RangaReddy

News September 9, 2024

HYD: BRSకు గడ్డం శ్రీనివాస్ యాదవ్ రాజీనామా

image

BRS హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, నగర ఇన్‌ఛార్జ్ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆదివారం కేసీఆర్, కేటీఆర్‌కు రాజీనామా లేఖను పంపించారు. అయితే తర్వాత ఏ పార్టీలో చేరుతారనే విషయాన్ని వెల్లడించలేదు. కాగా గత లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి BRS అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీనివాస్ యాదవ్ ఓడిపోయారు.

News September 9, 2024

HYD: యువత నైపుణ్యాభివృద్ధికి బల్దియా తోడు: ఆమ్రపాలి

image

చదువుకున్న యువతకు నైపుణ్య శిక్షణ నిచ్చి జీవనోపాధి కల్పించే దిశగా GHMC అడుగులు వేస్తోంది. గతేడాది బల్దియా సహకారంతో చందానగర్‌లో ఏర్పాటైన లైట్ హౌస్ కమ్యూనిటీస్ ఫౌండేషన్ సెంటర్ ద్వారా పలువురికి భిన్న రంగాల్లో ఉద్యోగాలు లభించాయి. ఇదే మాదిరి గ్రేటర్‌లోని సర్కిళ్ల పరిధిలో కేంద్రాలను ఏర్పాటు చేయాలని కమిషనర్ ఆమ్రపాలి భావిస్తున్నారు. 2 నెలల్లో 4 చోట్ల ఈ కేంద్రాలను నెలకొల్పే లక్ష్యంగా చర్చలు సాగుతున్నాయి.

News September 9, 2024

HYD: రేపటి కోసం.. కొత్త నగరం..!

image

భవిష్యత్ నగరానికి బంగారు బాటలు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. HYD సమీపంలో తలపెట్టిన ‘ఫ్యూచర్ సిటీ’కి నగరం నుంచి రాకపోకలు చేసేందుకు వీలుగా నాలుగు విధాలుగా మార్గాలను అధికారులు సూచించారు. వీటన్నిటినీ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఫోర్త్ సిటీ (స్కిల్ యూనివర్సిటీ)కి చేరుకునేలా ప్లాన్ చేశారు. ఇందులో రెండు మెట్రో రైలు రూట్‌లు, మరో రెండు ఎలక్ట్రిక్ బస్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టం మార్గాలున్నాయి.

News September 9, 2024

సికింద్రాబాద్: గాంధీ ఆసుపత్రి సమస్యలు తీరేనా..!

image

ఇటీవల గాంధీ ఆసుపత్రి మొదటిసారిగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజానర్సింహ సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులు సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి కూడా ఆసుపత్రి అభివృద్ధికి పలు సూచనలు చేశారు. వీటిన్నింటినీ అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలని అసుపత్రి వర్గాలు కోరుతున్నాయి. సరిపడా వైద్య సిబ్బంది, పారిశుద్ధ్యం, సెక్యూరిటీ, తదితర సిబ్బందిని నియమించాలి.

News September 9, 2024

HYD: నగర వాసులకు ముఖ్య గమనిక

image

16వ కేంద్ర ఆర్థిక సంఘంతో మహాత్మ జ్యోతిబా ఫులే ప్రజాభవన్‌లో నిర్వహించే ముఖ్య సమావేశాల కారణంగా మంగళవారం నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమం బుధవారానికి వాయిదా వేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా అర్జీదారులంతా విషయాన్ని గమనించి బదులుగా బుధవారం ప్రజావాణి కార్యక్రమానికి హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.

News September 8, 2024

HYD ఇన్‌స్టాలో పరిచయం.. 20రోజులు ఓయో గదిలో బంధించాడు

image

హైదరాబాద్‌లో మరో దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. భైంసాకు చెందిన బాలికకు ఇన్‌స్టాలో ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ పరిచయంతో అతడి కోసం ఇక్కడకు వచ్చిన బాలికను నారాయణగూడలోని ఓయో రూమ్‌లో 20 రోజులు బంధించాడు. బాలిక తల్లిదండ్రలకు వాట్సాప్‌‌లో లొకేషన్ షేర్ చేయడంతో బాధితులు షీటీమ్స్‌ను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు బాలికను విడిపించి నిందితుడిపై కేసు నమోదు చేశారు.

News September 8, 2024

HYD: నిమజ్జనానికి కీలక సూచనలు జారీ

image

హైదరాబాద్ వ్యాప్తంగా వినాయక చవితి కోలాహలం నడుస్తోంది. ఈ క్రమంలో వినాయక నిమజ్జనానికి సంబంధించి హైదరాబాద్ పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు.
* గణేష్ విగ్రహానికి ఒక వాహనం మాత్రమే అనుమతించబడుతుంది.
* నిమజ్జనం కోసం విగ్రహాన్ని తీసుకెళ్లే వాహనంపై లౌడ్ స్పీకర్ అమర్చకూడదు.* పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు ఇచ్చే సూచనలు పాటించాలి.

News September 8, 2024

ఘట్‌కేసర్: రైలు కింద పడి కానిస్టేబుల్ సూసైడ్

image

రైలు కింద పడి కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. సికింద్రాబాద్ పరిధిలోని గోపాలపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న నరసింహరాజు ఘట్‌కేసర్ వద్ద రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నరసింహరాజుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News September 8, 2024

HYD: నయా మోసం.. నమ్మితే నట్టేట మునిగినట్టే!

image

HYDలో కేటుగాళ్లు నయా మోసాలకు పాల్పడుతున్నారు. టెన్త్ చదివితే చాలు FAKE ఐడీ, ఆధార్ కార్డులు, జాబ్ ఆఫర్ లెటర్లు, ఫేక్ డిగ్రీ, B.Tech మెమోలు, క్వాలిఫికేషన్ సర్టిఫికెట్లు తయారుచేసి అవే ఒరిజినల్ అని నమ్మిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో జాబ్ వచ్చేలా చేస్తామని రూ.లక్షలు కాజేస్తున్నారు. ప్రతి విషయంపై అప్రమత్తంగా ఉండాలని, ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలని రాచకొండ CP సుధీర్ బాబు సూచించారు.

News September 8, 2024

HYD: అలా చేస్తే.. ఏడు జిల్లాల్లో ఆక్రమణలకు చెక్!

image

HYD నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతల పై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏ మాత్రం తగ్గటం లేదు. దీంతో HMDA పరిధిలోని 7 జిల్లాల్లో చెరువుల పరిరక్షణ కోసం లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఛైర్మన్ బాధ్యతలను సైతం హైడ్రాకు అప్పగించడంపై ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇదే కాని జరిగితే.. HYD, సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్, గజ్వేల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో చెరువుల ఆక్రమణలకు చెక్ పడనుంది.