్శనానికి వచ్చిన భక్తుడు ఆదివారం జంపన్నవాగులో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ పోచమ్మ బస్తీకి చెందిన రాజు కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి ఆదివారం మేడారం వచ్చారు. పుణ్యస్నానం కోసం ప్రవాహంలోకి దిగారు. లోతును అంచనా వేయకుండా దిగడంతో మునిగిపోయాడు. ఎస్ఐ శ్రీకాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల కలెక్టరేట్లలో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి రద్దు చేశామని కలెక్టర్లు అనుదీప్ దురిశెట్టి, గౌతమ్, శశాంక, నారాయణరెడ్డి తెలిపారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సోమవారం నుంచి జూన్ 4వ తేదీ వరకు నిలిపేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ ముగిసిన తర్వాత యథావిధిగా ప్రజావాణి ఉంటుందని చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని సూచించారు. SHARE IT
హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల కలెక్టరేట్లలో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి రద్దు చేశామని కలెక్టర్లు అనుదీప్ దురిశెట్టి, గౌతమ్, శశాంక, నారాయణరెడ్డి తెలిపారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సోమవారం నుంచి జూన్ 4వ తేదీ వరకు నిలిపేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ ముగిసిన తర్వాత యథావిధిగా ప్రజావాణి ఉంటుందని చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని సూచించారు. SHARE IT
పదో తరగతి పరీక్షలకు వేళైంది. నేటి నుంచి ఏప్రిల్ 2వ తేది వరకు జరిగే పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజు పరీక్ష ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30 వరకు జరుగుతుంది. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. నిమిషం నిబంధన ఎత్తివేశారు. KNR జిల్లా వ్యాప్తంగా 219 సెంటర్లు ఏర్పాటు చేయగా, 38,097 మంది పరీక్ష రాయనున్నారు.
బిజినేపల్లి మండలంలో రెండు బైక్లు ఢీకొన్న ఘటనలో యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. స్థానికుల వివరాలు.. వీపనగండ్ల మండల వాసి బాలకృష్ణ HYD వైపు బైక్పై వెళ్తున్నాడు. మరో బైక్పై సూర్యాపేట జిల్లాకు చెందిన అజయ్, సిద్దార్థ్, భరత్ ఎదురుగా వచ్చి ఢీకొన్నాయి. దీంతో సిద్దార్థ్ అక్కడిక్కడే మృతిచెందగా గాయపడ్డ మరో ముగ్గురిని నాగర్కర్నూల్ ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు వంద రోజులైనా హామీలు అమలుచేయడం లేదని MP లక్ష్మణ్ విమర్శించారు. HYDలో ఆదివారం నిర్వహించిన అడ్వకేట్స్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నామ మాత్రంగా పథకాలను ప్రారంభిస్తోందని ఆరోపించారు. అందుకే ప్రజలకు ఏం కావాలో తెలుసుకుని, అందుకు అనుగుణంగా మేనిఫెస్టో తయారుచేసేందుకు బీజేపీ సిద్ధమైందన్నారు.
రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు వంద రోజులైనా హామీలు అమలుచేయడం లేదని MP లక్ష్మణ్ విమర్శించారు. HYDలో ఆదివారం నిర్వహించిన అడ్వకేట్స్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నామ మాత్రంగా పథకాలను ప్రారంభిస్తోందని ఆరోపించారు. అందుకే ప్రజలకు ఏం కావాలో తెలుసుకుని, అందుకు అనుగుణంగా మేనిఫెస్టో తయారుచేసేందుకు బీజేపీ సిద్ధమైందన్నారు.
Sorry, no posts matched your criteria.