RangaReddy

News March 28, 2025

HYD: పోలీసుల అదుపులో ఇద్దరు అనుమానితులు

image

MMTSలో యువతిపై అత్యాచారయత్నం జరిగిన కేసులో పోలీసులు నిందితుడిని గుర్తించేందుకు దర్యాప్తును ముమ్మరం చేశారు. పోలీసుల దర్యాప్తులో ఇప్పటివరకు ఒక్క ఆధారం కూడా లభించకపోవడం సవాలుగా మారుతోంది. బాధితురాలికి మరోసారి అనుమానితులను చూపించాలని పోలీసులు భావిస్తుండగా.. ప్రస్తుతం ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని ఆరా తీస్తున్నారు. కాగా.. గురువారం బాధితురాలి వాంగ్మూలాన్ని మళ్లీ రికార్డు చేశారు.

News March 28, 2025

ఇబ్రహీంపట్నం: మానవ అక్రమ రవాణాపై శిక్షణ కార్యక్రమం

image

మానవ అక్రమ రవాణాను అరికట్టడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని రంగారెడ్డి జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి శ్రీలత తెలిపారు. మానవ అక్రమ రవాణాపై ఏపీఎం, సీసీలకు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తల్లిదండ్రులు లేని పిల్లలను, పేదవారిని నమ్మించి వారి ప్రమేయం లేకుండా నగరాలకు తరలించి అసాంఘిక కార్యకలాపాలకు వినియోగిస్తున్నారని తెలిపారు.

News March 28, 2025

HYD: మీరు ఇందులో నీళ్లు తాగుతున్నారా?

image

RO ప్లాంట్లు HYDలో విపరీతంగా పుట్టుకొచ్చాయి. కిరాణా షాపుల్లోనూ 20L వాటర్ రూ.15-20కి విక్రయిస్తున్నారు. ఈ ప్లాంట్ల నీరు తాగడంతో కిడ్నీల సమస్యలు, జట్టురాలడం, గుండె సమస్యలు వస్తాయని రుజువైంది. సోడియం సల్ఫేట్, పొటాషియం వంటి ఖనిజాలు కలిపితేనే మినరల్ వాటర్. RO వాటర్‌లో ఇవన్నీ ఉండవు. నాసీరకం క్యాన్లలో నీరుతాగినా ప్రమాదాన్ని కొనుక్కున్నట్లే. సర్టిఫైడ్ ప్లాంట్లలో, నాణ్యమైన డబ్బాల్లో నీటిని తెచ్చుకోవాలి.

News March 28, 2025

రంగారెడ్డి జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

image

రంగారెడ్డి జిల్లాలో ఎండ తీవ్రత పెరుగుతుండటంతో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం చుక్కాపూర్లో 39.6℃, మాడ్గుల్, మంగళ్‌పల్లె 39.5, మీర్‌ఖాన్‌పేట 39.4, కందవాడ 39.3, కడ్తాల్, కాసులాబాద్ 39.2, ఇబ్రహీంపట్నం, ఎలిమినేడు 39.1, రాజేంద్రనగర్, చందనవెల్లి 39, ముద్విన్, తాళ్లపల్లి, దండుమైలారం 38.9, మొగలిగిద్ద 38.8, యాచారం, షాబాద్ 38.7, కేశంపేట 38.6, వెల్జాల 38.5, తట్టిఅన్నారం 38.4℃ ఉష్ణోగ్రత నమోదైంది.

News March 28, 2025

HYD: కూతురిని హత్య చేసిన తల్లి

image

కూతురిని తల్లి హత్య చేసిన ఘటన మైలార్‌దేవ్‌పల్లి PS పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. తమిళనాడుకు చెందిన ముదులై మణి, ఆరోగ్య విజ్జి దంపతులు. భర్త మణికి 2 మూత్రపిండాలు పాడవగా.. 15 రోజుల క్రితం ఆడపిల్ల పుట్టింది. ఆమె పెద్దయ్యాక పెళ్లి ఖర్చులు ఉంటాయని భావించి మంగళవారం నీళ్ల బకెట్‌లో వేయడంతో మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

News March 28, 2025

హైదరాబాద్‌లో ఉదయం నుంచే ట్రాఫిక్ ఆంక్షలు

image

రంజాన్ చివరి శుక్రవారం మక్కా మసీదులో ప్రార్థనలకు ముస్లిం సోదరులు భారీగా రానుండటంతో పోలీసులు HYDలో ఆంక్షలు విధించారు. చార్మినార్ పరిసర ప్రాంతాలకు వచ్చే రోడ్లన్నింటినీ ఉ.8 నుంచి సా.4వరకు మూసేస్తున్నారు. చార్మినార్‌కు వచ్చే నయాపూల్ నుంచి మదీనా, శాలిబండ- హిమ్మత్‌పుర, చౌక్‌మైదాన్-మొగల్‌పుర, మీర్ఆలం మండీ/బీబీ బజార్, మూసాబౌలి- మోతీహాల్, గన్సీబజార్- హైకోర్టు రోడ్డుకు వాహనాలు మళ్లిస్తున్నట్లు పేర్కొన్నారు.

News March 28, 2025

కళకళలాడుతోన్న చార్మినార్

image

అర్ధరాత్రి చార్మినార్ కళకళలాడుతోంది. రంజాన్‌ మాసంలో నేడు చివరి శుక్రవారం కావడంతో‌ మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనల(అల్ విధా జుమ్మా) కోసం ఏర్పాట్లు చేశారు. పండుగకు మరో రెండ్రోజులే సమయం ఉండటంతో జనాలు షాపింగ్‌ కోసం క్యూకట్టారు. కమాన్ రోడ్, భాగ్యలక్ష్మీ టెంపుల్ రోడ్, లాడ్ బజార్, న్యూ లాడ్‌ బజార్, రాత్‌ఖానా గల్లీ, మోతీ గల్లీలు కిక్కిరిసిపోయాయి. వాహనాలు పార్కింగ్‌కు స్థలం దొరకని పరిస్థితి నెలకొంది.

News March 27, 2025

ఉప్పల్‌లో SRH, మహేశ్ బాబు FANS

image

ఉప్పల్ స్టేడియం వద్ద SRH, సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. వరంగల్, ఖమ్మం ప్రాంతాలకు చెందిన పలువురు యువత ఆరెంజ్ ఆర్మీ టీషర్ట్స్, మహేశ్ బాబు బ్యానర్‌తో స్టేడియానికి చేరుకున్నారు. ఈ సారి SRH బ్యాటింగ్‌కు దిగితే 300 స్కోర్ చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచి క్రికెట్ ఫ్యాన్స్ రావడంతో స్టేడియం పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి.

News March 27, 2025

IPL మ్యాచ్ చూడడానికి ఇవి తీసుకెళ్లకండి..!

image

వాటర్ బాటిల్స్ కెమెరాస్ IPL క్రికెట్ మ్యాచ్ చూడడానికి స్టేడియానికి వెళ్లే ప్రేక్షకుల కోసం రాచకొండ పోలీసులు కీలక సూచనలు చేశారు. మ్యాచ్ చూడడానికి వెళ్లే వారు ఎలాంటి వస్తువులను తీసుకెళ్లద్దని తెలిపారు. స్టేడియం వద్ద వస్తువులు నిలువ చేసుకోవడానికి CLOAKROOM ఉండవని తెలిపారు. ఏ వస్తువులు తీసుకెళ్లకూడదో ఒక జాబితా విడుదల చేశారు. కెమెరా, సిగరెట్స్, స్నాక్స్, బ్యాగ్స్, పెట్స్ తదితరాలపై నిషేదం ఉంటుంది.

News March 27, 2025

రంగారెడ్డి జిల్లా వెదర్ UPDATE

image

రంగారెడ్డి జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. బుధవారం తాళ్లపల్లిలో 39.5℃, మాడ్గుల్ 39.4, రాజేంద్రనగర్, కాసులాబాద్ 39.3, ఎలిమినేడు, కందువాడ, తట్టిఅన్నారం 39.2, చుక్కాపూర్, చందనవల్లి, కొందుర్గ్, మంగళపల్లె, కడ్తాల్, యాచారం 39.1, మామిడిపల్లి 39, మీర్‌ఖాన్‌పేట, దండుమైలారం, రెడ్డిపల్లె 38.9, ఆమన్‌గల్, మొగలిగిద్ద, కేశంపేట, షాబాద్ 38.8, గున్గల్, HCU 38.7, ఇబ్రహీంపట్నంలో 38.6℃ ఉష్ణోగ్రత నమోదైంది.