RangaReddy

News September 12, 2024

HYD: FREE వాటర్ పథకం.. ఇది మీ కోసమే!

image

గ్రేటర్ HYD పరిధిలో డొమెస్టిక్ యూజర్లు 20 వేల లీటర్ల ఉచిత మంచినీటి సరఫరా పథకం పొందేందుకు HMWSSB అధికారులు పలు సూచనలు చేశారు. పథకం పొందెందుకు ఆధార్ నెంబర్ CAN నంబర్‌తో లింక్ చేసుకోవడంతో పాటు, వాటర్ మీటర్ ఉండాలన్నారు. మురికివాడల్లో ఉన్న ప్రజలు కేవలం ఆధార్ లింక్ చేస్తే సరిపోతుందన్నారు. వాటర్ మీటర్ కనెక్షన్‌పై మినహాయింపు అందించినట్లు తెలిపారు. ఇందుకోసం స్థానిక సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించాలన్నారు.

News September 12, 2024

గణేశ్ నిమజ్జనం: HYDలో ‘రేపటి కోసం’

image

వినాయకచవితి ఉత్సవాల్లో భాగంగా నిమజ్జనం కోసం హైదరాబాద్‌లో ఏర్పాట్లు‌ జరుగుతున్నాయి. మండపాల్లో విగ్రహాలను నిలబెట్టిన భక్తులు ‘రేపటి కోసం’ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు. ‘నిమజ్జనం ఉంది. విరాళాలు కావాలి. సొంత డబ్బులు పోగు చేయాలి. అన్నదానం కోసం దాతల సహాయం కావాలి. మన గణపతిని అంగరంగ వైభవంగా ఊరేగించాలి’ అన్న తపనతో యువత‌ ముందుకు కదులుతున్నారు. మరి మీ మండపం‌ వద్ద పరిస్థితి ఎలా ఉంది. కామెంట్ చేయండి.

News September 12, 2024

HYD సిటీలో రౌడీల భరతం పడతాం: సీపీ

image

HYD సిటీ పోలీస్ కమిషనరేట్ సీపీ CV ఆనంద్ నేడు మంత్రి సీతక్క, రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలిశారు. కమిషనర్ బాధ్యతలు స్వీకరించిన ఆనంద్‌కు వారు శుభాకాంక్షలు తెలియజేశారు. HYD నగరంలో రౌడీల భరతం పడతామని, గంజాయి, డ్రగ్స్ పై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. డ్రగ్స్ జోలికి వెళ్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News September 12, 2024

HYD: సెప్టెంబర్ 17..ముఖ్య అతిథులు వీరే..!

image

రాష్ట్రంలో సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. HYD జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి, RR జిల్లాలో స్టేట్ చీఫ్ అడ్వైజర్ వేం నరేందర్ రెడ్డి, మేడ్చల్ జిల్లాలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లాలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం నిర్వహిస్తారని ప్రభుత్వం తెలిపింది.

News September 12, 2024

HYD: ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం TIME FIX

image

ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనంపై HYD సిటీ కమిషనరేట్ సీపీ CV ఆనంద్ వివరాలు వెల్లడించారు. సెప్టెంబర్ 17వ తేదీన మధ్యాహ్నం 1:30 గంటలలోపు నిమజ్జనం చేసేందుకు ఉత్సవ కమిటీ అంగీకరించినట్లు తెలిపారు. సమయానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని, అనుకున్న సమయానికి నిమజ్జనం చేయాలన్నారు. ఇందుకు తగ్గట్లు పోలీసు బందోబస్తు ఉండాలని ఆయన సిబ్బందికి సూచించారు.

News September 12, 2024

HYD: డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయండి: మంత్రి

image

రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ డిజిటలైజేషన్ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ HYDలో అధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని 2011 జనాభా లెక్కల ప్రకారం 83.04 లక్షల కుటుంబాలలో కుటుంబ సభ్యుల ఆరోగ్య వివరాలను గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ప్రతి గడపకు తిరిగి వారి హెల్త్ ప్రొఫైల్ డిజిటల్ రూపంలో ‌నమోదు చేయాలని మంత్రి ఆదేశించారు.

News September 11, 2024

HYD: ‘హైడ్రా ప్రణాళిక సిద్ధం చేసేందుకు కసరత్తు’

image

HYDలో హైడ్రా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసేందుకు కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్, లేటెస్ట్ హిస్టారికల్ సాటిలైట్ డేటాపై చర్చలు జరిపారు. ఏరియల్ సర్వీస్, డిజిటల్ మ్యాపింగ్ హైడ్రాకు ఖచ్చితమైన విశ్లేషణ, ప్రణాళిక చేసేందుకు అవసరమని తెలిపారు. వాతావరణాన్ని అంచనా వేయడం, నీటి వనరులు, డిజాస్టర్ మేనేజ్మెంట్ లాంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు.

News September 11, 2024

HYD: 6.13 లక్షల మందికి 20 వేల లీటర్ల వాటర్ FREE

image

HMWSSB ఆధ్వర్యంలో గ్రేటర్ HYDలో 20 వేల లీటర్ల ఉచిత నీటి సరఫరా పథకం కొనసాగుతుందని, ఇప్పటి వరకు 6,13,562 మందికి ఈ పథకం అందిస్తున్నట్లుగా అధికారులు వెల్లడించారు. దీని ద్వారా 11,85,479 గృహాలకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. డిసెంబర్ 2020లో పథకం ప్రారంభించినప్పటి నుంచి ఆగస్టు 31 నాటికి రూ.1108.88 కోట్ల మేర జీరో బిల్ అందించినట్లు పేర్కొన్నారు.

News September 11, 2024

HYD: మెట్రో ప్రయాణికుల కొత్త డిమాండ్

image

హైదరాబాద్‌ మెట్రో‌లో రద్దీ రోజురోజుకి పెరుగుతోంది. ముఖ్యంగా నాగోల్ నుంచి రాయదుర్గం రూట్‌లో ఉదయం, సాయంత్రం నిలబడలేని పరిస్థితి ఉంటోంది. నాన్‌స్టాప్ సర్వీసులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. దీనివలన ప్రయాణం సౌలభ్యంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. రెగ్యులర్ సేవలతో పాటు నాన్ స్టాప్ సర్వీసులు కూడా ఏర్పాటు చేయడంతో‌ సమయం ఆదా అవుతోందన్నారు. దీనిపై మీ కామెంట్?

News September 11, 2024

హైదరాబాద్: మందు తాగితే నో ఎంట్రీ!

image

HYDలో గణేశ్‌ నిమజ్జనాలు‌ మొదలయ్యాయి. బుధవారం 5వ రోజు పూజలు అందుకుంటున్న గణనాథులు సాయంత్రం భారీ జులూస్‌ నడుమ ‌ట్యాంక్‌బండ్‌కు చేరుకోనున్నారు. నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్ ప్లాజా ఎదుట క్రేన్లను ఏర్పాటు చేశారు. నిమజ్జనం కోసం గణేశ్ విగ్రహాన్ని తీసుకెళ్లే వాహనంలో మద్యం, మరేదైనా మత్తు పదార్థాలు తాగిన వ్యక్తులను అనుమతించకూడదని పోలీసులు స్పష్టం చేశారు. ప్రశాంత వాతావరణంలో వేడుకలు చేసుకోవాలన్నారు.
SHARE IT