India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అన్ని రంగాలతో పాటు వైద్యం కూడా వ్యాపారంగా మారింది. వైద్యులు ఆస్పత్రిని ఏర్పాటు చేసి నిర్వహించేవారు. సిద్దిపేటలో మాత్రం మేనేజ్మెంట్కు వైద్యం సంబంధం లేకున్నా ఆస్పత్రిని ఏర్పాటు చేసి ఇతర ప్రాంతాల నుంచి వైద్యులను తీసుకొచ్చి కొనసాగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 158 ఆస్పత్రులు ఉంటే.. అందులో సగం వరకు వైద్యంతో సంబంధంలేని వారే నిర్వాహకులుగా ఉన్నారు. కాసుల కోసం అనవసర టెస్టులు, స్కానింగ్లు చేస్తున్నారు.

ఎన్నికల విధులు పూర్తి అవగాహనతో నిర్వర్తించినప్పుడే ఎలాంటి పొరపాట్లు జరగవని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ అన్నారు. బంజారాభవన్లో శనివారం సెక్టర్ ఆఫీసర్లు, జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి మాస్టర్ ట్రైనర్స్కు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రోనాల్డ్ రాస్ మాట్లాడుతూ.. ప్రశాంత వాతావరణంలో ఓటర్లు ఓటు వేసేలా అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు.

ఎన్నికల విధులు పూర్తి అవగాహనతో నిర్వర్తించినప్పుడే ఎలాంటి పొరపాట్లు జరగవని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ అన్నారు. బంజారాభవన్లో శనివారం సెక్టర్ ఆఫీసర్లు, జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి మాస్టర్ ట్రైనర్స్కు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రోనాల్డ్ రాస్ మాట్లాడుతూ.. ప్రశాంత వాతావరణంలో ఓటర్లు ఓటు వేసేలా అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు.

వరంగల్ జిల్లా గీసుగొండ మండలం మచ్చాపుర్ గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. నర్సంపేట పట్టణానికి చెందిన ప్రభాకర్, శామ్యూల్ శనివారం రాత్రి బైక్పై వరంగల్కు వెళ్లారు. తిరిగి వస్తుండగా ఎడ్ల బండిని ఢీకొట్టారు. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సీతారామ ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులకు ఆటంకం కలిగింది. తిరుమలాయపాలెం మండలంలో ఓపెన్ కాలువతోపాటు సొరంగ మార్గం ఏర్పాటు చేస్తున్న క్రమంలో సమీపంలో వాగు ఉండటంతో భూగర్భ జలాలు పెద్ద మొత్తంలో నిర్మాణ కాలువలోకి ఉబికి వస్తున్నాయి. ఆ నీటితో టన్నెల్ నిండింది. దీంతో పనులకు ఆంటంకం కలుగుతోంది.

రోడ్డుప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. దేవరకొండ మండలం మైనంపల్లి స్టేజి వద్ద శనివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. చందంపేట మండలం బొల్లారం గ్రామానికి చెందిన అశోక్ అనే యువకుడు బైక్పై వెళుతున్నాడు. ఆటో ఢీకొనడంతో తీవ్రగాయాలయ్యాయి. హైదరాబాద్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అశోక్ మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు.

అడ్డాకుల: జాతీయ రహదారి 44పై త్వరలో 5 అండర్ బ్రిడ్జిల పనులు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. అవి వనపర్తి జిల్లాలోని కొత్తకోట మండలం కనిమెట్ట, పెద్దమందడి మండలంలోని వెల్టూర్ స్టేజీ, మూసాపేట మండలంలోని వేముల స్టేజీ, జానంపేట బస్స్టాప్, భూత్పూర్ మండలంలోని శేర్పల్లి(బీ) వద్ద జాతీయ రహదారిపై అండర్ బ్రిడ్జిలను నిర్మించడానికి నిధులు మంజూరు చేయడంతో టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది.

మహదేవపూర్ మండలం బెగ్లూర్ గ్రామానికి చెందిన మల్లయ్య అనే వ్యక్తిని హత్యాయత్నం ఘటనలో శనివారం రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ ప్రసాద్ వెల్లడించారు. అదే గ్రామానికి చెందిన కారు పోచయ్యపై పాత కక్షలతో కారు మల్లయ్య కత్తితో దాడి చేసినట్లు పేర్కొన్నారు. బాధితుడి భార్య దుర్గమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయగా, దర్యాప్తు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.

రెబ్బెన మండల కేంద్రానికి చెందిన గజ్జల భీం రావ్(35) పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. వారు తెలిపిన కథనం ప్రకారం.. భీమ్రావ్ ఏ పని చేయకపోవడంతో పాటు మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో అతని భార్య పుట్టింటికి వెళ్లింది.. మద్యానికి బానిసైన భీం రావ్ ఇంట్లో పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈమెకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

బాన్సువాడ శివారులోని చాదర్ లాక్ కెనాల్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం బాన్సువాడకు చెందిన దంపతులు మహమ్మద్ ముఖ్తాద్, ఆయేషా దంపతులు వెల్లుట్ల నుంచి బాన్సువాడకు బైక్ పై వస్తున్నారు. వారిని అతివేగంగా వచ్చిన బొలెరో ఢీకొట్టింది. దీంతో వారికి తీవ్రగాయాలయ్యాయి. వారికి మెరుగైన వైద్యం అందించేందుకు నిజామాబాద్ తరలిస్తుండగా మార్గ మధ్యలో ముఖ్తార్ మృతి చెందారు.
Sorry, no posts matched your criteria.