India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD శివారులో RR జిల్లా మంచిరేవుల ప్రాంతంలో నేడు యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభం కానుంది. ఇప్పటికే 200లో 87 మంది విద్యార్థుల అడ్మిషన్లు జరిగినట్లు సీపీ ఆనంద్ తెలిపారు. యూనిఫాం, హౌస్ డ్రెస్సులు, తరగతి గదులు, ఆట స్థలాలు మొదలైన పనులన్ని పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. నేడు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇది ప్రారంభం కానుంది.
సైబరాబాద్ కమిషనరేట్లో 11 మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ కమిషనర్ అవినాష్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. ఆమనగల్ CIగా జానకిరామ్ రెడ్డి, పేట్బషీరాబాద్ డీఐ సుంకరి విజయ్ని చందానగర్కు, ఆమనగల్ సీఐ ప్రమోద్ కుమార్ను RGIAకు, శామీర్పేట్ డీఐ గంగాధర్ను కడ్తాల్ PSకు, కడ్తాల్లో పనిచేస్తున్న శివప్రసాద్ను సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
HYDలోని ఉప్పల్, రామంతపూర్, నాచారం, నాగోల్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో బస్టాపులు, రద్దీ ఉన్న ప్రాంతాల్లో మఫ్టీలో షీ టీం ప్రతి చర్యను గమనిస్తోంది. గుంపులో ఎవరూ చూడడం లేదని అమ్మాయిలతో వెకిలి చేష్టలు, చెడుగా ప్రవర్తిస్తే అంతు చూస్తామని షీ టీం హెచ్చరించింది. పరాయి వ్యక్తుల ప్రవర్తనలో తేడా కనిపిస్తే వెంటనే నిర్భయంగా యువతులు, మహిళలు 100, 8712662111 ద్వారా ఫిర్యాదు చేయాలన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ వాసులకు ముఖ్య గమనిక. మాంసం దుకాణాలు నేడు బంద్ చేయాలని GHMC ఉత్వర్వులు జారీ చేసింది. కబేళాలు, రిటైల్ బీఫ్ దుకాణాలు మూసి ఉంటాయని ప్రకటించింది. మహావీర్ జయంతి సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి. GHMC లిమిట్స్లోని అన్ని మాంసం దుకాణాలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి.
SHARE IT
నల్లాల నుంచి మోటార్ల ద్వారా నీటిని తోడితే కఠిన చర్యలు తీసుకుంటామని జలమండలి MD అశోక్ రెడ్డి హెచ్చరించారు. బుధవారం ఖైరతాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. HMWSSB ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి సుదూర ప్రాంతాల నుంచి నీటిని శుద్ధి చేసి సరఫరా చేస్తోందని, వృథా చేయకుండా వాటిని తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని కోరారు. నల్లాకు మోటర్ బిగిస్తే రూ.5 వేల జరిమానా విధిస్తామన్నారు.
రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకోవాలని రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు రేషన్కార్డు లేదా ఆహారభద్రత కార్డు ఉంటే సరిపోతుందని తెలిపారు. ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. 14 వరకు అన్ని మున్సిపాలిటీ, ఎంపీడీవో కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
HYDలోని సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీ నాంపల్లి గ్రౌండ్లో పుస్తక ప్రదర్శన ప్రారంభమైంది. ఏప్రిల్ 17వ తేదీ వరకు కొనసాగుతుందని, ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. సాహిత్యం, నాట్యం, సంగీతం, జీవితచరిత్రలు, ఆదివాసి జీవన విధానం, అనేక పరిశోధన గ్రంథాలకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి.
దిల్సుఖ్నగర్ <<16034773>>బాంబ్ బ్లాస్ట్<<>> ఘటనలో నిందితులకు నిన్న హై కోర్టు ఉరిశిక్ష విధించింది. అయితే ఉగ్రవాదులు ముందుగా స్థానికంగా మిర్చి సెంటర్, మద్యం దుకాణాన్ని టార్గెట్ చేయగా సమయం మించిపోతుండడంతో వఖాస్ బాంబుతో సైకిల్ని 107 బస్టాప్ వద్ద వదిలేసి వెళ్లాడు. దీనికి ముందు లుంబినీ పార్క్ వద్ద పేలిన బాంబ్ను కూడా హుస్సేన్సాగర్లో పెట్టాలని ప్లాన్ చేశారు. సమయం మించిపోవడంతో లేజేరియం వద్ద వదిలేసి వెళ్లాడు.
మొయినాబాద్లో ముజ్రా పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఏడుగురు యువతులు, 14 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హాలిడే ఫామ్ హౌస్లో తెల్లవారుజామున SOT పోలీసులు దాడులు నిర్వహించి మద్యం బాటిళ్లతో పాటు 70 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్, ముంబైతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన యువతులను తీసుకొచ్చి అర్ధనగ్నంగా డాన్సులు చేయించిన్నట్లు సమాచారం.
గోషామహల్ MLA రాజాసింగ్పై మంగళ్హాట్ PSలో 3 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. శ్రీరామనవమి శోభాయాత్రలో రాజాసింగ్ ప్రసంగిస్తున్న సమయంలో భక్తులు ఒక్కసారిగా టస్కర్ వాహనం వద్దకు తోసుకుంటూ వచ్చారు. దీంతో పోలీసులు వారిని పక్కకు జరుపుతుండగా ‘భక్తులు, కార్యకర్తలపై లాఠీలు ఝళిపిస్తే లాఠీలకు పనిచెప్పాల్సి వస్తుంది’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై కేసులు నమోదు చేశారు.
Sorry, no posts matched your criteria.