India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
డిండి మండలం చెరుకుపల్లిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు కాళ్లు, చేతులు కట్టేసి బండరాయితో కొట్టి చంపారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ సురేశ్, ఎస్సై రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు తెలిసినవారు డిండి పోలీస్ స్టేషన్ నంబర్ల(8712670223, 8712670155)కు సమాచారం అందించాలన్నారు.
జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో శనివారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు స్వామివారి దర్శనానికి తరలివస్తున్నారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నారు. కాగా, ఆలయ అర్చకులు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు.
ఏళ్లుగా HYD నుంచి ఉత్పత్తి అయ్యే చెత్తను జవహర్నగర్ డంపింగ్ యార్డుకు తరలిస్తున్న విషయం తెలిసిందే. కాగా దానికి భారం తగ్గించేందుకు GHMC ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. మేడ్చల్, యాదాద్రి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో స్థలాలను గుర్తిస్తోంది. RRజిల్లా తలకొండపల్లి మండలం ఖానాపూర్లో 42.22 ఎకరాలు, సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం లక్డారంలో 100, దుండిగల్లో 85, మల్కాపూర్లో 200ఎకరాలను గుర్తించింది.
ఏళ్లుగా HYD నుంచి ఉత్పత్తి అయ్యే చెత్తను జవహర్నగర్ డంపింగ్ యార్డుకు తరలిస్తున్న విషయం తెలిసిందే. కాగా దానికి భారం తగ్గించేందుకు GHMC ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. మేడ్చల్, యాదాద్రి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో స్థలాలను గుర్తిస్తోంది. RRజిల్లా తలకొండపల్లి మండలం ఖానాపూర్లో 42.22 ఎకరాలు, సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం లక్డారంలో 100, దుండిగల్లో 85, మల్కాపూర్లో 200ఎకరాలను గుర్తించింది.
కరీంనగర్ జిల్లాలో ఇల్లు లేని అర్హులైన పేదలు సొంతింటి కోసం ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్నారు. త్వరలోనే వారి కల నెరవేరనున్నట్లు కనిపిస్తోంది. అక్టోబరు 15 నుంచి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించడంతో లబ్ధిదారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. మొదటి విడతలో జిల్లాలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మాత్రమే కేటాయిస్తుండగా దరఖాస్తులు మాత్రం లక్షకు పైగానే వచ్చాయి.
డీఎస్సీ అభ్యర్థులను ఎస్జీటీ కాంట్రాక్టు టీచర్లుగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విధితమే. సంగారెడ్డిలోని డీఈఓ కార్యాలయంలో 2008 డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను శుక్రవారం ప్రారంభించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 292 మంది అభ్యర్థులు ఉండగా, శుక్రవారం 132 మంది వెరిఫికేషన్కు హాజరయ్యారు. నేడు కూడా ప్రక్రియ కొనసాగనున్నది.
∆} వివిధ శాఖల అధికారులతో ఖమ్మం భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష
∆} దమ్మపేటలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటన
∆} ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన
∆} మణుగూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు
∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
సిద్దిపేట జిల్లాలో యువకుడిపై కేసు నమోదైంది. యువతిని పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన చేసినట్లు తొగుట ఎస్సై రవికాంతరావు తెలిపారు. మిరుదొడ్డి మండలానికి చెందిన యువతిని తొగుట మండల కేంద్రానికి చెందిన సిలివేరి నరేశ్ గౌడ్ ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆమె వద్ద నుంచి నగదు తీసుకున్నాడు. చివరకు పెళ్లికి నిరాకరించడంతో శుక్రవారం యువతి పోలీసులను ఆశ్రయించింది.
జూరాల ప్రాజెక్టు దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో శుక్రవారం 11 యూనిట్ల నుంచి ఉత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈలు సురేశ్, సూరిబాబు తెలిపారు. ఎగువలో 5 యూనిట్ల నుంచి 196 మెగావాట్లు, 201.187 ఎం.యూ, దిగువలో 6 యూనిట్ల నుంచి 240 మెగావాట్లు, 174.750 ఎం.యూ. విద్యుదుత్పత్తి చేపట్టామన్నారు. ఇప్పటి వరకు ఎగువ, దిగువ కేంద్రాల్లో 32,475 వేల క్యూసెక్కుల నీటిని వినియోగించి 360.108 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి సాధించారు.
కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలకు రానున్న 5 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్ష సూచన ఉందని పొలాస పరిశోధన స్థానం శాస్త్రవేత్త లక్ష్మి తెలిపారు. ఉష్ణోగ్రతలు కనిష్ఠంగా 22-24 డిగ్రీలు, గరిష్ఠంగా 32-36 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ముఖ్యంగా రైతులు గమనించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.