RangaReddy

News February 3, 2026

​ట్రెసా క్యాలెండర్, డైరీని ఆవిష్కరించిన కలెక్టర్

image

తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయ్స్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) 2026 నూతన క్యాలెండర్, డైరీని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, డీఆర్వో సంగీతతోపాటు ట్రెసా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ కుమార్, జిల్లా అధ్యక్షుడు జనార్దన్ఋ‌రావు పాల్గొన్నారు. రెవెన్యూ సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు.

News February 2, 2026

రంగారెడ్డి: ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

image

ఈనెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించాలని సూచించారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలని, పరీక్షల నిర్వహణలో అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పారదర్శకంగా పనులు పూర్తి చేయాలన్నారు.

News February 1, 2026

రంగారెడ్డి: నూతన సర్పంచుల శిక్షణా షెడ్యూల్‌లో మార్పులు

image

ఇటీవల నూతనంగా ఎన్నికైన సర్పంచుల శిక్షణా తరగతుల షెడ్యూల్‌లో మార్పులు చేసినట్లు జిల్లా అధికారులు తెలిపారు. మున్సిపాల్ ఎన్నికల కారణంగా కొత్త షెడ్యూల్ విడుదలైంది. మూడో విడత శిక్షణ ఫిబ్రవరి 23 నుంచి 27 వరకు, నాల్గో విడత ట్రైనింగ్ మార్చి 2 నుంచి 7 వరకు, ఐదో విడత శిక్షణ మార్చి 9 నుంచి 13 వరకు నిర్వహించనున్నారు. అప్పటివరకు సర్పంచులు గ్రామాభివృద్ధి పనుల్లో నిమగ్నం కావాలన్నారు.

News February 1, 2026

GHMC: రూ.11,460 కోట్ల బడ్జెట్‌కు కౌన్సిల్ ఆమోదం

image

2026-27 ఆర్థిక ఏడాది బడ్జెట్‌ను కౌన్సిల్‌లో జీహెచ్ఎంసీ ప్రవేశపెట్టింది. GHMC మొత్తం బడ్జెట్ రూ.11,460 కోట్లుగా పేర్కొంది. ఆదాయం రూ.6,441 కోట్లు, జీహెచ్ఎంసీ ఖర్చు రూ.4,057 కోట్లు, రెవెన్యూ మిగులు రూ.2,384 కోట్లు, రెవెన్యూ గ్రాంట్స్ రూ.400 కోట్లు, కొత్తగా విలీనమైన మున్సిపాలిటీల కోసం రూ.2,260 కోట్లను కేటాయించింది. విలీనమైన 27 మున్సిపాలిటీల నుంచి వచ్చిన రెవెన్యూ రూ.1,860 కోట్లుగా పేర్కొంది.

News January 31, 2026

రంగారెడ్డి: అంతరాష్ట్ర దొంగలు అరెస్ట్

image

ఈ నెల 15న వరుసగా ఇళ్లల్లో చోరీలు చేసి పరారైన అంతరాష్ట్ర దొంగలను శుక్రవారం మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించినట్లు DCP సురేష్ కుమార్ వివరాలు వెల్లడించారు. ఢిల్లీకి చెందిన మహాదేవ్ ఝా (A-1), పవన్ గుప్తా (A-2), కాన్పూర్‌కు చెందిన మంగళ్ సింగ్ (A-3)లు బోడుప్పల్ పరిధిలోని 9 ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. 250 గ్రాముల బంగారం, 6 కిలోల వెండి, రూ.2 లక్షల నగదును దోచుకొని పరారైనట్లు తెలిపారు.

News January 31, 2026

రంగారెడ్డి: అత్యాచారం ఘటనలో 25 సంవత్సరాల జైలు

image

బాలికపై అత్యాచారం చేసిన ఘటనలో నిందితుడికి 25 సంవత్సరాలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఇన్‌స్పెక్టర్ సైదులు వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన మహమ్మద్ హబీబ్ (53) 2023లో బేగంపేట పోలీసుస్టేషన్ పరిధిలో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదైంది. నేరం రుజువు కావడంతో 25 సంవత్సరాలు జైలు, రూ.10 వేల జరిమానా విధిస్తూ జడ్జి తీర్పునిచ్చారు.

News January 31, 2026

రంగారెడ్డి: ఉరేసుకుని సాప్ట్ వేర్ సూసైడ్

image

ఓ సాప్ట్ వేర్ ఇంజినీరు ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మైలార్ దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరల మేరకు.. వంశీ యాదవ్ (38) భార్య శ్రావ్య, ఇద్దరు ఆడ పిల్లలతో కలిసి దుర్గాహిల్స్‌లో కాపురముంటున్నాడు ఉంటున్నారు. ఈ క్రమంలో కుంటుంబంలో కలహాలు ఏర్పాడ్డాయి. మనస్తాపం చెందిన అతను శుక్రవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

News January 29, 2026

రంగారెడ్డి: ‘90001 13667కు సమాచారమివ్వండి’

image

అగ్ని ప్రమాదానికి ఆస్కారం ఉన్న పరిస్థితులుంటే వెంటనే హైడ్రా కంట్రోల్ రూం నంబరు 90001 13667కు ఫోను చేసి సమాచారమివ్వాలని హైడ్రా కమిషనర్ నగర ప్రజలను కోరారు. ఎక్కడ అగ్ని ప్రమాదానికి అవకాశం ఉన్నా లొకేషన్‌తో పాటు వీడియోలు, ఫొటోలు పంపించాలన్నారు. సమాచారం ఇచ్చినవారి వివరాలు గోప్యంగా ఉంటాయన్నారు. నగరంలోని అందరి లక్ష్యం అగ్ని ప్రమాదాలను తగ్గించడమే కావాలని కోరారు.

News January 26, 2026

రంగారెడ్డి: కలెక్టరేట్‌లో ఏర్పాట్లు అధ్వానం

image

రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. విద్యార్థులు పలు సాంసృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వేడుకలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో జనాలు హాజరయ్యారు. కానీ ఏర్పాట్లు మాత్రం అధ్వానంగా ఉన్నాయని వచ్చిన వారు మండిపడుతన్నారు. కూర్చునేందుకు కుర్చీలు లేకపోవడంతో పసిపిల్లలను ఎత్తుకుని ఎండలో నిలబడ్డారు.

News January 25, 2026

HYD: సాగర తీర విగ్రహాల వెనుక దాగిన చరిత్ర

image

HYD- SECను కలిపే హుస్సేన్‌సాగర్‌కు వెళ్తే వరుసగా కొలువైన 34 మంది మహానీయుల విగ్రహాలపైకి చూపు మళ్లక మానదు. ముందు తరాల వారికి దీని గురించి తెలిసినా.. నేటి తరానికి అదొక ప్రశ్నే. ఈ విగ్రహాలతో వారి గొప్పతనాన్ని చాటి చెప్పేందుకు ఇక్కడ ఏర్పాటు చేశారు. వీరు ఎవరు? అనే సందేహం అందరి మదిలో మెదులుతోంది. ఈ మహనీయుల వీరగాథ, చరిత్ర చెప్పేందుకు Way2News రోజుక్కొక్కరి స్టోరిని సంక్షిప్తంగా అందిస్తుంది.