Telangana

News September 2, 2025

NLG: విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వాలని HRC ఆదేశం

image

నల్గొండలోని నలంద ఫార్మసీ కళాశాల యాజమాన్యం తమకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని విద్యార్థులు తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌‌కి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన హెచ్‌ఆర్‌సీ ఛైర్మన్ షమీమ్ అక్తర్, బీ ఫార్మసీ పూర్తి చేసిన విద్యార్థులకు వారి టీసీ, ఇతర సర్టిఫికెట్లను వెంటనే అందజేయాలని సోమవారం ఆదేశాలు జారీ చేశారు.

News September 2, 2025

ఇందిరమ్మ ఇల్లు కట్టకుండానే రూ. లక్ష జమ..!

image

ఇందిరమ్మ ఇల్లు కట్టకుండానే ఖాతాలో రూ. లక్ష జమయిన ఘటన కామేపల్లి మండలం రేపల్లెవారి గ్రామం జాగన్నతండాలో జరిగింది. బాధితుడు తేజావత్ రవి వివరాలిలా.. ‘నాకు ఇల్లు మంజూరయిన విషయం అధికారులు చెప్పలేదు. కానీ నా ఖాతాలో రూ. లక్ష జమకాగా ఆరా తీయగా ఇల్లు మంజూరయిందని తెలిసింది. ఈ ఘటనపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాను. ఇల్లు కట్టుకునేందుకు అనుమతి ఇవ్వాలి’ అని ప్రభుత్వాన్ని వేడుకున్నాడు.

News September 2, 2025

HYD: అంగన్వాడీలతో పిల్లలు, గర్భిణీలకు పౌష్టికాహారం

image

అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు సమయానికి నాణ్యమైన పోషక ఆహారం అందించాలని HYD కలెక్టర్ హరి చందన సంబంధిత సిబ్బందికి సూచించారు. సోమవారం యూసుఫ్‌గూడ ఆరోగ్యనగర్‌లోని నాట్కో అంగన్వాడీ కేంద్రం, సుభాష్‌నగర్‌లోని మరో అంగన్వాడీ కేంద్రాన్ని ఆమె సందర్శించి పరిశీలించారు. పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు నాణ్యమైన పోషకాహారం అందించాలన్నారు.

News September 2, 2025

NZB: ‘లోకల్ దంగల్’లో ముందుగా ZPTC, MPTC ఎన్నికలు..!

image

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ముందుగా జిల్లా ప్రజాపరిషత్, మండల ప్రజా పరిషత్ ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ZPTC సభ్యుల ఎన్నికకు గులాబీ రంగు బ్యాలెట్ పత్రం, MPTC సభ్యుల ఎన్నికకు తెలుపు రంగు బ్యాలెట్ పత్రం ఇచ్చేందుకు నిర్ణయించారు. అయితే 42 శాతం రిజర్వేషన్లకు ఆమోదం లేనప్పటికీ ప్రత్యామ్నాయ మార్గంలో ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోందని అధికారులు పేర్కొంటున్నారు.

News September 2, 2025

HYDలో రోడ్ సేఫ్టీ డ్రైవ్‌‌లో 10,962 గుంతలు పూడ్చివేత

image

జీహెచ్ఎంసీ యుద్ధ ప్రాతిపదికన రోడ్ సేఫ్టీ డ్రైవ్ కొనసాగిస్తోంది. సెప్టెంబర్ 1 నాటికి గుర్తించిన 13,616 గుంతల్లో 10,962 పూడ్చేశారు. ఒక్కరోజులోనే 108 గుంతలు మరమ్మతయ్యాయి. ఇప్పటి వరకు 544 క్యాచ్‌పిట్స్ రిపేర్‌లు, 311 కవర్ రీప్లేస్‌మెంట్‌లు, 12 సెంట్రల్ మీడియన్ పనులు పూర్తయ్యాయి. జోన్ల వారీగా వేగంగా మరమ్మతులు జరుగుతున్నాయని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా తక్షణం పనులు పూర్తి చేయాలని కమిషనర్ ఆదేశించారు.

News September 2, 2025

సూర్యఘర్‌పై అవగాహన.. షెడ్యూల్ ఇలా!

image

సౌర విద్యుత్ ఉత్పత్తి, వాడకాన్ని ప్రోత్సహించేలా రూపొందించిన ప్రధాన మంత్రి సూర్యఘర్ పథకంపై మంగళవారం నుంచి నిర్వహించే అవగాహన సదస్సులకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు విద్యుత్ శాఖ ఖమ్మం ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి తెలిపారు. మంగళవారం అన్నారుగూడెం, తల్లాడలో, బుధవారం తనికెళ్ల, కొణిజర్ల, గురువారం నేలకొండపల్లిలో, శుక్రవారం ముదిగొండ, వల్లభితో పాటు శనివారం కందుకూరులో సదస్సులు నిర్వహిస్తామని వెల్లడించారు.

News September 2, 2025

భద్రకాళి అమ్మవారి దివ్య దర్శనం

image

భద్రకాళి దేవస్థానంలో ఆలయ అర్చకులు ఉదయాన్నే అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. ప్రాతఃకాల విశేష దర్శనంలో అమ్మవారు దర్శనమిచ్చారు. అనంతరం అమ్మవారికి విశేష పూజలు చేసి హారతి ఇచ్చారు. భక్తులు ఉదయం నుంచి ఆలయం చేరుకొని అమ్మవారిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. దేవస్థాన అర్చకులు తదితరులు ఉన్నారు.

News September 2, 2025

నేడు హైకోర్టులో KCR, హరీశ్‌రావు పిటిషన్లపై విచారణ

image

హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు పిటిషన్లపై నేడు చీఫ్ జస్టిస్ బెంచ్‌లో విచారణ జరగనుంది. సీబీఐకు ఇస్తామన్న ప్రభుత్వ నిర్ణయంపై నేడు హైకోర్టులో వాదనలు జరగనున్నాయి. కమిషన్ నివేదిక ఆధారంగా తమపై చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని KCR, హరీశ్‌రావు కోరుతున్నారు. నిన్న మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలని లంచ్ మోషన్‌ని న్యాయస్థానం నిరాకరించింది. ప్రభుత్వం నిర్ణయం ఇవ్వాళ ఏజీ కోర్టుకు తెలుపనుంది.

News September 2, 2025

HYD సంస్థానంలో ఆ రక్తపుటేరుకు 78 ఏళ్లు

image

దేశమంతా స్వేచ్ఛా గాలులు పీల్చుతుంటే.. నాటి HYD సంస్థానం (TG) నిరంకుశత్వంలో నలిగిపోయింది. రజాకార్ల రాక్షసకాండకు వ్యతిరేకంగా సామాన్యులే ఉద్యమాన్ని నడిపారు. దీనికి పరకాల ఘటనే సాక్ష్యం. సరిగ్గా 78 ఏళ్ల క్రితం 1947 SEP 2న అక్కడ జాతీయ పతాకావిష్కరణకు వేలాది మంది ర్యాలీగా బయలెల్లారు. రజాకార్లు విచక్షణారహితంగా వారిపై కాల్పులకు తెగబడగా 16 మంది అమరులయ్యారు. ఇది మరో జలియన్వాలాబాగ్‌ని తలపించింది.

News September 2, 2025

వరదల నష్టంపై సమగ్ర నివేదిక ఇవ్వండి: సీఎం రేవంత్ రెడ్డి

image

భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టం, పునరావాస చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి సోమవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విపత్తు నిర్వహణ నిధుల వినియోగంపై పూర్తి వివరాలతో సమగ్ర నివేదికను సిద్ధం చేసి, వెంటనే యూసీలను సమర్పించాలని ఆదేశించారు. వరదల కారణంగా దెబ్బతిన్న కాల్వలు, చెరువులు, రోడ్ల మరమ్మతులకు సంబంధించి యుద్ధప్రాతిపదికన యాక్షన్ ప్లాన్‌ను రూపొందించాలని సీఎం సూచించారు.